Political News

జోగి రమేష్, రాజీవ్.. పాత వీడియోలు వైరల్

అధికారంలో ఉన్నపుడు విర్రవీగిన వైసీపీ ముఖ్య నేతల్లో ఒక్కొక్కరిని కూటమి ప్రభుత్వం టార్గెట్ చేస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఇలా అధికారంలోకి రావడం ఆలస్యం వైసీపీ నేతల పని పట్టేయాలని టీడీపీ, జనసేన అభిమానులు ఆవేశపడ్డారు కానీ.. ఈ విషయంలో మరీ దూకుడుగా ఉంటే జనాలకు వేరే సంకేతాలు వెళ్తాయనే ఉద్దేశంతో ప్రభుత్వ పెద్దలు ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.

వైసీపీ నేతల అవినీతి వ్యవహారాల గురించి పూర్తి ఆధారాలు బయటికి తీసి, పక్కాగా కేసుల్లో ఇరికించడానికే చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తొలి టార్గెట్ అయ్యారు. గత ప్రభుత్వ హయాంలో ద్వారంపూడి ఎంతగా రెచ్చిపోయారో తెలిసిందే. ఆయన్ని అవినీతి కేసుల్లో గట్టిగా ఇరికించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాాచారం.

తాజాగా జోగి రమేష్ మీదికి ప్రభుత్వం దృష్టి మళ్లింది. అధికారంలో ఉండగా జోగి రమేష్ ఎలా నోరు పారేసుకున్నారో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌లను ఎలా తిట్టిపోశారో తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వం ఎటాచ్ చేసిన అగ్రిగోల్డ్ భూములను అక్రమంగా కొని విక్రయించి సొమ్ము చేసుకున్న కేసులో జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్‌ను ప్రభుత్వం అరెస్ట్ చేసింది. మరోవైపు టీడీపీ కార్యాలయం మీద దాడి కేసులో రమేష్ నిందితుడిగా ఉన్నారు.

కాగా ఇప్పుడు రాజీవ్ అరెస్ట్ నేపథ్యంలో రమేష్ స్వరం మార్చి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా, కులం కార్డు ప్రయోగిస్తున్నా ఫలితం ఉండట్లేదు. అధికారంలో ఉండగా తండ్రీ కొడుకులు ఎలా విర్రవీగారో తెలియజేసే వీడియోలను టీడీపీ, జనసేన మద్దతుదారులు బయటికి తీస్తున్నారు.

నారా లోకేష్‌ మంగళగిరిలో మట్టికరవబోతున్నాడని.. ఆయన్ని కృష్ణానదిలో కలిపేద్దామని జోగి రమేష్ ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. ఇక రాజీవ్ యుఎస్‌లో చదువుకుని వచ్చాడని, అన్యాయంగా అరెస్ట్ చేశారని అంటున్నారు కానీ.. ఒకప్పుడు అతను చంద్రబాబు ఒక రోగి అని.. ఆయనకు అల్జీమర్స్ ఉందని.. చాలా అభ్యంతరకరంగా మాట్లాడిన వీడియోతో పాటు అతడి ‘అతి’కి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

This post was last modified on August 14, 2024 8:02 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పందెం కోళ్లు: `అంద‌రూ` క‌లిసిపోయారు …!

నిన్న మొన్న‌టి వ‌ర‌కు కారాలు మిరియాలు నూరుకున్న నాయకులు..ఇప్పుడు ఎంచ‌క్కా చేతులు క‌లిపారు. సంక్రాంతి పుణ్య‌మా అని.. రాష్ట్రంలోని ఉభ‌య‌గోదావ‌రి…

1 hour ago

‘మనుషుల ప్రాణాల కంటే కుక్కలకు విలువ ఎక్కువా ?’

దేశవ్యాప్తంగా వీధికుక్కల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో జరిగిన విచారణలో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మానవ ప్రాణాల భద్రతకు…

2 hours ago

బాబీది టీజర్… అనిల్‌ది ట్రైలర్

ప్రతి అభిమానికీ తన ఆరాధ్య కథానాయకుడిని తెరపై ఒకలా చూసుకోవాలనే ఆశ ఉంటుంది. తన హీరో బలాన్ని గుర్తించి.. తన…

3 hours ago

ఎంపీ ఈటల వర్సెస్ ఎమ్మెల్యే మర్రి

రాజకీయాలలో ప్రజలకు అవసరమైన పనులు చేయడం ఎంత ముఖ్యమో… అందుకు సంబంధించిన క్రెడిట్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. అయితే,…

3 hours ago

చూపు లేకపోయినా చిరంజీవి కోసం

అభిమానానికి ఏదీ అడ్డు కాదు అనడానికి ఇది ఉదాహరణ. కంటి చూపు లేని ఒక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి మీద…

4 hours ago

మారుతి అడ్రస్ ఛాలెంజ్… టోల్ మెటీరియల్ ఐపోయింది

సినిమాను ప్రమోట్ చేయడంలో భాగంగా.. ఈ మధ్య సినీ జనాలు స్టేజ్‌ల మీద పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడం రివాజుగా…

5 hours ago