Political News

జ‌గ‌న్‌కు షాకిచ్చిన హైడ్రా.. ఏం జ‌రిగిందంటే!

ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు హైద‌రాబాద్‌ హైడ్రా అధికారులు భారీ షాకిచ్చారు. ఆయ‌న నివాసం ఉన్న లోట‌స్ పాండ్‌కు నోటీసులు జారీ చేశారు. మీరు కూలుస్తారా? మ‌మ్మ‌ల్నే కూల్చ‌మంటారా? చెప్పండంటూ.. ఈ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ మేర‌కు శ‌నివారం ఉద‌యాన్నే లోట‌స్ పాండ్ సిబ్బందికి హైడ్రా అధికారులు నోటీసులు జారీ చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. లోట‌స్ పాండ్ అనేది.. చెరువు శిఖం ప్రాంత‌మ‌ని.. దీనిని ఆక్ర‌మించి.. భారీ భ‌వ‌నం నిర్మించార‌ని దానిలో పేర్కొన్నారు.

దీనిని తొల‌గించాల‌ని హైడ్రా అధికారులు నోటీసుల్లో స్ప‌ష్టం చేశారు. మ‌రోవైపు.. మూడు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం జ‌గ‌న్‌.. శ‌నివారం మ‌ధ్యాహ్నం పులివెందుల‌కు బ‌య‌లు దేరుతున్న స‌మ‌యంలో ఈ నోటీసులు రావ‌డంతో ఆయ‌న ఆలోచ‌న‌లో ప‌డ్డారు. హైద‌రాబాద్ న‌డిబొడ్డున జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉన్న చెరువు శిఖంలో లోట‌స్ పాండ్ నిర్మించార‌న్న‌ది.. హైడ్రా అధికారులు చెబుతున్నారు. గ‌తంలోనూ.. రెండు నెల‌ల కింద‌ట లోట‌స్ పాండ్‌ను ఆనుకుని నిర్మించిన కొన్ని నిర్మాణాల‌ను తొల‌గించారు.

అయితే.. వాటిని సెక్యూరిటీ కోసం.. అన‌ధికారికంగా నిర్మించార‌ని.. ఆ విష‌యం త‌మ‌కు తెలియ‌ద‌ని లోట‌స్ పాండ్ వ‌ర్గాలు అప్ప‌ట్లో పేర్కొన్నాయి. ఆ త‌ర్వాత‌.. సీఎం రేవంత్ జోక్యంతో నిర్మాణాల కూల్చివేత ఆగిపోయింది. అప్ప‌ట్లో ఇలా చేసిన అధికారుల‌కు హైద‌రాబాద్ మ‌హాన‌గ‌ర కార్ప‌రేష‌న్ అధికారుల‌కు సైతం నోటీసులు ఇచ్చి వివ‌ర‌ణ కోరారు. ఆత‌ర్వాత హైడ్రా ఏర్పాటు అయింది. ఈ క్ర‌మంలో అనేక నిర్మాణాల‌ను కూల్చి వేస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు తాజాగా జ‌గ‌న్ నివాసానికి నోటీసులు ఇవ్వ‌డం సంచ‌ల‌నంగా మారింది. దీనిలోనే మ‌రోవైపు.. ష‌ర్మిల నివ‌సిస్తున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on August 31, 2024 6:48 pm

Share
Show comments
Published by
Satya
Tags: Jagan

Recent Posts

సునీల్ వెనుక వైసీపీ రాజకీయ వర్గాల్లో చర్చ

వివాదాస్పద ఐపీఎస్ సునీల్ కుమార్ వ్యవహారం అందరికీ తెలిసిందే. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజును కస్టోడియల్ విచారణలో చేయి చేసుకున్నారన్న…

7 minutes ago

బాలయ్యతో వస్తే మోగ్లికే మంచిది

అఖండ 2 వాయిదా వ్యవహారం డిసెంబర్ 12 విడుదల కావాల్సిన వేరే సినిమాల మీద ప్రభావం చూపించింది. సైక్ సిద్దార్థ్…

22 minutes ago

ఎన్నికల వరకు ఓర్చుకోండి అని జగన్ సూచన?

వైసీపీ నాయకులకు జగన్ తరచుగా హితవు పలుకుతున్నారు. ఎన్నికల వరకు ఓర్చుకోవాలని చెబుతున్నారు. దీనికి కారణం కొందరు ప్రస్తుతం కేసుల్లో…

28 minutes ago

పవన్ చెప్పే స‌నాత‌న ధ‌ర్మ బోర్డు.. ప్రభుత్వం స్థాపించగలదా?

``స‌నాత‌న ధ‌ర్మ బోర్డును సాధ్య‌మైనంత వేగంగా ఏర్పాటు చేయాలి.`` తాజాగా జ‌న‌సేన అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌రోసారి…

35 minutes ago

అఖండకు ఆలస్యమనే విషం అమృతంగా మారింది

గత వారం చివరి నిమిషంలో విడుదల వాయిదా పడిన అఖండ 2 ఇప్పుడు డిసెంబర్ 12 రావడం అంతా మంచికే…

55 minutes ago

అక్కర్లేని వివాదం ఎందుకు హృతిక్

భావ ప్రకటన స్వేచ్ఛ అందరికీ ఉంటుంది కానీ దానికి సహేతుకమైన కారణం ఆమోదం దక్కుతుంది. సోషల్ మీడియా కాలంలో దీని…

2 hours ago