అధ్యాత్మిక అంశాలకు పరిమితమయ్యే స్వామీజీలు అప్పుడప్పుడు రాజకీయాల్లోకి అలా వచ్చి ఇలా వెళ్లిపోవటం చూస్తుంటాం. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రతి అంశంలోనూ సలహాలు ఇచ్చేసి.. ఆ తర్వాతి కాలంలో వార్తలకు కాస్తంత దూరంగా ఉంటున్నారు. ఇంతకూ ఆయన ఎవరో చెప్పలేదు కదా? ఆయనే.. త్రిదండి చినజీయర్ స్వామి. విజయవాడకు విపత్తు విరుచుకుపడి.. వరదలో వేలాది మంది చిక్కుకున్న నేపథ్యంలో బాధితులకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు చినజీయర్ స్వామి.
తన శిష్యుులతో కలిసి వరద ప్రభావిత ప్రాంతాలకు వచ్చిన జీయర్ స్వామి.. విపత్తు మీద కీలక వ్యాఖ్యలు చేశారు. ‘విజయవాడకు ఇంతటి విపత్తు గతంలో ఎప్పుడూ రాలేదన్నారు. వరద బాధితుల్ని ఆదుకోవటం కోసం ఏపీ ప్రభుత్వం కీలక భూమిక పోషిస్తుందని పేర్కొన్నారు. భవానీ పురంలో వరద బాధితులకు ఆహార పంపిణీ చేశారు. ప్రజలు నిర్మాణం చేసుకునే నివాసాలు.. నది.. కాలువలు ప్రవహించే మార్గాలకు అడ్డుగా ఉంటే ఇలానే ఉంటుందన్నారు.
ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం చాలా చక్కగా పని చేస్తుందంటూ ఆయనకు సర్టిఫికేట్ ఇచ్చేసిన వైనం ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉండగా.. నీరు వెళ్లే మార్గాలను మూసేసి నిర్మాణాలు చేపట్టే వారిపై ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. మొత్తంగా చంద్రబాబు సర్కారుకు చినజీయర్ స్వామి సర్టిఫికేట్ ఇవ్వటం చర్చనీయాంశంగా మారింది.
This post was last modified on September 4, 2024 2:38 pm
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…