Political News

‘రండి.. పేద‌ల ఆక‌లి తీర్చండి’

రాష్ట్రంలో ప్రారంభ‌మైన అన్న క్యాంటీన్ల ద్వారా.. పేద‌ల ఆక‌లి మంట‌లు చ‌ల్లారుతాయ‌ని సీఎం చంద్ర బాబు తెలిపారు. గురువారం మ‌ధ్యాహ్నం గుడివాడ‌లో ఆయ‌న రాష్ట్రంలో తొలి అన్న క్యాంటీన్‌ను పునః ప్రారంభించిన విష‌యం తెలిసిందే. అనంత‌రం ఆయ‌న ప్ర‌జ‌ల‌కు ఒక సందేశం ఇచ్చారు. పేద‌ల ఆక‌లి తీర్చేందుకు ప్ర‌భుత్వంతో చేతులు క‌లిపేందుకు అంద‌రూ త‌ర‌లి రావాలంటూ.. ఆయ‌న పిలుపుని చ్చారు. అన్న క్యాంటీన్ల నిర్వ‌హ‌ణ‌కు ప్ర‌జ‌లు స్వ‌చ్ఛందంగా త‌ర‌లి వ‌చ్చి విరాళాలు ఇవ్వాల‌ని ఆయ‌న సూచించారు.

రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 200 పైచిలుకు క్యాంటీన్ల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు చంద్ర‌బాబు పేర్కొన్నారు. స్వాతంత్య్ర దినోత్స‌వాన్ని పుర‌స్కరించుకుని గురువారం తొలి క్యాంటీన్‌ను ప్రారంభించా రు. శుక్ర‌వారం మిగిలిన 99 క్యాంటీన్ల‌ను కూడా ప్రారంభించ‌నున్నారు. ఈ క్ర‌మంలో వ‌చ్చే రెండు మూడు మాసాల్లో మిగిలిన ల‌క్ష్యం కూడా చేరుకుంటున్న‌ట్టు తెలిపారు. సెప్టెంబరు చివరి నాటికి మొత్తం 203 అన్న క్యాంటీన్ లు ప్రారంభించేలా ప్రభుత్వం పనులు చేపట్టిందన్నారు.

అన్న క్యాంటీన్ పున: ప్రారంభంపై మంచి స్పందన వస్తోందని తెలిపారు. సాధారణ ప్రజలు, పారిశ్రామిక వేత్తలు, వృద్ధులు సైతం తరలి వచ్చి అన్న క్యాంటీన్ లకు విరాళాలు ఇస్తున్నారు. బుధవారం ఒక్కరోజే రూ.2 కోట్లకు పైగా విరాళం ప్రభుత్వానికి అందింది. వివిధ వర్గాల ప్రజలు, సంస్థలు విరాళాలు ఇచ్చేందు కు ఆసక్తి చూపుతున్నారు. దీంతో అన్న క్యాంటీన్ ల నిర్వహణ చూస్తన్న మునిసిపల్ శాఖ విరాళాలు తీసుకునేందుకు బ్యాంక్ వివరాలు ప్రకటించింది.

విరాళాలు ఇచ్చే వారు.. ఈ అకౌంట్ కు విరాళాలు పంపవచ్చని ప్రభుత్వం ప్రకటించింది.

Name:- ANNA CANTEENS
A/C.no.37818165097
Branch:- SBI,CHANDRMOULI NAGAR, GUNTUR
IFSC : SBIN0020541

This post was last modified on August 16, 2024 6:07 am

Share
Show comments
Published by
Satya
Tags: Chandrababu

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

2 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

5 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

8 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

8 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

11 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

13 hours ago