రెండు రోజుల్లలో తన పదవికి రాజీనామా చేయనున్నట్టు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీపార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. గత ఆరు మాసాలుగా తీహార్ జైల్లో ఉన్న ఆయన శుక్రవారం రాత్రి సుప్రీంకోర్టు తీర్పుతో బెయిల్పై బయటకు వచ్చారు. శనివారం రోజు రోజంతా ఆయన తీరిక లేకుండా గడిపారు. పార్టీ కార్యకర్త లు, నాయకులను కలుసుకున్నారు. అందరికీ భరోసా కల్పించారు.
అయితే.. ఆయన ఆదివారం ఉదయం పార్టీ నాయకులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి.. తాను రెండు రోజుల్లో తన పదవికి రాజీనామా చేయనున్నట్టు తెలిపారు. ఇదే ఇప్పుడు సంచలనంగా మారింది. తనకు దేవుడి అండ ఉందని.. ప్రజలు, పార్టీ నాయకుల ధైర్యంతోనే తాను ఆరు మాసాల పాటు జైలు జీవితంలో ఎలాంటి దిగులు లేకుండా గడిపానని చెప్పారు. అంతేకాదు.. తన కోసం ఎంతో మంది బాధపడిన విషయం తనకు తెలుసునని చెప్పారు. తమ ప్రభుత్వంపై ఒక పద్ధతి ప్రకారం కుట్ర జరిగిందని కేజ్రీవాల్ ఆరోపించారు.
తాను నిర్దోషినని తేలే వరకు కూడా.. సీఎం పీఠంపై కూర్చోబనని కేజ్రీవాల్ తేల్చి చెప్పడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వాస్తవానికి కేజ్రీవాల్.. జైలుకు వెళ్లిన నాటి నుంచే ఆయన తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ.. అన్ని వైపుల నుంచి ఒత్తిళ్లు వచ్చాయి. ముఖ్యంగా విపక్ష బీజేపీ ఏకంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయించాలంటూ కోర్టుకు కూడా వెళ్లింది. అయితే.. అప్పట్లో కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేయలే దు. అలాంటిది ఇప్పుడు అనూహ్యంగా ఆయనే తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించడం సంచలనంగా మారింది.
కాగా.. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయిన వారిలో ఆప్ నాయకులు సత్యేందర్ జైన్, అమానతుల్లా ఖాన్, పార్టీ ఇతర నాయకులు ఇంకా జైల్లోనే ఉన్నారు. వారు కూడా త్వరలోనే బెయిల్పై బయటకు వస్తారని కేజ్రీవాల్ చెబుతున్నా రు. అయితే కేజ్రీవాల్ ప్రకటన తర్వాత.. ఎవరు ముఖ్యమంత్రి అవుతారన్నది ఆసక్తిగా మారింది. ఆయన సతీమణి సునీత కానీ, మంత్రి ఆరిషి కానీ.. సీఎం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
This post was last modified on September 15, 2024 4:07 pm
ఇటీవలే విడుదలైన సంక్రాంతి సినిమాలు ది రాజా సాబ్, మన శంకరవరప్రసాద్ గారులో ప్రభాస్ కు నాన్నమ్మగా, చిరంజీవికి తల్లిగా…
మన శంకరవరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం మొదటి రోజు ప్రీమియర్లతో…
వాహనదారులకు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రహదారులపై ట్రాఫిక్ రూల్స్కు విరుద్ధంగా వాహనాలు నడుపుతూ..…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…
రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…
2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన…