టీడీపీ ఆఫీసుపై వైసీపీ నాయకులు చేసిన దాడిని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ సమర్థించుకున్నా రు. తమ పార్టీ నాయకులు చేసింది తప్పుకాదన్నారు. “టీడీపీకి చెందిన ఒక ప్రబుద్ధుడు నన్ను బోష్డీకే అన్నాడు. దీని అర్థం.. మీకు తెలుసు. లం.. కొడక అని.. మరి నన్ను ఇంతగా తిడితే.. నా పార్టీ వాళ్లకు కోపం రాదా. అందుకే.. టీడీపీ ఆఫీసుపై చిన్న దాడి చేశారు. దీనిలో తప్పేముంది“ అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఇదే కేసులో అరెస్టయిన మాజీ ఎంపీ నందిగం సురేష్.. గుంటూరు జైల్లో ఉన్నారు.
ఈ నేపథ్యంలో సురేష్ను పరామర్శించేందుకు బుధవారం జైలుకు వచ్చిన జగన్.. మీడియాతో మాట్లాడా రు. చంద్రబాబుపై ఈ సందర్భంగా విమర్శలు గుప్పించారు. తప్పు చేస్తే శిక్షించవచ్చని.. కానీ.. అసలు తప్పులన్నీ.. చంద్రబాబే చేస్తున్నారని, కానీ, శిక్షలు మాత్రం వైసీపీ నాయకులకు వేస్తున్నారని వ్యాఖ్యా నించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని చెప్పారు. ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటామని.. ఎవరి కాళ్లూ పట్టుకుని చంద్రబాబు లాగా మేనేజ్ చేసుకోబోమన్నారు.
రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని జగన్ చెప్పారు. చంద్రబాబు ను నమ్మి ప్రజలు ఓటేశారని.. కానీ, ప్రజలను ఆయన అన్ని రకాలుగా మోసం చేస్తున్నారని విమర్శించారు. సూపర్ సిక్స్ ఏమయ్యాయని ప్రశ్నించారు. తాము అధికారంలో ఉంటే.. ఇప్పటికే అమ్మ ఒడి, రైతు భరోసా, విద్యాకానుక వంటివి ప్రజలకు అంది ఉండేవని.. కానీ, చంద్రబాబు ఇంతకన్నా ఎక్కువ ఇస్తామని చెప్పి ప్రజలకు అన్యాయం చేశారని విమర్శలు గుప్పించారు. ఒక్కరంటే ఒక్కరు కూడా సూపర్ సిక్స్ గురించి మాట్లాడడం లేదన్నారు.
హారర్ అంటే కామెడీతో కిచిడి అయిపోయిన ట్రెండ్ లో నేరుగా ఓటిటిలో రిలీజైన మా ఊరి పొలిమేర జనాన్ని భయపెట్టడంలో…
ఒకప్పుడు మూడు నాలుగు సినిమాలు ఒకే రోజు విడుదలైనా బాక్సాఫీస్ కు తట్టుకునే కెపాసిటీ ఉండేది. ఓటిటి, ఇంటర్ నెట్…
తాను హీరోగా స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘రాయన్’ను 2024 సంవత్సరానికి ఉత్తమ ప్రాంతీయ తమిళ చిత్రంగా జాతీయ అవార్డుల జ్యూరీ…
ముద్రగడ పద్మనాభం సంతాప సభకు హాజరైన అంశంపై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా…
మాస్ మహారాజా రవితేజ ఇరుముడి మీద మంచి బజ్ ఉంది. గత కొన్ని సినిమాలు ఎంత ఫ్లాప్ అయినా దీని…
తమిళ సినిమాల్లో నంబర్ వన్ స్థాయిలో ఉంటూ రాజకీయాల వైపు అడుగులేసిన విజయ్ సినీ రంగాన్ని ఖాళీ చేస్తూ చేసిన…