Political News

అమ‌రావ‌తికి ద‌లైలామా సాయం.. నిజ‌మేనా ..!

ఏపీ క‌ల‌ల రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణం.. మ‌ళ్లీ ప‌ట్టాలెక్కుతోంది. దీనిని వ‌డివ‌డిగా పూర్తి చేసేందుకు సీఎం చంద్ర‌బాబు త‌న ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసిన‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే కేంద్రం నుంచి ఏదో ఒక రూపంలో నిధులు స‌మ‌కూర్చుకునే ప్ర‌య‌త్నాలు స‌క్సెస్ అయ్యాయి. త్వ‌ర‌లోనే రూ.15 వేల కోట్ల ను అప్పు రూపంలో కేంద్రం ఇప్పించేందుకు రెడీ అయింది. మ‌రోవైపు.. రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే.. సొంత‌గా మ‌రిన్ని నిధులు స‌మ‌కూర్చుకునేందుకు ప్ర‌ణాళిక‌లు రెడీ చేసుకుంది.

వీటిలో విరాళాల రూపంలో 10 వేల కోట్ల వ‌రకురాబ‌ట్టాల‌ని నిర్ణ‌యించింది. గ‌తంలో అమ‌రావ‌తి ఇటుక‌లు పేరుతో ఒక వినూత్న కార్య‌క్ర‌మాన్ని అమలు చేసిన విష‌యం తెలిసిందే. ఆన్‌లైన్‌లో అమ‌రావ‌తి నిర్మా ణం కోసం.. ఇటుక‌ల‌కు విరాళాలు ఇచ్చే కార్య‌క్ర‌మాన్ని 2017-19 మ‌ధ్య కాలంలో జోరుగా సాగించారు. దీనికి ప్ర‌త్యేకంగా అకౌంటు ఏర్పాటు చేసి ఇటుక‌కు రూ.10 చొప్పున విరాళాల రూపంలో సేక‌రించారు. దీనికి భారీగానే స్పందన వ‌చ్చింది. దేశ‌విదేశాల్లోని ఏపీ ప్ర‌జ‌లు.. ఇటుక‌ల‌కు ల‌క్ష‌ల రూపాయ‌ల్లో విరాళాలు ఇచ్చారు.

ఇప్పుడు మ‌రోసారి ఇటుక‌ల విరాళాల‌ను ప్రారంభించ‌నున్నారు. దీనికి సంబంధించి.. చంద్ర‌బాబు పాత ప్రణాళిక‌ల‌ను కొత్త‌గా అమ‌లు చేసేందుకు రెడీ అయ్యారు. దీనివల్ల కొంత మేర‌కు న‌గ‌దు స‌మ‌కూర‌నుంది. ఇదిలావుంటే.. ప్ర‌పంచ బ్యాంకు నుంచి రూ.15 వేల కోట్ల‌ను అప్పుగా పుచ్చుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. ప్ర‌పంచ బ్యాంకు ప్ర‌తినిధులు ఇప్ప‌టికే ఇక్క‌డ ప‌ర్య‌టించి వెళ్లారు. ఇవ‌న్నీ.. ఇలా ఉంటే.. త‌న‌కు ప‌రిచ‌యం ఉన్న బౌద్ధ‌మ‌త గురువు.. ద‌లైలామా ద్వారా కూడా అమ‌రావతి నిర్మాణానికి అంత‌ర్జాతీయంగా విరాళాలు సేక‌రించ‌నున్న‌ట్టు తెలుస్తోంది.

రామ‌చంద్ర‌చౌద‌రి అనే స్కాల‌ర్ ఒక‌రు.. తాజాగా ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. చంద్ర‌బాబు చేస్తున్న ప్ర‌య‌త్నాలకు బౌద్ధులు కూడా అందివ‌స్తున్న‌ట్టు తెలిపారు. బౌద్ధారామంగా విల‌సిల్లిన అమ‌రావ‌తిని అభివృద్ధి చేసేందుకు.. ద‌లైలామా నేతృత్వంలో విరాళాలు సేక‌రిస్తే.. బాగుంటుంద‌ని,ఆ దిశ‌గా చంద్ర‌బాబు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని ఆయ‌న తెలిపారు. అయితే.. దీనిపై ఇంకా అధికార ప్ర‌క‌ట‌న ఏమీ రాలేదు. కానీ.. ఇది నిజ‌మేన‌ని అనిపిస్తోంది.

ఎందుకంటే.. గ‌తంలో ద‌లౌలామా.. 2006-7 మ‌ధ్య అమ‌రావ‌తిలో బౌద్ధ కార్య‌క్ర‌మాన్నినిర్వ‌హించారు. సో.. ఆయ‌న‌కు ఇక్క‌డి సంగ‌తులు తెలుసు. పైగా బౌద్ధుల‌కు అమ‌రావ‌తి అత్యంత ప‌విత్ర ప్రాంతంగా కూడా ఉంది. ఈ నేప‌థ్యంలో రామ‌చంద్ర‌చౌద‌రి చెప్పిన మాటల్లో వాస్త‌వం లేక‌పోలేదు. ఆయ‌న చెబుతున్న‌ట్టు రూ.5 ల‌క్ష‌ల కోట్ల వ‌ర‌కు ద‌లైలామా ద్వారా నిధులు స‌మ‌కూర‌నున్నాయ‌ని అంటున్నారు. పోనీ.. అంత కాక‌పోయినా.. 50 వేల కోట్ల‌యినా.. సమ‌కూరితే.. అమ‌రావ‌తి ప‌రుగులుపెట్ట‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

This post was last modified on August 16, 2024 10:21 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

2 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

5 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

5 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

7 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

9 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

10 hours ago