Political News

జ‌గ‌న్ నోట‌.. వ‌లంటీర్ల మాట‌.. ఎన్నిక‌ల త‌ర్వాత‌ ఫ‌స్ట్ టైమ్

సార్వ‌త్రిక ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత‌.. తొలిసారి మాజీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్ నోటి నుంచి వ‌లంటీర్ల గురించి ప్ర‌స్తావ‌న వ‌చ్చింది. మూడు మాసాల‌కు ముందు జ‌రిగిన‌ ఎన్నిక‌ల స‌మ‌యంలో వ‌లంటీర్ల వ్య‌వ‌హారం.. తీవ్ర ర‌చ్చ‌గా మారిన విష‌యం తెలిసిందే.

ఆ స‌మ‌యంలో తాను మ‌రోసారి ముఖ్య‌మంత్రి అయితే.. వ‌లంటీర్ల‌ను పున‌రుద్ధ‌రించే ఫైలుపైనే తొలి సంత‌కం చేస్తాన‌ని జ‌గ‌న్ చెప్పారు. అదేస‌మ‌యంలో వ‌లంటీర్ల విషం చిమ్ముతున్నార‌ని కూడా.. ఆయ‌న వ్యాఖ్యానించారు. ఇక‌, ఎన్నిక‌ల్లో ఆయ‌న గెలిచింది.. లేదు. పోనీ.. ఆ త‌ర్వాతైనా జ‌గ‌న్ ఎక్క‌డా వ‌లంటీర్ల గురించి ప్ర‌స్తావించ‌లేదు.

2019 ఎన్నిక‌ల్లో విజ‌యం త‌ర్వాత‌.. జ‌గ‌న్ అనూహ్యంగా అదే ఏడాది అక్టోబ‌రు 2న వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ‌ను తీసుకువ‌చ్చారు. ప్ర‌భు త్వ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు అందించ‌డంతోపాటు.. రాజ‌కీయంగా కూడా వారి సేవ‌ల‌ను వినియోగించుకున్నారు. ఇదే.. ఎన్నిక‌ల‌కు ముందు తీవ్ర వివాదంగా మారిపోయింది. ఈ క్ర‌మంలోనే కేంద్ర ఎన్నిక‌ల సంఘం వ‌లంటీర్ల‌ను ఎన్నిక‌ల‌కు దూరం పెట్టింది.

ఇక‌, అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు వ‌లంటీర్లు లేకుండానే.. రాష్ట్రంలో ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌తి నెలా 1నే ఇస్తున్న పింఛ‌న్ల‌ను కూడా వ‌లంటీర్లు లేకుండానే అంద జేస్తున్నారు. అయితే.. వారిని వ‌దిలించుకునేందుకు ప్ర‌భుత్వం ఏమీ చూడ‌డం లేదు. ప్ర‌స్తుతం వారిలో నైపుణ్యాన్ని అధ్య‌య‌నం చేయాల‌ని నిర్ణ‌యించింది.

ఇదిలావుంటే.. తాజాగా విజ‌య‌వాడ‌లో ప‌ర్య‌టించిన జ‌గ‌న్‌.. వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లోని బాధితుల‌ను ప‌ల‌క‌రించారు. విజ‌య వాడలోని కృష్ణ‌లంక క‌ర‌క‌ట్ట‌పై ఉన్న కొంద‌రు బాధితుల‌ను ఆయ‌న క‌లుసుకున్నారు. వారిని ఓదార్చారు.

ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. ఎన్నిక‌ల త‌ర్వాత‌.. తొలిసారి వ‌లంటీర్ల ప్ర‌స్తావ‌న తీసుకువ‌చ్చారు. వ‌లంటీర్లు ఉండి ఉంటే.. బాధితుల‌కు ఆహారం, నీరు అందించేందుకు ఇబ్బందులు ఉండేవి కాద‌న్నారు. అంతేకాదు.. వ‌లంటీర్ల సేవ‌ల‌ను వినియోగించుకుని ఉంటే.. బాధితుల‌ను స‌మ‌యానికి సుర‌క్షిత ప్రాంతాల‌కు తీసుకువెళ్లేందుకు కూడా అవ‌కాశం ఉండేద‌ని పేర్కొన్నారు.

కానీ, చంద్ర‌బాబు ప్ర‌భుత్వం వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌ను నాశ‌నం చేసింద‌ని.. అందుకే ప్ర‌జ‌లు మూడు రోజులుగా కంటిపై నిద్ర‌లేకుండా.. ఆహారం కోసం అల‌మటించే ప‌రిస్థితి వ‌చ్చింద‌ని జ‌గ‌న్ దుయ్య‌బ‌ట్టారు. గ‌త మూడు రోజులుగా విజ‌య‌వాడ ప్ర‌జ‌ల‌కు కంటిపై కునుకు లేకుండా పోయింద‌ని.. ప్ర‌భుత్వం ప‌ట్టించుకోలేద‌ని.. ప‌ట్టించుకునే వ‌లంటీర్ల‌ను తీసేసింద‌ని జ‌గ‌న్ ఆరోపించారు.

గ‌తంలోనూ ఇంత‌క‌న్నా పెద్ద వ‌ర‌ద‌లే వ‌చ్చాయ‌ని.. అయితే. వాటిని తాను ముందుగానే హెచ్చ‌రించి వ‌లంటీర్ల‌ను అప్ర‌మ‌త్తం చేయ‌డంతో ప్ర‌జ‌ల‌కు కొంత ఊర‌ట క‌ల్పించామ‌ని జ‌గ‌న్ చెప్పుకొచ్చారు.

Satya

Recent Posts

తొందరపాటు ఎందుకు పెద్ది

స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…

1 hour ago

వరప్రసాద్ స్నేహితులకు క్లాష్ తప్పదా

సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…

2 hours ago

ఫౌజీ బాటలో ముళ్లచెట్ల బ్రేకులు

హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…

2 hours ago

ఆంధ్రాకి ఆరు ఆడ పులులు కోరిన పవన్

రాష్ట్రంలో అట‌వీ సంప‌ద‌ను కాపాడ‌డంతోపాటు.. వన్య‌ప్రాణుల సంర‌క్ష‌ణ‌కు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్య‌మంత్రి, అట‌వీ శాఖ మంత్రి ప‌వ‌న్…

3 hours ago

ఎవ‌రా త‌ల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్?

హీరోయిన్లు కెరీర్లో కొంచెం కుదురుకోగానే పెళ్లి ఎప్పుడు అనే ప్ర‌శ్న ఎదుర‌వుతుంది మీడియా నుంచి. ఆ తంతు పూర్త‌య్యాక త‌ల్లెప్పుడు…

3 hours ago

హీరోల ఫ్రెండ్ షిప్ గురించి చర్చలెందుకు

సింగ్ గీతంని విష్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ తన మిత్రుడు రామ్ చరణ్ పెద్దికి మాత్రం ఎలాంటి ట్వీట్ వేయకపోవడం…

3 hours ago