Political News

ష‌ర్మిల చేత‌.. ష‌ర్మిల వ‌ల‌న‌.. ఇప్ప‌టికైతే ఇంతే!!

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ ష‌ర్మిల హ‌వాకు బ్రేకులు వేయాల‌న్న కొంద‌రు నేత‌ల ప్ర‌య‌త్నాలు ఇప్ప‌టికైతే ఫ‌లించేలా క‌నిపించ‌డం లేదు. తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో ష‌ర్మిల త‌న సొంత అజెండాను అమలు చేశారని, ఆమె క్షేత్ర‌స్థాయిలో ప‌రిణామాల‌ను, ప‌రిస్థితుల‌ను అంచ‌నా వేయ‌కుండా.. త‌న ఇష్టానుసారం వ్య‌వ‌హరించార‌ని దీంతో పార్టీకి ఎలాంటి ప్ర‌యోజ‌నం క‌ల‌గ‌లేద‌ని ఆరోపిస్తూ.. రాష్ట్రానికి చెందిన నాయ‌కులు ఫిర్యాదులు చేశారు. వీరిలో కొంద‌రు మ‌హిళా నాయ‌కులు కూడా ఉన్నారు.

అయితే.. వాటిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం.. ప‌క్క‌న పెట్టింది. పైగా ఫిర్యాదులు చేసిన వారినే పార్టీ నుంచి త‌ప్పించింది. ఇక‌, ఇప్పుడు ష‌ర్మిల సుమారు 60 మంది నేత‌ల జాబితాతో ఢిల్లీకి చేరుకున్నారు. రాష్ట్రంలో ని ప‌లు కీల‌క ప‌ద‌వులు, జిల్లాల్లో పార్టీ అధ్య‌క్షుల‌ను ఎంపిక చేసి.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి పార్టీని డెవ‌ల‌ప్ చేయాల‌న్న‌ది ఆమె వ్యూహం. వాస్త‌వానికి రాష్ట్ర పార్టీపై జాతీయ నాయ‌కుల ముద్ర ఉంటుంది. అందుకే.. క్షేత్ర‌స్థాయిలో ఒక‌ప్పుడు పార్టీ అధిష్టానాన్నిమెప్పించి సొంతంగా ప‌ద‌వులు తెచ్చుకున్నారు.

అయితే..ఇప్పుడు మాత్రం క్షేత్ర‌స్థాయి నుంచి నాయ‌కులు ఎలాంటి ప్ర‌తిపాద‌న‌లు చేయ‌లేదు. ఎవ‌రూ వెళ్లి.. అధిష్టానాన్ని ర‌హ‌స్యంగా క‌లుసుకున్న‌ది కూడాలేదు. అంతా ష‌ర్మిల చేత‌, ష‌ర్మిల వ‌ల‌న‌.. అన్న‌ట్టు గానే ఏపీ కాంగ్రెస్ పార్టీ మారిపోయింది. కానీ, ఆమె దూకుడు వ్య‌క్తిగ‌త ఇమేజ్‌ను పెంచిన స్థాయిలోను, వ్య‌క్తిగ‌తంగా ఆమెకు వ‌చ్చిన మార్కుల స్థాయిలోనూ.. పార్టీకి రాలేక పోయాయి. ఇది వాస్త‌వం. భారీ ఎత్తున 20-30 శాతం స్థాయిలో ఓటు బ్యాంకు పెరుగుతుంద‌ని అనుకున్నా రాలేదు.

ఈ క్ర‌మంలో ష‌ర్మిల విఫ‌ల‌మైంద‌న్న వాద‌న సొంత గూటి నుంచి సుంక‌ర ప‌ద్మ‌శ్రీ వంటి వారు.. ప‌ళ్లం రాజు వంటి సీనియ‌ర్లు వినిపించినా.. ఫ‌లించ‌డం లేదు. త‌న‌కు పార్టీ ప‌గ్గాలు ఇచ్చి ముచ్చ‌ట‌గా మూడు మాసాలే అయింద‌ని.. అయినా తాను దూకుడుగానే ఉన్నాన‌ని ష‌ర్మిల చెప్పుకొంటున్నారు. దీనిని అధిష్టానం కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంది. సో.. ఏపీలో ఏర్పాటు చేసే క‌మిటీలు, ఇత‌ర పార్టీ కీల‌క ప‌ద‌వుల విష‌యంలో ష‌ర్మిలదే ఫైన‌ల్ నిర్ణ‌యం కావొచ్చ‌ని తెలుస్తోంది.

ఇదిలావుంటే.. ఏపీ కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడిగా.. ర‌ఘువీరారెడ్డి పేరు వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ష‌ర్మిల ఈ పేరును ప్ర‌పోజ్ చేశార‌ని, దీనికి పార్టీ కూడా ఓకే చెప్పే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on August 12, 2024 12:13 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఉస్తాద్ పాట‌ల వాడ‌కం.. ఎంత ఖ‌ర్చు పెట్టారో?

ఒక‌ప్పుడు పాత సినిమాల పాట‌లను య‌థేచ్ఛ‌గా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవ‌రికీ ఏ అభ్యంత‌రాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…

22 minutes ago

వైసీపీ పంచాంగం.. కేంద్రం ప్లస్.. రాష్ట్రం మైనస్

ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…

3 hours ago

స‌మంత బంగారం కోసం రాజు గారు వ‌స్తారా?

ఒక‌ప్పుడు తెలుగు, త‌మిళంలో టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా ద‌శాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన క‌థానాయిక స‌మంత‌. కానీ కొన్నేళ్లుగా…

4 hours ago

ఆ యూట్యూబర్లకు ‘పరాభవం’ తప్పదట

సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ…

4 hours ago

క‌విత పార్టీకి న్యాయ చిక్కులు… ఏం జరిగింది?

బీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. సొంత పార్టీ పెట్టుకునేందుకు రెడీ అయిన మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె క‌విత త‌న…

6 hours ago

ఫిక్స్… మూడో భాగం ఛాన్స్ లేదు

బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…

6 hours ago