Political News

బుడ‌మేరు గండి – ఆర్మీ స‌రికొత్త ప్ర‌యోగం

విజ‌య‌వాడ‌లోని శివారు ప్రాంతాలు నీట మున‌గ‌డానికి కార‌ణ‌మైన బుడ‌మేరు వ‌ర‌ద‌ను అరిక‌ట్టేందుకు.. స‌జావుగా వాగు సాగేందుకు ప్ర‌భుత్వం యుద్ధ ప్రాతిప‌దిక‌న చ‌ర్య‌లు తీసుకుంటున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆర్మీ సాయం తీసుకుంటోంది. చెన్నై, విశాఖ‌, సికింద్రాబాద్ నుంచి వ‌చ్చిన 150 మందికి పైగా సైన్యం.. బుడ‌మేరు ప్రాంతంలో గండ్లు పూడ్చే ప‌నిని విడ‌త‌ల వారీగా చేస్తున్నారు. ప్ర‌ధానంగా బుడ‌మేరుకు మూడు గండ్లు ప‌డ్డాయి. వీటి నుంచే నీరు భారీ ఎత్తున నివాస ప్రాంతాల్లోకి చొచ్చుకువ‌చ్చింది.

అయితే..ఈ గండ్ల‌లో రెండింటిని రాష్ట్ర ప్ర‌భుత్వ ఇరిగేష‌న్ అధికారులు గురువారం రాత్రి స‌మ‌యానికి పూడ్చి వేశారు. కానీ, ప్ర‌ధాన‌మైన మూడో గండి మాత్రం పూడ్చేందుకు ఇబ్బందులు ఏర్ప‌డ్డాయి. ఇది సాధ్యం కాలేదు. దీంతో ఆర్మీ సాయం తీసుకుంటున్నారు. రంగంలోకి దిగిన ఆర్మీ ఇంజ‌నీరింగ్ అధికారులు. గండి పూడ్చేందుకు ఉన్న అన్ని అవ‌కాశాల‌ను తొలుత అధ్య‌య‌నం చేశారు. ఎన్ని రాళ్లు వేసినా.. ఎంత మ‌ట్టి పొసినా.. గండి పూడ‌డం లేద‌ని గుర్తించారు. దీంతో కొత్త ఆలోచ‌న చేశారు.

దీంతో ఇనుప బుట్ట‌లు త‌యారు చేసి.. వాటిలో రాళ్ల‌ను, మ‌ట్టిని నింపి.. గండి ప‌డిన చోట వేయాల‌ని నిర్ణ‌యించారు. దీంతో హుటాహుటిన వెల్డ‌ర్ల‌ను తీసుకువ‌చ్చి.. ప‌టిష్ట‌మైన ఇనుముతో పెద్ద పెద్ద ఇనుప బుట్ట‌ల‌ను త‌యారు చేయిస్తున్నారు. వీటిలో వేసేందుకు కంక‌ర‌, మ‌ట్టి, ఇసుక‌, సిమెంటును కూడా సిద్ధం చేసుకున్నారు. వీటి ద్వారా.. మూడో గండిని పూడ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ బుట్ల‌ల‌ను గేబియాన్‌ అంటార‌ని ఆర్మీ అధికారులు తెలిపారు.

మూడో గండి ప్రాంతం 80 నుంచి 100 మీటర్ల ఉందని, దీనిని పూడ్చేందుకు స‌మ‌యం ప‌డుతుంద‌ని చెప్పారు. శ‌నివారం ఉద‌యానికి ప‌ని పూర్త‌వుతుంద‌న్నారు. మ‌రోవైపు.. ఆర్మీ అధికారుల‌కు, ఇంజ‌నీర్ల‌కు ఇరిగేష‌న్ అధికారులు సాయం చేస్తున్నారు. వారి సూచ‌న‌ల‌ను తూ.చ‌. త‌ప్ప‌కుండా పాటిస్తున్నారు. మంత్రి నిమ్మ‌ల రామానాయుడు క్షేత్ర‌స్థాయిలో ఉండి ప‌ర్య‌వేక్షిస్తున్నారు. దీంతో గండి పూడిక‌పై అధికారులు భ‌రోసా వ్య‌క్తం చేస్తున్నారు.

This post was last modified on September 9, 2024 10:39 am

Share

Recent Posts

రవితేజకు డబ్బులే డబ్బులు

మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…

2 hours ago

దృశ్యం 4… ఇంకెన్నిసార్లు సాగదీస్తారో

ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…

2 hours ago

హైదరాబాద్ వచ్చిన జాంబీరెడ్డి ఏం చేయబోతున్నాడు

కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…

2 hours ago

మహిళను చంపి…. బిర్యానీ వండి…

ఏమైందో ఏమో కానీ ఆ దంపతులు ఒక మహిళను హత్య చేశారు. హత్య చేసి తీరిగ్గా ఆ మహిళ దేహాన్ని…

3 hours ago

బాలయ్య తీసుకునేది తెలివైన నిర్ణయమే

ప్రమాదంలో కలిగిన గాయం వల్ల చికిత్స చేయించుకుని విశ్రాంతిలో ఉన్న బాలకృష్ణ డాక్టర్లు చెప్పిన టైం కన్నా ముందే షూటింగ్…

3 hours ago

హైదరాబాద్‌లో ఇంకా పెద్ద ఐమాక్స్?

దేశంలో సినీ అభిమానం పరంగా టాప్‌లో నిలిచే తెలుగు రాష్ట్రాల్లో ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యమే. గతంలో ప్రసాద్స్‌లో ఈ…

3 hours ago