Political News

కూట‌మి స‌ర్కారుకు ఉక్కు- ప‌రీక్ష‌!

కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డి మూడు మాసాలే అయింది. అయితే.. ఇంత‌లోనే అతి పెద్ద స‌మ‌స్య ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. విశాఖ ఉక్కు క‌ర్మాగారాన్ని ప్రైవేటు ప‌రం చేసేందుకు కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు ప్ర‌య‌త్నం చేస్తోంది.

అయితే.. దీనిని వ్య‌తిరేకిస్తు.. ఇక్క‌డి కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఉద్య‌మిస్తున్నారు. రిలే నిరాహార దీక్ష లు కూడా చేస్తున్నారు. కానీ, తెర‌చాటున దీనిని ప్రైవేటు ప‌రం చేసే కార్య‌క్ర‌మాలు మాత్రం కొన‌సాగుతున్నాయి. తాజాగా ఉక్కును క‌రిగించే యూనిట్‌ను మూసివేసిన‌ట్టు కార్మికులు ఆరోపిస్తున్నారు.

అదేస‌మ‌యంలో ఇప్ప‌టికే బొగ్గును ఆపేశారు. దీంతో ఉత్పత్తి 70 శాతం నిలిచిపోయింది. మ‌రోవైపు.. శాశ్వత‌ ఉద్యోగుల‌కు వాలంట‌రీ రిటైర్మెంట్ ఇస్తున్నారు. దీనిని కూడా కార్మిక సంఘాలు త‌ప్పుబ‌డుతున్నాయి. బ‌ల‌వంతంగా వాలంట‌రీ రిటైర్మెంట్ చేయిస్తున్నారంటూ.. గ‌త‌వారం రోజులుగా పేర్కొంటూ త‌మ ఉద్య‌మాన్ని మ‌రింత తీవ్రత‌రం చేస్తున్నారు.

ఈ క్ర‌మంలో రాష్ట్రంలోని కూట‌మి ప్ర‌భుత్వాన్ని వారు ప్ర‌శ్నిస్తున్నారు. తాజాగా ఇక్క‌డ‌కు వెళ్లిన ఏపీ టీడీపీ అధ్య‌క్షుడు ప‌ల్లా శ్రీనివాస‌రావుకు త‌మ గోడు వెళ్ల‌బోసుకున్నారు.

ఈ సంద‌ర్భంగా ప‌ల్లా.. వారికి ధైర్యం చెప్పారు. తాము ఉక్కు ఫ్యాక్ట‌రీని కాపాడుతామ‌న్నారు. అయితే.. బొగ్గును స‌ర‌ఫ‌రా చేయ‌డం.. లేక‌పోతే.. నిర్వ‌హ‌ణ‌ను మాకే అప్ప‌గించ‌డం వంటి రెండు విధానాల‌ను తాము చెబుతున్న‌ట్టు తెలిపారు. కానీ, ఈరెండు విధానాల‌కు కూడా కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు త‌లూప‌డం లేదు.

ప్రైవేటు ప‌రం చేయ‌డానికే మొగ్గు చూపుతోంది. ఇదే విష‌యాన్ని కార్మికులు సైతం ప‌ల్లాకు చెప్పారు. ఈ రెండు విష‌యాలు గ‌త జ‌గ‌న్ ప్ర‌భుత్వంలోనూ తెర‌మీదికి వ‌చ్చాయ‌ని.. కానీ, ఒక్క‌దానికి కూడా కేంద్రం ఒప్పుకోలేద‌న్నారు.

ఈ ప‌రిణామాల‌తో రాష్ట్రంలోని కూట‌మి స‌ర్కారుకు ఉక్కు క‌ర్మాగారం ఒక ప‌రీక్ష‌గా మారింది. గ‌త వారంలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమార‌స్వామి నిర్వ‌హించిన స‌మావేశంలో ప్రైవేటీక‌ర‌ణవైపే మొగ్గు చూపిన‌ట్టు తెలుస్తోంద‌ని కార్మికులు చెబుతున్నారు. దీంతో రాష్ట్ర స‌ర్కారు కేంద్రంపై ఒత్తిడి తేవాల‌న్న‌దివారి వాద‌న‌.

మ‌రోవైపు.. ఇప్పుడు బీజేపీతోనే టీడీపీ రాజ‌కీయ బంధం పెట్టుకున్న ద‌రిమిలా.. త‌మ‌కు అన్యాయం చేస్తుంద‌న్న భావ‌న కూడా వారిలో ఉంది. ఈ విషయంపై ప‌ల్లా స్ప‌ష్ట‌మైన హామీ ఇచ్చినా.. కార్మికులు మాత్రంఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఏదేమైనా.. ఇప్పుడు విశాఖ ఉక్కు వ్య‌వ‌హారం.. కూట‌మి స‌ర్కారుకు ప‌రీక్ష‌గానే మారిందని చెప్పాలి.

This post was last modified on September 15, 2024 12:10 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అన్వేషణను అరెస్టు చేస్తారా?

హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…

11 minutes ago

ష‌ర్మిలమ్మా.. మీ పార్టీ దీన‌స్థితి చూడ‌మ్మా.. !

ఏపీ కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారుతోందా? .. పార్టీ నాయ‌కులు దీన‌స్థితిలో ఉన్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే…

2 hours ago

ఇరాన్‌లో భారతీయ విద్యార్థులు.. ఇటు ప్రాణాలు, అటు పరీక్షలు

ఇరాన్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…

2 hours ago

బాలీవుడ్‌కు పొలిశెట్టి పంచ్

ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు న‌వీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన త‌న చివ‌రి చిత్రం అన‌గ‌న‌గా ఒక…

3 hours ago

శర్వానంద్ భోగికి అసలైన ఛాలెంజ్

2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…

4 hours ago

అయ్యన్నను ఓడించిన రఘురామ

రాజ‌కీయాల్లోనే కాదు.. ఆట‌ల్లోనూ త‌న సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాల…

4 hours ago