రాజకీయం రంగులు మార్చుకుంటుంది. ఇది ఫక్తు వాస్తవం. ముందు ఒక మాట అనేయడం.. దాని వల్ల వచ్చే పర్వ వసానాలు తమకు అనుకూలంగా ఉంటే.. రెచ్చగొట్టడం.. రెచ్చిపోవడం కామన్. ఏ చిన్న తేడా వచ్చి.. పెద్ద యాగీ జరుగుతుందని గుర్తించినా.. వెంటనే వెంటనే యూటర్న్ తీసుకోవడం.
ఇదీ.. ఇప్పుడు తెలంగాణలో రంగులు మార్చుకున్న రాజకీయం చెబుతున్న సరికొత్త పాఠం. అసలు వివాదానికి కారకులు ఎవరు? ఎక్కడ వివాదం మొద లైంది? అనే తలతోకను గుర్తించకుండా.. కేటీఆర్ వంటి సీనియర్ రాజకీయ నేత ఇప్పుడు విరుచుకుపడుతున్నా రు.
అసలు వాస్తవం ఏంటి? పాడి కౌశిక్ రెడ్డి అనే ఫస్ట్ టైం ఎమ్మెల్యే అది కూడా మూడు శుక్రవారాలు కూడా నిండా కాని.. దుందుడుకు నాయకుడిని ముందు పెట్టి.. రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది ఎవరో తెరచాటున ఉండి నాన్ లోకల్-లోకల్ వ్యాఖ్యలుచేసింది ఎవరో.. పెద్దగా పసిగట్టలేని జనాలు ఎవరూ లేరు.
పైగా.. తెలంగాణ ఉద్యమం.. తర్వాత పాలనతో రాజకీయాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉంది. సో.. పాడి ఒక్కడే అంత మాటలు అనే స్తాయి.. అనే సత్తా ఉన్న నాయకుడని ఎవరూ అనుకోరు.
ఇదివాస్తవం. అయితే.. లోకల్-నాన్లోకల్ వ్యాఖ్యలు బూమరాంగ్ అయ్యాయి. చివరకు కేసీఆర్ మళ్లీ కేంద్రం అయ్యారు. ఆయన లేనిపోని రాజకీయాలు చేస్తున్నారన్న వాదన ప్రజల్లో క్షణాల్లో ప్రబలి పోయింది. అంతే.. వెంటనే యూటర్న్ తీసుకుని ఎదురు దాడి చేయడం కేటీఆర్, హరీష్రావు లు ఒక ఉద్యోగంగా తీసుకున్నారు.
అరికెపూడి గాంధీకి పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వడం ఇష్టంలేకపోతే.. దానిని వేరే మార్గం ద్వారా ప్రశ్నించవచ్చు. కానీ, అసలు విషయం ఇదికాదు. హైడ్రాతో తమ వారు ఇబ్బందులు పడుతున్నారన్నది నిజం.
దీనిని వెలుగు లోకి తీసుకురాలేక.. కౌశిక్రెడ్డి భుజాలపై తుపాకీ పెట్టి.. తూటాల్లాంటి వివాదాన్ని సృష్టించే ప్రయత్నం చేశారు. కానీ.. ఆతూటాలు.. రేవంత్ను టార్గెట్ చేయాలని అనుకున్నా.. విధిలేని పరిస్థితిలో కేసీఆర్కు తగిలే ప్రమాదం ఏర్పడింది.
దీంతో ఒక్కసారిగా యూటర్న్ తీసుకుని.. “పాఫం! కౌశిక్ రెడ్డి” అంటూ.. ఇప్పుడు రాజకీయాలను మార్చే ప్రయత్నం.. ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యల్లో వివాదమే లేనప్పుడు కేటీఆర్ అంత హుటాహుటిన స్పందించాల్సిన అవసరమే ఉండేది కాదు. కానీ.. బూమరాంగ్ అయి.. తమ మెడకు చుట్టుకుంటున్న దరిమిలా.. తప్పని పరిస్థితి ఏర్పడింది!! ఇదీ.. అసలు రాజకీయం!!!
This post was last modified on September 14, 2024 3:16 pm
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో టాప్-10లో ఉండే పేరు. ఆయన చేయని పాత్ర…
యూట్యూబ్లో వెబ్ సిరీస్లు, సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసుకునే అమ్మాయి వంద కోట్ల వసూళ్లు రాబట్టిన సినిమాలో భాగం కావడం..…
తెలుగులో సముద్రం నేపథ్యంతో వచ్చిన సినిమాలు తక్కువే. తీరప్రాంతం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నప్పటికీ పూర్తిగా ఈ బ్యాక్ డ్రాప్ లో…
ఆరు సంవత్సరాల క్రితం నేరుగా ఓటిటిలో రిలీజైన సినిమా మూకుతి అమ్మన్. తెలుగులో అమ్మోరు తల్లిగా డబ్బింగ్ చేశారు. బాగానే…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బీజేపీ అగ్రనేత. ఇక, ఆయన సొంత రాష్ట్రం గుజరాత్. తాజాగా మోడీ చిన్ననాటి స్నేహితుడు,…
విడుదలకు ఇంకా రెండు నెలలు లేని నేపథ్యంలో రామాయణ బృందం సంగీత ప్రచారానికి తెరతీసింది. యూట్యూబ్ కన్నా ముందు స్పాటిఫై…