ఏపీకి తాజాగా ఓ అవార్డు వచ్చింది. సంప్రదాయ ఇంధన వనరుల విభాగంలో వచ్చిన `గ్రీన్ ఎనర్జీ చాంపియన్` అవార్డు.. రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇండియన్ విండ్ పవర్ అసోసియేషన్ 2023-24 సంవత్సరానికి గ్రీన్ ఎనర్జీ చాంపియన్ గా ఏపీని ప్రకటించింది. తాజాగా తమిళనాడులోని కోయంబత్తూరులో నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డును ఏపీకి ప్రదానం చేశారు. ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ, సీఈవో ఎం. కమలాకర్ బాబు ఈ అవార్డు స్వీకరించారు. అయితే.. ఇదే అవార్డును సొంతం చేసుకునేందుకు మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు పోటీ పడ్డాయి.
అయితే.. ఈ అవార్డు వ్యవహారంపై గత పాలక పార్టీ వైసీపీ, ప్రస్తుత కూటమి పాలక పార్టీ టీడీపీలు నా ఘనతంటే నాదేనని చెప్పుకొంటున్నాయి. ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డు ఏపీకి దక్కిందంటే ఆ ఘనత సీఎం చంద్రబాబుదేనని టీడీపీ నాయకులు అంటున్నారు. గతంలో 2014-19 మధ్య కాలంలో పునరుత్పాదక ఇంధన రంగంలో చేసిన కృషి ఇప్పుడు అవార్డు రావడానికి కారణమైందని పేర్కొంటున్నారు. అప్పట్లో గ్రీన్ ఎనర్జీని చంద్రబాబు ప్రోత్సహించారని.. అందుకే అప్పట్లో గ్రీన్ ఎనర్జీపై పెట్టుబడులు కూడా వచ్చాయని అంటున్నారు. ఈ క్రమంలోనే అవార్డు రావడం వెనుక చంద్రబాబు కృషి ఉందని చెబుతున్నారు.
వైసీపీ నాయకులు మాత్రం ఈ అవార్డు తమ పార్టీ అధినేత, అప్పటి ముఖ్యమంత్రి జగన్ కృషితోనే సాధ్యమైందని చెబుతున్నారు. సోలార్ విద్యుత్, విండ్ పవర్ వంటి వాటిలో చేసుకున్న ఒప్పందాలు.. చేసిన మార్పులు గణనీయంగా ఫలించాయని.. అందుకే 2023-24 కాలానికి ఈ అవార్డును రాష్ట్రానికి అందించారని అంటున్నారు. ఇదేసమయంలో టీడీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్య లకు కౌంటర్ ఇస్తున్నారు. ఎప్పుడో చేసిన పనికి ఇప్పుడు అవార్డు ఇచ్చారని ఎలా చెబుతారంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ అవార్డు రావడం వెనుక జగన్ చేసిన వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళికలే ఉన్నాయని అంటున్నారు. మొత్తానికి అవార్డు రావడం వరకు బాగానే ఉన్నా.. ఇలా అధికార, విపక్షాల మధ్య ఈ అవార్డు కూడా రాజకీయంగా దుమారం రేపడం గమనార్హం.
This post was last modified on August 19, 2024 5:34 pm
సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
గత ఏడాది లిటిల్ హార్ట్స్ సినిమా సక్సెస్ మీట్లో నటుడు, నిర్మాత బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…