Political News

ఆ విష‌యంలో వైఎస్సార్ త‌ర్వాత ష‌ర్మిలేనా…!

కాంగ్రెస్ పార్టీని గమనిస్తే ఆ పార్టీలో అధిష్టానం చెప్పిందే ఫైనల్ డెసిషన్ గా ఉంటుంది. ఇది రాష్ట్రాల పరిధిలో అయినా కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలో అయినా దేశవ్యాప్త రాజకీయాల్లో అయినా పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయమే అంతిమ నిర్ణయం. 136 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఏనాడు పెద్దగా ప్రాంతీయ నాయకులు వెలుగులోకి వచ్చింది లేదు. ఒకళ్ళిద్దరు వచ్చినా వారు పార్టీతో విభేదించి బయటికి వచ్చి సొంతంగా పార్టీలు పెట్టుకున్న వారే ఉన్నారు.

కానీ ఉమ్మడి రాష్ట్రంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీని శాసించే స్థాయికి ఎదిగిన విషయం అందరికీ తెలిసిందే. జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీ స్థాయికి ఆయన తీసుకు రాగలిగారు. తాను తీసుకున్న నిర్ణయాన్ని, తాను చేపట్టిన సంక్షేమ పథకాలను తాను ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు వ్యక్తిగతంగా ఆయన చూపించిన శ్రద్ధ అదేవిధంగా పార్టీ అధిష్టానాన్ని ఒప్పించిన తీరు అప్పట్లో భారీ ఎత్తున చర్చ‌కు వ‌చ్చిన విషయం తెలిసిందే.

దీంతో జాతీయ పార్టీ కూడా ప్రాంతీయ పార్టీ అయిపోయిందన్న విమర్శలు వచ్చాయి. అదే సమయంలో వైఎస్ కాబట్టి కాంగ్రెస్‌ను ఈ స్థాయిలో నడిపిస్తున్నారు అన్న ప్రశంసలు కూడా దక్కాయి. ఆ పరిస్థితిని పక్కన పెడితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్న వైఎస్ కుమార్తె షర్మిల కూడా అదే స్థాయిలో రాజకీయాలు చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. అంటే ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ పార్టీలో ఆమె చెప్పిందే వేదం ఆమె తీసుకున్న నిర్ణయం ఫైనల్ అన్నట్టుగా ఉందని పార్టీ నాయకులు చెబుతున్నారు.

వాస్తవానికి పార్టీ అధిష్టానం ఒకప్పుడు ఏపీపై ప్రత్యేకంగా దృష్టిపెట్టేది. ఏపీలో ఏం జరుగుతున్నా, ఏపీలో ఎవరిని నియమించాలన్నా.. ఏపీలో ఏం చేయాలన్నా.. అన్ని అధిష్టానమే పరిశీలించి నిర్ణయాలు తీసుకునేది. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది షర్మిల చెప్పిందే మాట, షర్మిలే ఏం చెప్తే అది చేయాలి అన్న విధంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి క్షేత్రస్థాయి నాయకులు ఆదేశాలు వస్తుండడం వాటిని పాటించాలని కూడా చెబుతుండడం విశేషం.

తాజాగా జిల్లాల కమిటీ అధ్యక్షులు, అలాగే రాష్ట్ర పిసిసి ఉపాధ్యక్ష‌ పదవులు కూడా షర్మిల కోరుకున్న వారికి పార్టీ అధిష్టానం ఓకే చేయటం చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు ఇలాంటి పరిస్థితి లేదు. అధిష్టానం నిర్ణయం తీసుకుని దాన్నే అమలు చేసేది. కానీ ఇప్పుడు షర్మిల తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ అమలు చేయడం దానికి అంగీకరించడం కూడా ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఈ పరిస్థితి పార్టీకి ఎంతవరకు మేలు చేస్తుందనేది చూడాలి.

గతంలో తన నిర్ణయాలు, తన సంక్షేమ హామీలు అమలు చేసుకునే క్రమంలో అధిష్టానాన్ని ఒప్పించిన వైఎస్.. పార్టీని అలాగే నడిపించారు. పార్టీని బలోపేతం చేశారు కూడా. అధికారంలోకి తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు షర్మిల ఆ స్థాయిలో పనిచేయగలుగుతారా? అనేది చూడాలి.

This post was last modified on August 22, 2024 1:28 pm

Share

Recent Posts

సుమంత్ ఈసారి బలంగా వస్తున్నాడు

అక్కినేని నాగేశ్వ‌ర‌రావు మ‌న‌వ‌డు సుమంత్‌ను చూస్తే పెద్ద స్టార్ కావ‌డానికి అవ‌స‌ర‌మైన అన్ని ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్లే క‌నిపిస్తాడు. ఆర‌డుగుల ఆజానుబాహుడు,…

55 minutes ago

విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌.. చంద్ర‌బాబు తీవ్ర ఆవేద‌న.. ఏంటీ బంధం?

పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. దీనికి సంబంధించిన కార‌ణాలు…

58 minutes ago

రంగ‌నాథ్‌ను తప్పించండి… హైడ్రాపై హైకోర్టు సీరియ‌స్‌!

తెలంగాణ‌లో ఆక్ర‌మ క‌ట్టడాల‌కు సింహ స్వ‌ప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. త‌మ మాటంటే హైడ్రాకు…

3 hours ago

జోగి ఫ్యామిలీలో `కోడ‌లి` కుదుపు!

వైసీపీ నేత‌, ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు, మాజీ మంత్రి జోగి ర‌మేష్ ఫ్యామిలీలో కోడ‌లు చేసిన ఆరోప‌ణలు పెను కుదుపున‌కు…

4 hours ago

కొత్త సినిమాల్లో పొలిటికల్ పంచులు చూశారా?

సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…

4 hours ago

థియేటర్ చెక్స్… నాయకుడి పద్దతి బాగుంది

జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…

4 hours ago