Political News

ఏపీ లో ‘ప‌ఫ్ఫు’ల పాలిటిక్స్‌!

ఏపీలో ఎగ్ ప‌ఫ్‌ల పాలిటిక్స్ పీక్స్‌కు చేరింది. గ‌త రెండు రోజులుగా సోష‌ల్ మీడియాలో హ‌ల్చ‌ల్ చేసిన వార్త‌లు.. ఇప్పుడు ప్ర‌దాన మీడియాలోకి కూడా వ‌చ్చేశాయి. దీంతో వైసీపీ అధికారికంగా ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. అంతేకాదు.. మెయిన్ స్ట్రీమ్ జ‌ర్న‌లిస్టులు, జ‌ర్న‌లిజంపై నిప్పులు చెరిగింది. ఇదేనా మీ జ‌ర్న‌లిజం? అంటూ నిప్పులు చెరిగింది. అవాస్త‌వాల‌ను.. సోష‌ల్ మీడియాలో పోస్టు చేసే.. ఎలాంటి వాస్త‌వాలు తెలుసుకోకుండా.. జాతీయ మీడియా, లోకల్ మీడియాలు ప్ర‌చారం చేయ‌డం ఏంట‌ని వైసీపీ మండిప‌డింది. ఇప్ప‌టికైనా వాస్త‌వాలు తెలుసుకుని వార్త‌లు రాయాల‌ని, ప్ర‌సారం చేయాల‌ని కోరింది.

ఏంటీ వివాదం?

రాష్ట్రంలో 2019-24 మ‌ధ్య వైసీపీ హ‌యాంలో ముఖ్య‌మంత్రి కార్యాల‌యం వినియోగించిన తినుబండారాల లెక్క‌లు.. ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో హల్చ‌ల్ చేశాయి. దీనిలో ప్ర‌ధానంగా ఎగ్ ప‌ఫ్ ల కోసం ఐదేళ్లలో 3.62 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు పెద్ద ఎత్తున వార్త‌లు వ‌చ్చాయి. అయితే.. ఇవి సోష‌ల్ మీడియా వ‌ర‌కే ప‌రిమితం అయ్యాయి. తాజాగా ఇదే విష‌యాన్ని మీడియా వార్త‌లుగా మ‌లిచి.. తాడేప‌ల్లిలో ఎగ్‌ప‌ఫ్‌ల కుంభ‌కోణం పేరుతో వార్త‌లు రాసింది. దీంతో ఇది మ‌రింత‌గా రాజ‌కీయ దుమారం రేపింది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఈ విష‌యంపై మౌనంగా ఉన్న వైసీపీ తాజాగా జాతీయ మీడియాలోనూ క‌థ‌నాలు వ‌చ్చాయ‌ని తెలిసి.. స్పందించింది.

ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) ఉద్యోగులు, సిబ్బంది రోజుకు సగటున 993 ఎగ్ పఫ్స్ తిన్నారని, దీనికిగాను ఏడాదికి 18 లక్షల రూపాయలను ఖర్చు చేశారని టీడీపీ నాయకులు పేర్కొన్న వివ‌రాల‌ను మీడియాలో వివ‌రించారు. దీంతో వైసీపీ ఒక్క‌సారిగా ఫైరైంది. ఎలాంటి ఆధారాలు లేని ఒక సోష‌ల్ మీడియా ప్ర‌చారాన్ని జాతీయ మీడియా ఎలా ప్ర‌సారం చేస్తుంద‌ని.. ప్ర‌చురించింద‌ని మండిప‌డింది.

ఉద్దేశ పూర్వ‌కంగానే కొందరు జర్నలిస్టులు దుష్ప్రచారం చేశారని పేర్కొంది. అధికారికంగా ధృవీకరించని, నిరాధారమైన సమాచారాన్ని ఎలా ప్ర‌స్తావిస్తార‌న్న వైసీపీ ప్ర‌శ్న‌. కాగా, గ‌తంలో వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన కొత్తలో ప్ర‌స్తుత మంత్రి నారా లోకేష్ జీడిప‌ప్పు, బాదం ప‌ప్పు కోసం.. రూ.6 కోట్లు ఖ‌ర్చు పెట్టారంటూ.. పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చేసిన విష‌యం తెలిసిందే. వైసీపీ అనుకూల మీడియాలోనూ ఈ విష‌యం పెద్ద ఎత్తున ప్ర‌చారంలోకి వ‌చ్చింది. అప్ప‌ట్లో ఈ విష‌యం తీవ్ర దుమారం రేపింది. ఇక‌, ఇప్పుడు ఎగ్ ప‌ఫ్‌ల వ్య‌వ‌హారం రాజ‌కీయంగా దుమారం రేపుతోంది.

This post was last modified on August 21, 2024 9:29 pm

Share

Recent Posts

విశ్వక్ సేన్ వేగం… 36 రోజుల్లో 3 సినిమాలు

ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…

10 minutes ago

చూసుకుందాం అంటున్న స్పిరిట్ నిర్మాత‌

సందీప్ రెడ్డి వంగ‌నే కాదు.. ఆయ‌న సోద‌రుడు ప్ర‌ణ‌య్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాద‌ని.. ఆయ‌న కాన్ఫిడెన్స్ లెవెల్…

46 minutes ago

ఎన్నికల ఫలితాలపై AI ప్రభావం

AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…

49 minutes ago

బుమ్రా తిరిగొచ్చాడు.. కానీ..

రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు ఢిల్లీలో జరిగిన…

1 hour ago

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

4 hours ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

5 hours ago