Political News

పోటాపోటీ గా ‘రాజకీయ’ ప‌రామ‌ర్శ‌లు!

అన‌కాప‌ల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లో సంభ‌వించిన ఘోర అగ్ని ప్ర‌మాద ఘ‌ట‌న‌లో 17 మంది కార్మికులు, ఉద్యోగులు, ఇత‌ర ఉన్న‌తాధికారులు కూడా ప్రాణాలు కోల్పోయిన విష‌యం తెలిసిందే. అదే విధంగా 36 మందికిపైగానే తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వీరిని వివిధ ఆసుప‌త్రుల‌కు త‌ర‌లించి వైద్యం అంది స్తున్నారు. మ‌రోవైపు.. మృత దేహాల‌కు పోస్టు మార్ట‌మ్ ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. ఈ క్ర‌మంలో ఆయా కు టుంబాల‌ను, ఆసుప‌త్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల‌ను రాజ‌కీయ పార్టీల నాయ‌కులు ప‌రామ‌ర్శిస్తున్నారు.

ఇలా ప‌రామ‌ర్శించ‌డం త‌ప్పుకాదు. కానీ, ఇక్క‌డే రాజ‌కీయం చోటు చేసుకోవ‌డం గ‌మ‌నార్హం. ముఖ్య‌మంత్రి సీఎం చంద్ర‌బాబు ఓ ప్రైవేటు ఆసుప‌త్రికి వెళ్లి బాధితుల‌ను ప‌రామ‌ర్శించారు. వారికి భ‌రోసా క‌ల్పించారు. వారికి ధైర్యం చెప్పారు. వైద్యుల‌తో మాట్లాడి.. వారికి మెరుగైన చికిత్స అందేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కూడా సూచించారు. క‌ట్ చేస్తే.. వైసీపీ కూడా ఇప్పుడు రంగంలోకి దిగింది. విశాఖ‌ప‌ట్నంలోని కింగ్ జార్జ్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న వారిని వైసీపీసీనియ‌ర్ నాయ‌కులు ప‌రామ‌ర్శించారు.

మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స స‌త్య‌నారాయ‌ణ, మాజీ మంత్రి బూడి ముత్యాల‌నాయుడు, మ‌రో మాజీ మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ స‌హా ప‌లువురు.. ఆసుప‌త్రికి వెళ్లి.. బాధితుల‌ను ప‌రామ‌ర్శించారు. ధైర్యం చెప్పారు. పార్టీ త‌ర‌ఫున తాము అండ‌గా ఉంటామ‌ని తెలిపారు. అయితే.. అటు చంద్ర‌బాబు మాట్లాడుతూ.. వ్య‌వ‌స్థల‌ను నాశ‌నం చేశార‌ని.. వాటిని స‌రిదిద్దే ప్ర‌య‌త్నం చేస్తున్న స‌మ‌యంలోనే ఈ ఘోరం జ‌రిగింద‌ని పేర్కొన్నారు.

ఇక‌, మాజీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ మాట్ల‌డుతూ.. ప్ర‌భుత్వం తీవ్ర అల‌సత్వంతో వ్య‌వ‌హ‌రించింద న్నారు. మొత్తానికి ఒక‌రిపై ఒక‌రు ప్ర‌త్య‌క్షంగా కాక‌ప‌యినా.. ప‌రోక్షంగా అయినా.. విమ‌ర్శించుకునేందుకు ప్ర‌య‌త్నించ‌డం గ‌మ‌నార్హం. మ‌రోవైపు.. మాజీ సీఎం జ‌గ‌న్.. ప్ర‌భుత్వ తీరును నిర‌సిస్తూ.. ట్వీట్‌చేశారు. బాధితుల‌ను త‌క్ష‌ణ‌మే ఆదుకోవ‌డంలో స‌ర్కారు విఫ‌ల‌మైంద‌న్నారు. స‌రైన స‌మ‌యంలో వైద్యం అంద‌క‌.. ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోయార‌ని చెప్పారు.

This post was last modified on August 22, 2024 4:15 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అదే చెక్క‌కుర్చీ… అదే టేబుల్‌… ఐదోసారి సీఎం!

దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా.. ఏ నాయ‌కుడు అయినా.. ఒక్క‌సారి ముఖ్య‌మంత్రి అయితే చాలు.. కూర్చునే కుర్చీ నుంచి తిరిగే…

47 minutes ago

సింగల్ స్క్రీన్ VS మల్టీప్లెక్స్… ఏది రైటు?

ఓ పాతిక సంవత్సరాలు వెనక్కు వెళ్తే హైదరాబాద్ లో అత్యధిక శాతం సింగల్ స్క్రీన్లు ఉండేవి. టోలి చౌకి నుంచి…

2 hours ago

దురంధర్ పోటీ సినిమాకు ఘోర అవమానం

గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…

3 hours ago

ప్రీమియర్ రేట్లు నిర్ణయించుకున్న పెద్ది ?

జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…

5 hours ago

త‌మిళ రాజ‌కీయాల్లో పుష్ప సోఫా రచ్చ

గ‌త ప‌ది రోజులుగా త‌మిళనాడు రాజ‌కీయాలు దేశ‌వ్యాప్తంగా ఎంత చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…

5 hours ago

చిరంజీవి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది

ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…

6 hours ago