టీడీపీ ఆఫీసుపై వైసీపీ నాయకులు చేసిన దాడిని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ సమర్థించుకున్నా రు. తమ పార్టీ నాయకులు చేసింది తప్పుకాదన్నారు. “టీడీపీకి చెందిన ఒక ప్రబుద్ధుడు నన్ను బోష్డీకే అన్నాడు. దీని అర్థం.. మీకు తెలుసు. లం.. కొడక అని.. మరి నన్ను ఇంతగా తిడితే.. నా పార్టీ వాళ్లకు కోపం రాదా. అందుకే.. టీడీపీ ఆఫీసుపై చిన్న దాడి చేశారు. దీనిలో తప్పేముంది“ అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఇదే కేసులో అరెస్టయిన మాజీ ఎంపీ నందిగం సురేష్.. గుంటూరు జైల్లో ఉన్నారు.
ఈ నేపథ్యంలో సురేష్ను పరామర్శించేందుకు బుధవారం జైలుకు వచ్చిన జగన్.. మీడియాతో మాట్లాడా రు. చంద్రబాబుపై ఈ సందర్భంగా విమర్శలు గుప్పించారు. తప్పు చేస్తే శిక్షించవచ్చని.. కానీ.. అసలు తప్పులన్నీ.. చంద్రబాబే చేస్తున్నారని, కానీ, శిక్షలు మాత్రం వైసీపీ నాయకులకు వేస్తున్నారని వ్యాఖ్యా నించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని చెప్పారు. ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటామని.. ఎవరి కాళ్లూ పట్టుకుని చంద్రబాబు లాగా మేనేజ్ చేసుకోబోమన్నారు.
రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని జగన్ చెప్పారు. చంద్రబాబు ను నమ్మి ప్రజలు ఓటేశారని.. కానీ, ప్రజలను ఆయన అన్ని రకాలుగా మోసం చేస్తున్నారని విమర్శించారు. సూపర్ సిక్స్ ఏమయ్యాయని ప్రశ్నించారు. తాము అధికారంలో ఉంటే.. ఇప్పటికే అమ్మ ఒడి, రైతు భరోసా, విద్యాకానుక వంటివి ప్రజలకు అంది ఉండేవని.. కానీ, చంద్రబాబు ఇంతకన్నా ఎక్కువ ఇస్తామని చెప్పి ప్రజలకు అన్యాయం చేశారని విమర్శలు గుప్పించారు. ఒక్కరంటే ఒక్కరు కూడా సూపర్ సిక్స్ గురించి మాట్లాడడం లేదన్నారు.
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…