అధ్యాత్మిక అంశాలకు పరిమితమయ్యే స్వామీజీలు అప్పుడప్పుడు రాజకీయాల్లోకి అలా వచ్చి ఇలా వెళ్లిపోవటం చూస్తుంటాం. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రతి అంశంలోనూ సలహాలు ఇచ్చేసి.. ఆ తర్వాతి కాలంలో వార్తలకు కాస్తంత దూరంగా ఉంటున్నారు. ఇంతకూ ఆయన ఎవరో చెప్పలేదు కదా? ఆయనే.. త్రిదండి చినజీయర్ స్వామి. విజయవాడకు విపత్తు విరుచుకుపడి.. వరదలో వేలాది మంది చిక్కుకున్న నేపథ్యంలో బాధితులకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు చినజీయర్ స్వామి.
తన శిష్యుులతో కలిసి వరద ప్రభావిత ప్రాంతాలకు వచ్చిన జీయర్ స్వామి.. విపత్తు మీద కీలక వ్యాఖ్యలు చేశారు. ‘విజయవాడకు ఇంతటి విపత్తు గతంలో ఎప్పుడూ రాలేదన్నారు. వరద బాధితుల్ని ఆదుకోవటం కోసం ఏపీ ప్రభుత్వం కీలక భూమిక పోషిస్తుందని పేర్కొన్నారు. భవానీ పురంలో వరద బాధితులకు ఆహార పంపిణీ చేశారు. ప్రజలు నిర్మాణం చేసుకునే నివాసాలు.. నది.. కాలువలు ప్రవహించే మార్గాలకు అడ్డుగా ఉంటే ఇలానే ఉంటుందన్నారు.
ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం చాలా చక్కగా పని చేస్తుందంటూ ఆయనకు సర్టిఫికేట్ ఇచ్చేసిన వైనం ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉండగా.. నీరు వెళ్లే మార్గాలను మూసేసి నిర్మాణాలు చేపట్టే వారిపై ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. మొత్తంగా చంద్రబాబు సర్కారుకు చినజీయర్ స్వామి సర్టిఫికేట్ ఇవ్వటం చర్చనీయాంశంగా మారింది.
This post was last modified on September 4, 2024 2:38 pm
ఎప్పుడో ఆరేళ్ళ క్రితం రిలీజైన సినిమా. ఓటిటిలో వచ్చేసి అక్కడా మిలియన్ల వ్యూస్ సాధించుకుంది. ఇప్పుడు కొత్తగా రీ రిలీజ్…
సెప్టెంబర్ నెల సగానికి పైనే అయిపోయింది. ఇకపై ఆకాశమే హద్దుగా గేమ్ ఛేంజర్ నాన్ స్టాప్ అప్డేట్స్ ఉంటాయని దిల్…
యూత్ హీరో సుహాస్ కొత్త సినిమా గొర్రె పురాణం ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కానుంది. ట్రైలర్ కూడా వచ్చేసింది.…
జనసేన పార్టీ నాయకుడు, ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై పార్టీ వేటు వేసింది. ఆయనను పార్టీ కార్యక్రమాలకు దూరంగా…
కొన్ని నెలల క్రితం లాల్ సలామ్ అనే సినిమా ఒకటొచ్చిందనే సంగతే చాలా మంది సగటు ప్రేక్షకులు మర్చిపోయి ఉంటారు.…
స్టార్ హీరోలు నటించిన సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చి భారీ వసూళ్లు సాధించడంలో ఆశ్చర్యం లేదు. కానీ చిన్న బడ్జెట్…