Political News

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. ప్రపంచ బ్యాంక్ ఓకే!

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం కొలువు దీరి రెండు మాసాలు పూర్త‌య్యాయో లేదో.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. త‌న క‌ల‌ల ప్రాజెక్టు అమ‌రావ‌తి రాజ‌ధానికి ఇప్ప‌టి వ‌ర‌కు 30 వేల కోట్ల రూపాయ‌ల‌ను ఆయ‌న స‌మీక‌రించే ప్ర‌య‌త్నం చేశారు. దీంతో రాజ‌ధాని నిర్మాణం ప‌రుగులు పెట్ట‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది. కేంద్ర బడ్జెట్ లో ప్రతిపాదించిన మేరకు ఏపీ రాజధాని అమరావతికి రూ.15 వేల కోట్ల రుణ సాయం అందించేందుకు ప్రపంచ బ్యాంకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ తో కలిసి ఆ మొత్తాన్ని మంజూరు చేయనున్నట్లు సమాచారం.

ఆయా బ్యాంకుల ప్రతినిధులు సోమ‌వారం నుంచి ఈ నెల 27 వరకు రాజధానిలో పర్యటించి వివిధ అంశాలపై ప్రభుత్వంతో చర్చించనున్నారు. వీలైనంత త్వరలోనే రుణం మంజూరు చేసే అవకాశముందని తెలుస్తోంది. దీంతో కేంద్రం బ‌డ్జెట్ లో ప్ర‌తిపాదించిన రూ.15 వేల కోట్ల మేర‌కు అందించే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఇది ఒక భారీ ఊతంగా మార‌నుంది. అదేవిధంగా రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా విడిగా ప్ర‌ప‌చం బ్యాంకు నుంచి రూ.15 వేల కోట్ల‌ను స‌మీకరించేందుకు రెడీ అయింది. అయితే.. కేంద్రం ఇప్పిస్తున్న‌రూ.15 వేల కోట్లు.. రాజ‌ధాని పున‌ర్నిర్మాణానికి వినియోగించ‌నున్నారు.

అయితే.. రాష్ట్ర ప్ర‌భుత్వం త‌నంత‌ట తానుగా సేక‌రించే రూ.15 వేల కోట్లు న‌వ న‌గ‌రాల‌ను అభివృద్ది చేయాల‌న్న ఉద్దేశంతో తీసుకురానుంది. దీనికి కూడా ప్ర‌పంచ బ్యాంకు ప్ర‌తినిధులు అంగీక‌రించే అవ‌కాశం ఉంది. గ‌త వార‌మే సీఎం చంద్రబాబుతో వరల్డ్‌బ్యాంక్‌ ప్రతినిధులు భేటీ అయ్యారు. రాజధాని అమరావతిలో న‌వ‌న‌గ‌రాల‌ నిర్మాణంపై చర్చించారు.  నిర్మాణాలు, రహదారులపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారు. రైతులతో మాట్లాడిన ప్రపంచబ్యాంక్‌ ప్రతినిధులు వారి అభిప్రాయాలు కూడా తెలుసుకున్నారు. వరల్డ్‌క్లాస్‌ సిటీగా అమరావతిని తీర్చిదిద్దేలా.. భవిష్యత్‌ ప్రణాళికలు వివరించిన సీఎం చంద్రబాబు సాయం చేయాల‌ని అప్ప‌ట్లోనే కోరారు.

ఇక‌, ఇప్పుడు కేంద్రం ప్ర‌తిపాదించిన రుణం వేరుగా అంద‌నుంద‌ని తెలుస్తోంది. మొత్తం అటు కేంద్రం, ఇటు రాష్ట్ర స‌ర్కారులు రూ.30 వేల కోట్ల‌ మేర‌కు అప్పుల రూపంలో స‌మీక‌రించి రాజ‌ధానికి కేటాయించ‌నున్నారు. దీంతో న‌వ‌న‌గ‌రాలు స‌హా.. రాజ‌ధాని రూపు రేఖ‌లు మారిపోతాయ‌ని.. త‌ద్వారా పెట్టుబ‌డులు తీసుకువ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని స‌ర్కారు అంచ‌నా వేస్తోంది. కొంత పురోగ‌తి క‌నిపిస్తే.. ప్ర‌జ‌లు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని భావిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే వ‌చ్చే ఏడాదిలో రాజ‌ధాని ప్రాంతానికి ఒక క‌ళ తీసుకువ‌చ్చే ప్ర‌య‌త్నాలు చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. 

This post was last modified on August 19, 2024 5:09 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

21 minutes ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

1 hour ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

1 hour ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

2 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

2 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

3 hours ago