Political News

హైకోర్టులో వైసీపీ నేతలకు షాక్

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు రాష్ట్ర హైకోర్టులో చుక్కెదురైంది. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంతో పాటు, అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నివాసంపై దాడి కేసులోనూ నేతలకు ముందస్తు బెయిలు ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది.

ఈ కేసుల్లో మాజీ మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, మాజీ ఎంపీ నందిగాం సురేష్, వైకాప నేత దేవినేని అవినాష్ తదితరులు నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో ముందస్తు బెయిలు కోసం వీరు హైకోర్టును ఆశ్రయించారు.

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ కేంద్ర కార్యాలయం మీద, చంద్రబాబు నివాసం మీద వందలాది మంది దాడి చేశారు. ఈ దాడిలో విలువైన వస్తువులు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో బెయిలుకు కోర్టు నిరాకరించగా సుప్రీంకోర్టును ఆశ్రయించే వరకు అరెస్టు నుండి మినహాయింపు ఇవ్వాలని వైసీపీ నేతలు కోరారు. అరెస్టు నుండి మినహాయింపు ఇవ్వొద్దని టీడీపీ తరపు న్యాయవాదులు కోరగా హైకోర్టు మధ్యాహ్నం తీర్పు వెల్లడించనున్నది.

Satya

Recent Posts

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

6 hours ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

8 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

10 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

11 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

11 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

11 hours ago