ఏపీ సీఎం చంద్రబాబు మంత్రాంగం ఫలించింది. ఇటీవల ఆయన ఢిల్లీ పర్యటన సందర్భంగా అమరావతి కోసం.. కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన రూ.15 వేల కోట్లను ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ సహా ఆర్థిక మంత్రినిర్మలా సీతారామన్ను కోరారు. దీంతో వారు ప్రపంచ బ్యాంకుతో మాట్లాడినట్టు ఉన్నారు. ఫలితంగా ఏపీకి ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు విచ్చేశారు. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వారు అమరాతిలోని ప్రతి ప్రాంతాన్నీ పరిశీలించి.. క్షుణ్ణంగా ఇక్కడి ప్లాన్ను రాబోయే సంస్థలను, నవ నగరాల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అదేవిధంగా ఇప్పటికే పూర్తయిన భవనాల తాలూకు నాణ్యతను కూడా తెలుసుకున్న ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు.. సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం చంద్రబాబుతోనూ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన అమరావతి ప్రాధాన్యాన్ని.. గతంలో తాము ప్రపంచ బ్యాంకును అప్పు కోసం చేసిన విజ్ఞాపనను కూడా ప్రస్తావించారు. అప్పట్లోనూ ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు వచ్చి చూసి వెళ్లారని.. అయితే.. కొందరు సృష్టించిన అపోహలతో అప్పు ఇచ్చేందుకు నిరాకరించిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఇక, పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న సంస్థల వివరాలను కూడా ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు వివరించారు.
చంద్రబాబు చెప్పిన వివరాలపై సంతృప్తి వ్యక్తం చేసిన ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు మొత్తం 5 వాయిదాల్లో రూ.15 వేల కోట్లను ఇచ్చేందుకు ప్రాథమికంగా సమ్మతించినట్టు తెలిసింది. అయితే.. దీనికి సంబంధించిన ప్రాసెస్ జరగాల్సి ఉంది. అమరావతి ప్రాజెక్టులో పనుల పురోగతి, క్షేత్రస్థాయి పర్యటనలు, భూసమీకరణ, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులపై ఈ సమావేశంలో చర్చించారు. అయితే.. మరిన్ని విషయాలను అధికారులతో చర్చించాలని చంద్రబాబు సూచించగా.. వారు అంగీకరించారు. దీంతో మరో రెండు రోజుల పాటువారు ఏపీలోనే ఉండనున్నారు. ఏదేమైనా.. అమరావతికి రుణం ఇచ్చేందుకు సమ్మతించడం చంద్రబాబుకు పెద్ద రిలీఫ్ లభించినట్టేనని అంటున్నారు.
This post was last modified on August 21, 2024 7:26 am
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో సాంకేతికత సరికొత్త ఒరవడిని సృష్టిస్తోంది. టీవీకే అధినేత విజయ్ ప్రత్యక్షంగా అన్ని నియోజకవర్గాలను సందర్శించడం కష్టంగా…
ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టిక చూస్తుంటే రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి 'రాజసం' ఉట్టిపడేలా ఉంది. ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ గెలిచి…
ఇండస్ట్రీకి లీకులు కొత్త కాదు. నిన్నటికి నిన్న జన నాయగన్ సినిమానే బయటికొచ్చింది. పైరసీని కట్టడి చేశారు కానీ భారీ…
అదేంటో సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలకు దర్శకుల మార్పు పెద్ద తలనెప్పిగా మారిపోయింది. అయన, కమల్ హాసన్ కలిసి నటించే…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్ ఈనెల 23న జరగనుంది. అంటే పది రోజుల్లో ప్రజలు తమ ఓటు ద్వారా ప్రభుత్వాన్ని…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న నందమూరి కుటుంబం నుంచి ఇప్పటికే మూడు తరాల హీరోలు వచ్చారు. ఆ ఫ్యామిలీ నుంచి…