అధికారంలో ఉన్నపుడు విర్రవీగిన వైసీపీ ముఖ్య నేతల్లో ఒక్కొక్కరిని కూటమి ప్రభుత్వం టార్గెట్ చేస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఇలా అధికారంలోకి రావడం ఆలస్యం వైసీపీ నేతల పని పట్టేయాలని టీడీపీ, జనసేన అభిమానులు ఆవేశపడ్డారు కానీ.. ఈ విషయంలో మరీ దూకుడుగా ఉంటే జనాలకు వేరే సంకేతాలు వెళ్తాయనే ఉద్దేశంతో ప్రభుత్వ పెద్దలు ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.
వైసీపీ నేతల అవినీతి వ్యవహారాల గురించి పూర్తి ఆధారాలు బయటికి తీసి, పక్కాగా కేసుల్లో ఇరికించడానికే చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తొలి టార్గెట్ అయ్యారు. గత ప్రభుత్వ హయాంలో ద్వారంపూడి ఎంతగా రెచ్చిపోయారో తెలిసిందే. ఆయన్ని అవినీతి కేసుల్లో గట్టిగా ఇరికించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాాచారం.
తాజాగా జోగి రమేష్ మీదికి ప్రభుత్వం దృష్టి మళ్లింది. అధికారంలో ఉండగా జోగి రమేష్ ఎలా నోరు పారేసుకున్నారో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లను ఎలా తిట్టిపోశారో తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వం ఎటాచ్ చేసిన అగ్రిగోల్డ్ భూములను అక్రమంగా కొని విక్రయించి సొమ్ము చేసుకున్న కేసులో జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్ను ప్రభుత్వం అరెస్ట్ చేసింది. మరోవైపు టీడీపీ కార్యాలయం మీద దాడి కేసులో రమేష్ నిందితుడిగా ఉన్నారు.
కాగా ఇప్పుడు రాజీవ్ అరెస్ట్ నేపథ్యంలో రమేష్ స్వరం మార్చి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా, కులం కార్డు ప్రయోగిస్తున్నా ఫలితం ఉండట్లేదు. అధికారంలో ఉండగా తండ్రీ కొడుకులు ఎలా విర్రవీగారో తెలియజేసే వీడియోలను టీడీపీ, జనసేన మద్దతుదారులు బయటికి తీస్తున్నారు.
నారా లోకేష్ మంగళగిరిలో మట్టికరవబోతున్నాడని.. ఆయన్ని కృష్ణానదిలో కలిపేద్దామని జోగి రమేష్ ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. ఇక రాజీవ్ యుఎస్లో చదువుకుని వచ్చాడని, అన్యాయంగా అరెస్ట్ చేశారని అంటున్నారు కానీ.. ఒకప్పుడు అతను చంద్రబాబు ఒక రోగి అని.. ఆయనకు అల్జీమర్స్ ఉందని.. చాలా అభ్యంతరకరంగా మాట్లాడిన వీడియోతో పాటు అతడి ‘అతి’కి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
This post was last modified on August 14, 2024 8:02 pm
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నుంచి వచ్చిన చివరి చిత్రం జననాయగన్ మీద అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ…
ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…
మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…
నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…
సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…