ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంట్లో ఉన్న గోశాలకు పండగ వచ్చింది. సుమారు 30 గోవులను ఈ గోశాలలో పెంచు తున్నారు. వీటికి ఆలనా.. పాలనా.. అంతా ప్రత్యేక సంరక్షకుల ద్వారా చేపడుతున్నారు. శనివారం తెల్లవారు జాము న ఈ గోశాలలోని ఓ ఆవు దూడకు జన్మనిచ్చింది. గోధుమ వర్గం.. మధ్య మధ్యలో నల్లటి మచ్చలతో పుట్టిన ఈ దూడను ప్రధాన మంత్రి చాలా గారాబం చేశారు.
దానిని నెమ్మదిగా నడిపించుకుంటూ.. తన పూజా మందిరంలోకి తీసుకువెళ్లారు. పూజా మందిరంలో ఉన్న దుర్గమ్మ విగ్రహం ముందు కూర్చుని.. మోడీ ఆ దూడ నుదుటిన సింధూరం పెట్టారు. మెడలో పూల మాలవేశారు. అనంత రం.. శాలువా కప్పి.. చేతుల్లోకి తీసుకున్నారు. ముద్దుముద్దుగా ఉన్న దూడ పిల్లను ప్రధాని అంతే ముద్దు చేశారు. చేతుల్లోకి తీసుకుని చంకలో ఎక్కించుకున్నారు.
సోఫాలో కూర్చుని.. దూడను కూడా తన ఒళ్లో కూర్చోబెట్టుకున్నారు. కొద్దిసేపు దానితో ముచ్చటిస్తున్నట్టుగా వ్యవహరించారు. దూడ చెంపలపై ముద్దు పెట్టారు. దూడ కూడా ప్రధాని మోడీ చెంపలపై ముద్దు పెట్టింది. ప్రధాని తన ఇంట్లోని గార్డెన్లోకి కూడా దూడను ఎత్తుకునే తీసుకువెళ్లారు. దూడ నుదుటిన ప్రత్యేకంగా ఉన్న తెల్లని మచ్చను పదే పదే నిమిరారు. అనంతరం.. ఆయన ఆ దూడకు.. దీప జ్యోతి అని పేరు పెట్టారు.
ఈ విషయాన్ని ప్రధాని మోడీ తన ఎక్స్లో పేర్కొన్నారు. శాస్త్రాల ప్రకారం.. గోవు పవిత్ర జంతువు. ఈ రోజు మా గోశాలలో ఒక దూడ జన్మించింది.అది నన్ను ఎంతో ఆకట్టుకుంది. మా ఇంట గోవుల కుటుంబంలోకి వచ్చిన ఈ ప్రత్యేక అతిథి నుదుటి మీద తెల్లటి రేఖతో పుట్టింది. కాబట్టి `దీప్ జ్యోతి` అని పేరు పెట్టా. మా నివాసంలో దూడ కొత్త సభ్యుడిగా రావడం ఎంతో సంతోషంగా ఉంది అని ప్రధాని మోడీ ఎక్స్లో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…