ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్కు హైదరాబాద్ హైడ్రా అధికారులు భారీ షాకిచ్చారు. ఆయన నివాసం ఉన్న లోటస్ పాండ్కు నోటీసులు జారీ చేశారు. మీరు కూలుస్తారా? మమ్మల్నే కూల్చమంటారా? చెప్పండంటూ.. ఈ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఉదయాన్నే లోటస్ పాండ్ సిబ్బందికి హైడ్రా అధికారులు నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. లోటస్ పాండ్ అనేది.. చెరువు శిఖం ప్రాంతమని.. దీనిని ఆక్రమించి.. భారీ భవనం నిర్మించారని దానిలో పేర్కొన్నారు.
దీనిని తొలగించాలని హైడ్రా అధికారులు నోటీసుల్లో స్పష్టం చేశారు. మరోవైపు.. మూడు రోజుల పర్యటన నిమిత్తం జగన్.. శనివారం మధ్యాహ్నం పులివెందులకు బయలు దేరుతున్న సమయంలో ఈ నోటీసులు రావడంతో ఆయన ఆలోచనలో పడ్డారు. హైదరాబాద్ నడిబొడ్డున జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉన్న చెరువు శిఖంలో లోటస్ పాండ్ నిర్మించారన్నది.. హైడ్రా అధికారులు చెబుతున్నారు. గతంలోనూ.. రెండు నెలల కిందట లోటస్ పాండ్ను ఆనుకుని నిర్మించిన కొన్ని నిర్మాణాలను తొలగించారు.
అయితే.. వాటిని సెక్యూరిటీ కోసం.. అనధికారికంగా నిర్మించారని.. ఆ విషయం తమకు తెలియదని లోటస్ పాండ్ వర్గాలు అప్పట్లో పేర్కొన్నాయి. ఆ తర్వాత.. సీఎం రేవంత్ జోక్యంతో నిర్మాణాల కూల్చివేత ఆగిపోయింది. అప్పట్లో ఇలా చేసిన అధికారులకు హైదరాబాద్ మహానగర కార్పరేషన్ అధికారులకు సైతం నోటీసులు ఇచ్చి వివరణ కోరారు. ఆతర్వాత హైడ్రా ఏర్పాటు అయింది. ఈ క్రమంలో అనేక నిర్మాణాలను కూల్చి వేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా జగన్ నివాసానికి నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది. దీనిలోనే మరోవైపు.. షర్మిల నివసిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on August 31, 2024 6:48 pm
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…