విశాఖ జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి ఉప ఎన్నికల పోటీకి దూరంగా ఉండాలని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ నేతలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో ఆయన ఈ విషయం స్పష్టంచేశారు. ఎన్నికలలో నిలబడి గెలవడం పెద్ద ఇబ్బంది కాకున్నా ఒక ఎమ్మెల్సీ ఎన్నిక కోసం పోటీ చేయడంకన్నా, దానికి దూరంగా ఉండడమే హుందాగా ఉంటుందని చెప్పినట్లు తెలుస్తుంది.
ఉమ్మడి విశాఖలో 60 శాతం పైగా స్థానిక సంస్థల ప్రతినిధులు వైసీపీకి చెందిన వారే ఉన్నారు. అయితే ఇటీవల శాసనసభ, లోక్ సభ ఎన్నికలలో ఎమ్మెల్యేలు, ఎంపీలు పూర్తిగా కూటమికి చెందిన వారు గెలిచారు. కూటమి ఘన విజయంతో విశాఖ కార్పోరేషన్ లోని పలువురు కార్పోరేటర్లు టీడీపీలో చేరారు.
టీడీపీ తరపున శాసనమండలి ఉప ఎన్నికల్లో అభ్యర్థిని బరిలోకి దింపితే గెలిపించుకునేందుకు తమ పరిధిలోని వైసీపీ పార్టీకి చెందిన జడ్పీటీసీలు, ఎంపీటీసీల మద్దతు కూడగట్టే బాధ్యతను తాము తీసుకుంటామని కూటమి తరపున గెలిచిన ఎమ్మెల్యేలు చంద్రబాబుకు భరోసా ఇచ్చారు. అయితే కేవలం ఒక ఉప ఎన్నిక కోసం అంత మంది స్థానిక ప్రజా ప్రతినిధుల మద్దతు కోసం ప్రయత్నించడం బాగుండదు అన్న ఉద్దేశంతో చంద్రబాబు హుందాగా పోటీ చేయడం లేదని ప్రకటించారు.
వైసీపీ తరపున బొత్స సత్యనారాయణ సోమవారం మూడు సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. ప్రస్తుతం కూటమి నుండి ఎవరూ బరిలోకి దిగడం లేదని స్పష్టంచేసిన నేపథ్యంలో బొత్స నామినేషన్ పత్రాలు అన్నీ సక్రమంగా ఉంటే ఆయన గెలుపు ఏకగ్రీవం కానుంది.
This post was last modified on August 13, 2024 1:02 pm
తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…
తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…
సౌత్ లో అతి పెద్ద నిర్మాణ సంస్థగా ఎదగాలని ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్. మూలాలు కర్ణాటకనే…
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో సాంకేతికత సరికొత్త ఒరవడిని సృష్టిస్తోంది. టీవీకే అధినేత విజయ్ ప్రత్యక్షంగా అన్ని నియోజకవర్గాలను సందర్శించడం కష్టంగా…
ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టిక చూస్తుంటే రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి 'రాజసం' ఉట్టిపడేలా ఉంది. ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ గెలిచి…
ఇండస్ట్రీకి లీకులు కొత్త కాదు. నిన్నటికి నిన్న జన నాయగన్ సినిమానే బయటికొచ్చింది. పైరసీని కట్టడి చేశారు కానీ భారీ…