ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్కు హైదరాబాద్ హైడ్రా అధికారులు భారీ షాకిచ్చారు. ఆయన నివాసం ఉన్న లోటస్ పాండ్కు నోటీసులు జారీ చేశారు. మీరు కూలుస్తారా? మమ్మల్నే కూల్చమంటారా? చెప్పండంటూ.. ఈ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఉదయాన్నే లోటస్ పాండ్ సిబ్బందికి హైడ్రా అధికారులు నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. లోటస్ పాండ్ అనేది.. చెరువు శిఖం ప్రాంతమని.. దీనిని ఆక్రమించి.. భారీ భవనం నిర్మించారని దానిలో పేర్కొన్నారు.
దీనిని తొలగించాలని హైడ్రా అధికారులు నోటీసుల్లో స్పష్టం చేశారు. మరోవైపు.. మూడు రోజుల పర్యటన నిమిత్తం జగన్.. శనివారం మధ్యాహ్నం పులివెందులకు బయలు దేరుతున్న సమయంలో ఈ నోటీసులు రావడంతో ఆయన ఆలోచనలో పడ్డారు. హైదరాబాద్ నడిబొడ్డున జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉన్న చెరువు శిఖంలో లోటస్ పాండ్ నిర్మించారన్నది.. హైడ్రా అధికారులు చెబుతున్నారు. గతంలోనూ.. రెండు నెలల కిందట లోటస్ పాండ్ను ఆనుకుని నిర్మించిన కొన్ని నిర్మాణాలను తొలగించారు.
అయితే.. వాటిని సెక్యూరిటీ కోసం.. అనధికారికంగా నిర్మించారని.. ఆ విషయం తమకు తెలియదని లోటస్ పాండ్ వర్గాలు అప్పట్లో పేర్కొన్నాయి. ఆ తర్వాత.. సీఎం రేవంత్ జోక్యంతో నిర్మాణాల కూల్చివేత ఆగిపోయింది. అప్పట్లో ఇలా చేసిన అధికారులకు హైదరాబాద్ మహానగర కార్పరేషన్ అధికారులకు సైతం నోటీసులు ఇచ్చి వివరణ కోరారు. ఆతర్వాత హైడ్రా ఏర్పాటు అయింది. ఈ క్రమంలో అనేక నిర్మాణాలను కూల్చి వేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా జగన్ నివాసానికి నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది. దీనిలోనే మరోవైపు.. షర్మిల నివసిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on August 31, 2024 6:48 pm
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
ఏపీ సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు సుమారు గంటకుపైగా చర్చలు జరిపారు. బుధవారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి…