Political News

పోటాపోటీ గా ‘రాజకీయ’ ప‌రామ‌ర్శ‌లు!

అన‌కాప‌ల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లో సంభ‌వించిన ఘోర అగ్ని ప్ర‌మాద ఘ‌ట‌న‌లో 17 మంది కార్మికులు, ఉద్యోగులు, ఇత‌ర ఉన్న‌తాధికారులు కూడా ప్రాణాలు కోల్పోయిన విష‌యం తెలిసిందే. అదే విధంగా 36 మందికిపైగానే తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వీరిని వివిధ ఆసుప‌త్రుల‌కు త‌ర‌లించి వైద్యం అంది స్తున్నారు. మ‌రోవైపు.. మృత దేహాల‌కు పోస్టు మార్ట‌మ్ ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. ఈ క్ర‌మంలో ఆయా కు టుంబాల‌ను, ఆసుప‌త్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల‌ను రాజ‌కీయ పార్టీల నాయ‌కులు ప‌రామ‌ర్శిస్తున్నారు.

ఇలా ప‌రామ‌ర్శించ‌డం త‌ప్పుకాదు. కానీ, ఇక్క‌డే రాజ‌కీయం చోటు చేసుకోవ‌డం గ‌మ‌నార్హం. ముఖ్య‌మంత్రి సీఎం చంద్ర‌బాబు ఓ ప్రైవేటు ఆసుప‌త్రికి వెళ్లి బాధితుల‌ను ప‌రామ‌ర్శించారు. వారికి భ‌రోసా క‌ల్పించారు. వారికి ధైర్యం చెప్పారు. వైద్యుల‌తో మాట్లాడి.. వారికి మెరుగైన చికిత్స అందేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కూడా సూచించారు. క‌ట్ చేస్తే.. వైసీపీ కూడా ఇప్పుడు రంగంలోకి దిగింది. విశాఖ‌ప‌ట్నంలోని కింగ్ జార్జ్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న వారిని వైసీపీసీనియ‌ర్ నాయ‌కులు ప‌రామ‌ర్శించారు.

మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స స‌త్య‌నారాయ‌ణ, మాజీ మంత్రి బూడి ముత్యాల‌నాయుడు, మ‌రో మాజీ మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ స‌హా ప‌లువురు.. ఆసుప‌త్రికి వెళ్లి.. బాధితుల‌ను ప‌రామ‌ర్శించారు. ధైర్యం చెప్పారు. పార్టీ త‌ర‌ఫున తాము అండ‌గా ఉంటామ‌ని తెలిపారు. అయితే.. అటు చంద్ర‌బాబు మాట్లాడుతూ.. వ్య‌వ‌స్థల‌ను నాశ‌నం చేశార‌ని.. వాటిని స‌రిదిద్దే ప్ర‌య‌త్నం చేస్తున్న స‌మ‌యంలోనే ఈ ఘోరం జ‌రిగింద‌ని పేర్కొన్నారు.

ఇక‌, మాజీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ మాట్ల‌డుతూ.. ప్ర‌భుత్వం తీవ్ర అల‌సత్వంతో వ్య‌వ‌హ‌రించింద న్నారు. మొత్తానికి ఒక‌రిపై ఒక‌రు ప్ర‌త్య‌క్షంగా కాక‌ప‌యినా.. ప‌రోక్షంగా అయినా.. విమ‌ర్శించుకునేందుకు ప్ర‌య‌త్నించ‌డం గ‌మ‌నార్హం. మ‌రోవైపు.. మాజీ సీఎం జ‌గ‌న్.. ప్ర‌భుత్వ తీరును నిర‌సిస్తూ.. ట్వీట్‌చేశారు. బాధితుల‌ను త‌క్ష‌ణ‌మే ఆదుకోవ‌డంలో స‌ర్కారు విఫ‌ల‌మైంద‌న్నారు. స‌రైన స‌మ‌యంలో వైద్యం అంద‌క‌.. ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోయార‌ని చెప్పారు.

Satya

Recent Posts

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

6 hours ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

8 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

10 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

11 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

11 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

11 hours ago