సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత.. తొలిసారి మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ నోటి నుంచి వలంటీర్ల గురించి ప్రస్తావన వచ్చింది. మూడు మాసాలకు ముందు జరిగిన ఎన్నికల సమయంలో వలంటీర్ల వ్యవహారం.. తీవ్ర రచ్చగా మారిన విషయం తెలిసిందే.
ఆ సమయంలో తాను మరోసారి ముఖ్యమంత్రి అయితే.. వలంటీర్లను పునరుద్ధరించే ఫైలుపైనే తొలి సంతకం చేస్తానని జగన్ చెప్పారు. అదేసమయంలో వలంటీర్ల విషం చిమ్ముతున్నారని కూడా.. ఆయన వ్యాఖ్యానించారు. ఇక, ఎన్నికల్లో ఆయన గెలిచింది.. లేదు. పోనీ.. ఆ తర్వాతైనా జగన్ ఎక్కడా వలంటీర్ల గురించి ప్రస్తావించలేదు.
2019 ఎన్నికల్లో విజయం తర్వాత.. జగన్ అనూహ్యంగా అదే ఏడాది అక్టోబరు 2న వలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చారు. ప్రభు త్వ పథకాలను ప్రజలకు అందించడంతోపాటు.. రాజకీయంగా కూడా వారి సేవలను వినియోగించుకున్నారు. ఇదే.. ఎన్నికలకు ముందు తీవ్ర వివాదంగా మారిపోయింది. ఈ క్రమంలోనే కేంద్ర ఎన్నికల సంఘం వలంటీర్లను ఎన్నికలకు దూరం పెట్టింది.
ఇక, అప్పటి నుంచి ఇప్పటి వరకు వలంటీర్లు లేకుండానే.. రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రతి నెలా 1నే ఇస్తున్న పింఛన్లను కూడా వలంటీర్లు లేకుండానే అంద జేస్తున్నారు. అయితే.. వారిని వదిలించుకునేందుకు ప్రభుత్వం ఏమీ చూడడం లేదు. ప్రస్తుతం వారిలో నైపుణ్యాన్ని అధ్యయనం చేయాలని నిర్ణయించింది.
ఇదిలావుంటే.. తాజాగా విజయవాడలో పర్యటించిన జగన్.. వరద ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులను పలకరించారు. విజయ వాడలోని కృష్ణలంక కరకట్టపై ఉన్న కొందరు బాధితులను ఆయన కలుసుకున్నారు. వారిని ఓదార్చారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల తర్వాత.. తొలిసారి వలంటీర్ల ప్రస్తావన తీసుకువచ్చారు. వలంటీర్లు ఉండి ఉంటే.. బాధితులకు ఆహారం, నీరు అందించేందుకు ఇబ్బందులు ఉండేవి కాదన్నారు. అంతేకాదు.. వలంటీర్ల సేవలను వినియోగించుకుని ఉంటే.. బాధితులను సమయానికి సురక్షిత ప్రాంతాలకు తీసుకువెళ్లేందుకు కూడా అవకాశం ఉండేదని పేర్కొన్నారు.
కానీ, చంద్రబాబు ప్రభుత్వం వలంటీర్ వ్యవస్థను నాశనం చేసిందని.. అందుకే ప్రజలు మూడు రోజులుగా కంటిపై నిద్రలేకుండా.. ఆహారం కోసం అలమటించే పరిస్థితి వచ్చిందని జగన్ దుయ్యబట్టారు. గత మూడు రోజులుగా విజయవాడ ప్రజలకు కంటిపై కునుకు లేకుండా పోయిందని.. ప్రభుత్వం పట్టించుకోలేదని.. పట్టించుకునే వలంటీర్లను తీసేసిందని జగన్ ఆరోపించారు.
గతంలోనూ ఇంతకన్నా పెద్ద వరదలే వచ్చాయని.. అయితే. వాటిని తాను ముందుగానే హెచ్చరించి వలంటీర్లను అప్రమత్తం చేయడంతో ప్రజలకు కొంత ఊరట కల్పించామని జగన్ చెప్పుకొచ్చారు.
This post was last modified on September 2, 2024 10:47 pm
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…