రాష్ట్రంలో ప్రారంభమైన అన్న క్యాంటీన్ల ద్వారా.. పేదల ఆకలి మంటలు చల్లారుతాయని సీఎం చంద్ర బాబు తెలిపారు. గురువారం మధ్యాహ్నం గుడివాడలో ఆయన రాష్ట్రంలో తొలి అన్న క్యాంటీన్ను పునః ప్రారంభించిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన ప్రజలకు ఒక సందేశం ఇచ్చారు. పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వంతో చేతులు కలిపేందుకు అందరూ తరలి రావాలంటూ.. ఆయన పిలుపుని చ్చారు. అన్న క్యాంటీన్ల నిర్వహణకు ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చి విరాళాలు ఇవ్వాలని ఆయన సూచించారు.
రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 200 పైచిలుకు క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నట్టు చంద్రబాబు పేర్కొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం తొలి క్యాంటీన్ను ప్రారంభించా రు. శుక్రవారం మిగిలిన 99 క్యాంటీన్లను కూడా ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో వచ్చే రెండు మూడు మాసాల్లో మిగిలిన లక్ష్యం కూడా చేరుకుంటున్నట్టు తెలిపారు. సెప్టెంబరు చివరి నాటికి మొత్తం 203 అన్న క్యాంటీన్ లు ప్రారంభించేలా ప్రభుత్వం పనులు చేపట్టిందన్నారు.
అన్న క్యాంటీన్ పున: ప్రారంభంపై మంచి స్పందన వస్తోందని తెలిపారు. సాధారణ ప్రజలు, పారిశ్రామిక వేత్తలు, వృద్ధులు సైతం తరలి వచ్చి అన్న క్యాంటీన్ లకు విరాళాలు ఇస్తున్నారు. బుధవారం ఒక్కరోజే రూ.2 కోట్లకు పైగా విరాళం ప్రభుత్వానికి అందింది. వివిధ వర్గాల ప్రజలు, సంస్థలు విరాళాలు ఇచ్చేందు కు ఆసక్తి చూపుతున్నారు. దీంతో అన్న క్యాంటీన్ ల నిర్వహణ చూస్తన్న మునిసిపల్ శాఖ విరాళాలు తీసుకునేందుకు బ్యాంక్ వివరాలు ప్రకటించింది.
విరాళాలు ఇచ్చే వారు.. ఈ అకౌంట్ కు విరాళాలు పంపవచ్చని ప్రభుత్వం ప్రకటించింది.
Name:- ANNA CANTEENS
A/C.no.37818165097
Branch:- SBI,CHANDRMOULI NAGAR, GUNTUR
IFSC : SBIN0020541
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…