విశాఖ జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి ఉప ఎన్నికల పోటీకి దూరంగా ఉండాలని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ నేతలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో ఆయన ఈ విషయం స్పష్టంచేశారు. ఎన్నికలలో నిలబడి గెలవడం పెద్ద ఇబ్బంది కాకున్నా ఒక ఎమ్మెల్సీ ఎన్నిక కోసం పోటీ చేయడంకన్నా, దానికి దూరంగా ఉండడమే హుందాగా ఉంటుందని చెప్పినట్లు తెలుస్తుంది.
ఉమ్మడి విశాఖలో 60 శాతం పైగా స్థానిక సంస్థల ప్రతినిధులు వైసీపీకి చెందిన వారే ఉన్నారు. అయితే ఇటీవల శాసనసభ, లోక్ సభ ఎన్నికలలో ఎమ్మెల్యేలు, ఎంపీలు పూర్తిగా కూటమికి చెందిన వారు గెలిచారు. కూటమి ఘన విజయంతో విశాఖ కార్పోరేషన్ లోని పలువురు కార్పోరేటర్లు టీడీపీలో చేరారు.
టీడీపీ తరపున శాసనమండలి ఉప ఎన్నికల్లో అభ్యర్థిని బరిలోకి దింపితే గెలిపించుకునేందుకు తమ పరిధిలోని వైసీపీ పార్టీకి చెందిన జడ్పీటీసీలు, ఎంపీటీసీల మద్దతు కూడగట్టే బాధ్యతను తాము తీసుకుంటామని కూటమి తరపున గెలిచిన ఎమ్మెల్యేలు చంద్రబాబుకు భరోసా ఇచ్చారు. అయితే కేవలం ఒక ఉప ఎన్నిక కోసం అంత మంది స్థానిక ప్రజా ప్రతినిధుల మద్దతు కోసం ప్రయత్నించడం బాగుండదు అన్న ఉద్దేశంతో చంద్రబాబు హుందాగా పోటీ చేయడం లేదని ప్రకటించారు.
వైసీపీ తరపున బొత్స సత్యనారాయణ సోమవారం మూడు సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. ప్రస్తుతం కూటమి నుండి ఎవరూ బరిలోకి దిగడం లేదని స్పష్టంచేసిన నేపథ్యంలో బొత్స నామినేషన్ పత్రాలు అన్నీ సక్రమంగా ఉంటే ఆయన గెలుపు ఏకగ్రీవం కానుంది.
This post was last modified on August 13, 2024 1:02 pm
ఏపీలో మెడికల్ కాలేజీల అంశంపై పెద్ద దుమారమే రేగుతోంది. కోటి సంతకాల పేరుతో రెండు నెలల పాటు వైసీపీ ఈ…
వైసీపీ పాలనలో ప్రజాధనం నీళ్లలా ఖర్చుపెట్టారని, జనం సొమ్మును దుబారా చేయడంలో మాజీ సీఎం జగన్ ఏ అవకాశం వదలలేదని…
మాములుగా ప్రభాస్ కొత్త సినిమా వస్తోందంటే ఆ యుఫోరియా వేరే లెవెల్ లో ఉంటుంది. సలార్ కు పెద్దగా ప్రమోషన్లు…
రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మించేందుకు వ్యతిరేకంగా వైసీపీ నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కోటి…
బాలీవుడ్ స్టార్లు ప్రైవేటు పెళ్లిళ్లకు వెళ్లి డ్యాన్సులు చేయడం ఎప్పట్నుంచో ఉన్న సంప్రదాయమే. అందుకోసం భారీగా పారితోషకాలు అందుకుంటూ ఉంటారు. షారుఖ్…
సినీ జనాలు తమ కెరీర్లో ఏదైనా పెద్ద డిజాస్టర్ ఎదురైనపుడు.. దాని గురించి తర్వాతి రోజుల్లో మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడరు.…