రాష్ట్రంలో ఐపీఎస్ ల వివాదం కొనసాగుతోంది. వైసీపీ హయంలో పనిచేసిన 16 మంది కీలక ఐపీఎస్ అధికారులను ప్రస్తుత ప్రభుత్వం వెయిటింగ్ లో పెట్టిన విషయం తెలిసిందే. అయితే వీరందరిని ఉదయం 10 గంటలకు డిజిపి ఆఫీసుకి రావాలని సాయంత్రం ఐదు గంటల వరకు అక్కడే ఉండాలని ఆదేశించడం, అదేవిధంగా రిజిస్టర్లలో సంతకాలు చేసి వెళ్ళాలి అని ప్రభుత్వం పేర్కొనడంతో ఇది వివాదంగా మారింది. వాస్తవానికి వెయిటింగ్ లో ఉన్న అధికారులు డిజిపి కార్యాలయానికి రావాలా? అవసరం లేదా. అనే విషయం ఇప్పటివరకు చర్చకు రాలేదు.
కానీ, ప్రస్తుత ప్రభుత్వం ఆదేశించిన తర్వాత ఐపీఎస్ ల విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. నిజానికి ఏ ఐపిఎస్ అయినా ఏఐఎస్ అయినా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి అనుకూలంగానే ఉంటారు. అది వైసిపి ప్రభుత్వం అయినా టిడిపి ప్రభుత్వమైనా ప్రభుత్వం చెప్పినట్టు నడుచుకుంటారు.
అయితే వైసిపి హయాంలో తమపై వ్యక్తిగతంగా కక్షకట్టు కుని కేసులు పెట్టారనే ఉద్దేశంతో టిడిపి నాయకులు మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడం నారా లోకేష్ పై కేసులు పెట్టడం అదేవిధంగా ఇతర నాయకులపై కేసులు పెట్టి జైలుకు పంపించే ప్రయత్నం చేసినటువంటి ఐపీఎస్ లపై సహజంగానే టిడిపి నాయకుల్లో కోపం ఉంది.
ఈ నేపథ్యంలోనే ఇప్పుడు 16 మంది ఐపీఎస్ లను పక్కన పెట్టారు అనే వాదన వినిపిస్తోంది. దీనిపై తాజాగా తెలంగాణకు చెందిన మాజీ డిజిపి లు స్వర్ణజిత్ సేన్ సహా మరికొందరు విమర్శలు చేశారు. ఐపీఎస్లను అవమానిస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదని పేర్కొన్నారు. దీంతో విషయం రాజకీయంగా వివాదం రేపింది. తాను చేసింది తప్పు కాదని ప్రభుత్వ అనుకూల వర్గాలు చెబుతుండగా ఐపీఎస్ వర్గాలు మాత్రం మౌనంగా ఉన్నాయి. అయితే వాస్తవం మాత్రం వెయిటింగ్ లో ఉన్న అధికారులు కచ్చితంగా నిర్దేశిత ఆఫీసుకు వచ్చి సంతకాలు పెట్టాలనేది రూల్ అయితే ఉంది. దీన్ని ఇప్పటివరకు ఎవరూ పాటించలేదు.
కానీ ఇప్పుడు తొలిసారి టిడిపి ప్రభుత్వం దీనిని అమలుచేస్తోంది ఇదే వివాదానికి కారణమైంది మరోవైపు వెయిటింగ్ లో ఉన్న అధికారులను కొనసాగించాలా లేక కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలా అనే విషయంపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఏదేమైనా రాష్ట్రంలో ప్రజల కోసం పనిచేయాల్సిన అధికారులు ప్రభుత్వ విధానాల మేరకు నడుచుకోవాల్సిన అధికారులు.. రాజకీయంగా నాయకుల మాటలకు ప్రాధాన్యం ఇవ్వడం.. వారు చెప్పినట్టు నడుచుకోవడం వివాదాలకు దారి తీయడం గమనించాల్సిన విషయం. చివరకు ఇది ఎటు మలుపు తిరుగుతుందో చూడాలి.
This post was last modified on August 18, 2024 11:28 am
వైసీపీ నేత, ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీలో కోడలు చేసిన ఆరోపణలు పెను కుదుపునకు…
సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…
జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…
ఏపీలో గత 2 మాసాల కిందటి వరకు తీవ్రస్థాయిలో చర్చనీయాంశం అయిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి నియోజకవర్గం…
ప్రజలు, శాంతియుతంగా నిరసన చేస్తున్నవారిని కొట్టే హక్కు పోలీసులకు ఉందా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇలా అయితే.. దేశం మొత్తం…
వైసీపీ మాజీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి కొత్తగా రాజకీయ పార్టీని పెడతానని కొన్నాళ్ల కిందటే ప్రకటించారు.…