ఏపీలో జరుగుతున్న ఘటనలపై కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల వెంటనే స్పందిస్తున్నారు. నిజానికి 11 మంది ఎమ్మెల్యేలతో ఉన్న జగన్ వెంటనే రియాక్ట్ అవ్వాలి. కానీ, తాడేపల్లి ప్యాలెస్ గడప దాటి రావడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. పోనీ.. ట్విట్టర్లో అయినా.. స్పందిస్తున్నారా? అంటే.. ప్రజలు తనను గెలిపించలేదన్న ఆవేదన నుంచి ఆయన ఇంకా కోలుకున్నట్టు లేరు. అందుకే చాలా నిదానంగా.. రియాక్ట్ అవుతున్నారు. కానీ, షర్మిల మాత్రం ప్రజాప్రతినిధులు ఉన్నా.. లేకున్నా రియాక్ట్ అవుతున్నారు.
తాజాగా వెలుగు చూసిన గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ సంచలన ఘటన పై వెంటనే స్పందించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక ప్రజాప్రతినిధి కుమార్తె ఈ కేసులో ఉన్నారన్న వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఎవరున్నా కూడా.. వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఒక ఆడబిడ్డకు తల్లిగా తాను ఈ విషయం తెలిసి, దిగ్భ్రాంతికి గురయ్యానని షర్మిల వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఎక్స్లో పోస్టు చేశారు. ఈ ఘటనపై విచారణ పేరులో రోజులు గడిపేస్తే కుదరదని కూడా తేల్చి చెప్పారు.
వచ్చే వారంలో ఈ కేసులో బాధ్యులను అరెస్టు చేయకపోతే.. తానే నేరుగా రంగంలోకి దిగుతానని కూడా ఆమె హెచ్చరించారు. నిరసన చేపడతానని.. బాధిత విద్యార్థినుల తరఫున పోరాటం చేస్తానని చెప్పారు. ఇలా.. షర్మిల ఎక్కడ ఘటన జరిగినా వెంటనే రియాక్ట్ అవుతున్నారు. గతంలోనూ మహిళలపై అత్యాచార ఘటనలు వెలుగు చూసినప్పుడు కూడా.. ఆమె స్పందించారు. అంతేకాదు.. ఇదే కృష్ణాజిల్లాలోని ఓ 10వ తరగతి విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం(అదే పాఠశాల విద్యార్థులు నిందితులు)పై షర్మిల స్పందించాక.. విషయం వెలుగు చూడడం గమనార్హం. ఏదేమైనా.. జగన్ కంటే షర్మిల మెరగు అనే మాట వినిపిస్తోంది.
This post was last modified on August 30, 2024 2:41 pm
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…