Political News

‘వైసీపీ ఐపీఎస్‌’ల‌కు అట్టెండన్స్ పనిష్మెంట్

ఏపీలో గ‌త ఐదేళ్ల వైసీపీ పాల‌న‌లో ఆ పార్టీ నాయ‌కుల‌కు అన్ని విధాలా స‌హ‌క‌రించిన‌ట్టుగా టీడీపీ నేత‌ల తో విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న ఐపీఎస్‌లు కొంద‌రు ఉన్నారు. ముఖ్యంగా అప్ప‌టి సీఎం జ‌గ‌న్ చెప్పిన‌ట్టు వీరు ఆడార‌ని.. అన‌వ‌స‌రంగా త‌మ‌పై కేసులు పెట్టి వేధించార‌ని టీడీపీ నాయ‌కులు ప‌లు సంద‌ర్భాల్లో చెప్పు కొచ్చారు. త‌ర్వాత కాలంలో టీడీపీ అధికారంలోకి వ‌చ్చాక ఇలా.. వైసీపీ ఐపీఎస్‌లుగా తాము ఆరోపించిన వారిని బ‌దిలీ చేయ‌డం.. విధుల నుంచి దూరం పెట్ట‌డం తెలిసిందే.

ఇలాంటి వారిలో కీల‌క‌మైన సీఐడీ చీఫ్‌(అప్ప‌టి) సంజ‌య్‌, నిఘా విభాగం చీఫ్ సీతారామాంజ‌నేయులు, విజ‌య‌వాడ క‌మిష‌న‌ర్‌ కాంతిరాణా టాటా, ఐపీఎస్‌లు కొల్లి రఘురామిరెడ్డి, అమ్మిరెడ్డి, గుంటూరు ఎస్పీగా ప‌నిచేసిన విజయరావు, విజ‌య‌వాడ ఏసీపీగా ప‌నిచేసిన విశాల్‌గున్ని, రవిశంకర్‌రెడ్డి, రిషాంత్‌రెడ్డి, రఘువీరారెడ్డి, అనంత‌పురం ఎస్పీగా ప‌నిచేసిన‌ పరమేశ్వర్‌రెడ్డి, కృష్ణాజిల్లా ఎస్పీగా ప‌నిచేసిన‌ జాషువా, కృష్ణకాంత్‌ పటేల్‌, గుంటూరు ఐజీగా ప‌నిచేసిన పాలరాజుల‌ను చంద్ర‌బాబు స‌ర్కారు ప‌క్క‌న పెట్టింది.

వీరికి ఎలాంటి పోస్టింగులు ఇవ్వ‌కుండా.. వీఆర్‌లో ఉంచారు. అంతేకాదు.. వారి హ‌యాంలో జ‌రిగిన అవ‌క త‌వ‌క‌ల‌పైనా విచార‌ణ చేయిస్తున్నారు. ఎవ‌రిపై ఎలాంటి కేసులు పెట్టించార‌నే విష‌యంపైనా కూట‌మి ప్ర‌భుత్వం విచార‌ణ చేయిస్తోంది. దీంతో వారంతా పొరుగు రాష్ట్రాల‌కు వెళ్లిపోయారు. ఒక‌రిద్ద‌రు పొరుగు దేశాల‌కు వెళ్లాల‌ని ప్ర‌య‌త్నించి భంగ ప‌డ్డారు. వీరికి ప్ర‌బుత్వం అనుమ‌తి ఇవ్వ‌లేదు. అయితే.. ఇప్పుడు వీరికి షాకిస్తూ.. చంద్ర‌బాబు స‌ర్కారు మ‌రో ఆదేశం జారీ చేసింది.

వీఆర్‌లో ఉన్న పైన చెప్పుకొన్న ఐపీఎస్‌లు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంట‌ల వరకు మంగ‌ళగిరిలోని డీజీపీ ఆఫీసులోనే ఉండాలని ప్ర‌భుత్వం త‌ర‌ఫున డీజీపీ ద్వార‌కా తిరుమ‌ల రావు ఆదేశించారు. విధులు ముగిశాక అటెండెన్స్‌ రిజిస్టర్‌లో సంతకం చేసి వెళ్లాలని పేర్కొన్నారు. అంతేకాదు.. రోజూ హెడ్‌ క్వార్టర్లలో రిపోర్టు చేయాలని తెలిపారు. ఆఫీసుకు వ‌చ్చి.. వెళ్లిన స‌మ‌యంలో ఏం చేస్తున్నారో కూడా చెప్పాల‌ని పేర్కొన్నారు. దీంతో ఇప్పుడు వారంద‌రికీ న‌ట్లు బిగించిన‌ట్టు అయింద‌ని అంటున్నారు.

This post was last modified on August 14, 2024 4:14 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పెను సంక్షోభంలో ప్ర‌పంచం…!

అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభ‌న ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…

26 minutes ago

రాష్ట్ర‌ప‌తికి బహుమతిగా మంగళగిరి చీర

భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…

49 minutes ago

ఏపీ కొత్త ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌… వైసీపీకి షాకేనా?

ఏపీ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ ప‌ద‌వి ఖాళీ అయింది. గ‌త నెల 31వ తేదీ వ‌ర‌కు ఉన్న రాష్ట్ర…

1 hour ago

‘హోం’ ప్రశ్నలపై ‘సీఎం’ సమాధానం చెప్తారా?

తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…

2 hours ago

కేసీఆర్ వరకు వెళ్లిన సీతక్క పంచాయితీ

తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…

3 hours ago

KVN… అగ్ర సంస్థకు అంతులేని అడ్డంకులు

సౌత్ లో అతి పెద్ద నిర్మాణ సంస్థగా ఎదగాలని ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్. మూలాలు కర్ణాటకనే…

4 hours ago