రాష్ట్రంలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. అయితే సాధారణంగా కొత్త ప్రభుత్వం కొత్త ఆలోచనలు, కొత్త పథకాలు, కొత్త అంశాలతో ముందుకు సాగుతుందని అందరు భావిస్తారు. అయితే తాజాగా జరుగుతున్న పరిణామాలు గమనిస్తే చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీ నాయకుల అభిప్రాయాల మేరకు 2014-2019 మధ్య సాగిన పరిపాలన మళ్లీ తీసుకురావాలనేది ఆలోచనగా ఉన్నట్టు తెలుస్తోంది.
అప్పట్లో అనుసరించిన విధానాల్ని ఇప్పుడు కొనసాగించాలని చూస్తున్నారు. ఒకటి రెండు శాఖల్లో తప్ప దాదాపు మిగిలిన అన్ని శాఖల్లో కూడా గత పాలనలో తీసుకున్న నిర్ణయాలను, గతంలో ఇచ్చిన ఆదేశాలను అనుసరించేలా వ్యవహరించాలని పెద్ద ఎత్తున జరుగుతున్న అంశమని తిరుపతి వర్గాలే చెబుతున్నాయి. అప్పట్లో మద్యం విధానం కావచ్చు, ఉద్యోగ వ్యవస్థ కావచ్చు, మౌలిక సదుపాయాలు కావచ్చు, పెట్టుబడులు కావచ్చు, ఉద్యోగ ఉపాధి కల్పన కావచ్చు.
ఏ రంగాన్ని తీసుకున్నా చంద్రబాబు వ్యూత్మకంగా వ్యవహరించారు. అదేవిధంగా నాయకులను కూడా నడిపించారు. ఇప్పుడు కూడా అదే విధానం అనుసరించాలని క్షేత్రస్థాయిలో నాయకుల నుంచి ఒత్తిడులు పెరుగుతున్నాయి. దీంతో మద్యం సహా పాఠశాలలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల విషయంలో 2014 నుంచి 2019 మధ్య వ్యవహరించిన తీరుతోనే ఇప్పుడు కూడా నడవాలని చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
దీనికి తోడు సంక్రాంతి కానుక, క్రిస్మస్ కానుక, రంజాన్ తోఫాలను కూడా తిరిగి ప్రవేశపెడుతున్నారు. ఇవన్నీ తమకు మేలు చేస్తాయి అన్నది చంద్రబాబు సహా పార్టీ నాయకుల ఆలోచన. మరి ప్రజలు దీనిని స్వాగతిస్తారా? ఒకవేళ పాత పథకాలను పెట్టినా కూడా తమ్ముళ్ళ దూకుడును తగ్గించకపోతే వ్యతిరేకతను పెంచే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిని ఎలా చేస్తారన్నది చూడాలి.
This post was last modified on August 21, 2024 2:52 pm
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…
ఏమైందో ఏమో కానీ ఆ దంపతులు ఒక మహిళను హత్య చేశారు. హత్య చేసి తీరిగ్గా ఆ మహిళ దేహాన్ని…
ప్రమాదంలో కలిగిన గాయం వల్ల చికిత్స చేయించుకుని విశ్రాంతిలో ఉన్న బాలకృష్ణ డాక్టర్లు చెప్పిన టైం కన్నా ముందే షూటింగ్…
దేశంలో సినీ అభిమానం పరంగా టాప్లో నిలిచే తెలుగు రాష్ట్రాల్లో ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యమే. గతంలో ప్రసాద్స్లో ఈ…