Political News

జ‌నం సెంట్రిక్ కాదు.. జ‌గ‌న్ సెంట్రిక్

ఏ పార్టీకైనా.. జ‌నం ముఖ్యం. ఏ నాయ‌కుడికైనా జ‌నం ప్ర‌ధానం. ప్ర‌జ‌ల బాధ‌ల‌ను త‌న బాధ‌లుగా మార్చుకున్న‌వారు ఎప్ప‌టికైనా నాయ‌కులు అవుతారు. త‌న బాధ‌ను ప్ర‌జ‌ల బాధ‌గా మ‌లిచేవారు.. జీరోలే అవుతారు.

ఈ చిన్న తేడా గ‌మ‌నించ‌క‌పోతే.. అనేక పార్టీలు కాల‌గ‌ర్భంలో క‌లిసిపోయాయ‌న్న సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇప్పుడు ఈ దారిలోనే వైసీపీ న‌డుస్తోంది. జ‌నం సెంట్రిక్‌గా కాకుండా.. జ‌గ‌న్ సెంట్రిక్ గానే వైసీపీ రాజ‌కీయాలు జ‌రుగుతున్నాయి.

ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీని గ‌మ‌నిస్తే..త‌న బాధ‌లు చెప్పుకొనేందుకు చంద్ర‌బాబు జ‌నంలోకి రాలేదు. జ‌నం బాధలు వినేందుకు వ‌చ్చారు. త‌న స‌మ‌స్య‌లు చెప్పలేదు. వారి స‌మ‌స్య‌లు కోట్ చేశారు. ఎక్క‌డా త‌మ గురించి చెప్ప‌లేదు.

నేను జైలుకు వెళ్లాను.. నాకు ఓటేయండి.. మా వాళ్ల‌ను జైళ్ల‌కు పంపించారు.. మమ్మ‌ల్ని గెలిపించ‌మ‌ని కూడా ఆయ‌న కోర‌లేదు. ప్ర‌జ‌ల‌ను సెంట్రిక్‌గా చేసుకుని ఆయ‌న ముందుకు సాగారు. ఆయ‌న ఏం చెప్పార‌న్న‌దానికంటే కూడా.. వారి స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించార‌న్న‌దానికే జ‌నాలు జై కొట్టారు.

ఫ‌లితంగా ఓటు బ్యాంకు పండింది. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కూడా ఇదే చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్ర‌జ‌లు.. వారి స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించారు. వ్య‌క్తుల‌ను టార్గెట్ చేస్తూనే వ్య‌వ‌స్థ‌ల‌ను ప్ర‌శ్నించే రీతిగా ప్ర‌జ‌ల‌ను త‌యారు చూస్తూ.. రాజ‌కీయాల‌ను ముందుకు తీసుకువెళ్లారు.

ఫ‌లితంగా విజ‌యం న‌ల్లేరుపై న‌డ‌కే అయింది. అయితే.. ఇప్పుడు ఓట‌మి త‌ర్వాత‌.. జ‌గ‌న్ ఈ బాట‌లో న‌డుస్తున్నారా? అంటే.. లేదనే అంటున్నారు రాజ‌కీయ ప‌రిశీల‌కులు. జ‌నాల‌కు వ‌ర‌ద వ‌చ్చింది.. ఏదో మొక్కుబ‌డిగా వ‌చ్చి.. ముగించారు.

గంటలోనే రావ‌డం.. పోవ‌డం కూడా అయిపోయింది. ఇక‌, గుంటూరుకు వెళ్లినా.. అంత‌కుముందు నెల్లూరుకు వెళ్లినా.. త‌న పార్టీ నాయ‌కుల‌ను ప‌రామ‌ర్శించేందుకు వెళ్లారు. అక్క‌డ మాత్రం గంట‌ల కొద్దీ స‌మ‌యం గ‌డిపారు. ఇదీ.. జ‌గ‌న్ చేసిన రాజ‌కీయం. పైగా.. తాము అధికారంలోకి వ‌స్తే.. ఇదే జైళ్ల‌లో మీరు ఉంటారంటూ.. టీడీపీ నేత‌ల‌ను హెచ్చ‌రించారు. ఇవ‌న్నీ.. ఎవ‌రి కోసం.. పార్టీ కోసం.. త‌న వాళ్ల కోసం. కానీ.. ప్ర‌జ‌ల కోసం ఆయ‌న ఏం చేశారు? అనేది ప్ర‌శ్న‌.

ప‌క్క‌నే ఉన్న ప్ర‌కాశం బ్యారేజీని ప‌డ‌వ‌లు ఢీ కొట్టాయ‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తే.. అక్క‌డ‌కు వెళ్ల‌లేక పోయారు. బుడ‌మేరు వ‌ర‌ద‌తో మునిగిపోయిన ప్రాంతాల్లో మొక్కుబ‌డి ప‌ర్య‌ట‌నే చేశారు. ఇవి కాదు క‌దా.. జ‌గ‌న్ చేయాల్సింది.. జ‌నాల‌కుఎక్క‌డ క‌ష్టం ఉంటే.. అక్క డ ఉండాలి. జ‌నం సెంట్రిక్‌గా ఆయ‌న రాజ‌కీయాలు చేయాలి. ఈ రెండు చేయ‌నంత వ‌ర‌కు .. జ‌గ‌న్‌ను జ‌నం న‌మ్మే ప‌రిస్థితి లేద‌నేది ప‌రిశీల‌కులు చెబుతున్న మాట‌.

This post was last modified on September 17, 2024 9:38 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాన్నమ్మ గారికి పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉంది

ఇటీవలే విడుదలైన సంక్రాంతి సినిమాలు ది రాజా సాబ్, మన శంకరవరప్రసాద్ గారులో ప్రభాస్ కు నాన్నమ్మగా, చిరంజీవికి తల్లిగా…

11 minutes ago

తొలి బంతికి సిక్సర్ కొట్టేశారు

మన శంకరవరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం మొదటి రోజు ప్రీమియర్లతో…

57 minutes ago

`చ‌లానా` పడిందా… బ్యాంక్ నుండి మనీ కట్

వాహ‌న‌దారుల‌కు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ర‌హ‌దారుల‌పై ట్రాఫిక్ రూల్స్‌కు విరుద్ధంగా వాహ‌నాలు న‌డుపుతూ..…

2 hours ago

బాబు, లోకేష్… సొంతూరికి వెళ్తూ స‌మ‌స్య‌ల‌పై దృష్టి!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్‌లు.. మూడు రోజుల‌ సంక్రాంతి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…

7 hours ago

జిల్లాల విషయంలో తగ్గేదేలే అంటున్న రేవంత్

రాష్ట్రంలో అభివృద్ది చేసే విష‌యంలో ఎవ‌రు ఎన్ని విధాల అడ్డు ప‌డినా.. తాము ముందుకు సాగుతామ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్…

9 hours ago

బడ్జెట్ 2026: అప్పులు తగ్గేలా నిర్మలమ్మ ప్లాన్

2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన…

11 hours ago