Political News

విజయవాడ తేరుకునే వరకు ఇంటికి వెళ్లనంటున్న నిమ్మల

వరదలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న విజయవాడలో పరిస్ధితుల్ని ఒక కొలిక్కి తెచ్చే వరకు విశ్రమించకూడదన్నట్లుగా వ్యవహరిస్తున్న ఒక ఏపీ మంత్రి వ్యవహారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వారం రోజులుగా ఇంటికి వెళ్లకుండా కాలువ గట్ల మీదే.. రాత్రి.. పగలు అన్న తేడా లేకుండా శ్రమిస్తున్న తీరు కొత్త స్ఫూర్తిగా మారింది. పార్టీ అధినేత కం ముఖ్యమంత్రి చంద్రబాబును ఆదర్శంగా తీసుకున్న ఆయన ఎవరో కాదు.. జలవనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు.

వరద ముంపుతో అతలాకుతలమైన విజయవాడ నగరం తేరుకునే వరకూ.. రొటీన్ లైఫ్ కు వచ్చే వరకు తాను ఇంటికి తిరిగి వెళ్లేదే లేదంటూ వర్షంలోనూ.. కాల్వగట్ల మీదనే గడుపుతున్నారు. బుడమేరు మళ్లింపు కాలువకు మూడు రోజుల క్రితం గండ్లు పడిన సంగతి తెలిసిందే. ఈ నీరంతా విజయవాడ నగరంలోని వివిధ ప్రాంతాలతో పాటు.. దిగువన ఉన్న గ్రామాల్లోకి.. పంట పొలాల్లోకి పోటెత్తుతోంది.

ఈ నేపథ్యంలో వరద నియంత్రణ చర్యలను బుధవారం నుంచే పర్యవేక్షిస్తున్న ఆయన.. గురువారం రాత్రి నాటికి ఈలప్రోలు.. కవులూరు వద్ద గండ్లకు రిపేర్లు పూర్తి చేశారు. వరదనీరు.. బురద కారణంగా వాహనాలు వెళ్లే పరిస్థితి లేకపోవటంతో సిబ్బందితో కలిసి నడిచి వెళ్లటం గమనార్హం. ఇదంతా ఒక ఎత్తు అయితే.. వాన కురుస్తున్నా.. వరద పోటెత్తుతున్నా.. చీకట్లలోనూ.. మంత్రి రామానాయుడు అక్కడి నుంచి ముందుకు కదలటం లేదు. కట్ట మీదే భోజనం చేస్తూ అక్కడే ఉంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే వసంత క్రిష్ణ ప్రసాద్.. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావులు మంత్రి వెంటే ఉంటున్నారు.

ఏ పని అయినా దగ్గర ఉండి చేయిస్తేనే ఆ పని త్వరగా పూర్తి అవుతుందన్నది ముఖ్యమంత్రి నమ్మకం. ఆ స్ఫూర్తినే తాను పాటిస్తున్నట్లుగా రామానాయుడు తెలిపారు. అన్ని గండ్లుపూడ్చిన తర్వాత ఇంటికి వెళతానన్న మంత్రి మాటలు కొత్త స్ఫూర్తిగా మారుతున్నాయని చెప్పాలి. ఒక మంత్రిలో ఇలాంటి కమిట్ మెంట్ రేర్ గా అభిప్రాయపడుతున్నారు.

This post was last modified on September 6, 2024 10:46 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

1 hour ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

1 hour ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

2 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

3 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

4 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

6 hours ago