Political News

ఐపీఎస్‌లు.. రాజ‌కీయ దుమారం వెనుక‌… !

రాష్ట్రంలో ఐపీఎస్ ల వివాదం కొనసాగుతోంది. వైసీపీ హయంలో పనిచేసిన 16 మంది కీలక ఐపీఎస్ అధికారులను ప్రస్తుత ప్రభుత్వం వెయిటింగ్ లో పెట్టిన విషయం తెలిసిందే. అయితే వీరందరిని ఉదయం 10 గంటలకు డిజిపి ఆఫీసుకి రావాలని సాయంత్రం ఐదు గంటల వరకు అక్కడే ఉండాలని ఆదేశించడం, అదేవిధంగా రిజిస్టర్లలో సంతకాలు చేసి వెళ్ళాలి అని ప్రభుత్వం పేర్కొనడంతో ఇది వివాదంగా మారింది. వాస్తవానికి వెయిటింగ్ లో ఉన్న అధికారులు డిజిపి కార్యాలయానికి రావాలా? అవసరం లేదా. అనే విషయం ఇప్పటివరకు చర్చ‌కు రాలేదు.

కానీ, ప్రస్తుత ప్రభుత్వం ఆదేశించిన తర్వాత ఐపీఎస్ ల విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. నిజానికి ఏ ఐపిఎస్ అయినా ఏఐఎస్ అయినా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి అనుకూలంగానే ఉంటారు. అది వైసిపి ప్రభుత్వం అయినా టిడిపి ప్రభుత్వమైనా ప్రభుత్వం చెప్పినట్టు నడుచుకుంటారు.

అయితే వైసిపి హయాంలో తమపై వ్యక్తిగతంగా కక్షకట్టు కుని కేసులు పెట్టారనే ఉద్దేశంతో టిడిపి నాయకులు మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడం నారా లోకేష్ పై కేసులు పెట్టడం అదేవిధంగా ఇతర నాయకులపై కేసులు పెట్టి జైలుకు పంపించే ప్రయత్నం చేసినటువంటి ఐపీఎస్ లపై సహజంగానే టిడిపి నాయకుల్లో కోపం ఉంది.

ఈ నేపథ్యంలోనే ఇప్పుడు 16 మంది ఐపీఎస్ లను పక్కన పెట్టారు అనే వాదన వినిపిస్తోంది. దీనిపై తాజాగా తెలంగాణకు చెందిన మాజీ డిజిపి లు స్వ‌ర్ణ‌జిత్ సేన్‌ సహా మరికొందరు విమర్శలు చేశారు. ఐపీఎస్‌ల‌ను అవమానిస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదని పేర్కొన్నారు. దీంతో విషయం రాజకీయంగా వివాదం రేపింది. తాను చేసింది తప్పు కాదని ప్రభుత్వ అనుకూల వర్గాలు చెబుతుండగా ఐపీఎస్ వర్గాలు మాత్రం మౌనంగా ఉన్నాయి. అయితే వాస్తవం మాత్రం వెయిటింగ్ లో ఉన్న అధికారులు కచ్చితంగా నిర్దేశిత ఆఫీసుకు వచ్చి సంతకాలు పెట్టాలనేది రూల్ అయితే ఉంది. దీన్ని ఇప్పటివరకు ఎవరూ పాటించలేదు.

కానీ ఇప్పుడు తొలిసారి టిడిపి ప్రభుత్వం దీనిని అమలుచేస్తోంది ఇదే వివాదానికి కారణమైంది మరోవైపు వెయిటింగ్ లో ఉన్న అధికారులను కొనసాగించాలా లేక కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలా అనే విషయంపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఏదేమైనా రాష్ట్రంలో ప్రజల కోసం పనిచేయాల్సిన అధికారులు ప్రభుత్వ విధానాల మేరకు నడుచుకోవాల్సిన అధికారులు.. రాజకీయంగా నాయ‌కుల మాట‌ల‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డం.. వారు చెప్పిన‌ట్టు న‌డుచుకోవ‌డం వివాదాలకు దారి తీయడం గమనించాల్సిన విషయం. చివ‌ర‌కు ఇది ఎటు మ‌లుపు తిరుగుతుందో చూడాలి.

This post was last modified on August 18, 2024 11:28 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఉస్తాద్ పాట‌ల వాడ‌కం.. ఎంత ఖ‌ర్చు పెట్టారో?

ఒక‌ప్పుడు పాత సినిమాల పాట‌లను య‌థేచ్ఛ‌గా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవ‌రికీ ఏ అభ్యంత‌రాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…

18 minutes ago

వైసీపీ పంచాంగం.. కేంద్రం ప్లస్.. రాష్ట్రం మైనస్

ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…

3 hours ago

స‌మంత బంగారం కోసం రాజు గారు వ‌స్తారా?

ఒక‌ప్పుడు తెలుగు, త‌మిళంలో టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా ద‌శాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన క‌థానాయిక స‌మంత‌. కానీ కొన్నేళ్లుగా…

4 hours ago

ఆ యూట్యూబర్లకు ‘పరాభవం’ తప్పదట

సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ…

4 hours ago

క‌విత పార్టీకి న్యాయ చిక్కులు… ఏం జరిగింది?

బీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. సొంత పార్టీ పెట్టుకునేందుకు రెడీ అయిన మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె క‌విత త‌న…

6 hours ago

ఫిక్స్… మూడో భాగం ఛాన్స్ లేదు

బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…

6 hours ago