ఏపీ సీఎం చంద్రబాబుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. విజయవాడలో బుడమేరు పొంగిపోవడంతో ఆయన బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. గురువారం మధ్యాహ్నం నుంచి మరోసారి బుడమేరుకు ఎగువ ప్రాంతాల నుంచి వరద రాక పెరిగింది. ప్రస్తుతం 10వేల క్యూసెక్కుల మేరకు వరద ప్రవాహం పెరిగింది. దీంతో ఈ వరద ప్రవాహాన్ని పరిశీలించి తగు చర్యలు చేపట్టేందుకు చంద్రబాబు క్షేత్రస్థాయిలో పర్యటనకు వెళ్లారు. సింగునగర్లోని రైల్వే ట్రాక్ పైకి ఎక్కి.. ఆయన పరిశీలించారు. ఈ సమయంలో ఇరిగేషన్ అధికారులు కూడా ఆయన వెంటే ఉన్నారు.
అయితే.. ఈ సమయంలో మధురానగర్ రైలు ట్రాక్పై విశాఖపట్నం నుంచి ఓ రైలు వస్తోంది. అయితే.. వరద ప్రవాహం, వాతావరణం సరిగా లేకపోవడంతో ఎవరూ దానిని గుర్తించలేదు. దాదాపు సమీపానికి వచ్చేసిన తర్వాత.. రైలు డ్రైవర్ హారన్ మోగించడంతో అందరూ ఉలిక్కిపడ్డారు. సరిగ్గా అదేసమయంలో ట్రాక్ పై చంద్రబాబు సహా అధికారులు ఉన్నారు. ఆ వెంటనే అధికారులు పరుగు పరుగున ముందుకు వెళ్లి.. చేతులు ఊపుతూ.. రైలు డ్రైవర్ను అప్రమత్తం చేసే ప్రయత్నం చేశారు. ఇంతలో సమీపంలో ఉన్న ట్రాక్మెన్ ఎర్ర జెండా చూపడంతో.. డ్రైవర్ రైలును సెడన్ బ్రేకులు వేసి ఆపివేశారు.
సుమారు అరగంట సేపు.. తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. ఆ వెంటనే చంద్రబాబు ట్రాప్ పక్కనే ఉన్న రెయిలింగ్ మీదకు వెళ్లి.. ట్రాక్ క్లియర్ చేయడంతో రైలు ప్రశాంతంగా వెళ్లిపోయింది. చంద్రబాబుకు పెను ముప్పు తప్పింది. అనంతరం.. చంద్రబాబు రైల్వే అధికారులకు సమాచారం ఇవ్వాలని.. అరగంట సేపు రైళ్లను ఆపాలని కోరారు. తర్వాత.. ఆయన బుడమేరు వరద ప్రవాహాన్ని పరిశీలించి.. దారిమళ్లంచేలా చర్యలు చేపట్టాలని.. ఆదేశించారు. అయితే.. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వరదల కారణంగా బుడమేరుకు మాత్రం వరద పోటు తప్పకపోవడం గమనార్హం.
This post was last modified on September 6, 2024 5:54 am
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పునర్నిర్మాణ పనులకు త్వరలోనే అడుగు పడనుంది. మే 2న అమరావతి రానున్న భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ…
ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ కారణంగా చాలామంది ఊబకాయం ,బెల్లీ ఫ్యాట్ తో భాద పడుతున్నారు. మరీ…
ఏపీ మంత్రి వర్గంలో సీఎం చంద్రబాబు గీస్తున్న లక్ష్మణ రేఖలకు.. ఆయన ఆదేశాలకు కూడా.. పెద్దగా రెస్పాన్స్ ఉండడం లేదని…
సంగీత దర్శకుడిగా ఏఆర్ ప్రస్థానం, గొప్పదనం గురించి మళ్ళీ కొత్తగా చెప్పడానికేం లేదు కానీ గత కొంత కాలంగా ఆయన…
యావత్తు దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వక్ఫ్ సవరణ చట్టంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. భారత…
నేను లోకల్, ధమాకా దర్శకుడు త్రినాధరావు నక్కిన ఇవాళ జరిగిన చౌర్య పాఠం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ…