Political News

దువ్వాడ-మాధురి పరిచయం ‘గడప గడప’లోనట

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చర్చనీయాంశం అంటే.. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు మాధురి అనే నడి వయస్సు మహిళతో బంధం గురించే. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యతో పాటు యుక్త వయసుకు వచ్చిన ఇద్దరు కూతుళ్లను వదిలేసి ఆయన కొన్నేళ్ల కిందట పరిచయం అయిన మాధురితో ఉంటున్నారు. దీనిపై ఆయన భార్యాపిల్లలు గొడవ చేస్తున్నారు.

వాళ్ల మీద శ్రీనివాస్ దాడికి కూడా ప్రయత్నించారు. కట్ చేస్తే అసలు కొన్నేళ్ల ముందు వరకు భార్యా పిల్లలతో ఎంతో అన్యోన్యంగా ఉన్న శ్రీనివాస్ ఇప్పుడిలా ఎందుకు తయారయ్యాడు అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. మాధురికి పెళ్లయింది. ఆమె విడాకులు కూడా తీసుకోలేదు. మరి వీరి మధ్య బంధం ఎలా మొదలైంది అన్నది ఆసక్తికరం. దీనికి ఓ టీవీ ఛానెల్ చర్చలో సమాధానం దొరికింది.

వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘గడప గడపకు ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా శ్రీనివాస్, మాధురిల పరిచయం జరిగిందట. అప్పట్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ నియోజకవర్గాల్లోని ప్రతి ఇంటికీ వెళ్లి జనాలను పలకరిస్తూ.. వారికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని వాకబు చేయడం, ప్రభుత్వం గురించి సానుకూల అభిప్రాయం ఏర్పడేలా చేయడం తెలిసిందే.

ఆ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంట్లో ఎవరెవరు ఉన్నారు.. వాళ్లు ఏం చేస్తున్నారు అన్నది కనుక్కొన్నారు. ఆ క్రమంలోనే శ్రీనివాస్.. మాధురి ఇంటికి వెళ్లినపుడు తన భర్త యుఎస్‌లో ఉంటున్నారని, ఆమె ఒంటరిగా ఉన్నట్లు తెలిసిందట. స్వయంగా మాధురినే తనకు, శ్రీనివాస్‌కు గడప గడపకు కార్యక్రమంలో పరిచయం జరిగిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పడం గమనార్హం.

అలా మొదలైన పరిచయంతో.. శ్రీనివాస్ తన భార్యా పిల్లల్ని వదిలేసి ఆమెతో సెటిలవ్వడమే కాదు.. వైసీపీలో ఓ పదవి ఇప్పించి ఐప్యాక్ టీంను నడిపించే వరకు తీసుకెళ్లింది. ఈ విషయం తెలిసి వైసీపీ వాళ్లు గడప గడపకు కార్యక్రమాన్ని ఇలా ఉపయోగించుకున్నారా, విజయవంతం చేశారా అని సోషల్ మీడియాలో కౌంటర్లు పడుతున్నాయి.

This post was last modified on August 13, 2024 9:45 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పదిహేనేళ్ల దీదీ కంచు కోట ఎలా బద్దలైంది?

తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ… అసెంబ్లీ ఎన్నికల్లో వెనుకబడిపోయారు. బెంగాల్ ను పదిహేనేళ్లుగా పాలిస్తూ…

2 hours ago

మూడో స్పీడ్ బ్రేకర్ ఏం చెబుతోంది

గత ఏడాది సింగల్ సక్సెస్ తో ట్రాక్ లో పడిన శ్రీవిష్ణుకి అతి తక్కువ గ్యాప్ లో మూడు వరస…

3 hours ago

విజయ్ విజయాన్ని ఏడాది ముందే పసిగట్టిన పీకే

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఘన విజయం సాధించే దిశగా దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధినేత, కోలీవుడ్…

4 hours ago

ఈసారి బీజేపీ బౌండరీ కొట్టింది

దేశంలో ఐదు రాష్ట్రాలకు (ఒకటి కేంద్ర పాలిత అసెంబ్లీ ఉన్న పుదుచ్చేరి) జరిగిన ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో అప్రతిహత…

6 hours ago

టీవీకే విజయ్ డబుల్ బొనాంజా

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఘన విజయం సాధించే దిశగా దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధినేత, కోలీవుడ్…

7 hours ago

మంచి అవకాశం వదిలేస్తావా బంగారం

సమంత మా ఇంటి బంగారం మే 15 రావడం లేదు. ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు కానీ ప్రమోషన్స్ నాలుగైదు…

7 hours ago