Political News

ఏపీ లో ‘ప‌ఫ్ఫు’ల పాలిటిక్స్‌!

ఏపీలో ఎగ్ ప‌ఫ్‌ల పాలిటిక్స్ పీక్స్‌కు చేరింది. గ‌త రెండు రోజులుగా సోష‌ల్ మీడియాలో హ‌ల్చ‌ల్ చేసిన వార్త‌లు.. ఇప్పుడు ప్ర‌దాన మీడియాలోకి కూడా వ‌చ్చేశాయి. దీంతో వైసీపీ అధికారికంగా ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. అంతేకాదు.. మెయిన్ స్ట్రీమ్ జ‌ర్న‌లిస్టులు, జ‌ర్న‌లిజంపై నిప్పులు చెరిగింది. ఇదేనా మీ జ‌ర్న‌లిజం? అంటూ నిప్పులు చెరిగింది. అవాస్త‌వాల‌ను.. సోష‌ల్ మీడియాలో పోస్టు చేసే.. ఎలాంటి వాస్త‌వాలు తెలుసుకోకుండా.. జాతీయ మీడియా, లోకల్ మీడియాలు ప్ర‌చారం చేయ‌డం ఏంట‌ని వైసీపీ మండిప‌డింది. ఇప్ప‌టికైనా వాస్త‌వాలు తెలుసుకుని వార్త‌లు రాయాల‌ని, ప్ర‌సారం చేయాల‌ని కోరింది.

ఏంటీ వివాదం?

రాష్ట్రంలో 2019-24 మ‌ధ్య వైసీపీ హ‌యాంలో ముఖ్య‌మంత్రి కార్యాల‌యం వినియోగించిన తినుబండారాల లెక్క‌లు.. ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో హల్చ‌ల్ చేశాయి. దీనిలో ప్ర‌ధానంగా ఎగ్ ప‌ఫ్ ల కోసం ఐదేళ్లలో 3.62 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు పెద్ద ఎత్తున వార్త‌లు వ‌చ్చాయి. అయితే.. ఇవి సోష‌ల్ మీడియా వ‌ర‌కే ప‌రిమితం అయ్యాయి. తాజాగా ఇదే విష‌యాన్ని మీడియా వార్త‌లుగా మ‌లిచి.. తాడేప‌ల్లిలో ఎగ్‌ప‌ఫ్‌ల కుంభ‌కోణం పేరుతో వార్త‌లు రాసింది. దీంతో ఇది మ‌రింత‌గా రాజ‌కీయ దుమారం రేపింది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఈ విష‌యంపై మౌనంగా ఉన్న వైసీపీ తాజాగా జాతీయ మీడియాలోనూ క‌థ‌నాలు వ‌చ్చాయ‌ని తెలిసి.. స్పందించింది.

ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) ఉద్యోగులు, సిబ్బంది రోజుకు సగటున 993 ఎగ్ పఫ్స్ తిన్నారని, దీనికిగాను ఏడాదికి 18 లక్షల రూపాయలను ఖర్చు చేశారని టీడీపీ నాయకులు పేర్కొన్న వివ‌రాల‌ను మీడియాలో వివ‌రించారు. దీంతో వైసీపీ ఒక్క‌సారిగా ఫైరైంది. ఎలాంటి ఆధారాలు లేని ఒక సోష‌ల్ మీడియా ప్ర‌చారాన్ని జాతీయ మీడియా ఎలా ప్ర‌సారం చేస్తుంద‌ని.. ప్ర‌చురించింద‌ని మండిప‌డింది.

ఉద్దేశ పూర్వ‌కంగానే కొందరు జర్నలిస్టులు దుష్ప్రచారం చేశారని పేర్కొంది. అధికారికంగా ధృవీకరించని, నిరాధారమైన సమాచారాన్ని ఎలా ప్ర‌స్తావిస్తార‌న్న వైసీపీ ప్ర‌శ్న‌. కాగా, గ‌తంలో వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన కొత్తలో ప్ర‌స్తుత మంత్రి నారా లోకేష్ జీడిప‌ప్పు, బాదం ప‌ప్పు కోసం.. రూ.6 కోట్లు ఖ‌ర్చు పెట్టారంటూ.. పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చేసిన విష‌యం తెలిసిందే. వైసీపీ అనుకూల మీడియాలోనూ ఈ విష‌యం పెద్ద ఎత్తున ప్ర‌చారంలోకి వ‌చ్చింది. అప్ప‌ట్లో ఈ విష‌యం తీవ్ర దుమారం రేపింది. ఇక‌, ఇప్పుడు ఎగ్ ప‌ఫ్‌ల వ్య‌వ‌హారం రాజ‌కీయంగా దుమారం రేపుతోంది.

This post was last modified on August 21, 2024 9:29 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పెంపుడు పిల్లి చ‌నిపోయింద‌ని.. ఉరేసుకున్న విద్యార్థిని!

పెంపుడు జంతువుల ప‌ట్ల య‌జ‌మానులు, కుటుంబ స‌భ్యులు ఎంత ప్రేమ‌ను పెంచుకుంటారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆయా జంతువులు…

17 minutes ago

ఉస్తాద్ పాట‌ల వాడ‌కం.. ఎంత ఖ‌ర్చు పెట్టారో?

ఒక‌ప్పుడు పాత సినిమాల పాట‌లను య‌థేచ్ఛ‌గా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవ‌రికీ ఏ అభ్యంత‌రాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…

2 hours ago

వైసీపీ పంచాంగం.. కేంద్రం ప్లస్.. రాష్ట్రం మైనస్

ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…

4 hours ago

స‌మంత బంగారం కోసం రాజు గారు వ‌స్తారా?

ఒక‌ప్పుడు తెలుగు, త‌మిళంలో టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా ద‌శాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన క‌థానాయిక స‌మంత‌. కానీ కొన్నేళ్లుగా…

5 hours ago

ఆ యూట్యూబర్లకు ‘పరాభవం’ తప్పదట

సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ…

5 hours ago

క‌విత పార్టీకి న్యాయ చిక్కులు… ఏం జరిగింది?

బీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. సొంత పార్టీ పెట్టుకునేందుకు రెడీ అయిన మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె క‌విత త‌న…

7 hours ago