Political News

పోటాపోటీ గా ‘రాజకీయ’ ప‌రామ‌ర్శ‌లు!

అన‌కాప‌ల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లో సంభ‌వించిన ఘోర అగ్ని ప్ర‌మాద ఘ‌ట‌న‌లో 17 మంది కార్మికులు, ఉద్యోగులు, ఇత‌ర ఉన్న‌తాధికారులు కూడా ప్రాణాలు కోల్పోయిన విష‌యం తెలిసిందే. అదే విధంగా 36 మందికిపైగానే తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వీరిని వివిధ ఆసుప‌త్రుల‌కు త‌ర‌లించి వైద్యం అంది స్తున్నారు. మ‌రోవైపు.. మృత దేహాల‌కు పోస్టు మార్ట‌మ్ ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. ఈ క్ర‌మంలో ఆయా కు టుంబాల‌ను, ఆసుప‌త్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల‌ను రాజ‌కీయ పార్టీల నాయ‌కులు ప‌రామ‌ర్శిస్తున్నారు.

ఇలా ప‌రామ‌ర్శించ‌డం త‌ప్పుకాదు. కానీ, ఇక్క‌డే రాజ‌కీయం చోటు చేసుకోవ‌డం గ‌మ‌నార్హం. ముఖ్య‌మంత్రి సీఎం చంద్ర‌బాబు ఓ ప్రైవేటు ఆసుప‌త్రికి వెళ్లి బాధితుల‌ను ప‌రామ‌ర్శించారు. వారికి భ‌రోసా క‌ల్పించారు. వారికి ధైర్యం చెప్పారు. వైద్యుల‌తో మాట్లాడి.. వారికి మెరుగైన చికిత్స అందేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కూడా సూచించారు. క‌ట్ చేస్తే.. వైసీపీ కూడా ఇప్పుడు రంగంలోకి దిగింది. విశాఖ‌ప‌ట్నంలోని కింగ్ జార్జ్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న వారిని వైసీపీసీనియ‌ర్ నాయ‌కులు ప‌రామ‌ర్శించారు.

మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స స‌త్య‌నారాయ‌ణ, మాజీ మంత్రి బూడి ముత్యాల‌నాయుడు, మ‌రో మాజీ మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ స‌హా ప‌లువురు.. ఆసుప‌త్రికి వెళ్లి.. బాధితుల‌ను ప‌రామ‌ర్శించారు. ధైర్యం చెప్పారు. పార్టీ త‌ర‌ఫున తాము అండ‌గా ఉంటామ‌ని తెలిపారు. అయితే.. అటు చంద్ర‌బాబు మాట్లాడుతూ.. వ్య‌వ‌స్థల‌ను నాశ‌నం చేశార‌ని.. వాటిని స‌రిదిద్దే ప్ర‌య‌త్నం చేస్తున్న స‌మ‌యంలోనే ఈ ఘోరం జ‌రిగింద‌ని పేర్కొన్నారు.

ఇక‌, మాజీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ మాట్ల‌డుతూ.. ప్ర‌భుత్వం తీవ్ర అల‌సత్వంతో వ్య‌వ‌హ‌రించింద న్నారు. మొత్తానికి ఒక‌రిపై ఒక‌రు ప్ర‌త్య‌క్షంగా కాక‌ప‌యినా.. ప‌రోక్షంగా అయినా.. విమ‌ర్శించుకునేందుకు ప్ర‌య‌త్నించ‌డం గ‌మ‌నార్హం. మ‌రోవైపు.. మాజీ సీఎం జ‌గ‌న్.. ప్ర‌భుత్వ తీరును నిర‌సిస్తూ.. ట్వీట్‌చేశారు. బాధితుల‌ను త‌క్ష‌ణ‌మే ఆదుకోవ‌డంలో స‌ర్కారు విఫ‌ల‌మైంద‌న్నారు. స‌రైన స‌మ‌యంలో వైద్యం అంద‌క‌.. ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోయార‌ని చెప్పారు.

This post was last modified on August 22, 2024 4:15 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

దేవరకొండా… ఇక ఆ సినిమా దేవుడికేనా?

తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…

2 hours ago

బిగ్ బాస్-9‌లో ఇతనే పెద్ద సర్ప్రైజ్

ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…

3 hours ago

‘అఖండ’ బాంబు… ఎవరిపై పడుతుందో?

దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…

6 hours ago

అప్పటినుండి నేతలు అందరూ జనాల్లో తిరగాల్సిందే

వ‌చ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని.. త‌న‌తో పాటు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవాల‌ని…

6 hours ago

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

7 hours ago

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

9 hours ago