Political News

ఏపీకి `అవార్డు`.. నాదా-నీదా!

ఏపీకి తాజాగా ఓ అవార్డు వ‌చ్చింది. సంప్ర‌దాయ ఇంధ‌న వ‌న‌రుల విభాగంలో వ‌చ్చిన `గ్రీన్ ఎన‌ర్జీ చాంపియ‌న్‌` అవార్డు.. రాజ‌కీయంగా ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఇండియన్ విండ్ పవర్ అసోసియేషన్ 2023-24 సంవత్సరానికి గ్రీన్ ఎనర్జీ చాంపియన్ గా ఏపీని ప్రకటించింది. తాజాగా తమిళనాడులోని కోయంబత్తూరులో నిర్వహించిన కార్య‌క్ర‌మంలో ఈ అవార్డును ఏపీకి ప్రదానం చేశారు. ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ, సీఈవో ఎం. కమలాకర్ బాబు ఈ అవార్డు స్వీకరించారు. అయితే.. ఇదే అవార్డును సొంతం చేసుకునేందుకు మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు పోటీ పడ్డాయి.

అయితే.. ఈ అవార్డు వ్య‌వ‌హారంపై గ‌త పాల‌క పార్టీ వైసీపీ, ప్ర‌స్తుత కూట‌మి పాల‌క పార్టీ టీడీపీలు నా ఘ‌నతంటే నాదేన‌ని చెప్పుకొంటున్నాయి. ప్ర‌తిష్టాత్మ‌కమైన ఈ అవార్డు ఏపీకి దక్కిందంటే ఆ ఘనత సీఎం చంద్రబాబుదేనని టీడీపీ నాయ‌కులు అంటున్నారు. గతంలో 2014-19 మధ్య కాలంలో పునరుత్పాదక ఇంధన రంగంలో చేసిన కృషి ఇప్పుడు అవార్డు రావడానికి కారణమైందని పేర్కొంటున్నారు. అప్ప‌ట్లో గ్రీన్ ఎన‌ర్జీని చంద్ర‌బాబు ప్రోత్స‌హించార‌ని.. అందుకే అప్ప‌ట్లో గ్రీన్ ఎన‌ర్జీపై పెట్టుబ‌డులు కూడా వ‌చ్చాయ‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలోనే అవార్డు రావ‌డం వెనుక చంద్ర‌బాబు కృషి ఉంద‌ని చెబుతున్నారు.

వైసీపీ నాయ‌కులు మాత్రం ఈ అవార్డు త‌మ పార్టీ అధినేత, అప్ప‌టి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కృషితోనే సాధ్య‌మైంద‌ని చెబుతున్నారు.  సోలార్ విద్యుత్‌, విండ్ ప‌వ‌ర్ వంటి వాటిలో చేసుకున్న ఒప్పందాలు.. చేసిన మార్పులు గ‌ణ‌నీయంగా ఫ‌లించాయ‌ని.. అందుకే 2023-24 కాలానికి ఈ అవార్డును రాష్ట్రానికి అందించార‌ని అంటున్నారు. ఇదేస‌మ‌యంలో టీడీపీ నాయ‌కులు చేస్తున్న వ్యాఖ్య లకు కౌంట‌ర్ ఇస్తున్నారు. ఎప్పుడో చేసిన ప‌నికి ఇప్పుడు అవార్డు ఇచ్చార‌ని ఎలా చెబుతారంటూ ప్ర‌శ్నిస్తున్నారు. ఈ అవార్డు రావ‌డం వెనుక జ‌గ‌న్ చేసిన వ్యూహాత్మ‌క కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌లే ఉన్నాయ‌ని అంటున్నారు. మొత్తానికి అవార్డు రావ‌డం వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఇలా అధికార, విప‌క్షాల మ‌ధ్య ఈ అవార్డు కూడా రాజ‌కీయంగా దుమారం రేప‌డం గ‌మ‌నార్హం. 

This post was last modified on August 19, 2024 5:34 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నియోజ‌క‌వ‌ర్గాల‌పై రేవంత్ కొత్త ఫార్ములా… వ‌ర్కువ‌ట్ అయ్యేనా?

2029 పార్ల‌మెంటు ఎన్నిక‌ల నాటికి దేశంలో నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభ‌జించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…

2 hours ago

పెను సంక్షోభంలో ప్ర‌పంచం…!

అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభ‌న ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…

2 hours ago

రాష్ట్ర‌ప‌తికి బహుమతిగా మంగళగిరి చీర

భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…

3 hours ago

ఏపీ కొత్త ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌… వైసీపీకి షాకేనా?

ఏపీ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ ప‌ద‌వి ఖాళీ అయింది. గ‌త నెల 31వ తేదీ వ‌ర‌కు ఉన్న రాష్ట్ర…

3 hours ago

‘హోం’ ప్రశ్నలపై ‘సీఎం’ సమాధానం చెప్తారా?

తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…

4 hours ago

కేసీఆర్ వరకు వెళ్లిన సీతక్క పంచాయితీ

తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…

5 hours ago