Political News

ఎవ‌రున్నా వ‌ద‌లద్దు.. ప్ర‌తి 3 గంట‌ల‌కూ రిపోర్టు ఇవ్వండి: చంద్ర‌బాబు

కృష్ణా జిల్లా గుడ్లవ‌ల్లేరులోని శేషాద్రి ఇంజ‌నీరింగ్ క‌ళాశాల‌లో విద్యార్థినుల మ‌రుగు దొడ్ల‌లో హిడెన్ కెమెరాలు పెట్టి.. రికార్డు చేశా ర‌న్న తీవ్ర ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో విద్యార్థినులు ఆందోళ‌న‌కు దిగారు. ఈ విష‌యంపై హుటాహుటిన స్పందించిన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.. ఉన్న‌తాధికారుల‌తో ప్ర‌తి 3 గంట‌ల‌కు ఒక‌సారి మాట్లాడుతున్నారు. ఈ ఘ‌ట‌న వెనుక ఎవరున్నా.. వ‌దిలి పెట్ట‌రాదని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

శుక్ర‌వారం ఉదయం 11గంట‌ల స‌మ‌యంలో ఘటన విషయం తెలిసిన విష‌యం తెలిసిందే. అయితే.. ఆ వెంటనే స్పందించిన చంద్ర‌బాబు జిల్లా అధికారులను అప్ర‌మ‌త్తం చేశారు. ఇదేస‌మ‌యంలో స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కొల్లు రవీంద్రను ఘ‌ట‌నా స్థ‌లానికి పంపించారు.

ఆ త‌ర్వాత‌.. ప్ర‌తి మూడు గంట‌ల‌కు చంద్ర‌బాబు అక్క‌డి ఘ‌ట‌న‌ల‌ను అడిగి తెలుసుకుంటున్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఫోన్ లో మాట్లాడి విచారణ సాగుతున్న విధానంపైనా అడిగి తెలుసుకుంటున్నారు. క‌ళాశాల‌ విద్యార్థినుల ఆందోళనను, ఆవేదనను అర్థం చేసుకున్నాన‌ని, వారి ఆవేద‌న‌ను మీరు కూడా వినాల‌ని ఆయ‌న కోరారు.

అదేవిధంగా ఈ కేసుపై పటిష్ట దర్యాప్తు సాగించాల‌ని చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు. హిడెన్ కెమెరాల ద్వారా వీడియోల చిత్రీకరణ జరిగిందన్న నేరం నిజ‌మైతే.. దాని వెనుక ఎంతటి కార‌కులు ఉన్నా.. క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌ని, ఎవ‌రినీ వ‌దిలి పెట్ట‌రాద‌ని కూడా చంద్ర‌బాబు ఆదేశించారు.

“మన ఇంట్లో ఆడబిడ్డలకు కష్టం వస్తే ఎలా స్పందిస్తామో…అంతే సీరియస్ గా స్పందించి నిజాలు నిగ్గు తేల్చాలి. ఆందోళనలో ఉన్న వారికి భరోసా కల్పించాలి. విద్యార్థినుల విష‌యంలో యాజమాన్యం నిర్లక్ష్యం చేసి ఉంటే.. దానిపైనా విచారణ జరపాలి. త‌క్ష‌ణం చర్యలు తీసుకోవాలి” అని చంద్ర‌బాబు పేర్కొన్నారు.

ఇక‌, త‌మ మ‌రుగు దొడ్ల‌లో కెమెరాలు పెట్టార‌ని ఆరోపిస్తున్న‌ విద్యార్థినుల వద్ద ఏ చిన్న క్లూ ఉన్నా.. వెంట‌నే త‌న‌కు నేరుగా పంపించాల‌ని చంద్ర‌బాబు పేర్కొన్నారు. ఈ విష‌యాన్ని అధికారులే విద్యార్థినుల‌కు చెప్పాల‌న్నారు. ప్రభుత్వం ఖ‌చ్చితంగా చర్యలు తీసుకుంటుందన్న భ‌రోసా వారికి చేరేలా క‌లెక్ట‌ర్‌, ఎస్పీలు బాధ్య‌త తీసుకోవాల‌ని చంద్ర‌బాబు ఆదేశించారు. ప్రతి మూడు గంటలకు ఒక సారి తనకు ఏం చేశారో.. ఎలాంటి విష‌యాలు వెలుగు చూశాయో రిపోర్ట్ చేయాలని పేర్కొన్నారు.

వైసీపీ ఫైర్‌

గుడ్ల‌వ‌ల్లేరు ఘ‌ట‌నపై వైసీపీ మ‌హిళా విభాగం విమ‌ర్శ‌లు గుప్పించింది. “ఇది 300 మంది ఆడపిల్లల భవిష్యత్తు.. హాస్టల్ వాష్ రూమ్స్ లో హిడెన్ కెమెరాలు పెట్టి ఆ ఫుటేజ్ లను బయటకు వదులుతున్నారు. అంటే రాష్ట్రంలో ఎంత దారుణమైన సంఘటనలు జరుగుతున్నాయో అర్థమవుతుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక రాజకీయ వేధింపుల మీద దృష్టి పెట్టింది గానీ.. ఆడపిల్లల మాన ప్రాణాలు గురించి పట్టించుకోవట్లేదు. కూటమి నాయకులు, మంత్రులు ప్రశాంతంగా నిద్రపోతున్నారు తప్ప రాష్ట్రంలో ఏ ఆడపిల్ల కూడా ప్రశాంతంగా నిద్రపోవట్లేదు” అని వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కల్యాణి వ్యాఖ్యానించారు.

Satya

Recent Posts

తొందరపాటు ఎందుకు పెద్ది

స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…

10 minutes ago

వరప్రసాద్ స్నేహితులకు క్లాష్ తప్పదా

సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…

1 hour ago

ఫౌజీ బాటలో ముళ్లచెట్ల బ్రేకులు

హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…

1 hour ago

ఆంధ్రాకి ఆరు ఆడ పులులు కోరిన పవన్

రాష్ట్రంలో అట‌వీ సంప‌ద‌ను కాపాడ‌డంతోపాటు.. వన్య‌ప్రాణుల సంర‌క్ష‌ణ‌కు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్య‌మంత్రి, అట‌వీ శాఖ మంత్రి ప‌వ‌న్…

2 hours ago

ఎవ‌రా త‌ల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్?

హీరోయిన్లు కెరీర్లో కొంచెం కుదురుకోగానే పెళ్లి ఎప్పుడు అనే ప్ర‌శ్న ఎదుర‌వుతుంది మీడియా నుంచి. ఆ తంతు పూర్త‌య్యాక త‌ల్లెప్పుడు…

2 hours ago

హీరోల ఫ్రెండ్ షిప్ గురించి చర్చలెందుకు

సింగ్ గీతంని విష్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ తన మిత్రుడు రామ్ చరణ్ పెద్దికి మాత్రం ఎలాంటి ట్వీట్ వేయకపోవడం…

2 hours ago