ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్కు హైదరాబాద్ హైడ్రా అధికారులు భారీ షాకిచ్చారు. ఆయన నివాసం ఉన్న లోటస్ పాండ్కు నోటీసులు జారీ చేశారు. మీరు కూలుస్తారా? మమ్మల్నే కూల్చమంటారా? చెప్పండంటూ.. ఈ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఉదయాన్నే లోటస్ పాండ్ సిబ్బందికి హైడ్రా అధికారులు నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. లోటస్ పాండ్ అనేది.. చెరువు శిఖం ప్రాంతమని.. దీనిని ఆక్రమించి.. భారీ భవనం నిర్మించారని దానిలో పేర్కొన్నారు.
దీనిని తొలగించాలని హైడ్రా అధికారులు నోటీసుల్లో స్పష్టం చేశారు. మరోవైపు.. మూడు రోజుల పర్యటన నిమిత్తం జగన్.. శనివారం మధ్యాహ్నం పులివెందులకు బయలు దేరుతున్న సమయంలో ఈ నోటీసులు రావడంతో ఆయన ఆలోచనలో పడ్డారు. హైదరాబాద్ నడిబొడ్డున జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉన్న చెరువు శిఖంలో లోటస్ పాండ్ నిర్మించారన్నది.. హైడ్రా అధికారులు చెబుతున్నారు. గతంలోనూ.. రెండు నెలల కిందట లోటస్ పాండ్ను ఆనుకుని నిర్మించిన కొన్ని నిర్మాణాలను తొలగించారు.
అయితే.. వాటిని సెక్యూరిటీ కోసం.. అనధికారికంగా నిర్మించారని.. ఆ విషయం తమకు తెలియదని లోటస్ పాండ్ వర్గాలు అప్పట్లో పేర్కొన్నాయి. ఆ తర్వాత.. సీఎం రేవంత్ జోక్యంతో నిర్మాణాల కూల్చివేత ఆగిపోయింది. అప్పట్లో ఇలా చేసిన అధికారులకు హైదరాబాద్ మహానగర కార్పరేషన్ అధికారులకు సైతం నోటీసులు ఇచ్చి వివరణ కోరారు. ఆతర్వాత హైడ్రా ఏర్పాటు అయింది. ఈ క్రమంలో అనేక నిర్మాణాలను కూల్చి వేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా జగన్ నివాసానికి నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది. దీనిలోనే మరోవైపు.. షర్మిల నివసిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on August 31, 2024 6:48 pm
తమిళనాట అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. అందుక్కారణం నటుడు విజయ్ పార్టీ టీవీకే మ్యాజిక్ మార్కు దిశగా…
తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో విజయ్ టీవీకే పార్టీ ముందంజలో ఉండటం చూస్తుంటే, అందరికీ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ ప్రయాణం…
కాంగ్రెస్ పార్టీ..దేశంలోనే అతి పురాతన రాజకీయ పార్టీ… అదే ఆ పార్టీకి పెద్ద మైనస్. పాత పార్టీ… పాత పాట……
సాయిపల్లవి బాలీవుడ్ డెబ్యూ ఏక్ దిన్ ఈ ఏడాది అతి పెద్ద డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచేందుకు పరుగులు పెడుతోంది.…
పశ్చిమ బెంగాల్ రాజకీయం ఊహించని మలుపు తిరిగింది. గత పదిహేనేళ్లుగా రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ కోట…
తమిళనాడు ఎన్నికల్లో భారీ విజయం నమోదు చేసుకున్న విజయ్ పార్టీ టీవీకే 110 స్థానాల్లో ఆధిక్యం సంపాయించింది. అయితే.. అధికారంలోకి…