Political News

‘అయోమ‌యం’ జ‌గ‌న్‌.. సోష‌ల్ మీడియాకు భారీ ఫీడ్‌!

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ ఎక్క‌డ మాట్లాడినా.. స్క్రిప్టును క‌ళ్ల ముందు ఉంచుకుని చ‌ద‌వ‌డం తెలిసిందే. అయితే.. ఇటీ వ‌ల ఓడిపోయిన త‌ర్వాత‌.. ఆయ‌న అస‌లు బ‌య‌ట‌కే రావ‌డం లేదు. వ‌చ్చినా.. ఏదో నాలుగు మాట‌లు మాట్లాడి వెళ్లిపోతున్నారు. ఎన్నిక‌ల త‌ర్వాత‌.. ఫ‌లితం వ‌చ్చాక‌.. జ‌గ‌న్ నిర్వ‌హించిన ప్రెస్ మీట్‌లోనూ.. ఆయ‌న చూసే చ‌దివారు. అయిన‌ప్ప‌టికీ.. ఆయ‌న త‌డ‌బ‌డ్డారు. కాగా.. జ‌గ‌న్ ఎప్పుడు మాట్లాడినా.. ఆ విష‌యాలు సోష‌ల్ మీడియాలో భారీగా ఎత్తున హైలెట్ అవుతా యి. దీనికి కార‌ణం.. కొన్ని కొన్ని విష‌యాల్లో ఆయ‌న త‌లా తోకా లేకుండా మాట్లాడ‌డ‌మే.

అది కూడా.. చిన్న‌పిల్ల‌లకు తెలిసిన విషయాలు కూడా ఆయ‌న‌కు తెలియ‌క‌పోవ‌డమే! హైవే టోల్ గేట్ ద‌గ్గ‌ర బైకులు ఎందుకు ఆగుతాయంటే.. టోల్ గేట్ క‌ట్టేందుక‌ని జ‌గ‌న్ చెబుతారు. ఇక‌, ఏపీలో క‌ష్టాల‌కు చంద్ర‌బాబు పాల‌నే కార‌ణ‌మ‌ని అంటారు. వ‌ర‌దలకు బాబుకు ముడిపెట్టేసి ఆయ‌న తాజాగా ఏదో చెప్పాల‌ని అనుకున్నారు. కానీ, చిత్రంగా ఆయ‌న‌కు ఆయ‌నే బుట్ట‌లో ప‌డ్డారు. ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల ఓటింగ్‌.. ఫ‌లితాల‌కు సంబంధించి.. జ‌గ‌న్ భారీగానే త‌డ‌బ‌డ్డారు. ఏదైనా ఒక త‌డ‌బాటు జ‌రిగిన‌ప్పుడు.. దానిని ఎంట‌నే స‌రిచేసుకునేందుకు ఎవ‌రైనా ప్ర‌య‌త్నిస్తారు. కానీ, జ‌గ‌న్ స‌ర్‌.. మాత్రం ఏమాత్రం స‌రిచేసుకునే ప్ర‌య‌త్నం చేయ‌లేదు.

పైగా త‌డ‌బ‌డిన ప‌దాన్ని ప‌దే ప‌దే చెప్పుకొచ్చారు. “మే 13న ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చాయి. అప్ప‌టి నుంచి ఇప్ప‌టికి నాలుగు మాసాలైంది. మ‌రి చంద్ర‌బాబు ఏం చేస్తున్నాడు” అని జ‌గ‌న్ తాజాగా ప్ర‌శ్నించారు. ఈ మాట‌ను ఆయ‌న ప‌దే ప‌దే చెప్పుకొచ్చా రు. అయితే.. చిత్రం ఏంటంటే.. అస‌లు ఎన్నిక‌లు పోలింగ్ జ‌ర‌గింది.. మే 13న , ఫ‌లితం వ‌చ్చింది మాత్రం జూన్ 4న. ఈ విష‌యం తెలిసి కూడా.. జ‌గ‌న్ ఎందుకో.. మ‌రిచిపోయిన‌ట్టున్నారు. ఆయ‌న ఓట‌మి తాలూకు ప‌రాభ‌వం నుంచి ఇంకా బ‌య‌ట‌కు వ‌చ్చిన ట్టుగా క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు నెటిజ‌న్లు. గ‌తంలోనూ ఆయ‌న అనేక సంద‌ర్భాల్లో త‌డ‌బ‌డిన ప‌రిస్థితి ఉంది. కానీ.. ఇప్పుడు ఏకంగా ఎన్నిక‌లు ఫ‌లితంపైనే ప‌దే ప‌దే త‌డ‌బ‌డ‌డం అంద‌రినీ విస్మ‌యానికి గురి చేసింది.

This post was last modified on September 5, 2024 11:20 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ష‌ర్మిలమ్మా.. మీ పార్టీ దీన‌స్థితి చూడ‌మ్మా.. !

ఏపీ కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారుతోందా? .. పార్టీ నాయ‌కులు దీన‌స్థితిలో ఉన్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే…

1 hour ago

ఇరాన్‌లో భారతీయ విద్యార్థులు.. ఇటు ప్రాణాలు, అటు పరీక్షలు

ఇరాన్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…

2 hours ago

బాలీవుడ్‌కు పొలిశెట్టి పంచ్

ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు న‌వీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన త‌న చివ‌రి చిత్రం అన‌గ‌న‌గా ఒక…

2 hours ago

శర్వానంద్ భోగికి అసలైన ఛాలెంజ్

2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…

3 hours ago

అయ్యన్నను ఓడించిన రఘురామ

రాజ‌కీయాల్లోనే కాదు.. ఆట‌ల్లోనూ త‌న సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాల…

3 hours ago

నంది అవార్డులంటే అంత చులకనా

ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…

4 hours ago