ఏపీకి తాజాగా ఓ అవార్డు వచ్చింది. సంప్రదాయ ఇంధన వనరుల విభాగంలో వచ్చిన `గ్రీన్ ఎనర్జీ చాంపియన్` అవార్డు.. రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇండియన్ విండ్ పవర్ అసోసియేషన్ 2023-24 సంవత్సరానికి గ్రీన్ ఎనర్జీ చాంపియన్ గా ఏపీని ప్రకటించింది. తాజాగా తమిళనాడులోని కోయంబత్తూరులో నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డును ఏపీకి ప్రదానం చేశారు. ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ, సీఈవో ఎం. కమలాకర్ బాబు ఈ అవార్డు స్వీకరించారు. అయితే.. ఇదే అవార్డును సొంతం చేసుకునేందుకు మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు పోటీ పడ్డాయి.
అయితే.. ఈ అవార్డు వ్యవహారంపై గత పాలక పార్టీ వైసీపీ, ప్రస్తుత కూటమి పాలక పార్టీ టీడీపీలు నా ఘనతంటే నాదేనని చెప్పుకొంటున్నాయి. ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డు ఏపీకి దక్కిందంటే ఆ ఘనత సీఎం చంద్రబాబుదేనని టీడీపీ నాయకులు అంటున్నారు. గతంలో 2014-19 మధ్య కాలంలో పునరుత్పాదక ఇంధన రంగంలో చేసిన కృషి ఇప్పుడు అవార్డు రావడానికి కారణమైందని పేర్కొంటున్నారు. అప్పట్లో గ్రీన్ ఎనర్జీని చంద్రబాబు ప్రోత్సహించారని.. అందుకే అప్పట్లో గ్రీన్ ఎనర్జీపై పెట్టుబడులు కూడా వచ్చాయని అంటున్నారు. ఈ క్రమంలోనే అవార్డు రావడం వెనుక చంద్రబాబు కృషి ఉందని చెబుతున్నారు.
వైసీపీ నాయకులు మాత్రం ఈ అవార్డు తమ పార్టీ అధినేత, అప్పటి ముఖ్యమంత్రి జగన్ కృషితోనే సాధ్యమైందని చెబుతున్నారు. సోలార్ విద్యుత్, విండ్ పవర్ వంటి వాటిలో చేసుకున్న ఒప్పందాలు.. చేసిన మార్పులు గణనీయంగా ఫలించాయని.. అందుకే 2023-24 కాలానికి ఈ అవార్డును రాష్ట్రానికి అందించారని అంటున్నారు. ఇదేసమయంలో టీడీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్య లకు కౌంటర్ ఇస్తున్నారు. ఎప్పుడో చేసిన పనికి ఇప్పుడు అవార్డు ఇచ్చారని ఎలా చెబుతారంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ అవార్డు రావడం వెనుక జగన్ చేసిన వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళికలే ఉన్నాయని అంటున్నారు. మొత్తానికి అవార్డు రావడం వరకు బాగానే ఉన్నా.. ఇలా అధికార, విపక్షాల మధ్య ఈ అవార్డు కూడా రాజకీయంగా దుమారం రేపడం గమనార్హం.
This post was last modified on August 19, 2024 5:34 pm
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…