ప్రతిపక్ష వైసీపీకి ఒకే రోజు రెండు విషయాల్లో భారీ ఉపశమనం లభించింది. ఇద్దరు కీలక నాయకులకు సంబంధించిన కేసుల్లో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో వైసీపీ నేతలు ఒకింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనిలోనూ ప్రధానంగా ఎన్నికల పోలింగ్ సమయంలో మే 13న ఈవీఎం సహా వీవీ ప్యాట్ను ధ్వంసం చేసిన కేసులో జైల్లో ఉన్న పిన్నెల్లి రామకృష్నారెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ జరిగిన సమయంలో పాల్వాయిగేటు పోలింగ్ బూత్లోకి ప్రవేశించిన పిన్నెల్లి.. ఈవీఎం, వీవీ ప్యాట్లను ధ్వంసం చేసిన వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
ఈ కేసులో 40 రోజులకు పైగానే పిన్నెల్లి నెల్లూరులోని సెంట్రల్ జైలులో ఉన్నారు. బెయిల్ కోరుతూ..పలు దఫాలుగా గురజాల కోర్టునుఆ శ్రయించారు. అయితే.. అక్కడ ఆయనకు ఉపశమనం లభించలేదు. తాజాగా హైకోర్టులో ఊరట లభించింది. అయితే.. షరతులతో కూడిన బెయిల్ మంజూరు కావడం గమనార్హం. దీనికి సంబంధించి రూ.50000 చొప్పున రెండు గ్యారెంటీను సమర్పించాల్సి ఉంటుంది. దీంతో శనివారం ఆయన విడుదలయ్యే అవకాశం ఉంది.
ఇవీ షరతులు
జోగి కుమారుడికి బెయిల్
మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్కు కూడా.. కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అగ్రిగోల్డ్ భూములను అక్రమంగా స్వాధీనం చేసుకుని వేరే వారికి విక్రయించారంటూ.. ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసులో రాజీవ్ వారం కిందట అరెస్టయిన విషయం తెలిసిందే. దీంతో స్థానిక కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. తాజాగా ఈ కేసులోనూ స్వల్ప షరతులతో రాజీవ్కు బెయిల్ మంజూరైంది. ఆయనను జిల్లా దాటి వెళ్లేందుకు వీల్లేదని, కోరినప్పుడు విచారణకు రావాలని కోర్టు నిర్దేశించింది. దీంతో వైసీపీకి ఒకింత ఊరట లభించినట్టు అయింది.
This post was last modified on August 23, 2024 9:19 pm
దేశంలో ఐదు రాష్ట్రాలకు (ఒకటి కేంద్ర పాలిత అసెంబ్లీ ఉన్న పుదుచ్చేరి) జరిగిన ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో అప్రతిహత…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఘన విజయం సాధించే దిశగా దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధినేత, కోలీవుడ్…
సమంత మా ఇంటి బంగారం మే 15 రావడం లేదు. ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు కానీ ప్రమోషన్స్ నాలుగైదు…
అదేంటి రాజకీయాల్లో గెలిచిన తర్వాత విజయ్ ఇక సినిమాల్లో నటించడు కదా, మరి నిర్మాతలకు పండగ ఏమిటనుకుంటున్నారా. తమిళనాడు ముఖ్యమంత్రిగా…
కొత్త ఏడాదిలో అయిదో నెల వచ్చేసింది. సంక్రాంతి తర్వాత మళ్ళీ సరైన ఊపు కోసం ఎదురు చూస్తున్న బాక్సాఫీస్ కు…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ డీఎంకే, ప్రతిపక్ష పార్టీ ఏఐడీఎంకేలకు టీవీకే పెద్ద షాకిచ్చిన సంగతి తెలిసిందే.…