Political News

హైకోర్టులో వైసీపీ నేతలకు షాక్

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు రాష్ట్ర హైకోర్టులో చుక్కెదురైంది. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంతో పాటు, అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నివాసంపై దాడి కేసులోనూ నేతలకు ముందస్తు బెయిలు ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది.

ఈ కేసుల్లో మాజీ మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, మాజీ ఎంపీ నందిగాం సురేష్, వైకాప నేత దేవినేని అవినాష్ తదితరులు నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో ముందస్తు బెయిలు కోసం వీరు హైకోర్టును ఆశ్రయించారు.

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ కేంద్ర కార్యాలయం మీద, చంద్రబాబు నివాసం మీద వందలాది మంది దాడి చేశారు. ఈ దాడిలో విలువైన వస్తువులు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో బెయిలుకు కోర్టు నిరాకరించగా సుప్రీంకోర్టును ఆశ్రయించే వరకు అరెస్టు నుండి మినహాయింపు ఇవ్వాలని వైసీపీ నేతలు కోరారు. అరెస్టు నుండి మినహాయింపు ఇవ్వొద్దని టీడీపీ తరపు న్యాయవాదులు కోరగా హైకోర్టు మధ్యాహ్నం తీర్పు వెల్లడించనున్నది.

This post was last modified on September 4, 2024 2:44 pm

Share
Show comments
Published by
Satya
Tags: High Court

Recent Posts

పరకామణి చోరీ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

వైసీపీ పాల‌నా కాలంలో తిరుమ‌ల శ్రీవారి ప‌ర‌కామ‌ణిలో 900 డాల‌ర్ల  చోరీ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రిణామం తిరుమ‌ల…

23 minutes ago

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

59 minutes ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

3 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

7 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

8 hours ago