Political News

ఏపీ లో ‘ప‌ఫ్ఫు’ల పాలిటిక్స్‌!

ఏపీలో ఎగ్ ప‌ఫ్‌ల పాలిటిక్స్ పీక్స్‌కు చేరింది. గ‌త రెండు రోజులుగా సోష‌ల్ మీడియాలో హ‌ల్చ‌ల్ చేసిన వార్త‌లు.. ఇప్పుడు ప్ర‌దాన మీడియాలోకి కూడా వ‌చ్చేశాయి. దీంతో వైసీపీ అధికారికంగా ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. అంతేకాదు.. మెయిన్ స్ట్రీమ్ జ‌ర్న‌లిస్టులు, జ‌ర్న‌లిజంపై నిప్పులు చెరిగింది. ఇదేనా మీ జ‌ర్న‌లిజం? అంటూ నిప్పులు చెరిగింది. అవాస్త‌వాల‌ను.. సోష‌ల్ మీడియాలో పోస్టు చేసే.. ఎలాంటి వాస్త‌వాలు తెలుసుకోకుండా.. జాతీయ మీడియా, లోకల్ మీడియాలు ప్ర‌చారం చేయ‌డం ఏంట‌ని వైసీపీ మండిప‌డింది. ఇప్ప‌టికైనా వాస్త‌వాలు తెలుసుకుని వార్త‌లు రాయాల‌ని, ప్ర‌సారం చేయాల‌ని కోరింది.

ఏంటీ వివాదం?

రాష్ట్రంలో 2019-24 మ‌ధ్య వైసీపీ హ‌యాంలో ముఖ్య‌మంత్రి కార్యాల‌యం వినియోగించిన తినుబండారాల లెక్క‌లు.. ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో హల్చ‌ల్ చేశాయి. దీనిలో ప్ర‌ధానంగా ఎగ్ ప‌ఫ్ ల కోసం ఐదేళ్లలో 3.62 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు పెద్ద ఎత్తున వార్త‌లు వ‌చ్చాయి. అయితే.. ఇవి సోష‌ల్ మీడియా వ‌ర‌కే ప‌రిమితం అయ్యాయి. తాజాగా ఇదే విష‌యాన్ని మీడియా వార్త‌లుగా మ‌లిచి.. తాడేప‌ల్లిలో ఎగ్‌ప‌ఫ్‌ల కుంభ‌కోణం పేరుతో వార్త‌లు రాసింది. దీంతో ఇది మ‌రింత‌గా రాజ‌కీయ దుమారం రేపింది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఈ విష‌యంపై మౌనంగా ఉన్న వైసీపీ తాజాగా జాతీయ మీడియాలోనూ క‌థ‌నాలు వ‌చ్చాయ‌ని తెలిసి.. స్పందించింది.

ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) ఉద్యోగులు, సిబ్బంది రోజుకు సగటున 993 ఎగ్ పఫ్స్ తిన్నారని, దీనికిగాను ఏడాదికి 18 లక్షల రూపాయలను ఖర్చు చేశారని టీడీపీ నాయకులు పేర్కొన్న వివ‌రాల‌ను మీడియాలో వివ‌రించారు. దీంతో వైసీపీ ఒక్క‌సారిగా ఫైరైంది. ఎలాంటి ఆధారాలు లేని ఒక సోష‌ల్ మీడియా ప్ర‌చారాన్ని జాతీయ మీడియా ఎలా ప్ర‌సారం చేస్తుంద‌ని.. ప్ర‌చురించింద‌ని మండిప‌డింది.

ఉద్దేశ పూర్వ‌కంగానే కొందరు జర్నలిస్టులు దుష్ప్రచారం చేశారని పేర్కొంది. అధికారికంగా ధృవీకరించని, నిరాధారమైన సమాచారాన్ని ఎలా ప్ర‌స్తావిస్తార‌న్న వైసీపీ ప్ర‌శ్న‌. కాగా, గ‌తంలో వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన కొత్తలో ప్ర‌స్తుత మంత్రి నారా లోకేష్ జీడిప‌ప్పు, బాదం ప‌ప్పు కోసం.. రూ.6 కోట్లు ఖ‌ర్చు పెట్టారంటూ.. పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చేసిన విష‌యం తెలిసిందే. వైసీపీ అనుకూల మీడియాలోనూ ఈ విష‌యం పెద్ద ఎత్తున ప్ర‌చారంలోకి వ‌చ్చింది. అప్ప‌ట్లో ఈ విష‌యం తీవ్ర దుమారం రేపింది. ఇక‌, ఇప్పుడు ఎగ్ ప‌ఫ్‌ల వ్య‌వ‌హారం రాజ‌కీయంగా దుమారం రేపుతోంది.

This post was last modified on August 21, 2024 9:29 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నియోజ‌క‌వ‌ర్గాల‌పై రేవంత్ కొత్త ఫార్ములా… వ‌ర్కువ‌ట్ అయ్యేనా?

2029 పార్ల‌మెంటు ఎన్నిక‌ల నాటికి దేశంలో నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభ‌జించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…

2 hours ago

పెను సంక్షోభంలో ప్ర‌పంచం…!

అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభ‌న ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…

3 hours ago

రాష్ట్ర‌ప‌తికి బహుమతిగా మంగళగిరి చీర

భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…

3 hours ago

ఏపీ కొత్త ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌… వైసీపీకి షాకేనా?

ఏపీ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ ప‌ద‌వి ఖాళీ అయింది. గ‌త నెల 31వ తేదీ వ‌ర‌కు ఉన్న రాష్ట్ర…

3 hours ago

‘హోం’ ప్రశ్నలపై ‘సీఎం’ సమాధానం చెప్తారా?

తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…

5 hours ago

కేసీఆర్ వరకు వెళ్లిన సీతక్క పంచాయితీ

తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…

5 hours ago