ప్రతిపక్ష వైసీపీకి ఒకే రోజు రెండు విషయాల్లో భారీ ఉపశమనం లభించింది. ఇద్దరు కీలక నాయకులకు సంబంధించిన కేసుల్లో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో వైసీపీ నేతలు ఒకింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనిలోనూ ప్రధానంగా ఎన్నికల పోలింగ్ సమయంలో మే 13న ఈవీఎం సహా వీవీ ప్యాట్ను ధ్వంసం చేసిన కేసులో జైల్లో ఉన్న పిన్నెల్లి రామకృష్నారెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ జరిగిన సమయంలో పాల్వాయిగేటు పోలింగ్ బూత్లోకి ప్రవేశించిన పిన్నెల్లి.. ఈవీఎం, వీవీ ప్యాట్లను ధ్వంసం చేసిన వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
ఈ కేసులో 40 రోజులకు పైగానే పిన్నెల్లి నెల్లూరులోని సెంట్రల్ జైలులో ఉన్నారు. బెయిల్ కోరుతూ..పలు దఫాలుగా గురజాల కోర్టునుఆ శ్రయించారు. అయితే.. అక్కడ ఆయనకు ఉపశమనం లభించలేదు. తాజాగా హైకోర్టులో ఊరట లభించింది. అయితే.. షరతులతో కూడిన బెయిల్ మంజూరు కావడం గమనార్హం. దీనికి సంబంధించి రూ.50000 చొప్పున రెండు గ్యారెంటీను సమర్పించాల్సి ఉంటుంది. దీంతో శనివారం ఆయన విడుదలయ్యే అవకాశం ఉంది.
ఇవీ షరతులు
జోగి కుమారుడికి బెయిల్
మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్కు కూడా.. కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అగ్రిగోల్డ్ భూములను అక్రమంగా స్వాధీనం చేసుకుని వేరే వారికి విక్రయించారంటూ.. ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసులో రాజీవ్ వారం కిందట అరెస్టయిన విషయం తెలిసిందే. దీంతో స్థానిక కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. తాజాగా ఈ కేసులోనూ స్వల్ప షరతులతో రాజీవ్కు బెయిల్ మంజూరైంది. ఆయనను జిల్లా దాటి వెళ్లేందుకు వీల్లేదని, కోరినప్పుడు విచారణకు రావాలని కోర్టు నిర్దేశించింది. దీంతో వైసీపీకి ఒకింత ఊరట లభించినట్టు అయింది.
This post was last modified on August 23, 2024 9:19 pm
తెలుగుదేశం పార్టీలో క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందని మరోసారి రుజువైంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులకు దళవాయి…
‘బాహుబలి’ దగ్గర్నుంచి ఉత్తరాదిన తెలుగు సినిమాల ఆధిపత్యం ఎలా సాగుతోందో చూస్తూనే ఉన్నాం. ‘బాహుబలి’ని తక్కువ అంచనా వేసిన బాలీవుడ్…
తెలుగు రాజకీయాల్లో కుటుంబ రాజకీయాలు కొత్త కాదు. ఒకే కుటుంబంలో తండ్రి, కొడుకులు, భార్యభర్తలు కూడా చట్టసభలకు ప్రాథినిత్యం వహించిన…
సోషల్ మీడియాలో, పరిశ్రమలో తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన టికెట్ రేట్ల జిఓ మీద పెద్ద చర్చ జరుగుతోంది. ప్రీమియం…
వెంకటేష్ - కళ్యాణ్ రామ్ కలయికలో దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందిస్తున్న సినిమాకు 'జనవరి 12 విడుదల' టైటిల్ లాక్…
ఇప్పుడు అమెరికాలో కొత్తగా వినిపిస్తున్న పేరు సరితా కోమటిరెడ్డి. ఈ తెలంగాణా బిడ్డ న్యూయార్క్ అటార్నీ జనరల్ పదవి రేసులో…