Political News

చిన్న‌బాబు – పెద్ద రాజ‌కీయం

టీడీపీ యువ‌నాయ‌కుడు, ప్ర‌స్తుత మంత్రి నారా లోకేష్‌.. ఉర‌ఫ్ చిన్న‌బాబు రాజ‌కీయాల‌ పై టీడీపీలో ఆసక్తి క‌ర చ‌ర్చ సాగుతోంది. నిన్న మొన్న‌టివ‌ర‌కు రాష్ట్ర రాజ‌కీయాల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైన ఆయ‌న‌.. ఇక, ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ చ‌క్రం తిప్ప‌నున్నారా? అనేది చ‌ర్చ‌. దీనిపై టీడీపీ నాయ‌కులే చ‌ర్చిం చుకోవ‌డం విశేషం. తాజాగా నారా లోకేష్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్తున్నారు. అయితే.. ఇది ఏ కేంద్ర మంత్రుల నో క‌ల‌సుకునేందుకు కాదు. పెట్టుబ‌డులు తెచ్చేందుకు కూడా కాదు.

కానీ, నారా లోకేష్ డిల్లీకి వెళ్తున్నారు. దీనికి కార‌ణం.. ఎన్డీయే భాగ‌స్వామ్య పార్టీల స‌మావేశం జ‌ర‌గనుండడ‌మే. ప్ర‌స్తుతం టీడీపీ ఎన్డీయే కూట‌మిలో ఉన్న విష‌యం తెలిసిందే. దీనిలో బీజేపీ స‌హా ఇత‌ర ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఆయా పార్టీల‌తో ఇప్ప‌టి వ‌ర‌కు చంద్ర‌బాబుకు మాత్ర‌మే ప‌రిచ‌యం ఉంది. సుదీర్ఘ కాలంగా అనుబంధం ఉన్న నాయ‌కులు కూడా ఉన్నారు. దీంతో ఇలాంటి స‌మావేశాల‌కు ఎప్పుడూ చంద్ర‌బాబు మాత్ర‌మే వెళ్తున్నారు. అయితే.. తొలిసారి నారా లోకేష్‌ను పంపిస్తున్నారు.

ఈ స‌మావేశాల అజెండా ఏంట‌నేది తెలియ‌కపోయినా.. నారా లోకేష్ ప‌ర్య‌ట‌న‌కు మాత్రం చాలా ప్రాధాన్యం ఏర్ప‌డింది. ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రానికి మాత్ర‌మే తెలిసిన నారా లోకేష్ ఢిల్లీ ల్లో కొద్ది మందికి మాత్రమే తెలుసు. కానీ.. రాబోయే రోజుల్లో అంతా నారా లోకేష్ రాజ‌కీయాలు న‌డుస్తాయ‌న్న సంకేతాలు వ‌స్తున్న నేప‌థ్యంలో కేవ‌లం ఆయ‌న‌ను రాష్ట్రానికి మాత్ర‌మే ప‌రిమితం చేయ‌కుండా.. జాతీయ రాజ‌కీయాల్లోనూ చురుగ్గా వ్య‌వ‌హ‌రించేలా చేయాల‌న్న‌ది పార్టీ వ్యూహంగా క‌నిపిస్తోంది. అందుకే స్వ‌యంగా చంద్ర‌బాబు నారా లోకేష్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని అంటున్నారు.

ఇదిలావుంటే.. 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌త్య‌క్ష‌రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన నారా లోకేష్‌.. 2019 ఎన్నిక‌ల్లో మంగ‌ళ‌గిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయిన‌ప్ప‌టికీ మండ‌లిలో ప్ర‌వేశించి.. అటు నుంచి మంత్రి అయ్యారు. ఇక‌, తాజా ఎన్నిక‌ల్లో మంగ‌ళ‌గిరి నుంచి 90 వేల ఓట్ల మెజారిటీతో విజ‌యం ద‌క్కించుకున్నారు . మ‌రోసారి మంత్రి ప‌ద‌విని చేప‌ట్టారు. అయితే.. గ‌తైదేళ్లు కూడా.. వైసీపీ స‌ర్కారుపై తీవ్ర రాజ‌కీయ పోరాటం చేయ‌డంతోపాటు.. యువ‌గ‌ళం పేరుతో పాద‌యాత్ర కూడా చేప‌ట్టారు. అంతేకాదు.. చంద్ర‌బాబును అరెస్టు చేసి జైల్లొ పెట్టిన‌ప్పుడు నారా లోకేష్ ఢిల్లీ వెళ్లి జాతీయ మీడియా ద్వారా.. దేశం మొత్తానికి త‌మ‌కు జ‌రిగిన అన్యాయాన్ని తెలిపారు.

This post was last modified on August 21, 2024 4:35 pm

Share

Recent Posts

చిరు అభిమానుల‌కు కొడాలి నాని వ‌ల‌

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత‌ల్లో ఒక‌రైన కొడాలి నానికి తెలుగుదేశం అన్నా, జ‌న‌సేన అన్నా ఎంత కోప‌మో ప్ర‌త్యేకంగా…

28 minutes ago

ఆ భవనాలు కూల్చేస్తామంటోన్న హైడ్రా రంగనాథ్

హైడ్రా కూల్చివేతలపై చాలామంది ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మరికొంత మంది మాత్రం నాలాలపై, చెరువలు…

1 hour ago

మాస్ రాజా తాప‌త్ర‌యమే కానీ… వాళ్లు చూస్తారా?

మాస్ రాజా ర‌వితేజ కొత్త సినిమా ఇరుముడి తెలుగు రాష్ట్రాల‌తో పాటు తెలుగు వాళ్లుండే ప్ర‌తి చోటా ఇర‌గాడేస్తోంది. తెలుగులో…

3 hours ago

నాగ చైతన్య అయితే సెట్ అయ్యేదా

బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేస్తున్న ఇరుముడి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అంతు చిక్కడం లేదు. పాజిటివ్ టాక్ రావడంలో…

3 hours ago

రాకా సెట్లో మంచు లక్ష్మి… వావ్ వావ్ వావ్

అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…

6 hours ago

విశాఖలో విద్యార్థుల లవ్ వార్… హద్దు మీరిపోయారు!

విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…

6 hours ago