వైసీపీ కీలక నాయకుడు, ప్రస్తుత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్కు ఆ పార్టీ అధినేత జగన్ సింపుల్గా షాకి చ్చారు. పార్టీలో ఫైర్ బ్రాండ్ కావడంతో నొప్పి తెలియకుండా.. చిన్నవాత పెట్టి.. పెద్ద ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం దువ్వాడ కుటుంబ వ్యవహారం కారణంగా రోడ్డున పడ్డ విషయం తెలిసిందే.
భార్య, ఇద్దరు ఆడపిల్లలు కూడా ఉన్న దువ్వాడ.. వేరే మహిళతో ఉంటున్నారనే విషయం వెలుగు చూసింది. ఇది వారి వ్యక్తిగత విషయం అనేందుకు అవకాశం లేకుండా కూడా పోయింది.
ఎందుకంటే తమకు న్యాయం చేయాలని సాక్షాత్తూ దువ్వాడ సతీమణి వాణి.. ఆయన బిడ్డులు కూడా రోడ్డె క్కారు. ధర్నాలు, నిరసనలు.. దాడులు ఇలా.. అన్నీ జరిగిపోయాయి. చివరకు వ్యవహారం.. మీడియాలో ప్రధాన వార్తలు హైలెట్ అయ్యాయి.
ఇక్కడ భార్య డిమాండ్ ఏంటంటే.. వైసీపీలో ఉండబట్టి ఎమ్మెల్సీగా అధికారాన్ని అడ్డుపెట్టుకుని తమపై దాడులు చేస్తున్నారని.. కాబట్టి ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని వాణి కోరుతున్నారు. లేదా ఎమ్మెల్సీ పదవి నుంచి అయినా తప్పించాలని.
కానీ, నిన్న మొన్నటి వరకు కూడా జగన్ ఈ విషయంలో స్పందించలేదు. దువ్వాడ వ్యవహారం తారస్థా యికి చేరిన తర్వాత కూడా ఆయన మౌనంగానే ఉన్నారు. కానీ, పార్టీ అంతర్గత వ్యవహారాల్లో మాత్రం దువ్వాడ కారణంగా డ్యామేజీ పెరుగుతోందని.. ఇలా అయితే.. ఇబ్బందేనని సీనియర్ నాయకులు లిఖిత పూర్వకంగా జగన్కు సూచించినట్టు తెలిసింది. దీంతో ఇక, తప్పని పరిస్థితిలో దువ్వాడపై చర్యలకు మొగ్గు చూపుతూ… సింపుట్ యాక్షన్ తీసుకున్నారు.
ప్రస్తుతం టెక్కలి నియోజకవర్గం ఇంచార్జ్గా ఉన్న దువ్వాడను ఆ స్థానం నుంచి తప్పించారు. దీనిని పేరాడ తిలక్కు ఇచ్చారు. అయితే.. ఇక్కడే వ్యూహం ఉంది. ఇలా చేయడం వల్ల దువ్వాడపై పాలు పోసినట్టు అయింది. నియోజకవర్గం బాధ్యత నుంచి తప్పించడంతో బిగ్ రిలీఫ్ వచ్చింది.
పైగా.. చర్యలు తీసుకున్నట్టుగా కూడా ఉంది. మరోవైపు.. తీవ్ర అసంతృప్తితో ఉన్నపేరాడ తిలక్కు ఇంచార్జ్ పోస్టు ఇచ్చినట్టు కూడా అయింది. అయితే.. ఇక్కడ వాణి డిమాండ్ మాత్రం నెరవేరకపోవడం.. ఆమె ఆవేదనను జగన్ పట్టించుకోకపోవడం గమనార్హం.
This post was last modified on August 23, 2024 12:02 pm
టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ నుంచి వస్తున్న అఖండ 2 తాండవం కౌంట్ డౌన్ రోజుల నుంచి గంటల్లోకి…
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
రాజకీయ పార్టీలకు ప్రముఖ సంస్థలు విరాళాలు ఇవ్వడం కొత్తకాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వడం(వాటి ఇష్టమే…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…