ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చర్చనీయాంశం అంటే.. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్కు మాధురి అనే నడి వయస్సు మహిళతో బంధం గురించే. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యతో పాటు యుక్త వయసుకు వచ్చిన ఇద్దరు కూతుళ్లను వదిలేసి ఆయన కొన్నేళ్ల కిందట పరిచయం అయిన మాధురితో ఉంటున్నారు. దీనిపై ఆయన భార్యాపిల్లలు గొడవ చేస్తున్నారు.
వాళ్ల మీద శ్రీనివాస్ దాడికి కూడా ప్రయత్నించారు. కట్ చేస్తే అసలు కొన్నేళ్ల ముందు వరకు భార్యా పిల్లలతో ఎంతో అన్యోన్యంగా ఉన్న శ్రీనివాస్ ఇప్పుడిలా ఎందుకు తయారయ్యాడు అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. మాధురికి పెళ్లయింది. ఆమె విడాకులు కూడా తీసుకోలేదు. మరి వీరి మధ్య బంధం ఎలా మొదలైంది అన్నది ఆసక్తికరం. దీనికి ఓ టీవీ ఛానెల్ చర్చలో సమాధానం దొరికింది.
వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘గడప గడపకు ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా శ్రీనివాస్, మాధురిల పరిచయం జరిగిందట. అప్పట్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ నియోజకవర్గాల్లోని ప్రతి ఇంటికీ వెళ్లి జనాలను పలకరిస్తూ.. వారికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని వాకబు చేయడం, ప్రభుత్వం గురించి సానుకూల అభిప్రాయం ఏర్పడేలా చేయడం తెలిసిందే.
ఆ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంట్లో ఎవరెవరు ఉన్నారు.. వాళ్లు ఏం చేస్తున్నారు అన్నది కనుక్కొన్నారు. ఆ క్రమంలోనే శ్రీనివాస్.. మాధురి ఇంటికి వెళ్లినపుడు తన భర్త యుఎస్లో ఉంటున్నారని, ఆమె ఒంటరిగా ఉన్నట్లు తెలిసిందట. స్వయంగా మాధురినే తనకు, శ్రీనివాస్కు గడప గడపకు కార్యక్రమంలో పరిచయం జరిగిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పడం గమనార్హం.
అలా మొదలైన పరిచయంతో.. శ్రీనివాస్ తన భార్యా పిల్లల్ని వదిలేసి ఆమెతో సెటిలవ్వడమే కాదు.. వైసీపీలో ఓ పదవి ఇప్పించి ఐప్యాక్ టీంను నడిపించే వరకు తీసుకెళ్లింది. ఈ విషయం తెలిసి వైసీపీ వాళ్లు గడప గడపకు కార్యక్రమాన్ని ఇలా ఉపయోగించుకున్నారా, విజయవంతం చేశారా అని సోషల్ మీడియాలో కౌంటర్లు పడుతున్నాయి.
This post was last modified on August 13, 2024 9:45 am
తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…
తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…
సౌత్ లో అతి పెద్ద నిర్మాణ సంస్థగా ఎదగాలని ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్. మూలాలు కర్ణాటకనే…
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో సాంకేతికత సరికొత్త ఒరవడిని సృష్టిస్తోంది. టీవీకే అధినేత విజయ్ ప్రత్యక్షంగా అన్ని నియోజకవర్గాలను సందర్శించడం కష్టంగా…
ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టిక చూస్తుంటే రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి 'రాజసం' ఉట్టిపడేలా ఉంది. ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ గెలిచి…
ఇండస్ట్రీకి లీకులు కొత్త కాదు. నిన్నటికి నిన్న జన నాయగన్ సినిమానే బయటికొచ్చింది. పైరసీని కట్టడి చేశారు కానీ భారీ…