అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మా సెజ్లో సంభవించిన ఘోర అగ్ని ప్రమాద ఘటనలో 17 మంది కార్మికులు, ఉద్యోగులు, ఇతర ఉన్నతాధికారులు కూడా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అదే విధంగా 36 మందికిపైగానే తీవ్రంగా గాయపడ్డారు. వీరిని వివిధ ఆసుపత్రులకు తరలించి వైద్యం అంది స్తున్నారు. మరోవైపు.. మృత దేహాలకు పోస్టు మార్టమ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆయా కు టుంబాలను, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను రాజకీయ పార్టీల నాయకులు పరామర్శిస్తున్నారు.
ఇలా పరామర్శించడం తప్పుకాదు. కానీ, ఇక్కడే రాజకీయం చోటు చేసుకోవడం గమనార్హం. ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. వారికి భరోసా కల్పించారు. వారికి ధైర్యం చెప్పారు. వైద్యులతో మాట్లాడి.. వారికి మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు. కట్ చేస్తే.. వైసీపీ కూడా ఇప్పుడు రంగంలోకి దిగింది. విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని వైసీపీసీనియర్ నాయకులు పరామర్శించారు.
మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి బూడి ముత్యాలనాయుడు, మరో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సహా పలువురు.. ఆసుపత్రికి వెళ్లి.. బాధితులను పరామర్శించారు. ధైర్యం చెప్పారు. పార్టీ తరఫున తాము అండగా ఉంటామని తెలిపారు. అయితే.. అటు చంద్రబాబు మాట్లాడుతూ.. వ్యవస్థలను నాశనం చేశారని.. వాటిని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్న సమయంలోనే ఈ ఘోరం జరిగిందని పేర్కొన్నారు.
ఇక, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లడుతూ.. ప్రభుత్వం తీవ్ర అలసత్వంతో వ్యవహరించింద న్నారు. మొత్తానికి ఒకరిపై ఒకరు ప్రత్యక్షంగా కాకపయినా.. పరోక్షంగా అయినా.. విమర్శించుకునేందుకు ప్రయత్నించడం గమనార్హం. మరోవైపు.. మాజీ సీఎం జగన్.. ప్రభుత్వ తీరును నిరసిస్తూ.. ట్వీట్చేశారు. బాధితులను తక్షణమే ఆదుకోవడంలో సర్కారు విఫలమైందన్నారు. సరైన సమయంలో వైద్యం అందక.. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు.
This post was last modified on August 22, 2024 4:15 pm
సుప్రీంకోర్టులో రోజు వారీగా అనేక కేసులు విచారణకు వస్తాయి. న్యాయశాస్త్రంలో లబ్ధప్రతిష్టులైన అనేక మంది న్యాయవాదులు వాదనలు వినిపిస్తారు. ఇది…
రేపు కొత్త శుక్రవారం వచ్చేస్తోంది. సంక్రాంతి సినిమాల హడావిడి పూర్తిగా అయిపోవడంతో ఇప్పుడు మూవీ లవర్స్ దృష్టి వీటివైపు వెళ్లాల్సి…
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…