టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు తీరే వేరు. పార్టీ పరంగా ఆయన ఎలా ఉన్నా.. పాలనా పరంగా మాత్రం ఖచ్చితంగా ఆయన సీఈవోను తలపిస్తారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపించడంలోనూ.. పాలనను ముందుకు తీసుకువెళ్లి ప్రజలకు భరోసా కల్పించడంలోనూ.. చంద్రబాబుకు సాటి లేరంటే అతిశయోక్తి లేదు. ప్రజలు కష్టాల్లో ఉన్నారంటే.. ఆయన విలవిల్లాడి పోతారు. అది వరదైనా.. విపత్తయినా.. ప్రజలను కాపాడుకునేందుకు శాయశక్తులా ఆయన పనిచేయడమే కాదు.. పాలనా యంత్రాంగాన్నిముందుండి నడిపిస్తారు. గతంలో 2016లో వెల్లువెత్తిన హుద్ హుద్ తుఫాను సమయంలోనూ ఆయన తనేంటో నిరూపించారు.
నాటి విలయంలో విశాఖ చివురుటాకులా వణికిపోయింది. రుషికొండ పర్యాటక ప్రాంతం సహా.. ఆర్కే బీచ్ పరిసర ప్రాంతాలు.. ప్రధాన రహదారులు కూడా.. పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. దీనిని తీవ్రంగా పరిగణించిన చంద్రబాబు ఆరోజు కూడా.. విశాఖలోనే రేయింబవళ్లు.. అక్కడే తిష్టవేసి.. పన్రజలకు భరోసా కల్పించారు. అంతేకాదు.. హుద్హుద్ తుఫానుతో దెబ్బతిన్న విశాఖను కేవలం ఏడాది సమయంలోనే మరింత సుందరంగా తీర్చిదిద్దారు. ఇప్పుడు విజయవాడ వంతు వచ్చింది. బుడమేరు వరద ప్రభావం కారణంగా.. ఇక్కడ ప్రజలు నీట మునిగారు. ఇళ్లు.. ఒళ్లు.. అన్నీ వరదలో కలిసిపోయాయి.
చంద్రబాబు హుటాహుటిన స్పందించారు. తాను పనిచేస్తూ.. తన పాలనా యంత్రాంగంతోనూ ఆయన పనిచేయించారు. అంతేకాదు.. అనుక్షణం ఆయన ప్రజల బాగోగులను పరిశీలించారు. ఇవన్నీ పరిశీలించాక.. చంద్రబాబులో దాగి ఉన్న సీఈవో మరో సారి మేల్కొన్నారన్నచర్చ.. ఆయనను విమర్శించేవారి నోళ్లకు తాళాలు పడ్డాయన్న వాదన బలంగా వినిపిస్తోంది. అంతేకాదు.. పార్టీలో కార్యకర్తల్ని పట్టించుకోవటం లేదన్న మూతిముడుపులు, కోపం వచ్చి అలిగే నాయకులు.. కూడా ఇప్పుడు బాబును చూసి మెచ్చుకోకుండా ఉండలేని పరిస్థితి.
అంతేకాదు.. నీకు సపోర్ట్ చేసేదే లేదు అని బిగదీసుకున్న నాయకులు.. నువ్వు మారవు… కొత్త చంద్రబాబుని చూసేది లేదు అని జోకులు వేసుకున్న వారు కూడా.. ఇప్పుడు ఆయన పాలనా పటమచూసి.. జనాలు కష్టం లొ ఉన్నారంటే చేసే చాకిరి చూసి.. ఆయనపై అభిమానం మళ్లీ పెంచుకుంటారు. చంద్రబాబు అంటే.. ప్రాణాలు ఇచ్చేందుకు సిద్ధమవుతారు. అందుకే దటీజ్ చంద్రబాబు! ఆయన తీరు.. పాలనా వైఖరి వంటివి ఎప్పటికప్పుడు.. ఒకరిని అనుకరించేది కాదు.. కొత్తగా నేర్చుకునేదే! అనడంలో సందేహం లేదు.
This post was last modified on September 2, 2024 4:38 pm
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…