ప్రతిపక్ష వైసీపీకి ఒకే రోజు రెండు విషయాల్లో భారీ ఉపశమనం లభించింది. ఇద్దరు కీలక నాయకులకు సంబంధించిన కేసుల్లో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో వైసీపీ నేతలు ఒకింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనిలోనూ ప్రధానంగా ఎన్నికల పోలింగ్ సమయంలో మే 13న ఈవీఎం సహా వీవీ ప్యాట్ను ధ్వంసం చేసిన కేసులో జైల్లో ఉన్న పిన్నెల్లి రామకృష్నారెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ జరిగిన సమయంలో పాల్వాయిగేటు పోలింగ్ బూత్లోకి ప్రవేశించిన పిన్నెల్లి.. ఈవీఎం, వీవీ ప్యాట్లను ధ్వంసం చేసిన వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
ఈ కేసులో 40 రోజులకు పైగానే పిన్నెల్లి నెల్లూరులోని సెంట్రల్ జైలులో ఉన్నారు. బెయిల్ కోరుతూ..పలు దఫాలుగా గురజాల కోర్టునుఆ శ్రయించారు. అయితే.. అక్కడ ఆయనకు ఉపశమనం లభించలేదు. తాజాగా హైకోర్టులో ఊరట లభించింది. అయితే.. షరతులతో కూడిన బెయిల్ మంజూరు కావడం గమనార్హం. దీనికి సంబంధించి రూ.50000 చొప్పున రెండు గ్యారెంటీను సమర్పించాల్సి ఉంటుంది. దీంతో శనివారం ఆయన విడుదలయ్యే అవకాశం ఉంది.
ఇవీ షరతులు
జోగి కుమారుడికి బెయిల్
మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్కు కూడా.. కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అగ్రిగోల్డ్ భూములను అక్రమంగా స్వాధీనం చేసుకుని వేరే వారికి విక్రయించారంటూ.. ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసులో రాజీవ్ వారం కిందట అరెస్టయిన విషయం తెలిసిందే. దీంతో స్థానిక కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. తాజాగా ఈ కేసులోనూ స్వల్ప షరతులతో రాజీవ్కు బెయిల్ మంజూరైంది. ఆయనను జిల్లా దాటి వెళ్లేందుకు వీల్లేదని, కోరినప్పుడు విచారణకు రావాలని కోర్టు నిర్దేశించింది. దీంతో వైసీపీకి ఒకింత ఊరట లభించినట్టు అయింది.
This post was last modified on August 23, 2024 9:19 pm
మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…
సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…