అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉమ్మడి చిత్తూరు జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పై తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. బాధితురాలు, టీడీపీ మహిళా నాయకురాలు ఫిర్యాదు మేరకు ఆదిమూలంపై సెక్స్ వల్ హెరాస్ మెంట్, పోస్కో చట్టం కింద కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. తిరుపతిలోని భీమాస్ పారడైజ్ రూమ్ నంబర్ 105, 109లో తన ప్రమేయం లేకుండానే ఆదిమూలం పలు మార్లు అత్యాచారం చేసినట్లు బాధితురాలు ఫిర్యాదు చేశారు.
దీంతో ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెంబరు 430/2024తో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదేసమయం లో భీమాస్ పారడైజ్ హోటల్ లో సి.సి. టీవీ పుటేజీ సేకరించారు. అదేసమయంలో హోటల్ యజమాని పైనా కేసు పెట్టినట్టు తెలిపారు. మరోవైపు టీడీపీ ఇప్పటికే ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేసిం ది. ఆయనపై అంతర్గత విచారణకు పార్టీ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీని నియమించిన రెండు రోజుల్లోనే నివేదిక ఇచ్చేలా చూస్తామని.. పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు.
ఇదిలావుంటే, తనపై అత్యాచార ఆరోపణలు రావడంతో ఆదిమూలం తన కుమారుడితో సహా.. అజ్ఞాతం లోకి వెళ్లిపోయారు. అయితే.. ఆయన చెన్నైలో ఉన్నారన్న సమాచారం మేరకు ఒక బృందం పోలీసులు.. అక్కడకు వెళ్లి ఆయన కోసం వెతుకుతున్నారు. ఇక, ఆదిమూలం వ్యవహారాన్ని స్థానిక టీడీపీ నాయకులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కాదు.. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించాలని డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు.. తమపై కుట్ర చేశారని.. వైసీపీ నాయకులు ఉన్నారని.. ఆదిమూలం కుటుంబ సభ్యులు ముఖ్యంగా ఆయన కుమార్తెలు ఇద్దరు చెబుతున్నారు. తమను కావాలనే ఇరికించారని.. తమ తండ్రి 50 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎలాంటి మచ్చ లేకుండా జీవించారని వారు చెబుతున్నారు. దీంతో తిరుపతి టీడీపీలో ఆదిమూలం వ్యవహారం ఉత్కంఠగా మారింది. చివరకు ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on September 6, 2024 1:58 pm
తెలుగు సినీ అభిమానుల్లో ఎన్నెన్ని వర్గాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులో ఒక వర్గానికి ఇంకో వర్గానికి అస్సలు…
ఒకప్పుడు హిందీ సినిమాలు తెలుగులోకి అనువాదం కావడం, ఇక్కడ పెద్ద స్థాయిలో రిలీజ్ కావడమే ఉండేది తప్ప.. తెలుగు చిత్రాలు…
మాజీ మంత్రి మల్లారెడ్డి స్టేజ్ ఎక్కారంటే, మైక్ అందుకున్నారు అంటే మెరుపులు మెరవాల్సిందే. అది రాజకీయ సభ అయినా.. సినిమా…
మన దేశంలో చాలా చోట్ల కోతుల బెడద ఉంది. అడవుల నరికివేత, పట్టణీకరణ నేపథ్యంలో కోతులు జనావాసాల మధ్యకు వచ్చాయి.…
అల్లు అర్జున్ అంటే ఒకప్పుడు మెగా హీరోల్లో ఒకడు. అతను మెగాస్టార్ చిరంజీవినో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్నో పొగిడితేనో..…
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇరుముడి తప్ప మరొక మాట వినిపించదేమో అన్న రేంజ్ లో వసూళ్లు హోరెత్తిపోతున్నాయి. ఈ జోరు…