Political News

బుడ‌మేరు గండి – ఆర్మీ స‌రికొత్త ప్ర‌యోగం

విజ‌య‌వాడ‌లోని శివారు ప్రాంతాలు నీట మున‌గ‌డానికి కార‌ణ‌మైన బుడ‌మేరు వ‌ర‌ద‌ను అరిక‌ట్టేందుకు.. స‌జావుగా వాగు సాగేందుకు ప్ర‌భుత్వం యుద్ధ ప్రాతిప‌దిక‌న చ‌ర్య‌లు తీసుకుంటున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆర్మీ సాయం తీసుకుంటోంది. చెన్నై, విశాఖ‌, సికింద్రాబాద్ నుంచి వ‌చ్చిన 150 మందికి పైగా సైన్యం.. బుడ‌మేరు ప్రాంతంలో గండ్లు పూడ్చే ప‌నిని విడ‌త‌ల వారీగా చేస్తున్నారు. ప్ర‌ధానంగా బుడ‌మేరుకు మూడు గండ్లు ప‌డ్డాయి. వీటి నుంచే నీరు భారీ ఎత్తున నివాస ప్రాంతాల్లోకి చొచ్చుకువ‌చ్చింది.

అయితే..ఈ గండ్ల‌లో రెండింటిని రాష్ట్ర ప్ర‌భుత్వ ఇరిగేష‌న్ అధికారులు గురువారం రాత్రి స‌మ‌యానికి పూడ్చి వేశారు. కానీ, ప్ర‌ధాన‌మైన మూడో గండి మాత్రం పూడ్చేందుకు ఇబ్బందులు ఏర్ప‌డ్డాయి. ఇది సాధ్యం కాలేదు. దీంతో ఆర్మీ సాయం తీసుకుంటున్నారు. రంగంలోకి దిగిన ఆర్మీ ఇంజ‌నీరింగ్ అధికారులు. గండి పూడ్చేందుకు ఉన్న అన్ని అవ‌కాశాల‌ను తొలుత అధ్య‌య‌నం చేశారు. ఎన్ని రాళ్లు వేసినా.. ఎంత మ‌ట్టి పొసినా.. గండి పూడ‌డం లేద‌ని గుర్తించారు. దీంతో కొత్త ఆలోచ‌న చేశారు.

దీంతో ఇనుప బుట్ట‌లు త‌యారు చేసి.. వాటిలో రాళ్ల‌ను, మ‌ట్టిని నింపి.. గండి ప‌డిన చోట వేయాల‌ని నిర్ణ‌యించారు. దీంతో హుటాహుటిన వెల్డ‌ర్ల‌ను తీసుకువ‌చ్చి.. ప‌టిష్ట‌మైన ఇనుముతో పెద్ద పెద్ద ఇనుప బుట్ట‌ల‌ను త‌యారు చేయిస్తున్నారు. వీటిలో వేసేందుకు కంక‌ర‌, మ‌ట్టి, ఇసుక‌, సిమెంటును కూడా సిద్ధం చేసుకున్నారు. వీటి ద్వారా.. మూడో గండిని పూడ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ బుట్ల‌ల‌ను గేబియాన్‌ అంటార‌ని ఆర్మీ అధికారులు తెలిపారు.

మూడో గండి ప్రాంతం 80 నుంచి 100 మీటర్ల ఉందని, దీనిని పూడ్చేందుకు స‌మ‌యం ప‌డుతుంద‌ని చెప్పారు. శ‌నివారం ఉద‌యానికి ప‌ని పూర్త‌వుతుంద‌న్నారు. మ‌రోవైపు.. ఆర్మీ అధికారుల‌కు, ఇంజ‌నీర్ల‌కు ఇరిగేష‌న్ అధికారులు సాయం చేస్తున్నారు. వారి సూచ‌న‌ల‌ను తూ.చ‌. త‌ప్ప‌కుండా పాటిస్తున్నారు. మంత్రి నిమ్మ‌ల రామానాయుడు క్షేత్ర‌స్థాయిలో ఉండి ప‌ర్య‌వేక్షిస్తున్నారు. దీంతో గండి పూడిక‌పై అధికారులు భ‌రోసా వ్య‌క్తం చేస్తున్నారు.

This post was last modified on September 9, 2024 10:39 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నియోజ‌క‌వ‌ర్గాల‌పై రేవంత్ కొత్త ఫార్ములా… వ‌ర్కువ‌ట్ అయ్యేనా?

2029 పార్ల‌మెంటు ఎన్నిక‌ల నాటికి దేశంలో నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభ‌జించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…

51 minutes ago

పెను సంక్షోభంలో ప్ర‌పంచం…!

అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభ‌న ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…

1 hour ago

రాష్ట్ర‌ప‌తికి బహుమతిగా మంగళగిరి చీర

భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…

2 hours ago

ఏపీ కొత్త ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌… వైసీపీకి షాకేనా?

ఏపీ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ ప‌ద‌వి ఖాళీ అయింది. గ‌త నెల 31వ తేదీ వ‌ర‌కు ఉన్న రాష్ట్ర…

2 hours ago

‘హోం’ ప్రశ్నలపై ‘సీఎం’ సమాధానం చెప్తారా?

తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…

3 hours ago

కేసీఆర్ వరకు వెళ్లిన సీతక్క పంచాయితీ

తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…

4 hours ago