టీడీపీ ఆఫీసుపై వైసీపీ నాయకులు చేసిన దాడిని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ సమర్థించుకున్నా రు. తమ పార్టీ నాయకులు చేసింది తప్పుకాదన్నారు. “టీడీపీకి చెందిన ఒక ప్రబుద్ధుడు నన్ను బోష్డీకే అన్నాడు. దీని అర్థం.. మీకు తెలుసు. లం.. కొడక అని.. మరి నన్ను ఇంతగా తిడితే.. నా పార్టీ వాళ్లకు కోపం రాదా. అందుకే.. టీడీపీ ఆఫీసుపై చిన్న దాడి చేశారు. దీనిలో తప్పేముంది“ అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఇదే కేసులో అరెస్టయిన మాజీ ఎంపీ నందిగం సురేష్.. గుంటూరు జైల్లో ఉన్నారు.
ఈ నేపథ్యంలో సురేష్ను పరామర్శించేందుకు బుధవారం జైలుకు వచ్చిన జగన్.. మీడియాతో మాట్లాడా రు. చంద్రబాబుపై ఈ సందర్భంగా విమర్శలు గుప్పించారు. తప్పు చేస్తే శిక్షించవచ్చని.. కానీ.. అసలు తప్పులన్నీ.. చంద్రబాబే చేస్తున్నారని, కానీ, శిక్షలు మాత్రం వైసీపీ నాయకులకు వేస్తున్నారని వ్యాఖ్యా నించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని చెప్పారు. ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటామని.. ఎవరి కాళ్లూ పట్టుకుని చంద్రబాబు లాగా మేనేజ్ చేసుకోబోమన్నారు.
రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని జగన్ చెప్పారు. చంద్రబాబు ను నమ్మి ప్రజలు ఓటేశారని.. కానీ, ప్రజలను ఆయన అన్ని రకాలుగా మోసం చేస్తున్నారని విమర్శించారు. సూపర్ సిక్స్ ఏమయ్యాయని ప్రశ్నించారు. తాము అధికారంలో ఉంటే.. ఇప్పటికే అమ్మ ఒడి, రైతు భరోసా, విద్యాకానుక వంటివి ప్రజలకు అంది ఉండేవని.. కానీ, చంద్రబాబు ఇంతకన్నా ఎక్కువ ఇస్తామని చెప్పి ప్రజలకు అన్యాయం చేశారని విమర్శలు గుప్పించారు. ఒక్కరంటే ఒక్కరు కూడా సూపర్ సిక్స్ గురించి మాట్లాడడం లేదన్నారు.
యానిమల్ 3 గంటల 20 నిముషాలు ఉన్నా జనం బోర్ కొట్టకుండా చూశారు. పుష్ప 2 అంతకంటే ఎక్కువే అయినా…
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…