తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తేశాయి. ముఖ్యంగా తెలంగాణలోని ఖమ్మం, ఏపీలోని విజయవాడ ప్రాంతాలు వరద ముప్పుతో అల్లాడిపోతున్నాయి. ఐతే వందేళ్ల చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో విజయవాడ మునిగిపోయింది.
ఇప్పుడు జీవించి ఉన్న వాళ్లలో ఎవ్వరూ కూడా తమ అనుభవంలో విజయవాడ ఇలా మునిగిపోవడం చూడలేదంటున్నారు. ఐతే ఇందుకు కారణాలేంటి అన్నది పక్కన పెడితే.. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ, చేపడుతున్న సహాయ కార్యక్రమాలు ప్రశంసలు అందుకుంటున్నాయి.
ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గ్రౌండ్లోకి దిగి బాధితులకు మనో ధైర్యాన్నిస్తూ.. అధికారులను అప్రమత్త చేస్తూ సహాయ చర్యలు ఉత్తమ స్థాయిలో అందేలా చూస్తున్నారు. ఒక సీఎం బోటులో వీధుల వెంబడి ప్రయాణిస్తూ సహాయ చర్యలను పర్యవేక్షించడం.. అర్ధరాత్రి దాటాక మూడు గంటల ప్రాంతంలోనూ వరద ప్రాంతాల్లో పర్యటించడం అన్నది అరుదైన విషయం.
తెల్లవారుజాము వరకు మేలుకుని ఉండి సహాయ చర్యలను పర్యవేక్షించిన సీఎం మళ్లీ ఉదయానికల్లా వరద ప్రాంతాల్లోకి వచ్చేయడం విశేషం. ఈ సందర్భంగా గత ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో ఏం చేశారో గుర్తు చేసుకుంటున్నారు జనాలు.
సాధారణ వరదల సమయంలో అసలు బయటికే వచ్చేవారు కాదు జగన్. పరిస్థితి విషమిస్తే.. హెలికాఫ్టర్ ఎక్కి ఏరియల్ రివ్యూ చేసేవారు. ఇక తప్పదు గ్రౌండ్లోకి వెళ్లాలంటే.. అక్కడో సెటప్ ఏర్పాటు చేసుకుని ఎంపిక చేసిన జనాలు కొందరిని తీసుకొచ్చి పరామర్శించడం, వారితో జేజేలు కొట్టించుకోవడం లాంటి దృశ్యాలు జనం అంత సులువుగా మరిచిపోలేరు.
వరదలతో జనాలు అల్లాడిపోతుంటే సీఎం ఎక్కడ అని ఎవరైనా అంటే.. గ్రౌండ్లోకి సీఎం వస్తే భద్రత, ప్రొటోకాల్ పేరుతో వ్యవస్థ అంతా ఆయన చుట్టూ తిరుగుతుంది, సహాయ చర్యలకు అడ్డంకి అనేవాళ్లు. కానీ చంద్రబాబు ప్రొటోకాల్ హడావుడి ఎక్కువ లేకుండా గ్రౌండ్లో తిరుగుతూ.. వ్యవస్థను మరింత అప్రమత్తంగా ఉంచుతూ సహాయ చర్యలు పకడ్బందీగా జరిగేలా చూస్తుండడం ఇప్పుడు ప్రస్తావనార్హం. దీన్ని బట్టే మాజీ, ప్రస్తుత ముఖ్యమంత్రుల పనితీరులో ఎంత తేడా ఉందో స్పష్టంగా అర్థమైపోతుంది.
This post was last modified on September 2, 2024 2:13 pm
హారర్ అంటే కామెడీతో కిచిడి అయిపోయిన ట్రెండ్ లో నేరుగా ఓటిటిలో రిలీజైన మా ఊరి పొలిమేర జనాన్ని భయపెట్టడంలో…
ఒకప్పుడు మూడు నాలుగు సినిమాలు ఒకే రోజు విడుదలైనా బాక్సాఫీస్ కు తట్టుకునే కెపాసిటీ ఉండేది. ఓటిటి, ఇంటర్ నెట్…
తాను హీరోగా స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘రాయన్’ను 2024 సంవత్సరానికి ఉత్తమ ప్రాంతీయ తమిళ చిత్రంగా జాతీయ అవార్డుల జ్యూరీ…
ముద్రగడ పద్మనాభం సంతాప సభకు హాజరైన అంశంపై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా…
మాస్ మహారాజా రవితేజ ఇరుముడి మీద మంచి బజ్ ఉంది. గత కొన్ని సినిమాలు ఎంత ఫ్లాప్ అయినా దీని…
తమిళ సినిమాల్లో నంబర్ వన్ స్థాయిలో ఉంటూ రాజకీయాల వైపు అడుగులేసిన విజయ్ సినీ రంగాన్ని ఖాళీ చేస్తూ చేసిన…