Political News

పోటాపోటీ గా ‘రాజకీయ’ ప‌రామ‌ర్శ‌లు!

అన‌కాప‌ల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లో సంభ‌వించిన ఘోర అగ్ని ప్ర‌మాద ఘ‌ట‌న‌లో 17 మంది కార్మికులు, ఉద్యోగులు, ఇత‌ర ఉన్న‌తాధికారులు కూడా ప్రాణాలు కోల్పోయిన విష‌యం తెలిసిందే. అదే విధంగా 36 మందికిపైగానే తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వీరిని వివిధ ఆసుప‌త్రుల‌కు త‌ర‌లించి వైద్యం అంది స్తున్నారు. మ‌రోవైపు.. మృత దేహాల‌కు పోస్టు మార్ట‌మ్ ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. ఈ క్ర‌మంలో ఆయా కు టుంబాల‌ను, ఆసుప‌త్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల‌ను రాజ‌కీయ పార్టీల నాయ‌కులు ప‌రామ‌ర్శిస్తున్నారు.

ఇలా ప‌రామ‌ర్శించ‌డం త‌ప్పుకాదు. కానీ, ఇక్క‌డే రాజ‌కీయం చోటు చేసుకోవ‌డం గ‌మ‌నార్హం. ముఖ్య‌మంత్రి సీఎం చంద్ర‌బాబు ఓ ప్రైవేటు ఆసుప‌త్రికి వెళ్లి బాధితుల‌ను ప‌రామ‌ర్శించారు. వారికి భ‌రోసా క‌ల్పించారు. వారికి ధైర్యం చెప్పారు. వైద్యుల‌తో మాట్లాడి.. వారికి మెరుగైన చికిత్స అందేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కూడా సూచించారు. క‌ట్ చేస్తే.. వైసీపీ కూడా ఇప్పుడు రంగంలోకి దిగింది. విశాఖ‌ప‌ట్నంలోని కింగ్ జార్జ్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న వారిని వైసీపీసీనియ‌ర్ నాయ‌కులు ప‌రామ‌ర్శించారు.

మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స స‌త్య‌నారాయ‌ణ, మాజీ మంత్రి బూడి ముత్యాల‌నాయుడు, మ‌రో మాజీ మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ స‌హా ప‌లువురు.. ఆసుప‌త్రికి వెళ్లి.. బాధితుల‌ను ప‌రామ‌ర్శించారు. ధైర్యం చెప్పారు. పార్టీ త‌ర‌ఫున తాము అండ‌గా ఉంటామ‌ని తెలిపారు. అయితే.. అటు చంద్ర‌బాబు మాట్లాడుతూ.. వ్య‌వ‌స్థల‌ను నాశ‌నం చేశార‌ని.. వాటిని స‌రిదిద్దే ప్ర‌య‌త్నం చేస్తున్న స‌మ‌యంలోనే ఈ ఘోరం జ‌రిగింద‌ని పేర్కొన్నారు.

ఇక‌, మాజీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ మాట్ల‌డుతూ.. ప్ర‌భుత్వం తీవ్ర అల‌సత్వంతో వ్య‌వ‌హ‌రించింద న్నారు. మొత్తానికి ఒక‌రిపై ఒక‌రు ప్ర‌త్య‌క్షంగా కాక‌ప‌యినా.. ప‌రోక్షంగా అయినా.. విమ‌ర్శించుకునేందుకు ప్ర‌య‌త్నించ‌డం గ‌మ‌నార్హం. మ‌రోవైపు.. మాజీ సీఎం జ‌గ‌న్.. ప్ర‌భుత్వ తీరును నిర‌సిస్తూ.. ట్వీట్‌చేశారు. బాధితుల‌ను త‌క్ష‌ణ‌మే ఆదుకోవ‌డంలో స‌ర్కారు విఫ‌ల‌మైంద‌న్నారు. స‌రైన స‌మ‌యంలో వైద్యం అంద‌క‌.. ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోయార‌ని చెప్పారు.

Satya

Recent Posts

వెంకీ మామ స్పీడు పెంచుతున్నారు

గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ తర్వాత వెంకటేష్ బాగా గ్యాప్ తీసుకున్నారు. అతిథి పాత్ర కాబట్టి మన…

50 minutes ago

తెలంగాణ మా జాగీరే పవన్ కల్యాణ్: కేటీఆర్

తెలంగాణ… 4 కోట్ల మంది తెలంగాణ భూమిపుత్రుల జాగీరేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.…

2 hours ago

మాలలో మాస్ మహారాజ… కొత్తగా ఉందే

గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక అభిమానులను బాధ పెడుతున్న మాస్ మహారాజ రవితేజ ఎట్టకేలకు రూటు మార్చేశారు. రొటీన్…

3 hours ago

రెహమాన్ సత్తాకు ‘జెన్ జీ’ పరీక్ష

ఇవాళ సాయంత్రం ప్రీమియర్లతో విడుదల కాబోతున్న పెద్దికి సంబంధించి అందరు దృష్టి సారిస్తున్న ప్రధానాంశాల్లో ఏఅర్ రెహమాన్ సంగీతం ఒకటి.…

3 hours ago

ఆజ్ కీ షామ్… పెద్దికే నామ్

మెగా కౌంట్ డౌన్ లో సంవత్సరాలు నెలలుగా మారిపోయి, రోజులకు దిగిపోయి, ఇప్పుడు గంటల్లోకి వచ్చేసింది. మెగాభిమానులు, సినీ ప్రియులు…

4 hours ago

విజయ్ vs అన్నామలై… అసలు సాధ్యమేనా?

తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మొన్నటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాాలే ఇందుకు కారణమని చెప్పాలి. ఈ…

5 hours ago