ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చర్చనీయాంశం అంటే.. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్కు మాధురి అనే నడి వయస్సు మహిళతో బంధం గురించే. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యతో పాటు యుక్త వయసుకు వచ్చిన ఇద్దరు కూతుళ్లను వదిలేసి ఆయన కొన్నేళ్ల కిందట పరిచయం అయిన మాధురితో ఉంటున్నారు. దీనిపై ఆయన భార్యాపిల్లలు గొడవ చేస్తున్నారు.
వాళ్ల మీద శ్రీనివాస్ దాడికి కూడా ప్రయత్నించారు. కట్ చేస్తే అసలు కొన్నేళ్ల ముందు వరకు భార్యా పిల్లలతో ఎంతో అన్యోన్యంగా ఉన్న శ్రీనివాస్ ఇప్పుడిలా ఎందుకు తయారయ్యాడు అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. మాధురికి పెళ్లయింది. ఆమె విడాకులు కూడా తీసుకోలేదు. మరి వీరి మధ్య బంధం ఎలా మొదలైంది అన్నది ఆసక్తికరం. దీనికి ఓ టీవీ ఛానెల్ చర్చలో సమాధానం దొరికింది.
వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘గడప గడపకు ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా శ్రీనివాస్, మాధురిల పరిచయం జరిగిందట. అప్పట్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ నియోజకవర్గాల్లోని ప్రతి ఇంటికీ వెళ్లి జనాలను పలకరిస్తూ.. వారికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని వాకబు చేయడం, ప్రభుత్వం గురించి సానుకూల అభిప్రాయం ఏర్పడేలా చేయడం తెలిసిందే.
ఆ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంట్లో ఎవరెవరు ఉన్నారు.. వాళ్లు ఏం చేస్తున్నారు అన్నది కనుక్కొన్నారు. ఆ క్రమంలోనే శ్రీనివాస్.. మాధురి ఇంటికి వెళ్లినపుడు తన భర్త యుఎస్లో ఉంటున్నారని, ఆమె ఒంటరిగా ఉన్నట్లు తెలిసిందట. స్వయంగా మాధురినే తనకు, శ్రీనివాస్కు గడప గడపకు కార్యక్రమంలో పరిచయం జరిగిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పడం గమనార్హం.
అలా మొదలైన పరిచయంతో.. శ్రీనివాస్ తన భార్యా పిల్లల్ని వదిలేసి ఆమెతో సెటిలవ్వడమే కాదు.. వైసీపీలో ఓ పదవి ఇప్పించి ఐప్యాక్ టీంను నడిపించే వరకు తీసుకెళ్లింది. ఈ విషయం తెలిసి వైసీపీ వాళ్లు గడప గడపకు కార్యక్రమాన్ని ఇలా ఉపయోగించుకున్నారా, విజయవంతం చేశారా అని సోషల్ మీడియాలో కౌంటర్లు పడుతున్నాయి.
బాలీవుడ్లో దీపికా పదుకొనే, ఆలియా భట్ లాంటి హై ప్రొఫైల్ హీరోయిన్ల పోటీని తట్టుకుని చాలా ఏళ్లుగా టాప్లో కొనసాగుతున్న…
జింబాబ్వే పర్యటన కోసం ఎంపిక చేసిన భారత జట్టులో ఎడమచేతి వాటం బ్యాటర్లదే ఆధిపత్యం నడుస్తోంది. కుర్రాడు వైభవ్ సూర్యవంశీతో…
ఇటీవలే విడుదలైన నాగబంధంకు అంత ఓపెనింగ్స్ వస్తాయని ఊహించినవాళ్లు చాలా తక్కువ. ఎంత విజువల్ ఎఫెక్ట్స్ తో తీసిన సినిమా…
రెండు సంవత్సరాలకు పైగా మోక్షం కోసం ఎదురు చూస్తున్న విశ్వంభర విడుదలకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇప్పటికే ఆలస్యం వల్ల హైప్…
కాపు నాయకుడు, మాజీ ఎమ్మెల్యే.. దివంగత వంగవీటి మోహన్రంగా కుమార్తె ఆశాలత త్వరలోనే జనసేన పార్టీ తీర్థం పుచ్చు కోనున్నారా?…
ఫుట్బాల్ ప్రపంచాన్ని దశాబ్దాల పాటు శాసించిన క్రిస్టియానో రొనాల్డో శకం కన్నీటితో ముగిసింది. 2026 ఫిఫా వరల్డ్ కప్ ప్రీ…