టీడీపీ యువనాయకుడు, ప్రస్తుత మంత్రి నారా లోకేష్.. ఉరఫ్ చిన్నబాబు రాజకీయాల పై టీడీపీలో ఆసక్తి కర చర్చ సాగుతోంది. నిన్న మొన్నటివరకు రాష్ట్ర రాజకీయాలకు మాత్రమే పరిమితమైన ఆయన.. ఇక, ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ చక్రం తిప్పనున్నారా? అనేది చర్చ. దీనిపై టీడీపీ నాయకులే చర్చిం చుకోవడం విశేషం. తాజాగా నారా లోకేష్ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. అయితే.. ఇది ఏ కేంద్ర మంత్రుల నో కలసుకునేందుకు కాదు. పెట్టుబడులు తెచ్చేందుకు కూడా కాదు.
కానీ, నారా లోకేష్ డిల్లీకి వెళ్తున్నారు. దీనికి కారణం.. ఎన్డీయే భాగస్వామ్య పార్టీల సమావేశం జరగనుండడమే. ప్రస్తుతం టీడీపీ ఎన్డీయే కూటమిలో ఉన్న విషయం తెలిసిందే. దీనిలో బీజేపీ సహా ఇతర ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఆయా పార్టీలతో ఇప్పటి వరకు చంద్రబాబుకు మాత్రమే పరిచయం ఉంది. సుదీర్ఘ కాలంగా అనుబంధం ఉన్న నాయకులు కూడా ఉన్నారు. దీంతో ఇలాంటి సమావేశాలకు ఎప్పుడూ చంద్రబాబు మాత్రమే వెళ్తున్నారు. అయితే.. తొలిసారి నారా లోకేష్ను పంపిస్తున్నారు.
ఈ సమావేశాల అజెండా ఏంటనేది తెలియకపోయినా.. నారా లోకేష్ పర్యటనకు మాత్రం చాలా ప్రాధాన్యం ఏర్పడింది. ఇప్పటివరకు రాష్ట్రానికి మాత్రమే తెలిసిన నారా లోకేష్ ఢిల్లీ ల్లో కొద్ది మందికి మాత్రమే తెలుసు. కానీ.. రాబోయే రోజుల్లో అంతా నారా లోకేష్ రాజకీయాలు నడుస్తాయన్న సంకేతాలు వస్తున్న నేపథ్యంలో కేవలం ఆయనను రాష్ట్రానికి మాత్రమే పరిమితం చేయకుండా.. జాతీయ రాజకీయాల్లోనూ చురుగ్గా వ్యవహరించేలా చేయాలన్నది పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే స్వయంగా చంద్రబాబు నారా లోకేష్ ఢిల్లీ పర్యటనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు.
ఇదిలావుంటే.. 2014 ఎన్నికల సమయంలో ప్రత్యక్షరాజకీయాల్లోకి వచ్చిన నారా లోకేష్.. 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయినప్పటికీ మండలిలో ప్రవేశించి.. అటు నుంచి మంత్రి అయ్యారు. ఇక, తాజా ఎన్నికల్లో మంగళగిరి నుంచి 90 వేల ఓట్ల మెజారిటీతో విజయం దక్కించుకున్నారు . మరోసారి మంత్రి పదవిని చేపట్టారు. అయితే.. గతైదేళ్లు కూడా.. వైసీపీ సర్కారుపై తీవ్ర రాజకీయ పోరాటం చేయడంతోపాటు.. యువగళం పేరుతో పాదయాత్ర కూడా చేపట్టారు. అంతేకాదు.. చంద్రబాబును అరెస్టు చేసి జైల్లొ పెట్టినప్పుడు నారా లోకేష్ ఢిల్లీ వెళ్లి జాతీయ మీడియా ద్వారా.. దేశం మొత్తానికి తమకు జరిగిన అన్యాయాన్ని తెలిపారు.
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…