Political News

గుంటూరు లో జెండా పీకేస్తున్న వైసిపి నేత‌లు

మాచర్ల సహా గుంటూరు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో వైసిపి హవా తగ్గిపోయిందని ప్రచారం జరుగుతోంది. ఎన్నికలకు ముందు గడిచిన ఐదు సంవత్సరాలలో గుంటూరు జిల్లా వ్యాప్తంగా వైసిపి జెండా ఎగిరిన విషయం తెలిసిందే. బలమైన పొన్నూరు నియోజకవర్గంలో కూడా గత ఐదేళ్లలో కిలారు రోశయ్య ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వైసిపి హవా నడిచింది. ఒకానొక దశలో అప్ప‌టి మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను అరెస్టు చేయడం కూడా వైసిపి పుంజుకుందడానికి బలమైన కారణంగా చెప్పుకొచ్చారు.

అయితే.. ఇప్పుడు అలాంటి ప‌రిస్థితి లేదు. ఇక్క‌డ జెండా ప‌ట్టుకునే నాయ‌కులు ఎవ‌రూ క‌నిపించ‌డం లేదు. ఇక మాచర్ల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు అదే విధంగా తాడికొండ ప్రతిపాడు పెదకూరపాడులో కూడా వైసిపి నాయకులు హవాచలాయించారు. ముఖ్యంగా పెద్దకూరపాడులో అయితే నంబూరు శంకర్రావు రెచ్చి పోయారు. తమకు తిరుగులేదని ఇక టిడిపి భూస్థాపితం అయిపోయిందని భావించారు. మాచర్లలో అయితే మరింత ఎక్కువగా వైసిపి నాయకులు పేట్రేగిపోయారు.

అయితే గడిచిన రెండు మాసాలలో గుంటూరు జిల్లా వ్యాప్తంగా వైసిపి నాయకులు ఎవరు కనిపించకపోవడం వాయిస్ వినిపించకపోవడం చెప్పుకోదగిన అంశం. ఒక అంబటి రాంబాబు మినహా మిగిలిన నాయకులు ఎవరు బయటకు రావడం లేదు. పైగా గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన కిలారి రోశయ్య పార్టీ పదవికి ఏకంగా రాజీనామా చేశారు. రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతం ఆయ‌న‌ టిడిపిలో చేరేందుకు అవకాశాలు వెతుక్కుంటున్నట్టు తెలుస్తోంది.

అదేవిధంగా అనేకమంది నాయకులు వైసిపికి దూరం కావాలని నిర్ణయించుకున్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇక‌, వైసీపీ ప్రభావం కోల్పోయినట్టే అనే చర్చ అయితే నడుస్తుండడం విశేషం. మరోవైపు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వర్గం ప‌ని అయిపోయింది. కొందరు నాయకులు టిడిపిలో చేరాలని కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎలా చూసుకున్నా తమదే అధికారం అని తమకు తిరుగులేదని భావించిన నాయకులు ఇప్పుడు కంటికి కనిపించకపోవడం గ‌మ‌నార్హం.

This post was last modified on August 22, 2024 10:56 pm

Share
Show comments
Published by
Satya
Tags: YSRCP

Recent Posts

ఉస్తాద్ పాట‌ల వాడ‌కం.. ఎంత ఖ‌ర్చు పెట్టారో?

ఒక‌ప్పుడు పాత సినిమాల పాట‌లను య‌థేచ్ఛ‌గా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవ‌రికీ ఏ అభ్యంత‌రాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…

47 minutes ago

వైసీపీ పంచాంగం.. కేంద్రం ప్లస్.. రాష్ట్రం మైనస్

ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…

3 hours ago

స‌మంత బంగారం కోసం రాజు గారు వ‌స్తారా?

ఒక‌ప్పుడు తెలుగు, త‌మిళంలో టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా ద‌శాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన క‌థానాయిక స‌మంత‌. కానీ కొన్నేళ్లుగా…

4 hours ago

ఆ యూట్యూబర్లకు ‘పరాభవం’ తప్పదట

సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ…

4 hours ago

క‌విత పార్టీకి న్యాయ చిక్కులు… ఏం జరిగింది?

బీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. సొంత పార్టీ పెట్టుకునేందుకు రెడీ అయిన మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె క‌విత త‌న…

6 hours ago

ఫిక్స్… మూడో భాగం ఛాన్స్ లేదు

బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…

6 hours ago