Political News

విజయవాడ తేరుకునే వరకు ఇంటికి వెళ్లనంటున్న నిమ్మల

వరదలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న విజయవాడలో పరిస్ధితుల్ని ఒక కొలిక్కి తెచ్చే వరకు విశ్రమించకూడదన్నట్లుగా వ్యవహరిస్తున్న ఒక ఏపీ మంత్రి వ్యవహారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వారం రోజులుగా ఇంటికి వెళ్లకుండా కాలువ గట్ల మీదే.. రాత్రి.. పగలు అన్న తేడా లేకుండా శ్రమిస్తున్న తీరు కొత్త స్ఫూర్తిగా మారింది. పార్టీ అధినేత కం ముఖ్యమంత్రి చంద్రబాబును ఆదర్శంగా తీసుకున్న ఆయన ఎవరో కాదు.. జలవనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు.

వరద ముంపుతో అతలాకుతలమైన విజయవాడ నగరం తేరుకునే వరకూ.. రొటీన్ లైఫ్ కు వచ్చే వరకు తాను ఇంటికి తిరిగి వెళ్లేదే లేదంటూ వర్షంలోనూ.. కాల్వగట్ల మీదనే గడుపుతున్నారు. బుడమేరు మళ్లింపు కాలువకు మూడు రోజుల క్రితం గండ్లు పడిన సంగతి తెలిసిందే. ఈ నీరంతా విజయవాడ నగరంలోని వివిధ ప్రాంతాలతో పాటు.. దిగువన ఉన్న గ్రామాల్లోకి.. పంట పొలాల్లోకి పోటెత్తుతోంది.

ఈ నేపథ్యంలో వరద నియంత్రణ చర్యలను బుధవారం నుంచే పర్యవేక్షిస్తున్న ఆయన.. గురువారం రాత్రి నాటికి ఈలప్రోలు.. కవులూరు వద్ద గండ్లకు రిపేర్లు పూర్తి చేశారు. వరదనీరు.. బురద కారణంగా వాహనాలు వెళ్లే పరిస్థితి లేకపోవటంతో సిబ్బందితో కలిసి నడిచి వెళ్లటం గమనార్హం. ఇదంతా ఒక ఎత్తు అయితే.. వాన కురుస్తున్నా.. వరద పోటెత్తుతున్నా.. చీకట్లలోనూ.. మంత్రి రామానాయుడు అక్కడి నుంచి ముందుకు కదలటం లేదు. కట్ట మీదే భోజనం చేస్తూ అక్కడే ఉంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే వసంత క్రిష్ణ ప్రసాద్.. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావులు మంత్రి వెంటే ఉంటున్నారు.

ఏ పని అయినా దగ్గర ఉండి చేయిస్తేనే ఆ పని త్వరగా పూర్తి అవుతుందన్నది ముఖ్యమంత్రి నమ్మకం. ఆ స్ఫూర్తినే తాను పాటిస్తున్నట్లుగా రామానాయుడు తెలిపారు. అన్ని గండ్లుపూడ్చిన తర్వాత ఇంటికి వెళతానన్న మంత్రి మాటలు కొత్త స్ఫూర్తిగా మారుతున్నాయని చెప్పాలి. ఒక మంత్రిలో ఇలాంటి కమిట్ మెంట్ రేర్ గా అభిప్రాయపడుతున్నారు.

This post was last modified on September 6, 2024 10:46 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

45 minutes ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

1 hour ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

2 hours ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

3 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

4 hours ago

దమ్ముంటే నన్ను జైలుకు పంపు: జగన్ కు బీజేపీ మంత్రి సవాల్

మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…

5 hours ago