ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చర్చనీయాంశం అంటే.. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్కు మాధురి అనే నడి వయస్సు మహిళతో బంధం గురించే. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యతో పాటు యుక్త వయసుకు వచ్చిన ఇద్దరు కూతుళ్లను వదిలేసి ఆయన కొన్నేళ్ల కిందట పరిచయం అయిన మాధురితో ఉంటున్నారు. దీనిపై ఆయన భార్యాపిల్లలు గొడవ చేస్తున్నారు.
వాళ్ల మీద శ్రీనివాస్ దాడికి కూడా ప్రయత్నించారు. కట్ చేస్తే అసలు కొన్నేళ్ల ముందు వరకు భార్యా పిల్లలతో ఎంతో అన్యోన్యంగా ఉన్న శ్రీనివాస్ ఇప్పుడిలా ఎందుకు తయారయ్యాడు అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. మాధురికి పెళ్లయింది. ఆమె విడాకులు కూడా తీసుకోలేదు. మరి వీరి మధ్య బంధం ఎలా మొదలైంది అన్నది ఆసక్తికరం. దీనికి ఓ టీవీ ఛానెల్ చర్చలో సమాధానం దొరికింది.
వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘గడప గడపకు ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా శ్రీనివాస్, మాధురిల పరిచయం జరిగిందట. అప్పట్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ నియోజకవర్గాల్లోని ప్రతి ఇంటికీ వెళ్లి జనాలను పలకరిస్తూ.. వారికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని వాకబు చేయడం, ప్రభుత్వం గురించి సానుకూల అభిప్రాయం ఏర్పడేలా చేయడం తెలిసిందే.
ఆ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంట్లో ఎవరెవరు ఉన్నారు.. వాళ్లు ఏం చేస్తున్నారు అన్నది కనుక్కొన్నారు. ఆ క్రమంలోనే శ్రీనివాస్.. మాధురి ఇంటికి వెళ్లినపుడు తన భర్త యుఎస్లో ఉంటున్నారని, ఆమె ఒంటరిగా ఉన్నట్లు తెలిసిందట. స్వయంగా మాధురినే తనకు, శ్రీనివాస్కు గడప గడపకు కార్యక్రమంలో పరిచయం జరిగిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పడం గమనార్హం.
అలా మొదలైన పరిచయంతో.. శ్రీనివాస్ తన భార్యా పిల్లల్ని వదిలేసి ఆమెతో సెటిలవ్వడమే కాదు.. వైసీపీలో ఓ పదవి ఇప్పించి ఐప్యాక్ టీంను నడిపించే వరకు తీసుకెళ్లింది. ఈ విషయం తెలిసి వైసీపీ వాళ్లు గడప గడపకు కార్యక్రమాన్ని ఇలా ఉపయోగించుకున్నారా, విజయవంతం చేశారా అని సోషల్ మీడియాలో కౌంటర్లు పడుతున్నాయి.
This post was last modified on August 13, 2024 9:45 am
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…
వైసీపీ అధినేత జగన్ పలువురు కీలక రాజకీయ వ్యూహకర్తలతో భేటీ అయ్యారా? వచ్చే ఎన్నికలు.. దీనికి ముందు ఆయన చేయనున్న…