ఏపీలోని అతి పెద్ద పరిశ్రమల్లో కేవలం ఐదేళ్ల వ్యవధిలో రెండు అతి పెద్ద దుర్ఘటనలు జరిగాయి. 2020 ప్రారంభంలో విశాఖపట్నంలోని ఎల్ జీ పాలిమర్స్ నుంచి వెలువడిన ప్రాణాంతక వాయువు కారణంగా.. పలువురు ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆనాడు కూడా.. బాధితుల వ్యవహారం రాజకీయం అయింది. ఇక, అప్పటి కేసు ఇప్పటి వరకు తేలకపోగా.. బాధ్యులైన ఎల్ జీ కంపెనీ ప్రతినిధులు.. రాష్ట్రం విడిచి వెళ్లిపోయారు.
ఇక, ఇప్పుడు అదే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని అచ్యుతాపురం ఫార్మా సెజ్లో జరిగిన ఘోరం.. మరో రాజకీయ దుమారాన్నిరేపింది. ఇప్పటి వరకు సంబంధిత ఎసెన్షియా కంపెనీ ప్రతినిధులు కానీ, బాధ్యులు కానీ.. ఎవరూ స్పందించలేదు. నాడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్.. ఎల్ జీ బాధితులను పరామర్శించి.. రూ.కోటి పరిహారం ప్రకటించినట్టుగానే ఇప్పుడు కూడా.. చంద్రబాబు రూ.కోటి పరిహారం ప్రకటించారు. ఆసుపత్రులకు వెళ్లి బాధితులను పరామర్శించారు.
ఇక్కడితే సర్కారు పని అయిపోయినట్టే!. రేపటి నుంచి ఇతర విషయాలు.. సర్కారు చుట్టూ ప్రదక్షిణలు చేస్తాయి. అయితే.. ఇక్కడే అసలు కీలక విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. పరిశ్ర మల విషయంలో జరుగుతున్న రాజకీయాలను ఆయన పరోక్షంగా వ్యాఖ్యానించారు. కంపెనీ యాజమాన్యం మధ్య విభేదాలు ఉన్నట్లు తమకు తెలిసిందన్నారు. అందిన సమాచారం మేరకే తాను ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని అన్నారు. ఇదే సమయంలో మరో కీలక వ్యాఖ్య కూడా చేశారు. “సేఫ్టీ ఆడిట్ చేయమని తాను ముందు నుంచి చెబుతున్నా. అయితే కంపెనీలు వెనక్కు వెళతాయయోనని ఆందోళన చెందుతున్నారు” అని అన్నారు.
పవన్ చెప్పిన విషయంలో రెండో వ్యాఖ్య అత్యంత కీలకం. కంపెనీలు తీసుకురావడంలో ఏర్పడిన పోటీ.. అనేక విషయాల్లో ప్రభుత్వాలు రాజీ పడేలా మారిపోయింది. “మీరు కాదంటే.. పొరుగు రాష్ట్రానికి వెళ్లిపోతాం” అంటూ.. కంపెనీలు బెదిరించే స్థాయి వచ్చింది. పోనీ.. పోతే పోండి! అని ఊరుకుంటే.. రాజకీయం గా ప్రభుత్వాలపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. దీంతో ప్రజల రక్షణ, కార్మికుల భద్రత కూడా.. గాలిలో కలిసిపోతోంది. కంపెనీల భద్రతకు సంబంధించి ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రభుత్వానికి ఆయా కంపెనీలు నివేదికలు ఇవ్వాలి. ఇది నిబంధన.
అదేసమయంలో ప్రభుత్వం నుంచి కూడా ఆయా సేఫ్టీ అంశాలను క్షుణ్ణంగా తనిఖీలు చేయాలి. కానీ, ఇవేవీ జరగడం లేదు. ఏమంటే.. ఏం జరుగుతుందో అన్న భయం ప్రభుత్వాలకు, సర్కారు తమను టార్గెట్ చేస్తే.. వెళ్లిపోతామన్న కొరడా ఝళిపించేలా.. పరిశ్రమలు ఉన్న కారణంగానే.. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఏర్పడిందనేది పవన్ కల్యాణ్ చెప్పకనే చెప్పారు. కాబట్టి ఇప్పుడు సర్కారు చేయాల్సింది.. రాజకీయం కాదు.. నిర్దిష్ట నిబంధనలు పాటించేలా పరిశ్రమలను ఒప్పించడం.. లేదా చర్యలు తీసుకోవడం. లేకపోతే.. పరిశ్రమల దూకుడు ముందు.. ప్రజల ప్రాణాలు ఇలానే బలవుతాయి.
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…