వైసీపీలో నాయకుల వాదన అంతా అప్పటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చుట్టూనే తిరుగుతోంది. ఆయన వల్లే పార్టీకి కష్టాలు ఏర్పడ్డాయని.. ఆయన నిర్ణయాలే పార్టీని ముంచేశాయని చాలా మంది నాయకులు చెబుతున్నారు. ఎన్నికలకు ముందు.. ప్రభుత్వంలోనూ సజ్జల కీ రోల్ పోషించారు. అంతా ఆయన కనుసన్నల్లోనే వ్యవహారాలు సాగాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు.. ఇలా ఎవరు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా.. సజ్జల సర్ చెప్పాల్సిందే.
అంతేకాదు.. నియోజకవర్గాల్లో విభేదాలు, వివాదులు చోటు చేసుకున్నప్పుడు కూడా.. పంచాయతీలు చేసింది సజ్జలే. అయితే.. అప్పట్లో అంటే.. ఆయన మాటకు కట్టుబడో.. లేక భయపడో నాయకులు వ్యవ హరించారు. కానీ, పార్టీలో ఓటమికి కూడా ఆయనే కారణమన్న భావన ఉంది. ముఖ్యంగా పార్టీలో నాయకు లను మార్పు చేసిన విషయం తెలిసిందే. సుమారు 85 నియోజకవర్గాల్లో నాయకులను మార్పు చేశారు. వేరే వారిని కూడా నియమించారు. ఈ మార్పులకు సజ్జలే కారణమన్నది ఒక విమర్శ.
గుంటూరు వెస్ట్లో మద్దాలి గిరిని తప్పించడం వెనుక.. సజ్జల కీలక పాత్ర పోషించారని అంటారు. దీంతో గిరి ఎన్నికల సమయంలో పొరుగు రాష్ట్రానికి వెళ్లిపోయి.. కనీసం పార్టీ తరఫున కూడా ప్రచారం చేయలేక పోయారు. ఇలా.. చాలా నియోజకవర్గాలలో జరిగింది. అదేవిధంగా రాయదుర్గం ఎమ్మెల్యేకు టికెట్ రాకపోవడానికి కూడా సజ్జలే కారణమన్నది బహిరంగ రహస్యం. అలానే.. నెల్లూరులోనూ కీలక నేతలు దూరం కావడానికి కూడా ఆయనే కారణమని తెలుస్తోంది. ఇలా ఎన్నికలకు ముందు పార్టీని శాసించిన.. సజ్జలను తప్పించాలన్నది ఇప్పుడు నాయకుల డిమాండ్.
కొందరు నాయకులు చెబుతున్న మాటలను బట్టి.. వారు చేస్తున్న విమర్శలను బట్టి.. సజ్జల సహా ఒకరిద్దరు నాయకులను తప్పించాలన్నది డిమాండ్గా ఉంది. అయితే.. ఈ విషయంలో జగన్ రాజీ పడే అవకాశం లేదు. అంటే.. నాయకుల కంటే కూడా.. సజ్జల వంటి వారే ముఖ్యమని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే.. సజ్జలను వ్యతిరేకించే నాయకులనుకూడా పార్టీ కార్యాలయానికి రానివ్వడం లేదంటున్నారు. కానీ, నాయకులు మాత్రం ఈ విషయంలో సజ్జలను తొలగించాల్సిందేనని పట్టుబడుతున్నారు. చివరకు ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on September 1, 2024 12:06 pm
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…