Political News

`పీపీపీ` విధానంపై చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఏపీ సీఎం చంద్ర‌బాబు ప‌బ్లిక్‌-ప్రైవేట్‌-పార్ట‌న‌ర్ షిప్(పీపీపీ)పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దీనిని త‌ప్పు ప‌ట్టిన వారే.. త‌ర్వాత కాలంలో అనుస‌రిస్తున్నార‌ని ఆయ‌న అన్నారు. “మొట్ట‌మొద‌ట ఉమ్మ‌డి ఏపీలో నేనే పీపీపీ విధానం అమ‌లు చేశారు. ఆ రోజు నేనేదో త‌ప్పు చేస్తున్నాన‌ని కొంద‌రు గ‌గ్గోలు పెట్టారు. కానీ, ఆ మోడ‌ల్‌తోనే నేను హైటెక్ సిటీని నిర్మించా. ఇది ఎంతో అభివృద్ధి చెందింది. ఇప్పుడు హైద‌రాబాద్‌కు వ‌స్తున్న ఆదాయంలో సింహ‌భాగం దీని నుంచే వ‌స్తోంది. కానీ.. అప్ప‌ట్లో పీపీపీ విధానం తీసుకురాకుండా ఉంటే ఇది సాకారం అయ్యేదా?” అని చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు.

ఇప్పుడు ఏపీలోనూ పీపీపీ స‌హా… పీ-4 విధానాల‌ను తీసుకువ‌స్తున్నామ‌ని చంద్ర‌బాబు తెలిపారు. దీనివ‌ల్ల మౌలిక సౌక‌ర్యాలు, పెట్టుబ‌డులు, ప‌రిశ్ర‌మ‌ల‌కు ఏర్పాటుకు మార్గం సుగ‌మం అవుతుంద‌ని చంద్ర‌బాబు వివ‌రించారు. కానీ, కొంద‌రు పీపీపీని త‌ప్పుబ‌డుతున్నార‌ని, అయితే.. వారంతా క‌ళ్లు తెర‌వాల‌ని చంద్ర‌బాబు సూచించారు. పీ-4 విధానాన్ని జ‌ర్మ‌నీ, జ‌పాన్‌, బ్రిట‌న్‌, అమెరికా వంటి దేశాలు కూడా అవలంభిస్తున్నాయ‌ని.. దీనివ‌ల్ల మెరుగైన వ‌స‌తులు ఏర్ప‌డ‌తాయ‌ని.. ప్ర‌జ‌ల‌కు భారం లేని విధంగానే దీనిని తీసుకువ‌స్తున్నామ‌ని చంద్ర‌బాబు చెప్పుకొచ్చారు.

“గ‌త ఐదేళ్ల‌లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విధ్వంసం అయిపోయింది. దీనిని స‌రిచేయాల‌ని చూస్తున్నాం. అదేస‌మ‌యంలో పీపీపీ, పీ-4 విధానాల‌ను అనుస‌రించాల‌ని భావిస్తున్నాం. దీనిని త‌ప్పుబ‌డితే ఎలా? అభివృద్ధి చేసేందుకు మా ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంది” అని చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా ఆయ‌న తిరుప‌తిలోని శ్రీసిటీలో ప‌లువురు పారిశ్రామిక వేత్త‌ల‌తో భేటీ అయ్యారు. ఈ సంద ర్భంగా వారికి రాష్ట్ర ప‌రిస్థితులు, భ‌విష్య‌త్తు ప్ర‌ణాళిక‌ల‌ను కూడా వివ‌రించారు.  పెట్టుబ‌డులు పెట్టే కంపెనీలు వీలైనంతగా ఉత్పత్తి, లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గించుకోవాలని సూచించారు.

త‌ద్వారా.. ప్ర‌జ‌ల‌కు త‌క్కువ ధ‌ర‌ల‌కే ఉత్ప‌త్తులు అందించే వీలు క‌లుగుతుంద‌ని తెలిపారు.  పారిశ్రామికవేత్తలు వినూత్న ఆలోచనలతో రావాలని, అన్ని విధాలా తాము స‌హ‌క‌రిస్తామ‌ని ప్ర‌క‌టించారు. కాగా, రాష్ట్రంలో పీపీపీ విధానం స‌హా పీ-4 విధానంలో ర‌హ‌దారుల నిర్మాణం, వైద్య శాల‌ల నిర్మాణం దిశ‌గా కూటమి స‌ర్కారు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. దీనివ‌ల్ల మెరుగైన వ‌స‌తులు, మౌలిక సౌక‌ర్యాలు కూడా ప్ర‌జ‌ల‌కు చేరువ అవుతాయ‌ని అంచ‌నా వేస్తోంది. కానీ, దీనిని కొంద‌రు మేధావులు ఆన్ లైన్ చాన‌ళ్ల‌లో త‌ప్పుబ‌డుతూ.. ప్ర‌చారం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే చంద్ర‌బాబు పీపీపీ, పీ-4 విధానాల‌పై వివ‌ర‌ణ ఇవ్వ‌డంతోపాటు.. స‌మ‌ర్థించారు.  

Satya

Recent Posts

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

7 hours ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

9 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

11 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

12 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

12 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

12 hours ago