అధికారంలో ఉన్నపుడు విర్రవీగిన వైసీపీ ముఖ్య నేతల్లో ఒక్కొక్కరిని కూటమి ప్రభుత్వం టార్గెట్ చేస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఇలా అధికారంలోకి రావడం ఆలస్యం వైసీపీ నేతల పని పట్టేయాలని టీడీపీ, జనసేన అభిమానులు ఆవేశపడ్డారు కానీ.. ఈ విషయంలో మరీ దూకుడుగా ఉంటే జనాలకు వేరే సంకేతాలు వెళ్తాయనే ఉద్దేశంతో ప్రభుత్వ పెద్దలు ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.
వైసీపీ నేతల అవినీతి వ్యవహారాల గురించి పూర్తి ఆధారాలు బయటికి తీసి, పక్కాగా కేసుల్లో ఇరికించడానికే చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తొలి టార్గెట్ అయ్యారు. గత ప్రభుత్వ హయాంలో ద్వారంపూడి ఎంతగా రెచ్చిపోయారో తెలిసిందే. ఆయన్ని అవినీతి కేసుల్లో గట్టిగా ఇరికించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాాచారం.
తాజాగా జోగి రమేష్ మీదికి ప్రభుత్వం దృష్టి మళ్లింది. అధికారంలో ఉండగా జోగి రమేష్ ఎలా నోరు పారేసుకున్నారో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లను ఎలా తిట్టిపోశారో తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వం ఎటాచ్ చేసిన అగ్రిగోల్డ్ భూములను అక్రమంగా కొని విక్రయించి సొమ్ము చేసుకున్న కేసులో జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్ను ప్రభుత్వం అరెస్ట్ చేసింది. మరోవైపు టీడీపీ కార్యాలయం మీద దాడి కేసులో రమేష్ నిందితుడిగా ఉన్నారు.
కాగా ఇప్పుడు రాజీవ్ అరెస్ట్ నేపథ్యంలో రమేష్ స్వరం మార్చి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా, కులం కార్డు ప్రయోగిస్తున్నా ఫలితం ఉండట్లేదు. అధికారంలో ఉండగా తండ్రీ కొడుకులు ఎలా విర్రవీగారో తెలియజేసే వీడియోలను టీడీపీ, జనసేన మద్దతుదారులు బయటికి తీస్తున్నారు.
నారా లోకేష్ మంగళగిరిలో మట్టికరవబోతున్నాడని.. ఆయన్ని కృష్ణానదిలో కలిపేద్దామని జోగి రమేష్ ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. ఇక రాజీవ్ యుఎస్లో చదువుకుని వచ్చాడని, అన్యాయంగా అరెస్ట్ చేశారని అంటున్నారు కానీ.. ఒకప్పుడు అతను చంద్రబాబు ఒక రోగి అని.. ఆయనకు అల్జీమర్స్ ఉందని.. చాలా అభ్యంతరకరంగా మాట్లాడిన వీడియోతో పాటు అతడి ‘అతి’కి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…