Political News

వైసీపీకి బిగ్ రిలీఫ్‌.. ఒకేరోజు ఇద్ద‌రికి బెయిల్

ప్ర‌తిప‌క్ష వైసీపీకి ఒకే రోజు రెండు విష‌యాల్లో భారీ ఉప‌శ‌మ‌నం ల‌భించింది. ఇద్ద‌రు కీల‌క నాయ‌కుల‌కు సంబంధించిన కేసుల్లో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో వైసీపీ నేత‌లు ఒకింత ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. దీనిలోనూ ప్ర‌ధానంగా ఎన్నిక‌ల పోలింగ్ స‌మ‌యంలో మే 13న ఈవీఎం స‌హా వీవీ ప్యాట్‌ను ధ్వంసం చేసిన కేసులో జైల్లో ఉన్న పిన్నెల్లి రామ‌కృష్నారెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంలో పోలింగ్ జ‌రిగిన స‌మ‌యంలో పాల్వాయిగేటు పోలింగ్ బూత్‌లోకి ప్ర‌వేశించిన పిన్నెల్లి.. ఈవీఎం, వీవీ ప్యాట్‌ల‌ను ధ్వంసం చేసిన వ్య‌వ‌హారం దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే.

ఈ కేసులో 40 రోజుల‌కు పైగానే పిన్నెల్లి నెల్లూరులోని సెంట్ర‌ల్ జైలులో ఉన్నారు. బెయిల్ కోరుతూ..ప‌లు ద‌ఫాలుగా గుర‌జాల కోర్టునుఆ శ్ర‌యించారు. అయితే.. అక్క‌డ ఆయ‌న‌కు ఉప‌శ‌మ‌నం ల‌భించ‌లేదు. తాజాగా హైకోర్టులో ఊర‌ట ల‌భించింది. అయితే.. ష‌ర‌తులతో కూడిన బెయిల్ మంజూరు కావ‌డం గ‌మ‌నార్హం. దీనికి సంబంధించి రూ.50000 చొప్పున రెండు గ్యారెంటీను స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. దీంతో శ‌నివారం ఆయ‌న విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంది.

ఇవీ ష‌ర‌తులు

  • వారానికి ఒక‌సారి పోలీసు స్టేష‌న్‌కు హాజ‌రై.. సంత‌కం చేయాలి.
  • పాస్ పోర్టును క‌లెక్ట‌ర్‌కు స్వాధీనం చేయాలి
  • కేసుకు సంబందించిన విష‌యాల‌ను మీడియా ముందు మాట్లాడ‌డానికి వీల్లేదు.
  • సాక్షుల‌ను బెదిరించ‌వ‌ద్దు.. ప్ర‌లోభాల‌కు గురిచేయ‌వ‌ద్దు.
  • పోలీసుల‌కు.. నివాసం, ఫోన్ నెంబ‌రు వివ‌రాల‌ను అంద‌జేయాలి.
  • ష‌ర‌తులు ఉల్లంఘిస్తే.. ఎప్పుడైనా బెయిల్ ర‌ద్దు అవుతుంది.

జోగి కుమారుడికి బెయిల్‌

మాజీ మంత్రి జోగి ర‌మేష్ కుమారుడు జోగి రాజీవ్‌కు కూడా.. కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అగ్రిగోల్డ్ భూముల‌ను అక్ర‌మంగా స్వాధీనం చేసుకుని వేరే వారికి విక్ర‌యించారంటూ.. ఏసీబీ అధికారులు న‌మోదు చేసిన కేసులో రాజీవ్ వారం కిందట అరెస్ట‌యిన విష‌యం తెలిసిందే. దీంతో స్థానిక కోర్టు ఆయ‌న‌కు 14 రోజుల రిమాండ్ విధించింది. తాజాగా ఈ కేసులోనూ స్వ‌ల్ప ష‌ర‌తుల‌తో రాజీవ్‌కు బెయిల్ మంజూరైంది. ఆయ‌న‌ను జిల్లా దాటి వెళ్లేందుకు వీల్లేద‌ని, కోరిన‌ప్పుడు విచార‌ణ‌కు రావాల‌ని కోర్టు నిర్దేశించింది. దీంతో వైసీపీకి ఒకింత ఊర‌ట ల‌భించిన‌ట్టు అయింది.

This post was last modified on August 23, 2024 9:19 pm

Share

Recent Posts

పార్టీ అధిష్టానానికే బోండా ఉమ సవాల్?

ముద్రగడ పద్మనాభం సంతాప సభకు హాజరైన అంశంపై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా…

43 minutes ago

పాతిక రోజుల్లో ఇరుముడి… ఏదీ సందడి

మాస్ మహారాజా రవితేజ ఇరుముడి మీద మంచి బజ్ ఉంది. గత కొన్ని సినిమాలు ఎంత ఫ్లాప్ అయినా దీని…

4 hours ago

విజ‌య్ స‌రైన‌ సినిమా చేసుంటే…

త‌మిళ సినిమాల్లో నంబ‌ర్ వ‌న్ స్థాయిలో ఉంటూ రాజ‌కీయాల వైపు అడుగులేసిన విజ‌య్ సినీ రంగాన్ని ఖాళీ చేస్తూ చేసిన…

5 hours ago

సెకండాఫ్ జాగ్రత్త పడి ఉంటే కల్ట్ క్లాసిక్ అయ్యేది

మూడు రోజుల క్రితం విడుదలైన చెన్నై లవ్ స్టోరీ మొదటి వీకెండ్ ఘనంగా ముగిసింది. ఊహించిన దానికన్నా వసూళ్లు ఎక్కువే…

5 hours ago

ఆ నలుగురు… ట్రెండు సృష్టిస్తారా

ఆ నలుగురు అంటే ఏదో రాజేంద్ర ప్రసాద్ సినిమా అనుకునేరు. ఇది దాని గురించి కాదు. ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త…

6 hours ago

వారణాసి అభిమానులకు కీరవాణి శుభవార్త

మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…

10 hours ago