విజయవాడలోని శివారు ప్రాంతాలు నీట మునగడానికి కారణమైన బుడమేరు వరదను అరికట్టేందుకు.. సజావుగా వాగు సాగేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆర్మీ సాయం తీసుకుంటోంది. చెన్నై, విశాఖ, సికింద్రాబాద్ నుంచి వచ్చిన 150 మందికి పైగా సైన్యం.. బుడమేరు ప్రాంతంలో గండ్లు పూడ్చే పనిని విడతల వారీగా చేస్తున్నారు. ప్రధానంగా బుడమేరుకు మూడు గండ్లు పడ్డాయి. వీటి నుంచే నీరు భారీ ఎత్తున నివాస ప్రాంతాల్లోకి చొచ్చుకువచ్చింది.
అయితే..ఈ గండ్లలో రెండింటిని రాష్ట్ర ప్రభుత్వ ఇరిగేషన్ అధికారులు గురువారం రాత్రి సమయానికి పూడ్చి వేశారు. కానీ, ప్రధానమైన మూడో గండి మాత్రం పూడ్చేందుకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇది సాధ్యం కాలేదు. దీంతో ఆర్మీ సాయం తీసుకుంటున్నారు. రంగంలోకి దిగిన ఆర్మీ ఇంజనీరింగ్ అధికారులు. గండి పూడ్చేందుకు ఉన్న అన్ని అవకాశాలను తొలుత అధ్యయనం చేశారు. ఎన్ని రాళ్లు వేసినా.. ఎంత మట్టి పొసినా.. గండి పూడడం లేదని గుర్తించారు. దీంతో కొత్త ఆలోచన చేశారు.
దీంతో ఇనుప బుట్టలు తయారు చేసి.. వాటిలో రాళ్లను, మట్టిని నింపి.. గండి పడిన చోట వేయాలని నిర్ణయించారు. దీంతో హుటాహుటిన వెల్డర్లను తీసుకువచ్చి.. పటిష్టమైన ఇనుముతో పెద్ద పెద్ద ఇనుప బుట్టలను తయారు చేయిస్తున్నారు. వీటిలో వేసేందుకు కంకర, మట్టి, ఇసుక, సిమెంటును కూడా సిద్ధం చేసుకున్నారు. వీటి ద్వారా.. మూడో గండిని పూడ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ బుట్లలను గేబియాన్ అంటారని ఆర్మీ అధికారులు తెలిపారు.
మూడో గండి ప్రాంతం 80 నుంచి 100 మీటర్ల ఉందని, దీనిని పూడ్చేందుకు సమయం పడుతుందని చెప్పారు. శనివారం ఉదయానికి పని పూర్తవుతుందన్నారు. మరోవైపు.. ఆర్మీ అధికారులకు, ఇంజనీర్లకు ఇరిగేషన్ అధికారులు సాయం చేస్తున్నారు. వారి సూచనలను తూ.చ. తప్పకుండా పాటిస్తున్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు క్షేత్రస్థాయిలో ఉండి పర్యవేక్షిస్తున్నారు. దీంతో గండి పూడికపై అధికారులు భరోసా వ్యక్తం చేస్తున్నారు.
This post was last modified on September 9, 2024 10:39 am
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేశ్కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ను కూటమి సర్కార్ ఏర్పాటు చేసిన…
తమిళ రాజకీయాల్లో తన అరంగేట్రం చేస్తున్న నటుడు విజయ్ (తమిళగ వెట్రి కళగం), గతంలో ఏపీలో పవన్ కళ్యాణ్ అనుసరించిన…
పవన్ కళ్యాణ్ కొత్త సినిమా నుంచి పాట వస్తోందంటే అభిమానులకు ఎక్కడ లేని హుషారు పుట్టుకొస్తుంది. అందులోనూ గబ్బర్ సింగ్…
నెల్లూరు పార్లమెంటు సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వ్యవహారం వైసీపీలో హాట్ టాపిక్గా మారింది. ఇటీ వల వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి,…
వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…
జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…