ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు దీరి రెండు మాసాలు పూర్తయ్యాయో లేదో.. టీడీపీ అధినేత చంద్రబాబు దూకుడు ప్రదర్శిస్తున్నారు. తన కలల ప్రాజెక్టు అమరావతి రాజధానికి ఇప్పటి వరకు 30 వేల కోట్ల రూపాయలను ఆయన సమీకరించే ప్రయత్నం చేశారు. దీంతో రాజధాని నిర్మాణం పరుగులు పెట్టడం ఖాయమని తెలుస్తోంది. కేంద్ర బడ్జెట్ లో ప్రతిపాదించిన మేరకు ఏపీ రాజధాని అమరావతికి రూ.15 వేల కోట్ల రుణ సాయం అందించేందుకు ప్రపంచ బ్యాంకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ తో కలిసి ఆ మొత్తాన్ని మంజూరు చేయనున్నట్లు సమాచారం.
ఆయా బ్యాంకుల ప్రతినిధులు సోమవారం నుంచి ఈ నెల 27 వరకు రాజధానిలో పర్యటించి వివిధ అంశాలపై ప్రభుత్వంతో చర్చించనున్నారు. వీలైనంత త్వరలోనే రుణం మంజూరు చేసే అవకాశముందని తెలుస్తోంది. దీంతో కేంద్రం బడ్జెట్ లో ప్రతిపాదించిన రూ.15 వేల కోట్ల మేరకు అందించే అవకాశం కనిపిస్తోంది. ఇది ఒక భారీ ఊతంగా మారనుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా విడిగా ప్రపచం బ్యాంకు నుంచి రూ.15 వేల కోట్లను సమీకరించేందుకు రెడీ అయింది. అయితే.. కేంద్రం ఇప్పిస్తున్నరూ.15 వేల కోట్లు.. రాజధాని పునర్నిర్మాణానికి వినియోగించనున్నారు.
అయితే.. రాష్ట్ర ప్రభుత్వం తనంతట తానుగా సేకరించే రూ.15 వేల కోట్లు నవ నగరాలను అభివృద్ది చేయాలన్న ఉద్దేశంతో తీసుకురానుంది. దీనికి కూడా ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు అంగీకరించే అవకాశం ఉంది. గత వారమే సీఎం చంద్రబాబుతో వరల్డ్బ్యాంక్ ప్రతినిధులు భేటీ అయ్యారు. రాజధాని అమరావతిలో నవనగరాల నిర్మాణంపై చర్చించారు. నిర్మాణాలు, రహదారులపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారు. రైతులతో మాట్లాడిన ప్రపంచబ్యాంక్ ప్రతినిధులు వారి అభిప్రాయాలు కూడా తెలుసుకున్నారు. వరల్డ్క్లాస్ సిటీగా అమరావతిని తీర్చిదిద్దేలా.. భవిష్యత్ ప్రణాళికలు వివరించిన సీఎం చంద్రబాబు సాయం చేయాలని అప్పట్లోనే కోరారు.
ఇక, ఇప్పుడు కేంద్రం ప్రతిపాదించిన రుణం వేరుగా అందనుందని తెలుస్తోంది. మొత్తం అటు కేంద్రం, ఇటు రాష్ట్ర సర్కారులు రూ.30 వేల కోట్ల మేరకు అప్పుల రూపంలో సమీకరించి రాజధానికి కేటాయించనున్నారు. దీంతో నవనగరాలు సహా.. రాజధాని రూపు రేఖలు మారిపోతాయని.. తద్వారా పెట్టుబడులు తీసుకువచ్చేందుకు అవకాశం ఉంటుందని సర్కారు అంచనా వేస్తోంది. కొంత పురోగతి కనిపిస్తే.. ప్రజలు వచ్చేందుకు అవకాశం ఉంటుందని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాదిలో రాజధాని ప్రాంతానికి ఒక కళ తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తుండడం గమనార్హం.
This post was last modified on August 19, 2024 5:09 pm
కొత్త నెల వచ్చేసింది. సంక్రాంతి అయిపోయాక ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా జనాలు రాక థియేటర్లు అలో లక్ష్మణా అంటున్న…
జంతర్ మంతర్ ఆందోళనలో విద్యార్థులు తనను దుషించారని ప్రధాని మోదీ శుక్రవారం రాత్రి విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో…
నేటి తరం రాజకీయ నాయకులలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కుమార్ స్టైలే వేరు. నిబద్దత కలిగిన నాయకుడిగా ఎదిగినప్పటికి…
గత రెండు మూడు రోజులుగా మహేష్ బాబు గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. జయకృష్ణ తొలి సినిమ…
గత కొన్ని వారాలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పెద్ది తెలుగు రాష్ట్రాల్లో బాగా ఆడితే…
కార్తీ కెరీర్ బెస్ట్ హిట్స్ గా చెప్పుకునే సినిమాల్లో ఖైదీ, నా పేరు శివ తర్వాత సర్దార్ ఉంటుంది. తెలుగులోనూ…