Political News

‘అయోమ‌యం’ జ‌గ‌న్‌.. సోష‌ల్ మీడియాకు భారీ ఫీడ్‌!

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ ఎక్క‌డ మాట్లాడినా.. స్క్రిప్టును క‌ళ్ల ముందు ఉంచుకుని చ‌ద‌వ‌డం తెలిసిందే. అయితే.. ఇటీ వ‌ల ఓడిపోయిన త‌ర్వాత‌.. ఆయ‌న అస‌లు బ‌య‌ట‌కే రావ‌డం లేదు. వ‌చ్చినా.. ఏదో నాలుగు మాట‌లు మాట్లాడి వెళ్లిపోతున్నారు. ఎన్నిక‌ల త‌ర్వాత‌.. ఫ‌లితం వ‌చ్చాక‌.. జ‌గ‌న్ నిర్వ‌హించిన ప్రెస్ మీట్‌లోనూ.. ఆయ‌న చూసే చ‌దివారు. అయిన‌ప్ప‌టికీ.. ఆయ‌న త‌డ‌బ‌డ్డారు. కాగా.. జ‌గ‌న్ ఎప్పుడు మాట్లాడినా.. ఆ విష‌యాలు సోష‌ల్ మీడియాలో భారీగా ఎత్తున హైలెట్ అవుతా యి. దీనికి కార‌ణం.. కొన్ని కొన్ని విష‌యాల్లో ఆయ‌న త‌లా తోకా లేకుండా మాట్లాడ‌డ‌మే.

అది కూడా.. చిన్న‌పిల్ల‌లకు తెలిసిన విషయాలు కూడా ఆయ‌న‌కు తెలియ‌క‌పోవ‌డమే! హైవే టోల్ గేట్ ద‌గ్గ‌ర బైకులు ఎందుకు ఆగుతాయంటే.. టోల్ గేట్ క‌ట్టేందుక‌ని జ‌గ‌న్ చెబుతారు. ఇక‌, ఏపీలో క‌ష్టాల‌కు చంద్ర‌బాబు పాల‌నే కార‌ణ‌మ‌ని అంటారు. వ‌ర‌దలకు బాబుకు ముడిపెట్టేసి ఆయ‌న తాజాగా ఏదో చెప్పాల‌ని అనుకున్నారు. కానీ, చిత్రంగా ఆయ‌న‌కు ఆయ‌నే బుట్ట‌లో ప‌డ్డారు. ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల ఓటింగ్‌.. ఫ‌లితాల‌కు సంబంధించి.. జ‌గ‌న్ భారీగానే త‌డ‌బ‌డ్డారు. ఏదైనా ఒక త‌డ‌బాటు జ‌రిగిన‌ప్పుడు.. దానిని ఎంట‌నే స‌రిచేసుకునేందుకు ఎవ‌రైనా ప్ర‌య‌త్నిస్తారు. కానీ, జ‌గ‌న్ స‌ర్‌.. మాత్రం ఏమాత్రం స‌రిచేసుకునే ప్ర‌య‌త్నం చేయ‌లేదు.

పైగా త‌డ‌బ‌డిన ప‌దాన్ని ప‌దే ప‌దే చెప్పుకొచ్చారు. “మే 13న ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చాయి. అప్ప‌టి నుంచి ఇప్ప‌టికి నాలుగు మాసాలైంది. మ‌రి చంద్ర‌బాబు ఏం చేస్తున్నాడు” అని జ‌గ‌న్ తాజాగా ప్ర‌శ్నించారు. ఈ మాట‌ను ఆయ‌న ప‌దే ప‌దే చెప్పుకొచ్చా రు. అయితే.. చిత్రం ఏంటంటే.. అస‌లు ఎన్నిక‌లు పోలింగ్ జ‌ర‌గింది.. మే 13న , ఫ‌లితం వ‌చ్చింది మాత్రం జూన్ 4న. ఈ విష‌యం తెలిసి కూడా.. జ‌గ‌న్ ఎందుకో.. మ‌రిచిపోయిన‌ట్టున్నారు. ఆయ‌న ఓట‌మి తాలూకు ప‌రాభ‌వం నుంచి ఇంకా బ‌య‌ట‌కు వ‌చ్చిన ట్టుగా క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు నెటిజ‌న్లు. గ‌తంలోనూ ఆయ‌న అనేక సంద‌ర్భాల్లో త‌డ‌బ‌డిన ప‌రిస్థితి ఉంది. కానీ.. ఇప్పుడు ఏకంగా ఎన్నిక‌లు ఫ‌లితంపైనే ప‌దే ప‌దే త‌డ‌బ‌డ‌డం అంద‌రినీ విస్మ‌యానికి గురి చేసింది.

This post was last modified on September 5, 2024 11:20 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

2 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

2 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

3 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

4 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

5 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

7 hours ago