Political News

నిశ్శ‌బ్ద విప్ల‌వం దిశ‌గా ష‌ర్మిల అడుగులు..!

నిశ్శబ్ద విప్లవం దిశగా షర్మిల అడుగులు వేస్తున్నారు. తన మాటకు తిరుగులేకుండా, తాను చెప్పిందే వేదంగా భావించి నడిచే నాయకులను ఆవిడ తన కోట‌రీలో చేర్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ అంటేనే గ్రూపు రాజకీయాలు చేసే పార్టీగా పేరు ఉంది. తెలంగాణను తీసుకుంటే అక్క‌డ‌ కూడా రేవంత్ రెడ్డి సహా అనేకమంది నాయకులు ఉన్నప్పటికీ గ్రూపు రాజకీయాలు కామన్ గా మారాయి. ఇది ఆది నుంచి ఉన్న ఒక సంస్కృతి. కాంగ్రెస్ అంటేనే గ్రూపు రాజకీయానికి పెట్టింది పేరు.

ఎవరి గ్రూపులు వాళ్ళవి, ఎవరి రాజకీయాలు వాళ్ళవి. అధిష్టానాన్ని మెప్పించి ఒప్పించి పదవులు తెచ్చుకున్న గ్రూపులు, అధిష్టానాన్ని మెప్పించలేక సాధార‌ణ‌ నాయకులుగా మిగిలిపోయిన వారు కూడా కాంగ్రెస్ పార్టీలో ఎక్కువమంది ఉన్నారు. ఈ రకంగా చూసుకుంటే ఇప్పుడు ఏపీలో గ్రూపు రాజకీయాలకు చెక్‌పెట్టి.. తానే ఒక గ్రూప్ గా మారేటటువంటి సంకేతాలు షర్మిల ఇస్తున్నారు. ఏపీ పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి ప్రయత్నంలోనే ఆమెకు అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి. ఈ రెండు ఎన్నికల్లో సత్తా చాటి తన హవాను పెంచుకోవాలని షర్మిల భావించారు.

ఇది తప్పు కాదు. ఏ రాజకీయ నాయకుడైనా తన సత్తా చాటి పైకి రావాలని, ఆధిపత్యం చలాయించాలని, పదవులు అనుభవించాలని కోరుకుంటారు. ఈ క్రమంలోనే షర్మిల కూడా తనవంతు ప్రయత్నం చేసిం ది. అయితే చిత్రంగా తాజా ఎన్నికల్లో ఆమె ఆశించింది ఒకటైతే జరిగింది మరొకటి కావడంతో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అయినప్పటికీ షర్మిల చేస్తున్న ప్రయత్నాలను గమనిస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తన మాటే వేదంగా తను చెప్పిందే శాసనంగా నడిచేలాగా ఆమె వ్యవహరిస్తున్నారు.

ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న చర్చల్లో ఇదే విషయం బహిర్గతమైంది. తను సూచించిన ఒక కీలక నాయకుడికి పలానా పదవిని ఇవ్వాలని ఆమె చెప్పుకొచ్చారు. అయితే ఆయనకే ఎందుకు ఇవ్వాలి అన్న ప్రశ్నకు ఆమె త‌న‌దైన శైలిలో సమాధానం చెప్పినట్టు తెలిసింది. ఆయన పార్టీకి అవసరమని పార్టీలో ఆయనకు చాలా ప్రాధాన్యం ఉందని ఆమె చెప్పుకురావడం, సదరు నాయకుడిని వెనకేసుకు రావడం చూస్తే షర్మిల ఏ స్థాయిలో పట్టు బిగించాలని చూస్తున్నారనేది అర్థమవుతుంది. ఇక గతంలో కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలోనైనా ఇన్చార్జిని నియమించాలన్నా లేక కమిటీలను వేయాలన్న ఒకటికి పది మందితో చర్చించి వారి ద్వారా కూడా జాబితాలు తయారు చేయించుకుని చివరకు పదవులు ఇచ్చే సంస్కృతి ఉంది.

కానీ ఇప్పుడు ఏపీ విషయానికి వస్తే షర్మిల చెప్పిందే వేదంగా మారుతోంది. షర్మిల మినహా ఇప్పటివరకు ఎవరు కూడా మాకు ఈ పదవి కావాలని, లేదు వీరు ఈ పదవి అడుగుతున్నారని గానీ కాంగ్రెస్ అధిష్టానానికి చెప్పింది లేదు. కాబట్టి షర్మిల మునుముందు ఒక నిశ్శబ్ద విప్ల‌వం రూపంలో కాంగ్రెస్ పార్టీలో అధికారం చెలాయించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

This post was last modified on August 14, 2024 3:43 pm

Share

Recent Posts

ప్ర‌పంచ‌పు వింత అంటే ఇదే: యువ‌కుడికి గ‌ర్భాశ‌యం!

మ‌హిళ‌లు మీసాలు పెంచ‌లేర‌ని.. పురుషులు గ‌ర్భాన్ని దాల్చ‌లేర‌ని సామెత‌!. అయితే.. ఇటీవ‌ల కాలంలో ర‌ష్యాకు చెందిన ఓ మ‌హిళ మీసాలు…

23 minutes ago

జగన్ నమ్మకం ఏంటో అర్థం కావట్లేదే!

విశ్వాసం..అతి విశ్వాసం…ఈ రెండింటికి మధ్య ఒక సన్నని గీత ఉంది. ఈ విషయం తెలుసుకోకుండా చాలామంది రాజకీయ నేతలు తొందరపడుతుంటారు…

33 minutes ago

టికెట్ రేట్ల పంచాయితీలో ‘ప్యారడైజ్’ తర్జన భర్జన

ఇంకో 15 రోజుల్లో విడుదల కాబోతున్న ది ప్యారడైజ్ టికెట్ రేట్లకు సంబంధించి ట్రేడ్ వర్గాల్లో చర్చలు మొదలైపోయాయి. పెంచాలా…

1 hour ago

ప్రతీకారానికి ఒక్క నిమిషం చాలు.. కానీ నేను ఆ పని చేయలేదు

వైసీపీ హయాంలో మూడేళ్ల క్రితం జరిగిన తన అరెస్టు ఘటనను ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. నాడు జరిగిన ఘటనలను…

1 hour ago

13 రోజుల చిన్నారికి పాస్పోర్ట్ – రికార్డ్ సృష్టించిన తెలుగు బిడ్డ

పుట్టిన 13 రోజులకే పాస్పోర్ట్ తీసుకోవడం సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతుంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలోని దాసన్నపేటకు చెందిన…

2 hours ago

హీరోయిన్ని వెంటాడిన దుల్కర్ డిజాస్టర్

కొన్ని సినిమాల ఫెయిల్యూర్లు కొందరు కెరీర్ల మీద తీవ్ర ప్రభావమే చూపిస్తుంటాయి. ఒక మూవీలో చాలామంది భాగం అయినా.. కొందరి మీదే ఎక్కువ ప్రభావం…

3 hours ago