ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు దీరి రెండు మాసాలు పూర్తయ్యాయో లేదో.. టీడీపీ అధినేత చంద్రబాబు దూకుడు ప్రదర్శిస్తున్నారు. తన కలల ప్రాజెక్టు అమరావతి రాజధానికి ఇప్పటి వరకు 30 వేల కోట్ల రూపాయలను ఆయన సమీకరించే ప్రయత్నం చేశారు. దీంతో రాజధాని నిర్మాణం పరుగులు పెట్టడం ఖాయమని తెలుస్తోంది. కేంద్ర బడ్జెట్ లో ప్రతిపాదించిన మేరకు ఏపీ రాజధాని అమరావతికి రూ.15 వేల కోట్ల రుణ సాయం అందించేందుకు ప్రపంచ బ్యాంకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ తో కలిసి ఆ మొత్తాన్ని మంజూరు చేయనున్నట్లు సమాచారం.
ఆయా బ్యాంకుల ప్రతినిధులు సోమవారం నుంచి ఈ నెల 27 వరకు రాజధానిలో పర్యటించి వివిధ అంశాలపై ప్రభుత్వంతో చర్చించనున్నారు. వీలైనంత త్వరలోనే రుణం మంజూరు చేసే అవకాశముందని తెలుస్తోంది. దీంతో కేంద్రం బడ్జెట్ లో ప్రతిపాదించిన రూ.15 వేల కోట్ల మేరకు అందించే అవకాశం కనిపిస్తోంది. ఇది ఒక భారీ ఊతంగా మారనుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా విడిగా ప్రపచం బ్యాంకు నుంచి రూ.15 వేల కోట్లను సమీకరించేందుకు రెడీ అయింది. అయితే.. కేంద్రం ఇప్పిస్తున్నరూ.15 వేల కోట్లు.. రాజధాని పునర్నిర్మాణానికి వినియోగించనున్నారు.
అయితే.. రాష్ట్ర ప్రభుత్వం తనంతట తానుగా సేకరించే రూ.15 వేల కోట్లు నవ నగరాలను అభివృద్ది చేయాలన్న ఉద్దేశంతో తీసుకురానుంది. దీనికి కూడా ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు అంగీకరించే అవకాశం ఉంది. గత వారమే సీఎం చంద్రబాబుతో వరల్డ్బ్యాంక్ ప్రతినిధులు భేటీ అయ్యారు. రాజధాని అమరావతిలో నవనగరాల నిర్మాణంపై చర్చించారు. నిర్మాణాలు, రహదారులపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారు. రైతులతో మాట్లాడిన ప్రపంచబ్యాంక్ ప్రతినిధులు వారి అభిప్రాయాలు కూడా తెలుసుకున్నారు. వరల్డ్క్లాస్ సిటీగా అమరావతిని తీర్చిదిద్దేలా.. భవిష్యత్ ప్రణాళికలు వివరించిన సీఎం చంద్రబాబు సాయం చేయాలని అప్పట్లోనే కోరారు.
ఇక, ఇప్పుడు కేంద్రం ప్రతిపాదించిన రుణం వేరుగా అందనుందని తెలుస్తోంది. మొత్తం అటు కేంద్రం, ఇటు రాష్ట్ర సర్కారులు రూ.30 వేల కోట్ల మేరకు అప్పుల రూపంలో సమీకరించి రాజధానికి కేటాయించనున్నారు. దీంతో నవనగరాలు సహా.. రాజధాని రూపు రేఖలు మారిపోతాయని.. తద్వారా పెట్టుబడులు తీసుకువచ్చేందుకు అవకాశం ఉంటుందని సర్కారు అంచనా వేస్తోంది. కొంత పురోగతి కనిపిస్తే.. ప్రజలు వచ్చేందుకు అవకాశం ఉంటుందని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాదిలో రాజధాని ప్రాంతానికి ఒక కళ తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తుండడం గమనార్హం.
This post was last modified on August 19, 2024 5:09 pm
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…