Political News

దసరా బుల్లోళ్లు ఎవరు ?

తెలంగాణ క్యాబినెట్ విస్తరణ ఆషాడం పోయి శ్రావణమాసం వచ్చినా అడుగు ముందుకు సాగడం లేదు. తాజాగా ఈ విస్తరణ వ్యవహారం  అంతా దసరా తర్వాతేనని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. గత డిసెంబరులో ప్రభుత్వం ఏర్పాటయినప్పుడు ముఖ్యమంత్రితో సహా 12 మంది మంత్రులుగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.

ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల తర్వాత విస్తరణ ఉంటుందన్న ఊహాగానాలు వినిపించాయి. పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటి పార్టీ అభ్యర్థులను గెలిపించిన వారికే పదవులు అని టార్టెట్లు కూడా విధించారు. సీఎం సహా పలువురు మంత్రులు ఢిల్లీలో ఐదు రోజుల పాటు మకాం పెట్టినా మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలన్న వ్యవహారం ఒక కొలిక్కి  రాలేదు.

ఈ లోపు ఆషాడమాసం రావడంతో ఆషాడం ముగిసి శ్రావణంలో అడుగుపెట్టగానే విస్తరణ ఖాయం అని అన్నారు. శ్రావణమాసం వచ్చి 15 రోజులు అవుతున్నా మంత్రి వర్గ విస్తరణ ఊసెత్తడం లేదు. తాజాగా దసరా తర్వాతే విస్తరణ అన్న వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి వ్యవసాయ సలహాదారుగా క్యాబినెట్ పదవి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ కు డెయిరీ ఫెడరేషన్ చైర్మన్ పదవులు కట్టబెట్టారు.

పార్టీ మారిన ఇద్దరికి పదవులు దక్కడంతో మరి మంత్రి పదవులు ఎవరికి ? అన్న చర్చ మొదలయింది. యాదవ సామాజికవ వర్గం నుండి ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, ముదిరాజ్ సామాజిక వర్గం నుండి మక్తల్ ఎమ్మెల్యే వాకిట శ్రీహరికి పదవులు ఇవ్వాలన్న డిమాండ్ పెరుగుతుంది. ఇక భువనగిరి ఎంపీ గెలుపులో కీలకపాత్ర పోషించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మైనారిటీ కోటాలో షబ్బీర్ అలీ, ఫిరోజ్ ఖాన్, అజారుద్దీన్ తదితరుల పేర్లు తెరమీదకు వస్తున్నాయి.

వీరు కాకుండా ప్రేమ్ సాగర్ రావు, సుదర్శన్ రెడ్డి, బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన దానం నాగేందర్, సికింద్రాబాద్ కంటో న్మెంట్ ఉప ఎన్నికల్లో గెలిచిన శ్రీగణేష్, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, వీ6, వెలుగు పత్రికల అధినేత, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఆయన సోదరుడు గడ్డం వినోద్, మదన్ మోహన్ రావు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి,  ఎస్టీ కోటాలో వెడ్మ బొజ్జు తదితరులు మంత్రి పదవులు ఆశిస్తున్న వారిలో ఉన్నారు.

ఇక తాజాగా ఎమ్మెల్సీగా ఎన్నికయిన ప్రొఫెసర్ కోదండరాంకు మంత్రి పదవి ఇవ్వాలన్న డిమాండ్ పెరుగుతుంది. ఏకంగా డిప్యూటీ కలెక్టర్ల సంఘం ఈ మేరకు డిమాండ్ ను కాంగ్రెస్ అధిష్టానం ముందు ఉంచడం విశేషం. ఇక ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కూడా ఆశావాహుల్లో ఉన్నాడు. ఖాళీగా ఉన్న ఆరు మంత్రి పదవులలో నాలుగు మాత్రమే భర్తీ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో   ఈ విస్తరణలో చోటు దక్కించుకునే దసరా బుల్లోళ్లు ఎవరు అనే చర్చ కాంగ్రెస్ వర్గాలలో నడుస్తుంది. 

This post was last modified on August 21, 2024 9:50 am

Share
Show comments
Published by
Satya
Tags: Telangana

Recent Posts

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

3 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

3 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

5 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

7 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

8 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

8 hours ago