Political News

జోగి రమేష్, రాజీవ్.. పాత వీడియోలు వైరల్

అధికారంలో ఉన్నపుడు విర్రవీగిన వైసీపీ ముఖ్య నేతల్లో ఒక్కొక్కరిని కూటమి ప్రభుత్వం టార్గెట్ చేస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఇలా అధికారంలోకి రావడం ఆలస్యం వైసీపీ నేతల పని పట్టేయాలని టీడీపీ, జనసేన అభిమానులు ఆవేశపడ్డారు కానీ.. ఈ విషయంలో మరీ దూకుడుగా ఉంటే జనాలకు వేరే సంకేతాలు వెళ్తాయనే ఉద్దేశంతో ప్రభుత్వ పెద్దలు ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.

వైసీపీ నేతల అవినీతి వ్యవహారాల గురించి పూర్తి ఆధారాలు బయటికి తీసి, పక్కాగా కేసుల్లో ఇరికించడానికే చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తొలి టార్గెట్ అయ్యారు. గత ప్రభుత్వ హయాంలో ద్వారంపూడి ఎంతగా రెచ్చిపోయారో తెలిసిందే. ఆయన్ని అవినీతి కేసుల్లో గట్టిగా ఇరికించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాాచారం.

తాజాగా జోగి రమేష్ మీదికి ప్రభుత్వం దృష్టి మళ్లింది. అధికారంలో ఉండగా జోగి రమేష్ ఎలా నోరు పారేసుకున్నారో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌లను ఎలా తిట్టిపోశారో తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వం ఎటాచ్ చేసిన అగ్రిగోల్డ్ భూములను అక్రమంగా కొని విక్రయించి సొమ్ము చేసుకున్న కేసులో జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్‌ను ప్రభుత్వం అరెస్ట్ చేసింది. మరోవైపు టీడీపీ కార్యాలయం మీద దాడి కేసులో రమేష్ నిందితుడిగా ఉన్నారు.

కాగా ఇప్పుడు రాజీవ్ అరెస్ట్ నేపథ్యంలో రమేష్ స్వరం మార్చి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా, కులం కార్డు ప్రయోగిస్తున్నా ఫలితం ఉండట్లేదు. అధికారంలో ఉండగా తండ్రీ కొడుకులు ఎలా విర్రవీగారో తెలియజేసే వీడియోలను టీడీపీ, జనసేన మద్దతుదారులు బయటికి తీస్తున్నారు.

నారా లోకేష్‌ మంగళగిరిలో మట్టికరవబోతున్నాడని.. ఆయన్ని కృష్ణానదిలో కలిపేద్దామని జోగి రమేష్ ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. ఇక రాజీవ్ యుఎస్‌లో చదువుకుని వచ్చాడని, అన్యాయంగా అరెస్ట్ చేశారని అంటున్నారు కానీ.. ఒకప్పుడు అతను చంద్రబాబు ఒక రోగి అని.. ఆయనకు అల్జీమర్స్ ఉందని.. చాలా అభ్యంతరకరంగా మాట్లాడిన వీడియోతో పాటు అతడి ‘అతి’కి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

This post was last modified on August 14, 2024 8:02 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నియోజ‌క‌వ‌ర్గాల‌పై రేవంత్ కొత్త ఫార్ములా… వ‌ర్కువ‌ట్ అయ్యేనా?

2029 పార్ల‌మెంటు ఎన్నిక‌ల నాటికి దేశంలో నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభ‌జించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…

1 minute ago

పెను సంక్షోభంలో ప్ర‌పంచం…!

అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభ‌న ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…

28 minutes ago

రాష్ట్ర‌ప‌తికి బహుమతిగా మంగళగిరి చీర

భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…

50 minutes ago

ఏపీ కొత్త ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌… వైసీపీకి షాకేనా?

ఏపీ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ ప‌ద‌వి ఖాళీ అయింది. గ‌త నెల 31వ తేదీ వ‌ర‌కు ఉన్న రాష్ట్ర…

1 hour ago

‘హోం’ ప్రశ్నలపై ‘సీఎం’ సమాధానం చెప్తారా?

తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…

2 hours ago

కేసీఆర్ వరకు వెళ్లిన సీతక్క పంచాయితీ

తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…

3 hours ago