Political News

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. ప్రపంచ బ్యాంక్ ఓకే!

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం కొలువు దీరి రెండు మాసాలు పూర్త‌య్యాయో లేదో.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. త‌న క‌ల‌ల ప్రాజెక్టు అమ‌రావ‌తి రాజ‌ధానికి ఇప్ప‌టి వ‌ర‌కు 30 వేల కోట్ల రూపాయ‌ల‌ను ఆయ‌న స‌మీక‌రించే ప్ర‌య‌త్నం చేశారు. దీంతో రాజ‌ధాని నిర్మాణం ప‌రుగులు పెట్ట‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది. కేంద్ర బడ్జెట్ లో ప్రతిపాదించిన మేరకు ఏపీ రాజధాని అమరావతికి రూ.15 వేల కోట్ల రుణ సాయం అందించేందుకు ప్రపంచ బ్యాంకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ తో కలిసి ఆ మొత్తాన్ని మంజూరు చేయనున్నట్లు సమాచారం.

ఆయా బ్యాంకుల ప్రతినిధులు సోమ‌వారం నుంచి ఈ నెల 27 వరకు రాజధానిలో పర్యటించి వివిధ అంశాలపై ప్రభుత్వంతో చర్చించనున్నారు. వీలైనంత త్వరలోనే రుణం మంజూరు చేసే అవకాశముందని తెలుస్తోంది. దీంతో కేంద్రం బ‌డ్జెట్ లో ప్ర‌తిపాదించిన రూ.15 వేల కోట్ల మేర‌కు అందించే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఇది ఒక భారీ ఊతంగా మార‌నుంది. అదేవిధంగా రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా విడిగా ప్ర‌ప‌చం బ్యాంకు నుంచి రూ.15 వేల కోట్ల‌ను స‌మీకరించేందుకు రెడీ అయింది. అయితే.. కేంద్రం ఇప్పిస్తున్న‌రూ.15 వేల కోట్లు.. రాజ‌ధాని పున‌ర్నిర్మాణానికి వినియోగించ‌నున్నారు.

అయితే.. రాష్ట్ర ప్ర‌భుత్వం త‌నంత‌ట తానుగా సేక‌రించే రూ.15 వేల కోట్లు న‌వ న‌గ‌రాల‌ను అభివృద్ది చేయాల‌న్న ఉద్దేశంతో తీసుకురానుంది. దీనికి కూడా ప్ర‌పంచ బ్యాంకు ప్ర‌తినిధులు అంగీక‌రించే అవ‌కాశం ఉంది. గ‌త వార‌మే సీఎం చంద్రబాబుతో వరల్డ్‌బ్యాంక్‌ ప్రతినిధులు భేటీ అయ్యారు. రాజధాని అమరావతిలో న‌వ‌న‌గ‌రాల‌ నిర్మాణంపై చర్చించారు.  నిర్మాణాలు, రహదారులపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారు. రైతులతో మాట్లాడిన ప్రపంచబ్యాంక్‌ ప్రతినిధులు వారి అభిప్రాయాలు కూడా తెలుసుకున్నారు. వరల్డ్‌క్లాస్‌ సిటీగా అమరావతిని తీర్చిదిద్దేలా.. భవిష్యత్‌ ప్రణాళికలు వివరించిన సీఎం చంద్రబాబు సాయం చేయాల‌ని అప్ప‌ట్లోనే కోరారు.

ఇక‌, ఇప్పుడు కేంద్రం ప్ర‌తిపాదించిన రుణం వేరుగా అంద‌నుంద‌ని తెలుస్తోంది. మొత్తం అటు కేంద్రం, ఇటు రాష్ట్ర స‌ర్కారులు రూ.30 వేల కోట్ల‌ మేర‌కు అప్పుల రూపంలో స‌మీక‌రించి రాజ‌ధానికి కేటాయించ‌నున్నారు. దీంతో న‌వ‌న‌గ‌రాలు స‌హా.. రాజ‌ధాని రూపు రేఖ‌లు మారిపోతాయ‌ని.. త‌ద్వారా పెట్టుబ‌డులు తీసుకువ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని స‌ర్కారు అంచ‌నా వేస్తోంది. కొంత పురోగ‌తి క‌నిపిస్తే.. ప్ర‌జ‌లు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని భావిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే వ‌చ్చే ఏడాదిలో రాజ‌ధాని ప్రాంతానికి ఒక క‌ళ తీసుకువ‌చ్చే ప్ర‌య‌త్నాలు చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. 

This post was last modified on August 19, 2024 5:09 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

2 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

2 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

3 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

4 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

5 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

7 hours ago