Political News

మరో మంచి పని చేసిన చంద్ర‌బాబు

వ‌ల‌స‌వాద బ్రిటీష్ విధానాల‌కు కేంద్ర ప్ర‌భుత్వం స్వ‌స్థి చెబుతున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే క్రిమిన‌ల్ చ‌ట్టా లను మార్పు చేశారు. రెండు రోజుల కింద‌ట‌.. అండ‌మాన్ రాజ‌ధాని పోర్టు బ్లెయిర్ పేరును శ్రీవిజ‌య‌పురంగా మార్చారు. ఇలా.. వ‌ల‌సవాదుల కాలంలో ఉన్న ప‌ద్ధ‌తులు, విదానాలు.. పేర్ల‌ను మార్పు చేస్తున్నారు. ఈ ప‌రంప‌ర‌లో ఇప్పుడు ఏపీ స‌ర్కారు కూడా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చిన నాటి నుంచి ఉన్న ఒక కీల‌క అంశానికి స‌రికొత్త మార్పుల దిశ‌గా అడుగులు వేసింది.

అవే.. నిత్యం ప్ర‌జ‌ల‌తో ర‌ద్దీగా ఉండే స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాలు. భూముల లావాదేవీలు, వివాహాల రిజిస్ట్రేష‌న్ వంటి కీల‌క కార్య‌క‌లాపాల‌తో రాష్ట్ర వ్యాప్తంగా నిత్యం స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాలు.. ర‌ద్డీగా ఉంటాయి. ఇవి రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు కీల‌క ఆదాయ వ‌న‌రు అన్న విష‌యం తెలిసిందే. అయితే.. ఇక్క‌డ 75 ఏళ్లుగా.. అప్ప‌ట్లో బ్రిటీష్ హ‌యాంలో ఎలాంటి ప‌ద్ధ‌తులు ఉన్నాయో.. వాటినే అమ‌లు చేస్తున్నారు. స‌బ్ రిజిస్ట్రార్‌.. ఎత్త‌యిన పీఠంపై కూర్చుని ఉంటాడు. దాదాపు ఐదు అడుగుల పోడియం ప్ర‌త్యేకంగా ఉంటుంది.

మిగిలిన వారంతా.. ఆయ‌నకు దిగువ‌న కూర్చుని ప‌నులు చేస్తారు. అంతేకాదు.. స‌బ్ రిజిస్ట్రార్ కూర్చునే పోడియం చుట్టూ రెడ్ కార్పెట్ వేసిప్ర‌త్యేకంగా ఉంటుంది. ఆయ‌న ద‌గ్గ‌ర‌కు వెళ్లి ఎవ‌రు మాట్లాడాల‌న్నా.. నిల‌బ‌డే ఉండాలి. ఇది బ్రిటీష్ వారి కాలంలో చేసిన ఏర్పాటు. అయితే.. ఇప్పుడు ఈ విధానాన్ని మార్పు చేయాల‌ని చంద్ర‌బాబు ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఆ వెంట‌నే ఉత్త‌ర్వులు కూడా జారీ చేశారు. స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో ఇక నుంచి మిగిలిన ఉద్యోగుల మాదిరిగానే స‌బ్ రిజిస్ట్రార్‌కు కూడా కుర్చీ వేయాల‌ని నిర్దేశించారు.

అంతేకాదు.. స‌బ్ రిజిస్ట్రార్‌ను ప్ర‌త్యేకంగా సంబోధించాల్సిన అవ‌స‌రం లేద‌ని.. సాధార‌ణ ఉద్యోగిగానే ప‌రిగ‌ణించా ల‌ని ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. అంతేకాదు.. పోడియం.. దానిపై రెడ్ కార్పెట్‌వంటివాటిని త‌క్ష‌ణ‌మే తొల‌గించాల‌ని ఆదేశించారు. రిజిస్ట్రేష‌న్ల కోసం వ‌చ్చేవారికి ఆఫీసు ఖ‌ర్చుతో తాగునీరు, టీ, కాఫీ స‌దుపాయాలు క‌ల్పించాల‌ని.. వారు కూర్చునేందుకు ప్ర‌త్యేకంగా కుష‌న్ సీట్లు ఉన్న కుర్చీలు వేయాల‌ని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఎట్టి ప‌రిస్థితిలోనూ స‌బ్ రిజిస్ట్రార్ ఎక్కువ‌.. ప్ర‌జ‌లు త‌క్కువ అనే భావ‌న క‌నిపించ‌డానికి వీల్లేద‌ని ఉత్త‌ర్వుల్లో స్ప‌ష్టం చేయ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on September 15, 2024 12:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఉస్తాద్ పాట‌ల వాడ‌కం.. ఎంత ఖ‌ర్చు పెట్టారో?

ఒక‌ప్పుడు పాత సినిమాల పాట‌లను య‌థేచ్ఛ‌గా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవ‌రికీ ఏ అభ్యంత‌రాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…

37 minutes ago

వైసీపీ పంచాంగం.. కేంద్రం ప్లస్.. రాష్ట్రం మైనస్

ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…

3 hours ago

స‌మంత బంగారం కోసం రాజు గారు వ‌స్తారా?

ఒక‌ప్పుడు తెలుగు, త‌మిళంలో టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా ద‌శాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన క‌థానాయిక స‌మంత‌. కానీ కొన్నేళ్లుగా…

4 hours ago

ఆ యూట్యూబర్లకు ‘పరాభవం’ తప్పదట

సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ…

4 hours ago

క‌విత పార్టీకి న్యాయ చిక్కులు… ఏం జరిగింది?

బీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. సొంత పార్టీ పెట్టుకునేందుకు రెడీ అయిన మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె క‌విత త‌న…

6 hours ago

ఫిక్స్… మూడో భాగం ఛాన్స్ లేదు

బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…

6 hours ago