అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉమ్మడి చిత్తూరు జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పై తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. బాధితురాలు, టీడీపీ మహిళా నాయకురాలు ఫిర్యాదు మేరకు ఆదిమూలంపై సెక్స్ వల్ హెరాస్ మెంట్, పోస్కో చట్టం కింద కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. తిరుపతిలోని భీమాస్ పారడైజ్ రూమ్ నంబర్ 105, 109లో తన ప్రమేయం లేకుండానే ఆదిమూలం పలు మార్లు అత్యాచారం చేసినట్లు బాధితురాలు ఫిర్యాదు చేశారు.
దీంతో ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెంబరు 430/2024తో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదేసమయం లో భీమాస్ పారడైజ్ హోటల్ లో సి.సి. టీవీ పుటేజీ సేకరించారు. అదేసమయంలో హోటల్ యజమాని పైనా కేసు పెట్టినట్టు తెలిపారు. మరోవైపు టీడీపీ ఇప్పటికే ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేసిం ది. ఆయనపై అంతర్గత విచారణకు పార్టీ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీని నియమించిన రెండు రోజుల్లోనే నివేదిక ఇచ్చేలా చూస్తామని.. పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు.
ఇదిలావుంటే, తనపై అత్యాచార ఆరోపణలు రావడంతో ఆదిమూలం తన కుమారుడితో సహా.. అజ్ఞాతం లోకి వెళ్లిపోయారు. అయితే.. ఆయన చెన్నైలో ఉన్నారన్న సమాచారం మేరకు ఒక బృందం పోలీసులు.. అక్కడకు వెళ్లి ఆయన కోసం వెతుకుతున్నారు. ఇక, ఆదిమూలం వ్యవహారాన్ని స్థానిక టీడీపీ నాయకులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కాదు.. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించాలని డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు.. తమపై కుట్ర చేశారని.. వైసీపీ నాయకులు ఉన్నారని.. ఆదిమూలం కుటుంబ సభ్యులు ముఖ్యంగా ఆయన కుమార్తెలు ఇద్దరు చెబుతున్నారు. తమను కావాలనే ఇరికించారని.. తమ తండ్రి 50 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎలాంటి మచ్చ లేకుండా జీవించారని వారు చెబుతున్నారు. దీంతో తిరుపతి టీడీపీలో ఆదిమూలం వ్యవహారం ఉత్కంఠగా మారింది. చివరకు ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on September 6, 2024 1:58 pm
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…