Political News

జ‌గ‌న్‌కు షాకిచ్చిన హైడ్రా.. ఏం జ‌రిగిందంటే!

ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు హైద‌రాబాద్‌ హైడ్రా అధికారులు భారీ షాకిచ్చారు. ఆయ‌న నివాసం ఉన్న లోట‌స్ పాండ్‌కు నోటీసులు జారీ చేశారు. మీరు కూలుస్తారా? మ‌మ్మ‌ల్నే కూల్చ‌మంటారా? చెప్పండంటూ.. ఈ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ మేర‌కు శ‌నివారం ఉద‌యాన్నే లోట‌స్ పాండ్ సిబ్బందికి హైడ్రా అధికారులు నోటీసులు జారీ చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. లోట‌స్ పాండ్ అనేది.. చెరువు శిఖం ప్రాంత‌మ‌ని.. దీనిని ఆక్ర‌మించి.. భారీ భ‌వ‌నం నిర్మించార‌ని దానిలో పేర్కొన్నారు.

దీనిని తొల‌గించాల‌ని హైడ్రా అధికారులు నోటీసుల్లో స్ప‌ష్టం చేశారు. మ‌రోవైపు.. మూడు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం జ‌గ‌న్‌.. శ‌నివారం మ‌ధ్యాహ్నం పులివెందుల‌కు బ‌య‌లు దేరుతున్న స‌మ‌యంలో ఈ నోటీసులు రావ‌డంతో ఆయ‌న ఆలోచ‌న‌లో ప‌డ్డారు. హైద‌రాబాద్ న‌డిబొడ్డున జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉన్న చెరువు శిఖంలో లోట‌స్ పాండ్ నిర్మించార‌న్న‌ది.. హైడ్రా అధికారులు చెబుతున్నారు. గ‌తంలోనూ.. రెండు నెల‌ల కింద‌ట లోట‌స్ పాండ్‌ను ఆనుకుని నిర్మించిన కొన్ని నిర్మాణాల‌ను తొల‌గించారు.

అయితే.. వాటిని సెక్యూరిటీ కోసం.. అన‌ధికారికంగా నిర్మించార‌ని.. ఆ విష‌యం త‌మ‌కు తెలియ‌ద‌ని లోట‌స్ పాండ్ వ‌ర్గాలు అప్ప‌ట్లో పేర్కొన్నాయి. ఆ త‌ర్వాత‌.. సీఎం రేవంత్ జోక్యంతో నిర్మాణాల కూల్చివేత ఆగిపోయింది. అప్ప‌ట్లో ఇలా చేసిన అధికారుల‌కు హైద‌రాబాద్ మ‌హాన‌గ‌ర కార్ప‌రేష‌న్ అధికారుల‌కు సైతం నోటీసులు ఇచ్చి వివ‌ర‌ణ కోరారు. ఆత‌ర్వాత హైడ్రా ఏర్పాటు అయింది. ఈ క్ర‌మంలో అనేక నిర్మాణాల‌ను కూల్చి వేస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు తాజాగా జ‌గ‌న్ నివాసానికి నోటీసులు ఇవ్వ‌డం సంచ‌ల‌నంగా మారింది. దీనిలోనే మ‌రోవైపు.. ష‌ర్మిల నివ‌సిస్తున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on August 31, 2024 6:48 pm

Share
Show comments
Published by
Satya
Tags: Jagan

Recent Posts

నియోజ‌క‌వ‌ర్గాల‌పై రేవంత్ కొత్త ఫార్ములా… వ‌ర్కువ‌ట్ అయ్యేనా?

2029 పార్ల‌మెంటు ఎన్నిక‌ల నాటికి దేశంలో నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభ‌జించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…

2 hours ago

పెను సంక్షోభంలో ప్ర‌పంచం…!

అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభ‌న ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…

2 hours ago

రాష్ట్ర‌ప‌తికి బహుమతిగా మంగళగిరి చీర

భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…

3 hours ago

ఏపీ కొత్త ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌… వైసీపీకి షాకేనా?

ఏపీ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ ప‌ద‌వి ఖాళీ అయింది. గ‌త నెల 31వ తేదీ వ‌ర‌కు ఉన్న రాష్ట్ర…

3 hours ago

‘హోం’ ప్రశ్నలపై ‘సీఎం’ సమాధానం చెప్తారా?

తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…

4 hours ago

కేసీఆర్ వరకు వెళ్లిన సీతక్క పంచాయితీ

తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…

5 hours ago