Political News

ఐదేళ్ల నిర్ల‌క్ష్యం.. పాతికేళ్ల ఎఫెక్ట్‌..

ఏపీలో చంద్ర‌బాబు ఎక్క‌డికి వెళ్లినా.. వ్య‌వ‌స్థ‌ల‌ను బాగు చేస్తున్నామ‌నే మాట వినిపిస్తున్నారు. ఇక‌, ఆయ‌న మంత్రివ‌ర్గంలోని వారు కూడా ఇదే చెబుతున్నారు. వ్య‌వ‌స్థ‌ల‌ను బాగు చేస్తున్నామ‌ని.. చెబుతున్నారు. దీనికి కార‌ణం.. ఐదేళ్ల వైసీపీ పాన‌ల‌లో అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను నాశ‌నం చేశార‌న్న‌ది టీడీపీచెబుతున్న మాట‌. అంతేకాదు.,. మ‌ద్యం, విద్య‌త్ వంటి కీల‌క విష‌యాల్లో అయితే.. పాతికేళ్ల‌కు స‌రిప‌డా వైసీపీ ఒప్పందాలు చేసుకుని.. అప్పులు తెచ్చుకుంది.

ఇప్పుడు వాటిని స‌రిచేసే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌న్న‌ది చంద్ర‌బాబు మాట‌. దీనికితోడు.. అమ‌రావ‌తి రాజ‌ధానిలో అయితే.. ఎక్క‌డ చూసినా తుప్ప‌లు, తుమ్మ‌లు పెరిగిపోయాయి.

వాటిని స‌రిచేసేందుకు.. తుమ్మ‌ను శుభ్రం చేసేందుకు 40 కోట్ల రూపాయ‌ల‌ను వెచ్చించాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. దీంతో ప్ర‌భుత్వం ఆపశోపాలు ప‌డుతున్న‌మాట వాస్త‌వం. అయిన‌ప్ప‌టికీ.. ఆయా స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు స‌ర్కారు వ్యూహాత్మ‌కంగానే ముందుకు సాగుతోంది.

వెళ్లిపోయిన ప‌రిశ్ర‌మ‌ల‌ను తీసుకువ‌చ్చేందుకు, కొత్త ప‌రిశ్ర‌మ‌ల‌ను ఆక‌ర్షించేందుకు చంద్ర‌బాబు ప్ర‌యత్నిస్తున్నారు. దీనిలో భాగంగా ఇప్ప‌టికే కొన్ని సంస్థ‌ల‌కు ఆహ్వానం పంపించారు. మ‌రికొన్నింటిని రావాల‌ని క‌బురు పంపించారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది.

అయితే.. ఇప్పుడు అస‌లు స‌మ‌స్య‌.. గ‌త వైసీపీ ప్ర‌భుత్వం చేసుకున్న కీల‌క ఒప్పందాలు. వీటిని విస్మ‌రించే ప‌రిస్థితి లేదు. ఉదాహ‌ర‌ణ‌కు మ‌ద్యంపై 25 ఏళ్ల‌కు స‌రిపోయేలా అప్పులు తెచ్చుకున్నారు.

ఇప్పుడు నూత‌న ప్ర‌భుత్వం మ‌ద్యం పాల‌సీని మార్చుతోంది. ఇప్ప‌టికే ఉన్న చీపు బ్రాండ్ల‌ను తీసేసి.. బ్రాండెడ్ మ‌ద్యం తీసుకురావాల‌ని, ధ‌ర‌లు త‌గ్గించాల‌ని భావిస్తోంది. కానీ, వ‌స్తున్న ఆదాయంలో అప్పుల‌కు వ‌డ్డీలు క‌ట్టాల్సి ఉంది. దీంతో ఈ విధానంపై మ‌రోసారి పున‌రాలోచ‌న‌లో ప్ర‌భుత్వం ప‌డింది.

అదే విధంగా విద్యుత్ ఒప్పందాలు కూడా.. అదానీ కంపెనీతో పాతికేళ్ల‌పాటు చేసుకున్నారు. స్మార్ట్ మీట‌ర్ల కొనుగోళ్లు దానిలో భాగ‌మే. దీంతో దీనినికాద‌న‌లేని ప‌రిస్థితి వ‌చ్చింది. సో.. వైసీపీ ఐదేళ్ల పాల‌న చిక్కులు పాతికేళ్ల‌కు స‌రిపోయేలా ఉన్నాయ‌న్న స‌ర్కారు వాద‌న‌లో వాస్త‌వం క‌నిపిస్తోంది.

This post was last modified on August 30, 2024 1:12 pm

Share
Show comments
Published by
Satya
Tags: AP

Recent Posts

నియోజ‌క‌వ‌ర్గాల‌పై రేవంత్ కొత్త ఫార్ములా… వ‌ర్కువ‌ట్ అయ్యేనా?

2029 పార్ల‌మెంటు ఎన్నిక‌ల నాటికి దేశంలో నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభ‌జించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…

2 hours ago

పెను సంక్షోభంలో ప్ర‌పంచం…!

అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభ‌న ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…

2 hours ago

రాష్ట్ర‌ప‌తికి బహుమతిగా మంగళగిరి చీర

భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…

3 hours ago

ఏపీ కొత్త ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌… వైసీపీకి షాకేనా?

ఏపీ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ ప‌ద‌వి ఖాళీ అయింది. గ‌త నెల 31వ తేదీ వ‌ర‌కు ఉన్న రాష్ట్ర…

3 hours ago

‘హోం’ ప్రశ్నలపై ‘సీఎం’ సమాధానం చెప్తారా?

తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…

4 hours ago

కేసీఆర్ వరకు వెళ్లిన సీతక్క పంచాయితీ

తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…

5 hours ago