“తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ.. చిట్టినాయుడు. మేం చంద్రబాబు నాయుడితోనే కొట్టాడినం. ఈయనెం త?” అని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. ఎమ్మెల్యే కేటీఆర్ సెటైర్లు గుప్పించారు.
తాజాగా తెలంగాణలో జరుగు తున్న రాజకీయ వివాదానికి మూల కారణమైన సొంత పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పరామర్శించారు. ఆయన ఇంటికి నేరుగా వెళ్లిన కేటీఆర్.. ఆలింగనం చేసుకుని.. ధైర్యం చెప్పారు. మేమున్నామంటూ.. వెనుకేసుకువచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తాము వైఎస్ రాజశేఖరరెడ్డి, చంద్రబాబునాయుడు వంటివారితోనే కొట్లాడామని చెప్పారు.
అలాంటిది చిట్టినాయుడు రేవంత్రెడ్డి ఎంత? అని ప్రశ్నించారు. అంతేకాదు.. తెలంగాణ చరిత్రలో ఎంతో మంది పనికిమాలిన ముఖ్యమంత్రులను చూశామన్నారు.
“నీలాంటి(రేవంత్) తలమాసిన సీఎంలను మస్తుగ చూశాం” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు, రోశయ్య, వైఎస్, కిరణ్కుమార్ లాంటి ఎంతో మందితో బీఆర్ ఎస్ కొట్లాడిందన్నారు. “ఇప్పుడు వాళ్లతో పోల్చుకుంటే నువ్వెంత? నువ్వు చిట్టి నాయుడివి. మా బాషలో చెప్పాలంటే.. నువ్వు బుల్లబ్బాయ్వి!” అని కేటీఆర్ సెటైర్లు వేశారు.
“మాకేం ఫరక్ పడేది లేదు. వెంట్రుక కూడా పీకలేవు. కానీ, నాలుగు రోజులు ఏదో పైశాచిక ఆనందం. ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నాను. నేనేదో పెద్దవాడిని అయ్యానని ఎగిరెగిరి పడుతున్నావ్” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే.. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, ఈ దుష్ట సంప్రదాయం రేపు పదవి నుంచి దిగిపోయాక కూడా వెంటా డుతుంది అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డిని కేటీఆర్ పొగడ్తలతో ముంచెత్తారు. `టైగర్ కౌశిక్ భాయ్` అని వ్యాఖ్యానించారు.
This post was last modified on September 14, 2024 3:12 pm
ఒకప్పుడు పాత సినిమాల పాటలను యథేచ్ఛగా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవరికీ ఏ అభ్యంతరాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…
ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా దశాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన కథానాయిక సమంత. కానీ కొన్నేళ్లుగా…
సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ…
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి.. సొంత పార్టీ పెట్టుకునేందుకు రెడీ అయిన మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత తన…
బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…