అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉమ్మడి చిత్తూరు జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పై తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. బాధితురాలు, టీడీపీ మహిళా నాయకురాలు ఫిర్యాదు మేరకు ఆదిమూలంపై సెక్స్ వల్ హెరాస్ మెంట్, పోస్కో చట్టం కింద కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. తిరుపతిలోని భీమాస్ పారడైజ్ రూమ్ నంబర్ 105, 109లో తన ప్రమేయం లేకుండానే ఆదిమూలం పలు మార్లు అత్యాచారం చేసినట్లు బాధితురాలు ఫిర్యాదు చేశారు.
దీంతో ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెంబరు 430/2024తో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదేసమయం లో భీమాస్ పారడైజ్ హోటల్ లో సి.సి. టీవీ పుటేజీ సేకరించారు. అదేసమయంలో హోటల్ యజమాని పైనా కేసు పెట్టినట్టు తెలిపారు. మరోవైపు టీడీపీ ఇప్పటికే ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేసిం ది. ఆయనపై అంతర్గత విచారణకు పార్టీ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీని నియమించిన రెండు రోజుల్లోనే నివేదిక ఇచ్చేలా చూస్తామని.. పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు.
ఇదిలావుంటే, తనపై అత్యాచార ఆరోపణలు రావడంతో ఆదిమూలం తన కుమారుడితో సహా.. అజ్ఞాతం లోకి వెళ్లిపోయారు. అయితే.. ఆయన చెన్నైలో ఉన్నారన్న సమాచారం మేరకు ఒక బృందం పోలీసులు.. అక్కడకు వెళ్లి ఆయన కోసం వెతుకుతున్నారు. ఇక, ఆదిమూలం వ్యవహారాన్ని స్థానిక టీడీపీ నాయకులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కాదు.. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించాలని డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు.. తమపై కుట్ర చేశారని.. వైసీపీ నాయకులు ఉన్నారని.. ఆదిమూలం కుటుంబ సభ్యులు ముఖ్యంగా ఆయన కుమార్తెలు ఇద్దరు చెబుతున్నారు. తమను కావాలనే ఇరికించారని.. తమ తండ్రి 50 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎలాంటి మచ్చ లేకుండా జీవించారని వారు చెబుతున్నారు. దీంతో తిరుపతి టీడీపీలో ఆదిమూలం వ్యవహారం ఉత్కంఠగా మారింది. చివరకు ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on September 6, 2024 1:58 pm
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ తో కలిసి…
ఒకప్పుడు తమిళ డబ్బింగ్ సినిమాలను చూసి తెలుగులో ఇలాంటి సినిమాలు రావేంటి అని చాలా ఫీలయ్యేవాళ్లు మన ప్రేక్షకులు. అక్కడ ఎన్నో కొత్త…
మాస్ రాజా రవితేజకు గత కొన్నేళ్లలో పెద్ద హిట్ అంటే.. ధమాకానే. ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుని కూడా బ్లాక్ బస్టర్…
హైదరాబాద్ శిల్ప కళావేదికలో జరిగిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవాళ అభిమానులతో కళకళలాడిపోయింది. ఇదే నెలలో…
పాకిస్థాన్ క్రికెటర్ల మీద సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతూ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఆటతోనే కాక మాటతీరుతోనూ వాళ్లు సోషల్ మీడియాకు టార్గెట్ అవుతుంటారు.…
https://www.youtube.com/watch?v=hFNCZ_oVOZ4 ఏడాదిన్నరగా కళ్యాణ్ రామ్ కు గ్యాప్ వచ్చేసింది. డెవిల్ తర్వాత ఆచితూచి అడుగులు వేస్తున్న ఈ నందమూరి హీరో…