Political News

వామ్మో చంద్రబాబు.. నీకో దండం సామీ!

అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. విపక్షంలో ఉన్నప్పుడు మరోలా వ్యవహరించే తీరు చంద్రబాబులో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. ఆయన తీరు ఇప్పటికి మారలేదన్న విషయం తాజా పరిణామాలు మరోసారి స్పష్టం చేస్తున్న పరిస్థితి.

తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడని గడ్డు పరిస్థితుల్ని చూసినట్లుగా.. వాటిని ఎదుర్కొన్నట్లుగా చంద్రబాబు తన సన్నిహితులతో చెబుతుంటారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా గడిచిన ఐదేళ్లలో చోటు చేసుకున్న అంశాల్ని ప్రస్తావించటమే కాదు.. తన కెరీర్ లో చూడనంత విధ్వంసాన్ని తాను చూసినట్లు చెబుతారు.

ఆయన నోటి నుంచి వచ్చే మాటలు ఆయన మనసులో నుంచి రావట్లేదా? ఒకవేళ వస్తే.. అలాంటి పరిస్థితుల గురించి వెరో అలెర్టు చేయకుండానే సరి చేయాల్సిన బాధ్యత చంద్రబాబు మీద ఉంది కదా? అన్నది ప్రశ్న.

ఎందుకిదంతా అంటే.. వైసీపీ నేత.. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దాదాపు వంద కోట్ల రూపాయిల విలువైన 982.48 ఎకరాల భూమిని ప్రైవేటు పట్టా భూములుగా మార్చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి తాజాగా విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం సైతం ఈ దారుణం చోటు చేసుకుందని తేల్చింది.

విజిలెన్స్ సిద్ధం చేసిన ప్రాథమిక రిపోర్టులో ఒక సంచలన అంశాన్ని ప్రస్తావించారు. అదేమంటే.. అప్పటి చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్.. ప్రస్తుత తిరుపతి కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ కుట్రకు పాల్పడినట్లుగా నిగ్గు దేల్చటం సంచలనంగా మారింది.

ఇదంతా చూసినోళ్లు.. ముక్కున వేలేసుకుంటున్నారు. కారణం.. ముఖ్యమంత్రిగా సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు తాను అధికారంలో ఉన్నప్పుడు తాను ప్రాతినిధ్యం వహించే జిల్లాకు సంబంధించిన కీలక అధికారి ఎంపిక ఎలా ఉండాలి? ఏ ప్రాతిపదికన చేపట్టాలన్న చిన్న విషయాల్ని మర్చిపోవటం చూస్తే.. ఇదేంది చంద్రబాబు.. ఈ ప్లానింగ్ ఏమిటి? అన్న ప్రశ్నలు రాక మానవు.

గత ప్రభుత్వానికి.. ప్రభుత్వంలోని కీలక నేతల అడుగులకు మడుగులు పట్టిన వారి గురించి చంద్రబాబుకు ప్రత్యేకంగా ఫీడ్ బ్యాక్ ఉండి ఉంటుంది. ఎందుకుంటే.. విపక్ష నేతగా ఉన్నప్పుడు తమను, తమ పార్టీని.. నేతల్ని టార్గెట్ చేసిన వారి వివరాల్ని సేకరించటం.. తాము అధికారంలోకి రాగానే అలాంట వారి సంగతి చూస్తామన్న హెచ్చరికలు చేశారు.

ఇంత జరిగి.. అధికారంలోకి వచ్చిన తర్వాత చిత్తూరు జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేతకు ఇంత భారీగా భూమిని కట్టబెట్టే వైనం చంద్రబాబుకు కానీ వారి పరివారానికి కానీ తెలీకుండా ఉంటుందా? అన్నది మరో ప్రశ్న. విజిలెన్స్ రిపోర్టు వెలుగు చూసి.. మీడియాలో వచ్చే వరకు చంద్రబాబు ఏం చేస్తున్నట్లు?

తన రాజకీయ ప్రత్యర్థి వ్యూహాలపై కూడా అవగాహన లేకపోవటాన్ని ఎలా చూడాలి? అన్న వాదన వినిపిస్తోంది. తాజా రిపోర్టు ప్రకారం బాధ్యులైన పెద్దిరెడ్డి.. తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్.. పలమనేరు ఆర్డీవోలుగా పని చేసిన పులి శ్రీనివాసులు.. మనోజ్ కుమార్ రెడ్డి.. నాటి పలమనేరు తహసీల్దార్ సీతారామ్ లు లబ్థి పొందినట్లుగా పేర్కొన్నారు.

వీరంతా కుమ్మక్కైనట్లుగా విజిలెన్స్ రిపోర్టు పేర్కొంది. నేరపూరిత కార్యకలాపాలకు పాల్పడి ప్రభుత్వ భూముల మ్యుటేషన్ లో అక్రమాలు చేసినట్లుగా నిర్దారించింది. వీరందరిపై భూకబ్జా చట్టాల్లోని అక్రమ చొరబాటు.. మోసం.. ఫోర్జరీ తదితర సెక్షన్ కింద చర్యలు తీసుకోవాలని చెప్పింది.

అధికారంలోకి వచ్చినంతనే ప్రతీకార చర్యలు తీసుకోవాలి లాంటి మాటలు చెప్పట్లేదు కానీ.. కనీసం తప్పుడు తీరుతో వ్యవహరించినట్లుగా ఆరోపణలు ఉన్న వారిని పక్కన పెట్టేయాలన్న అంశంపై కూడా కసరత్తు జరగకపోవటం దేనికి నిదర్శనం? అన్నది ప్రశ్న.

అధికారంలోకి వస్తే అది చేస్తాం.. ఇది చేస్తామని చెప్పిన చంద్రబాబు పవర్లోకి వచ్చిన తర్వాత ఏమేమో చేయక్కర్లేదు కానీ.. తన సొంత జిల్లాకు ఏర్పాటు చేసిన కలెక్టర్ బ్యాక్ గ్రౌండ్ గురించి ఎందుకని క్రాస్ చెక్ చేయలేదన్నదే అసలు ప్రశ్న. దీనికి సమాధానం చెప్పేదెవరు?

This post was last modified on August 24, 2024 10:28 am

Share

Recent Posts

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

2 hours ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

3 hours ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

3 hours ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

3 hours ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

4 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

5 hours ago