Political News

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. ప్రపంచ బ్యాంక్ ఓకే!

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం కొలువు దీరి రెండు మాసాలు పూర్త‌య్యాయో లేదో.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. త‌న క‌ల‌ల ప్రాజెక్టు అమ‌రావ‌తి రాజ‌ధానికి ఇప్ప‌టి వ‌ర‌కు 30 వేల కోట్ల రూపాయ‌ల‌ను ఆయ‌న స‌మీక‌రించే ప్ర‌య‌త్నం చేశారు. దీంతో రాజ‌ధాని నిర్మాణం ప‌రుగులు పెట్ట‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది. కేంద్ర బడ్జెట్ లో ప్రతిపాదించిన మేరకు ఏపీ రాజధాని అమరావతికి రూ.15 వేల కోట్ల రుణ సాయం అందించేందుకు ప్రపంచ బ్యాంకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ తో కలిసి ఆ మొత్తాన్ని మంజూరు చేయనున్నట్లు సమాచారం.

ఆయా బ్యాంకుల ప్రతినిధులు సోమ‌వారం నుంచి ఈ నెల 27 వరకు రాజధానిలో పర్యటించి వివిధ అంశాలపై ప్రభుత్వంతో చర్చించనున్నారు. వీలైనంత త్వరలోనే రుణం మంజూరు చేసే అవకాశముందని తెలుస్తోంది. దీంతో కేంద్రం బ‌డ్జెట్ లో ప్ర‌తిపాదించిన రూ.15 వేల కోట్ల మేర‌కు అందించే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఇది ఒక భారీ ఊతంగా మార‌నుంది. అదేవిధంగా రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా విడిగా ప్ర‌ప‌చం బ్యాంకు నుంచి రూ.15 వేల కోట్ల‌ను స‌మీకరించేందుకు రెడీ అయింది. అయితే.. కేంద్రం ఇప్పిస్తున్న‌రూ.15 వేల కోట్లు.. రాజ‌ధాని పున‌ర్నిర్మాణానికి వినియోగించ‌నున్నారు.

అయితే.. రాష్ట్ర ప్ర‌భుత్వం త‌నంత‌ట తానుగా సేక‌రించే రూ.15 వేల కోట్లు న‌వ న‌గ‌రాల‌ను అభివృద్ది చేయాల‌న్న ఉద్దేశంతో తీసుకురానుంది. దీనికి కూడా ప్ర‌పంచ బ్యాంకు ప్ర‌తినిధులు అంగీక‌రించే అవ‌కాశం ఉంది. గ‌త వార‌మే సీఎం చంద్రబాబుతో వరల్డ్‌బ్యాంక్‌ ప్రతినిధులు భేటీ అయ్యారు. రాజధాని అమరావతిలో న‌వ‌న‌గ‌రాల‌ నిర్మాణంపై చర్చించారు.  నిర్మాణాలు, రహదారులపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారు. రైతులతో మాట్లాడిన ప్రపంచబ్యాంక్‌ ప్రతినిధులు వారి అభిప్రాయాలు కూడా తెలుసుకున్నారు. వరల్డ్‌క్లాస్‌ సిటీగా అమరావతిని తీర్చిదిద్దేలా.. భవిష్యత్‌ ప్రణాళికలు వివరించిన సీఎం చంద్రబాబు సాయం చేయాల‌ని అప్ప‌ట్లోనే కోరారు.

ఇక‌, ఇప్పుడు కేంద్రం ప్ర‌తిపాదించిన రుణం వేరుగా అంద‌నుంద‌ని తెలుస్తోంది. మొత్తం అటు కేంద్రం, ఇటు రాష్ట్ర స‌ర్కారులు రూ.30 వేల కోట్ల‌ మేర‌కు అప్పుల రూపంలో స‌మీక‌రించి రాజ‌ధానికి కేటాయించ‌నున్నారు. దీంతో న‌వ‌న‌గ‌రాలు స‌హా.. రాజ‌ధాని రూపు రేఖ‌లు మారిపోతాయ‌ని.. త‌ద్వారా పెట్టుబ‌డులు తీసుకువ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని స‌ర్కారు అంచ‌నా వేస్తోంది. కొంత పురోగ‌తి క‌నిపిస్తే.. ప్ర‌జ‌లు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని భావిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే వ‌చ్చే ఏడాదిలో రాజ‌ధాని ప్రాంతానికి ఒక క‌ళ తీసుకువ‌చ్చే ప్ర‌య‌త్నాలు చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. 

This post was last modified on August 19, 2024 5:09 pm

Share

Recent Posts

రాకా సెట్లో మంచు లక్ష్మి… వావ్ వావ్ వావ్

అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…

39 minutes ago

విశాఖలో విద్యార్థుల లవ్ వార్… హద్దు మీరిపోయారు!

విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…

59 minutes ago

చివరి సినిమా టోటల్ కలెక్షన్లు… ఒక్క రోజులోనే ఔట్

మాస్ రాజా రవితేజ నుంచి సరైన సినిమా వస్తే.. పరిస్థితులు కూడా అనుకూలిస్తే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో…

1 hour ago

సందీప్ వెర్సస్ దీపిక… మళ్లీ రాజుకుంది

ప్రభాస్, సందీప్ రెడ్డి వంగల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమా నుంచి దీపికా పదుకొనేను తప్పించడం మీద ఎప్పుడో…

1 hour ago

చిరు భలే బోల్తా కొట్టించాడుగా

ఏదో ఈవెంట్‌కు వెళ్లి ఏదో మాట్లాడుతూ.. తన కొత్త సినిమాల విశేషాలను లీక్ చేసేయడం మెగాస్టార్ చిరంజీవికి అలవాటు. కొన్నిసార్లు…

3 hours ago

సాలిడ్ కంటెంట్ పడితే రవితేజ స్టామినా ఇది

టాలీవుడ్ థియేటర్ల దగ్గర ఇరుముడి సందడి ఓ రేంజ్ లో ఉంది. సెకండ్ షోలు సైతం టికెట్ ముక్క దొరకనంతగా…

4 hours ago