Political News

జ‌నం సెంట్రిక్ కాదు.. జ‌గ‌న్ సెంట్రిక్

ఏ పార్టీకైనా.. జ‌నం ముఖ్యం. ఏ నాయ‌కుడికైనా జ‌నం ప్ర‌ధానం. ప్ర‌జ‌ల బాధ‌ల‌ను త‌న బాధ‌లుగా మార్చుకున్న‌వారు ఎప్ప‌టికైనా నాయ‌కులు అవుతారు. త‌న బాధ‌ను ప్ర‌జ‌ల బాధ‌గా మ‌లిచేవారు.. జీరోలే అవుతారు.

ఈ చిన్న తేడా గ‌మ‌నించ‌క‌పోతే.. అనేక పార్టీలు కాల‌గ‌ర్భంలో క‌లిసిపోయాయ‌న్న సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇప్పుడు ఈ దారిలోనే వైసీపీ న‌డుస్తోంది. జ‌నం సెంట్రిక్‌గా కాకుండా.. జ‌గ‌న్ సెంట్రిక్ గానే వైసీపీ రాజ‌కీయాలు జ‌రుగుతున్నాయి.

ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీని గ‌మ‌నిస్తే..త‌న బాధ‌లు చెప్పుకొనేందుకు చంద్ర‌బాబు జ‌నంలోకి రాలేదు. జ‌నం బాధలు వినేందుకు వ‌చ్చారు. త‌న స‌మ‌స్య‌లు చెప్పలేదు. వారి స‌మ‌స్య‌లు కోట్ చేశారు. ఎక్క‌డా త‌మ గురించి చెప్ప‌లేదు.

నేను జైలుకు వెళ్లాను.. నాకు ఓటేయండి.. మా వాళ్ల‌ను జైళ్ల‌కు పంపించారు.. మమ్మ‌ల్ని గెలిపించ‌మ‌ని కూడా ఆయ‌న కోర‌లేదు. ప్ర‌జ‌ల‌ను సెంట్రిక్‌గా చేసుకుని ఆయ‌న ముందుకు సాగారు. ఆయ‌న ఏం చెప్పార‌న్న‌దానికంటే కూడా.. వారి స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించార‌న్న‌దానికే జ‌నాలు జై కొట్టారు.

ఫ‌లితంగా ఓటు బ్యాంకు పండింది. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కూడా ఇదే చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్ర‌జ‌లు.. వారి స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించారు. వ్య‌క్తుల‌ను టార్గెట్ చేస్తూనే వ్య‌వ‌స్థ‌ల‌ను ప్ర‌శ్నించే రీతిగా ప్ర‌జ‌ల‌ను త‌యారు చూస్తూ.. రాజ‌కీయాల‌ను ముందుకు తీసుకువెళ్లారు.

ఫ‌లితంగా విజ‌యం న‌ల్లేరుపై న‌డ‌కే అయింది. అయితే.. ఇప్పుడు ఓట‌మి త‌ర్వాత‌.. జ‌గ‌న్ ఈ బాట‌లో న‌డుస్తున్నారా? అంటే.. లేదనే అంటున్నారు రాజ‌కీయ ప‌రిశీల‌కులు. జ‌నాల‌కు వ‌ర‌ద వ‌చ్చింది.. ఏదో మొక్కుబ‌డిగా వ‌చ్చి.. ముగించారు.

గంటలోనే రావ‌డం.. పోవ‌డం కూడా అయిపోయింది. ఇక‌, గుంటూరుకు వెళ్లినా.. అంత‌కుముందు నెల్లూరుకు వెళ్లినా.. త‌న పార్టీ నాయ‌కుల‌ను ప‌రామ‌ర్శించేందుకు వెళ్లారు. అక్క‌డ మాత్రం గంట‌ల కొద్దీ స‌మ‌యం గ‌డిపారు. ఇదీ.. జ‌గ‌న్ చేసిన రాజ‌కీయం. పైగా.. తాము అధికారంలోకి వ‌స్తే.. ఇదే జైళ్ల‌లో మీరు ఉంటారంటూ.. టీడీపీ నేత‌ల‌ను హెచ్చ‌రించారు. ఇవ‌న్నీ.. ఎవ‌రి కోసం.. పార్టీ కోసం.. త‌న వాళ్ల కోసం. కానీ.. ప్ర‌జ‌ల కోసం ఆయ‌న ఏం చేశారు? అనేది ప్ర‌శ్న‌.

ప‌క్క‌నే ఉన్న ప్ర‌కాశం బ్యారేజీని ప‌డ‌వ‌లు ఢీ కొట్టాయ‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తే.. అక్క‌డ‌కు వెళ్ల‌లేక పోయారు. బుడ‌మేరు వ‌ర‌ద‌తో మునిగిపోయిన ప్రాంతాల్లో మొక్కుబ‌డి ప‌ర్య‌ట‌నే చేశారు. ఇవి కాదు క‌దా.. జ‌గ‌న్ చేయాల్సింది.. జ‌నాల‌కుఎక్క‌డ క‌ష్టం ఉంటే.. అక్క డ ఉండాలి. జ‌నం సెంట్రిక్‌గా ఆయ‌న రాజ‌కీయాలు చేయాలి. ఈ రెండు చేయ‌నంత వ‌ర‌కు .. జ‌గ‌న్‌ను జ‌నం న‌మ్మే ప‌రిస్థితి లేద‌నేది ప‌రిశీల‌కులు చెబుతున్న మాట‌.

This post was last modified on September 17, 2024 9:38 am

Share

Recent Posts

అసెంబ్లీ ఆవరణలో సీపీఆర్ చేసిన మంత్రి కానీ…

వైద్యో నారాయణో హరి అన్నారు పెద్దలు…అంటే రోగి ప్రాణాలు కాపాడే వైద్యుడు దేవుడితో సమానం అన్న నానుడిని ఇప్పటికీ చాలామంది…

1 hour ago

ఎపిక్ మీద A ప్రభావం నిజంగా ఉంటుందా

ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ మీద యూత్ వర్గాల్లో మంచి అంచనాలే నెలకొన్నాయి. ఇవాళ…

2 hours ago

కేసీఆర్ ఫాం హౌస్ దగ్గర హై టెన్షన్

తెలంగాణ శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలు దుమారం…

2 hours ago

ఇన్‌స్టాగ్రామ్ ఏం చూపించాలో ఇక మనమే చెప్పొచ్చా?

ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మనం ఫాలో కాని అకౌంట్ల నుంచి కూడా వరుసగా రీల్స్ వచ్చేస్తుంటాయి. ఒక వీడియో కాస్త…

2 hours ago

చిరు vs ఎన్టీఆర్ ఫాన్స్ వార్లు… సహించని హై కమాండ్లు

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో వున్న కూటమి పార్టీల్లో కొన్ని రోజులుగా క్షేత్రస్థాయి కార్యకర్తలు, నాయకుల మధ్య సోషల్ వార్ జరుగుతుంది.…

4 hours ago

ప్యారడైజ్ నిలబెట్టుకోవాల్సింది అదొక్కటే

వాయిదాల ప్రచారాలకు చెక్ పెడుతూ నిన్న ప్యారడైజ్ బృందం మరోసారి సెప్టెంబర్ 24 విడుదలని కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే.…

4 hours ago