విజయవాడలోని శివారు ప్రాంతాలు నీట మునగడానికి కారణమైన బుడమేరు వరదను అరికట్టేందుకు.. సజావుగా వాగు సాగేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆర్మీ సాయం తీసుకుంటోంది. చెన్నై, విశాఖ, సికింద్రాబాద్ నుంచి వచ్చిన 150 మందికి పైగా సైన్యం.. బుడమేరు ప్రాంతంలో గండ్లు పూడ్చే పనిని విడతల వారీగా చేస్తున్నారు. ప్రధానంగా బుడమేరుకు మూడు గండ్లు పడ్డాయి. వీటి నుంచే నీరు భారీ ఎత్తున నివాస ప్రాంతాల్లోకి చొచ్చుకువచ్చింది.
అయితే..ఈ గండ్లలో రెండింటిని రాష్ట్ర ప్రభుత్వ ఇరిగేషన్ అధికారులు గురువారం రాత్రి సమయానికి పూడ్చి వేశారు. కానీ, ప్రధానమైన మూడో గండి మాత్రం పూడ్చేందుకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇది సాధ్యం కాలేదు. దీంతో ఆర్మీ సాయం తీసుకుంటున్నారు. రంగంలోకి దిగిన ఆర్మీ ఇంజనీరింగ్ అధికారులు. గండి పూడ్చేందుకు ఉన్న అన్ని అవకాశాలను తొలుత అధ్యయనం చేశారు. ఎన్ని రాళ్లు వేసినా.. ఎంత మట్టి పొసినా.. గండి పూడడం లేదని గుర్తించారు. దీంతో కొత్త ఆలోచన చేశారు.
దీంతో ఇనుప బుట్టలు తయారు చేసి.. వాటిలో రాళ్లను, మట్టిని నింపి.. గండి పడిన చోట వేయాలని నిర్ణయించారు. దీంతో హుటాహుటిన వెల్డర్లను తీసుకువచ్చి.. పటిష్టమైన ఇనుముతో పెద్ద పెద్ద ఇనుప బుట్టలను తయారు చేయిస్తున్నారు. వీటిలో వేసేందుకు కంకర, మట్టి, ఇసుక, సిమెంటును కూడా సిద్ధం చేసుకున్నారు. వీటి ద్వారా.. మూడో గండిని పూడ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ బుట్లలను గేబియాన్ అంటారని ఆర్మీ అధికారులు తెలిపారు.
మూడో గండి ప్రాంతం 80 నుంచి 100 మీటర్ల ఉందని, దీనిని పూడ్చేందుకు సమయం పడుతుందని చెప్పారు. శనివారం ఉదయానికి పని పూర్తవుతుందన్నారు. మరోవైపు.. ఆర్మీ అధికారులకు, ఇంజనీర్లకు ఇరిగేషన్ అధికారులు సాయం చేస్తున్నారు. వారి సూచనలను తూ.చ. తప్పకుండా పాటిస్తున్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు క్షేత్రస్థాయిలో ఉండి పర్యవేక్షిస్తున్నారు. దీంతో గండి పూడికపై అధికారులు భరోసా వ్యక్తం చేస్తున్నారు.
This post was last modified on September 9, 2024 10:39 am
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…