Political News

బాబు కీలక నిర్ణయం .. విశాఖ బరికి కూటమి దూరం !

విశాఖ జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి ఉప ఎన్నికల పోటీకి దూరంగా ఉండాలని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ నేతలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో ఆయన ఈ విషయం స్పష్టంచేశారు. ఎన్నికలలో నిలబడి గెలవడం పెద్ద ఇబ్బంది కాకున్నా ఒక ఎమ్మెల్సీ ఎన్నిక కోసం పోటీ చేయడంకన్నా, దానికి దూరంగా ఉండడమే హుందాగా ఉంటుందని చెప్పినట్లు తెలుస్తుంది.

ఉమ్మడి విశాఖలో 60 శాతం పైగా స్థానిక సంస్థల ప్రతినిధులు వైసీపీకి చెందిన వారే ఉన్నారు. అయితే ఇటీవల శాసనసభ, లోక్ సభ ఎన్నికలలో ఎమ్మెల్యేలు, ఎంపీలు పూర్తిగా కూటమికి చెందిన వారు గెలిచారు. కూటమి ఘన విజయంతో విశాఖ కార్పోరేషన్ లోని పలువురు కార్పోరేటర్లు టీడీపీలో చేరారు.

టీడీపీ తరపున శాసనమండలి ఉప ఎన్నికల్లో అభ్యర్థిని బరిలోకి దింపితే గెలిపించుకునేందుకు తమ పరిధిలోని వైసీపీ పార్టీకి చెందిన జడ్పీటీసీలు, ఎంపీటీసీల మద్దతు కూడగట్టే బాధ్యతను తాము తీసుకుంటామని కూటమి తరపున గెలిచిన ఎమ్మెల్యేలు చంద్రబాబుకు భరోసా ఇచ్చారు. అయితే కేవలం ఒక ఉప ఎన్నిక కోసం అంత మంది స్థానిక ప్రజా ప్రతినిధుల మద్దతు కోసం ప్రయత్నించడం బాగుండదు అన్న ఉద్దేశంతో చంద్రబాబు హుందాగా పోటీ చేయడం లేదని ప్రకటించారు.

వైసీపీ తరపున బొత్స సత్యనారాయణ సోమవారం మూడు సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. ప్రస్తుతం కూటమి నుండి ఎవరూ బరిలోకి దిగడం లేదని స్పష్టంచేసిన నేపథ్యంలో బొత్స నామినేషన్ పత్రాలు అన్నీ సక్రమంగా ఉంటే ఆయన గెలుపు ఏకగ్రీవం కానుంది.

This post was last modified on August 13, 2024 1:02 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

2 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

2 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

4 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

4 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

5 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

6 hours ago