Political News

విజయవాడ తేరుకునే వరకు ఇంటికి వెళ్లనంటున్న నిమ్మల

వరదలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న విజయవాడలో పరిస్ధితుల్ని ఒక కొలిక్కి తెచ్చే వరకు విశ్రమించకూడదన్నట్లుగా వ్యవహరిస్తున్న ఒక ఏపీ మంత్రి వ్యవహారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వారం రోజులుగా ఇంటికి వెళ్లకుండా కాలువ గట్ల మీదే.. రాత్రి.. పగలు అన్న తేడా లేకుండా శ్రమిస్తున్న తీరు కొత్త స్ఫూర్తిగా మారింది. పార్టీ అధినేత కం ముఖ్యమంత్రి చంద్రబాబును ఆదర్శంగా తీసుకున్న ఆయన ఎవరో కాదు.. జలవనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు.

వరద ముంపుతో అతలాకుతలమైన విజయవాడ నగరం తేరుకునే వరకూ.. రొటీన్ లైఫ్ కు వచ్చే వరకు తాను ఇంటికి తిరిగి వెళ్లేదే లేదంటూ వర్షంలోనూ.. కాల్వగట్ల మీదనే గడుపుతున్నారు. బుడమేరు మళ్లింపు కాలువకు మూడు రోజుల క్రితం గండ్లు పడిన సంగతి తెలిసిందే. ఈ నీరంతా విజయవాడ నగరంలోని వివిధ ప్రాంతాలతో పాటు.. దిగువన ఉన్న గ్రామాల్లోకి.. పంట పొలాల్లోకి పోటెత్తుతోంది.

ఈ నేపథ్యంలో వరద నియంత్రణ చర్యలను బుధవారం నుంచే పర్యవేక్షిస్తున్న ఆయన.. గురువారం రాత్రి నాటికి ఈలప్రోలు.. కవులూరు వద్ద గండ్లకు రిపేర్లు పూర్తి చేశారు. వరదనీరు.. బురద కారణంగా వాహనాలు వెళ్లే పరిస్థితి లేకపోవటంతో సిబ్బందితో కలిసి నడిచి వెళ్లటం గమనార్హం. ఇదంతా ఒక ఎత్తు అయితే.. వాన కురుస్తున్నా.. వరద పోటెత్తుతున్నా.. చీకట్లలోనూ.. మంత్రి రామానాయుడు అక్కడి నుంచి ముందుకు కదలటం లేదు. కట్ట మీదే భోజనం చేస్తూ అక్కడే ఉంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే వసంత క్రిష్ణ ప్రసాద్.. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావులు మంత్రి వెంటే ఉంటున్నారు.

ఏ పని అయినా దగ్గర ఉండి చేయిస్తేనే ఆ పని త్వరగా పూర్తి అవుతుందన్నది ముఖ్యమంత్రి నమ్మకం. ఆ స్ఫూర్తినే తాను పాటిస్తున్నట్లుగా రామానాయుడు తెలిపారు. అన్ని గండ్లుపూడ్చిన తర్వాత ఇంటికి వెళతానన్న మంత్రి మాటలు కొత్త స్ఫూర్తిగా మారుతున్నాయని చెప్పాలి. ఒక మంత్రిలో ఇలాంటి కమిట్ మెంట్ రేర్ గా అభిప్రాయపడుతున్నారు.

Satya

Recent Posts

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

9 hours ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

12 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

14 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

14 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

14 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

15 hours ago