ఏపీ కలల రాజధాని అమరావతి నిర్మాణం.. మళ్లీ పట్టాలెక్కుతోంది. దీనిని వడివడిగా పూర్తి చేసేందుకు సీఎం చంద్రబాబు తన ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే కేంద్రం నుంచి ఏదో ఒక రూపంలో నిధులు సమకూర్చుకునే ప్రయత్నాలు సక్సెస్ అయ్యాయి. త్వరలోనే రూ.15 వేల కోట్ల ను అప్పు రూపంలో కేంద్రం ఇప్పించేందుకు రెడీ అయింది. మరోవైపు.. రాష్ట్ర ప్రభుత్వమే.. సొంతగా మరిన్ని నిధులు సమకూర్చుకునేందుకు ప్రణాళికలు రెడీ చేసుకుంది.
వీటిలో విరాళాల రూపంలో 10 వేల కోట్ల వరకురాబట్టాలని నిర్ణయించింది. గతంలో అమరావతి ఇటుకలు పేరుతో ఒక వినూత్న కార్యక్రమాన్ని అమలు చేసిన విషయం తెలిసిందే. ఆన్లైన్లో అమరావతి నిర్మా ణం కోసం.. ఇటుకలకు విరాళాలు ఇచ్చే కార్యక్రమాన్ని 2017-19 మధ్య కాలంలో జోరుగా సాగించారు. దీనికి ప్రత్యేకంగా అకౌంటు ఏర్పాటు చేసి ఇటుకకు రూ.10 చొప్పున విరాళాల రూపంలో సేకరించారు. దీనికి భారీగానే స్పందన వచ్చింది. దేశవిదేశాల్లోని ఏపీ ప్రజలు.. ఇటుకలకు లక్షల రూపాయల్లో విరాళాలు ఇచ్చారు.
ఇప్పుడు మరోసారి ఇటుకల విరాళాలను ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి.. చంద్రబాబు పాత ప్రణాళికలను కొత్తగా అమలు చేసేందుకు రెడీ అయ్యారు. దీనివల్ల కొంత మేరకు నగదు సమకూరనుంది. ఇదిలావుంటే.. ప్రపంచ బ్యాంకు నుంచి రూ.15 వేల కోట్లను అప్పుగా పుచ్చుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ఇప్పటికే ఇక్కడ పర్యటించి వెళ్లారు. ఇవన్నీ.. ఇలా ఉంటే.. తనకు పరిచయం ఉన్న బౌద్ధమత గురువు.. దలైలామా ద్వారా కూడా అమరావతి నిర్మాణానికి అంతర్జాతీయంగా విరాళాలు సేకరించనున్నట్టు తెలుస్తోంది.
రామచంద్రచౌదరి అనే స్కాలర్ ఒకరు.. తాజాగా ఈ విషయాన్ని వెల్లడించారు. చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలకు బౌద్ధులు కూడా అందివస్తున్నట్టు తెలిపారు. బౌద్ధారామంగా విలసిల్లిన అమరావతిని అభివృద్ధి చేసేందుకు.. దలైలామా నేతృత్వంలో విరాళాలు సేకరిస్తే.. బాగుంటుందని,ఆ దిశగా చంద్రబాబు ప్రయత్నాలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన తెలిపారు. అయితే.. దీనిపై ఇంకా అధికార ప్రకటన ఏమీ రాలేదు. కానీ.. ఇది నిజమేనని అనిపిస్తోంది.
ఎందుకంటే.. గతంలో దలౌలామా.. 2006-7 మధ్య అమరావతిలో బౌద్ధ కార్యక్రమాన్నినిర్వహించారు. సో.. ఆయనకు ఇక్కడి సంగతులు తెలుసు. పైగా బౌద్ధులకు అమరావతి అత్యంత పవిత్ర ప్రాంతంగా కూడా ఉంది. ఈ నేపథ్యంలో రామచంద్రచౌదరి చెప్పిన మాటల్లో వాస్తవం లేకపోలేదు. ఆయన చెబుతున్నట్టు రూ.5 లక్షల కోట్ల వరకు దలైలామా ద్వారా నిధులు సమకూరనున్నాయని అంటున్నారు. పోనీ.. అంత కాకపోయినా.. 50 వేల కోట్లయినా.. సమకూరితే.. అమరావతి పరుగులుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…
హీరోయిన్లు కెరీర్లో కొంచెం కుదురుకోగానే పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న ఎదురవుతుంది మీడియా నుంచి. ఆ తంతు పూర్తయ్యాక తల్లెప్పుడు…
సింగ్ గీతంని విష్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ తన మిత్రుడు రామ్ చరణ్ పెద్దికి మాత్రం ఎలాంటి ట్వీట్ వేయకపోవడం…