Political News

బాబుకు, జగన్‌కు తేడా గమనించారా?

తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తేశాయి. ముఖ్యంగా తెలంగాణలోని ఖమ్మం, ఏపీలోని విజయవాడ ప్రాంతాలు వరద ముప్పుతో అల్లాడిపోతున్నాయి. ఐతే వందేళ్ల చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో విజయవాడ మునిగిపోయింది.

ఇప్పుడు జీవించి ఉన్న వాళ్లలో ఎవ్వరూ కూడా తమ అనుభవంలో విజయవాడ ఇలా మునిగిపోవడం చూడలేదంటున్నారు. ఐతే ఇందుకు కారణాలేంటి అన్నది పక్కన పెడితే.. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ, చేపడుతున్న సహాయ కార్యక్రమాలు ప్రశంసలు అందుకుంటున్నాయి.

ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గ్రౌండ్లోకి దిగి బాధితులకు మనో ధైర్యాన్నిస్తూ.. అధికారులను అప్రమత్త చేస్తూ సహాయ చర్యలు ఉత్తమ స్థాయిలో అందేలా చూస్తున్నారు. ఒక సీఎం బోటులో వీధుల వెంబడి ప్రయాణిస్తూ సహాయ చర్యలను పర్యవేక్షించడం.. అర్ధరాత్రి దాటాక మూడు గంటల ప్రాంతంలోనూ వరద ప్రాంతాల్లో పర్యటించడం అన్నది అరుదైన విషయం.

తెల్లవారుజాము వరకు మేలుకుని ఉండి సహాయ చర్యలను పర్యవేక్షించిన సీఎం మళ్లీ ఉదయానికల్లా వరద ప్రాంతాల్లోకి వచ్చేయడం విశేషం. ఈ సందర్భంగా గత ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో ఏం చేశారో గుర్తు చేసుకుంటున్నారు జనాలు.

సాధారణ వరదల సమయంలో అసలు బయటికే వచ్చేవారు కాదు జగన్. పరిస్థితి విషమిస్తే.. హెలికాఫ్టర్ ఎక్కి ఏరియల్ రివ్యూ చేసేవారు. ఇక తప్పదు గ్రౌండ్లోకి వెళ్లాలంటే.. అక్కడో సెటప్ ఏర్పాటు చేసుకుని ఎంపిక చేసిన జనాలు కొందరిని తీసుకొచ్చి పరామర్శించడం, వారితో జేజేలు కొట్టించుకోవడం లాంటి దృశ్యాలు జనం అంత సులువుగా మరిచిపోలేరు.

వరదలతో జనాలు అల్లాడిపోతుంటే సీఎం ఎక్కడ అని ఎవరైనా అంటే.. గ్రౌండ్లోకి సీఎం వస్తే భద్రత, ప్రొటోకాల్ పేరుతో వ్యవస్థ అంతా ఆయన చుట్టూ తిరుగుతుంది, సహాయ చర్యలకు అడ్డంకి అనేవాళ్లు. కానీ చంద్రబాబు ప్రొటోకాల్ హడావుడి ఎక్కువ లేకుండా గ్రౌండ్లో తిరుగుతూ.. వ్యవస్థను మరింత అప్రమత్తంగా ఉంచుతూ సహాయ చర్యలు పకడ్బందీగా జరిగేలా చూస్తుండడం ఇప్పుడు ప్రస్తావనార్హం. దీన్ని బట్టే మాజీ, ప్రస్తుత ముఖ్యమంత్రుల పనితీరులో ఎంత తేడా ఉందో స్పష్టంగా అర్థమైపోతుంది.

This post was last modified on September 2, 2024 2:13 pm

Share
Show comments
Published by
Satya
Tags: Chandrababu

Recent Posts

నియోజ‌క‌వ‌ర్గాల‌పై రేవంత్ కొత్త ఫార్ములా… వ‌ర్కువ‌ట్ అయ్యేనా?

2029 పార్ల‌మెంటు ఎన్నిక‌ల నాటికి దేశంలో నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభ‌జించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…

2 hours ago

పెను సంక్షోభంలో ప్ర‌పంచం…!

అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభ‌న ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…

3 hours ago

రాష్ట్ర‌ప‌తికి బహుమతిగా మంగళగిరి చీర

భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…

3 hours ago

ఏపీ కొత్త ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌… వైసీపీకి షాకేనా?

ఏపీ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ ప‌ద‌వి ఖాళీ అయింది. గ‌త నెల 31వ తేదీ వ‌ర‌కు ఉన్న రాష్ట్ర…

3 hours ago

‘హోం’ ప్రశ్నలపై ‘సీఎం’ సమాధానం చెప్తారా?

తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…

5 hours ago

కేసీఆర్ వరకు వెళ్లిన సీతక్క పంచాయితీ

తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…

6 hours ago