Political News

రాజ‌కీయాల్లో తొలిసారి.. వ‌ర‌ద నీటిలో జ‌గ‌న్‌!

కృష్ణాన‌ది మ‌హోగ్ర రూపం దాల్చడంతో ఏపీలోని ప్ర‌ముఖ వాణిజ్య ప్రాంతం విజ‌య‌వాడ పూర్తిగా నీట మునిగింది. ఎక్క‌డా కూ డా.. వ‌ర‌ద లేని ప్రాంతం క‌నిపించ‌డం లేదంటే అతిశ‌యోక్తికాదు. ముఖ్యంగా శివారు ప్రాంతాలైన సింగున‌గ‌ర్‌, నున్న‌.. పాయ‌కా పురం, జ‌క్కంపూడి వంటి ప్రాంతాల‌న్నీ నీట‌మునిగాయి.

దీంతో రెండు ల‌క్ష‌ల మందికిపైగానే ప్ర‌జ‌లు నిరాశ్ర‌యుల‌య్యారు. అంతే కాదు.. కొంద‌రు క‌ట్టుబ‌ట్ట‌ల‌తో మిగిలారు. ఈ నేప‌థ్యంలో వారి వ‌ర‌ద క‌ష్టాల‌ను కొంతైనా త‌గ్గించాల‌ని చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నం చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు స్వ‌యంగా రంగంలోకి దిగారు.

ఎన్న‌డూ ఏ ముఖ్య‌మంత్రీ స్వ‌యంగా వ‌ర‌ద నీటిలో ప‌ర్య‌టించక‌పోవ‌డంతోపాటు.. కేవ‌లం సమీక్ష‌ల‌కే ప‌రిమితం అయ్యారు. అలాంటిది.. తాజాగా చంద్ర‌బాబు మాత్రం.. నేరుగా రంగంలోకి దిగారు. స్వ‌యంగా బాధితుల‌ను ఓదార్చారు. వారికి సాయం అందే వ‌ర‌కు నిద్ర పోనంటూ… ఆయ‌న అధికారుల‌కు తేల్చి చెప్పారు.

ఇక‌, దేవ‌దేవుడే దిగి వ‌చ్చిన త‌ర్వాత‌.. క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌ట‌న చేప‌ట్టిన త‌ర్వాత‌.. ఇత‌ర అధికారులు.. ఉన్న‌తాధికారులు కూడా రంగంలోకి దిగి వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌ర్య‌టిం చారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకునే ప్ర‌య‌త్నం చేశారు. మొత్తంగా.. ప్ర‌భుత్వ యంత్రాంగం పూర్తిగా రంగంలోకి దిగింది.

ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో వైసీపీ అదినేత‌, విప‌క్ష నేత జ‌గ‌న్ కూడా.. రంగంలోకి దిగారు. చంద్ర‌బాబే స్వ‌యంగా బుర‌ద‌లోనూ.. వ‌ర‌ద‌లోనూ ప‌ర్య‌టించిన‌ప్పుడు.. తాను తాడేప‌ల్లి ప్యాల‌స్‌కే ప‌రిమితం అయితే.. బాగోద‌నుకున్నారో.. లేక వ‌ర‌ద‌లు, విప‌త్తులు వ‌చ్చిన‌ప్పుడు.. ఇలా చేస్తారా? ఇలా చేయాలా? అని తెలుసుకున్నారో.. ఏమో మొత్తానికి జ‌గ‌న్ కూడా రంగంలోకి దిగారు.

అయితే.. అలా ఇలా కాదు.. నేరుగా మొకాల్లోతు నీటిలో దిగి బాధితుల ఇళ్ల వ‌ద్ద‌కు వెళ్లారు. వారి స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. పార్టీ త‌ర‌ఫున ఆదుకుంటామ‌ని చెప్పారు. ప‌నిలో ప‌నిగా స‌ర్కారు తీరుపై విమ‌ర్శ‌లు చేసి.. త‌న డ్యూటీ పూర్తి చేశారు.

అయితే.. ఇక్క‌డ కీలక విష‌యం.. ఏంటంటే, జ‌గ‌న్ త‌న జీవిత కాలంలో ముఖ్యంగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. ఈ త‌ర‌హాలో ఎప్పుడూ.. వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌ర్య‌టించింది కానీ.. మోకాల్లోతు నీటిలో ఎక్క‌డా ఆయ‌న దిగిందికానీ లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

దీంతో ఆయ‌న ప‌నితీరులో మార్పు వ‌చ్చిందా? లేక‌.. ప్ర‌జ‌లు ఇచ్చిన తీర్పుతో ఆయ‌న మారారా? లేక‌.. ఇవ‌న్నీ కాకుండా.. చంద్ర‌బాబు కొట్టేస్తున్న క్రెడిట్‌లో కొంతైనా త‌న‌కు రావాల‌ని అనుకున్నారా? అనేది ఆస‌క్తిగా మారింది. ఏదేమైనా.. ఒక్క ఓట‌మి.. జ‌గ‌న్‌ను వర‌ద నీటిలో ఈదేలా చేసింది.

Satya

Recent Posts

తొందరపాటు ఎందుకు పెద్ది

స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…

1 hour ago

వరప్రసాద్ స్నేహితులకు క్లాష్ తప్పదా

సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…

2 hours ago

ఫౌజీ బాటలో ముళ్లచెట్ల బ్రేకులు

హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…

2 hours ago

ఆంధ్రాకి ఆరు ఆడ పులులు కోరిన పవన్

రాష్ట్రంలో అట‌వీ సంప‌ద‌ను కాపాడ‌డంతోపాటు.. వన్య‌ప్రాణుల సంర‌క్ష‌ణ‌కు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్య‌మంత్రి, అట‌వీ శాఖ మంత్రి ప‌వ‌న్…

3 hours ago

ఎవ‌రా త‌ల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్?

హీరోయిన్లు కెరీర్లో కొంచెం కుదురుకోగానే పెళ్లి ఎప్పుడు అనే ప్ర‌శ్న ఎదుర‌వుతుంది మీడియా నుంచి. ఆ తంతు పూర్త‌య్యాక త‌ల్లెప్పుడు…

3 hours ago

హీరోల ఫ్రెండ్ షిప్ గురించి చర్చలెందుకు

సింగ్ గీతంని విష్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ తన మిత్రుడు రామ్ చరణ్ పెద్దికి మాత్రం ఎలాంటి ట్వీట్ వేయకపోవడం…

3 hours ago