Political News

సీఎం చంద్ర‌బాబుకు త‌ప్పిన ముప్పు..!

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు తృటిలో పెను ప్ర‌మాదం త‌ప్పింది. విజ‌య‌వాడ‌లో బుడ‌మేరు పొంగిపోవ‌డంతో ఆయ‌న బాధిత ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే.. గురువారం మ‌ధ్యాహ్నం నుంచి మ‌రోసారి బుడ‌మేరుకు ఎగువ ప్రాంతాల నుంచి వ‌ర‌ద రాక పెరిగింది. ప్ర‌స్తుతం 10వేల క్యూసెక్కుల మేర‌కు వ‌ర‌ద ప్ర‌వాహం పెరిగింది. దీంతో ఈ వ‌ర‌ద ప్ర‌వాహాన్ని ప‌రిశీలించి త‌గు చ‌ర్య‌లు చేప‌ట్టేందుకు చంద్ర‌బాబు క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. సింగున‌గ‌ర్‌లోని రైల్వే ట్రాక్ పైకి ఎక్కి.. ఆయ‌న ప‌రిశీలించారు. ఈ స‌మ‌యంలో ఇరిగేష‌న్ అధికారులు కూడా ఆయ‌న వెంటే ఉన్నారు.

అయితే.. ఈ స‌మ‌యంలో మధురాన‌గ‌ర్ రైలు ట్రాక్‌పై విశాఖ‌ప‌ట్నం నుంచి ఓ రైలు వ‌స్తోంది. అయితే.. వ‌ర‌ద ప్ర‌వాహం, వాతావ‌ర‌ణం స‌రిగా లేక‌పోవ‌డంతో ఎవ‌రూ దానిని గుర్తించ‌లేదు. దాదాపు స‌మీపానికి వ‌చ్చేసిన త‌ర్వాత‌.. రైలు డ్రైవ‌ర్ హార‌న్ మోగించ‌డంతో అంద‌రూ ఉలిక్కిప‌డ్డారు. స‌రిగ్గా అదేస‌మయంలో ట్రాక్ పై చంద్ర‌బాబు స‌హా అధికారులు ఉన్నారు. ఆ వెంట‌నే అధికారులు ప‌రుగు ప‌రుగున ముందుకు వెళ్లి.. చేతులు ఊపుతూ.. రైలు డ్రైవ‌ర్‌ను అప్ర‌మ‌త్తం చేసే ప్ర‌య‌త్నం చేశారు. ఇంత‌లో స‌మీపంలో ఉన్న ట్రాక్‌మెన్ ఎర్ర జెండా చూపడంతో.. డ్రైవ‌ర్ రైలును సెడ‌న్ బ్రేకులు వేసి ఆపివేశారు.

సుమారు అర‌గంట సేపు.. తీవ్ర గంద‌ర‌గోళం చోటు చేసుకుంది. ఆ వెంట‌నే చంద్ర‌బాబు ట్రాప్ ప‌క్క‌నే ఉన్న రెయిలింగ్ మీద‌కు వెళ్లి.. ట్రాక్ క్లియ‌ర్ చేయ‌డంతో రైలు ప్ర‌శాంతంగా వెళ్లిపోయింది. చంద్ర‌బాబుకు పెను ముప్పు త‌ప్పింది. అనంత‌రం.. చంద్ర‌బాబు రైల్వే అధికారుల‌కు స‌మాచారం ఇవ్వాల‌ని.. అర‌గంట సేపు రైళ్ల‌ను ఆపాల‌ని కోరారు. త‌ర్వాత‌.. ఆయ‌న బుడ‌మేరు వ‌ర‌ద ప్ర‌వాహాన్ని ప‌రిశీలించి.. దారిమ‌ళ్లంచేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని.. ఆదేశించారు. అయితే.. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వ‌రద‌ల కార‌ణంగా బుడ‌మేరుకు మాత్రం వ‌ర‌ద పోటు త‌ప్ప‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on September 6, 2024 5:54 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ష‌ర్మిలమ్మా.. మీ పార్టీ దీన‌స్థితి చూడ‌మ్మా.. !

ఏపీ కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారుతోందా? .. పార్టీ నాయ‌కులు దీన‌స్థితిలో ఉన్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే…

1 hour ago

ఇరాన్‌లో భారతీయ విద్యార్థులు.. ఇటు ప్రాణాలు, అటు పరీక్షలు

ఇరాన్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…

2 hours ago

బాలీవుడ్‌కు పొలిశెట్టి పంచ్

ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు న‌వీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన త‌న చివ‌రి చిత్రం అన‌గ‌న‌గా ఒక…

3 hours ago

శర్వానంద్ భోగికి అసలైన ఛాలెంజ్

2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…

3 hours ago

అయ్యన్నను ఓడించిన రఘురామ

రాజ‌కీయాల్లోనే కాదు.. ఆట‌ల్లోనూ త‌న సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాల…

4 hours ago

నంది అవార్డులంటే అంత చులకనా

ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…

4 hours ago