ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న… టీడీపీ అధినేత చంద్రబాబు అరుదైన రికార్డునే సొంతం చేసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన తొలిసారి ప్రమాణ స్వీకారం చేసి.. సెప్టెంబరు 1 (ఆదివా రం)కి 30 ఏళ్లు అయింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకునేందుకు తమ్ముళ్లు రెడీ అయ్యారు. ఇది అధికారికంగా కాకపోయినా.. ముఖ్యమంత్రిగా, పార్టీ పరంగా చంద్రబాబు సేవలను కొనియాడుతూ.. భారీ ఎత్తున కార్యక్రమాలు చేయాలని టీడీపీ నిర్ణయించింది.
1995, సెప్టెంబరు 1న చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆనాడు వరుసగా రెండో సారి టీడీపీ అధికారంలోకి వచ్చింది. అయితే.. అన్నగారు ఎన్టీఆర్ తీసుకున్న వివాదాస్పద నిర్ణ యం పార్టీలోనూ.. ఆయన కుటుంబంలోనూ చిచ్చు పెట్టింది. దీంతో అప్పట్లో చోటు చేసుకున్న రాజకీయ వివాదాలు.. మార్పులు.. సమీకరణల నేపథ్యంలో చంద్రబాబు వైపు మెజారిటీ ఎమ్మెల్యేలు మొగ్గు చూపా రు. ఫలితంగా టీడీపీలో జరిగిన మార్పుతో .. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు.
అనంతరం వచ్చిన ఎన్నికల్లోనూ.. చంద్రబాబు ఘన విజయం దక్కించుకున్నారు. ఆ తర్వాత.. ఆయన విజన్-2020 పేరుతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టారు. కేంద్రంలోని వాజపేయి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. అప్పట్లో తీసుకువచ్చిన అనేక సంచలన కార్యక్రమాల్లోనే ఐటీ విప్లవం ఒకటి. జన్మభూమి, డ్వాక్రా సంఘాలు.. వంటివి కూడా అప్పట్లోనే ప్రజలకు పరిచయం అయ్యాయి. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని.. చంద్రబాబు సేవలను గుర్తు చేస్తూ.. ఆదివారం పెద్ద ఎత్తున కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అన్న క్యాంటీన్లలోనూ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు.. విరాళం ఇచ్చి.. చంద్రబాబు పేరుతో భోజనం వడ్డించనున్నారు. పార్టీ కార్యాలయాల్లో రక్త దాన శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా పలు సేవాకార్యక్రమాలు చేయాలని నిర్ణయించారు. అయితే.. వాతావరణం సహకరించకపో తే.. ఈ కార్యక్రమాలను మరుసటి రోజు నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
దురంధర్ ముందు వరకు నాన్ బాలీవుడ్ రాష్ట్రాల్లో అంతగా పరిచయం లేని పేరు ఆదిత్య ధార్. ఏడు గంటలకు పైగా…
న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ సెప్టెంబర్ 24 రావడం దాదాపు ఖాయమే.…
జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు పరామర్శలు వెల్లువలా తరలి వస్తున్నాయి. ఏపీ సహా తెలంగాణ…
ఇటీవల టాలీవుడ్ డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్లో పెద్ద గొడవ జరిగి అది మీడియా దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. ఈ…
బాలీవుడ్ చిత్రాలతో పోలిస్తే సౌత్ సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం ఉండదన్నట్లు.. వాళ్ల పనికి సరైన కాంప్లిమెంట్స్ రావన్నట్లు…
గత నెలలో విడుదలైన సమంత కొత్త సినిమా ‘మా ఇంటి బంగారం’ థియేటర్లో ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఏకంగా…