ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల హవాకు బ్రేకులు వేయాలన్న కొందరు నేతల ప్రయత్నాలు ఇప్పటికైతే ఫలించేలా కనిపించడం లేదు. తాజాగా జరిగిన ఎన్నికల్లో షర్మిల తన సొంత అజెండాను అమలు చేశారని, ఆమె క్షేత్రస్థాయిలో పరిణామాలను, పరిస్థితులను అంచనా వేయకుండా.. తన ఇష్టానుసారం వ్యవహరించారని దీంతో పార్టీకి ఎలాంటి ప్రయోజనం కలగలేదని ఆరోపిస్తూ.. రాష్ట్రానికి చెందిన నాయకులు ఫిర్యాదులు చేశారు. వీరిలో కొందరు మహిళా నాయకులు కూడా ఉన్నారు.
అయితే.. వాటిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం.. పక్కన పెట్టింది. పైగా ఫిర్యాదులు చేసిన వారినే పార్టీ నుంచి తప్పించింది. ఇక, ఇప్పుడు షర్మిల సుమారు 60 మంది నేతల జాబితాతో ఢిల్లీకి చేరుకున్నారు. రాష్ట్రంలో ని పలు కీలక పదవులు, జిల్లాల్లో పార్టీ అధ్యక్షులను ఎంపిక చేసి.. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని డెవలప్ చేయాలన్నది ఆమె వ్యూహం. వాస్తవానికి రాష్ట్ర పార్టీపై జాతీయ నాయకుల ముద్ర ఉంటుంది. అందుకే.. క్షేత్రస్థాయిలో ఒకప్పుడు పార్టీ అధిష్టానాన్నిమెప్పించి సొంతంగా పదవులు తెచ్చుకున్నారు.
అయితే..ఇప్పుడు మాత్రం క్షేత్రస్థాయి నుంచి నాయకులు ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదు. ఎవరూ వెళ్లి.. అధిష్టానాన్ని రహస్యంగా కలుసుకున్నది కూడాలేదు. అంతా షర్మిల చేత, షర్మిల వలన.. అన్నట్టు గానే ఏపీ కాంగ్రెస్ పార్టీ మారిపోయింది. కానీ, ఆమె దూకుడు వ్యక్తిగత ఇమేజ్ను పెంచిన స్థాయిలోను, వ్యక్తిగతంగా ఆమెకు వచ్చిన మార్కుల స్థాయిలోనూ.. పార్టీకి రాలేక పోయాయి. ఇది వాస్తవం. భారీ ఎత్తున 20-30 శాతం స్థాయిలో ఓటు బ్యాంకు పెరుగుతుందని అనుకున్నా రాలేదు.
ఈ క్రమంలో షర్మిల విఫలమైందన్న వాదన సొంత గూటి నుంచి సుంకర పద్మశ్రీ వంటి వారు.. పళ్లం రాజు వంటి సీనియర్లు వినిపించినా.. ఫలించడం లేదు. తనకు పార్టీ పగ్గాలు ఇచ్చి ముచ్చటగా మూడు మాసాలే అయిందని.. అయినా తాను దూకుడుగానే ఉన్నానని షర్మిల చెప్పుకొంటున్నారు. దీనిని అధిష్టానం కూడా పరిగణనలోకి తీసుకుంది. సో.. ఏపీలో ఏర్పాటు చేసే కమిటీలు, ఇతర పార్టీ కీలక పదవుల విషయంలో షర్మిలదే ఫైనల్ నిర్ణయం కావొచ్చని తెలుస్తోంది.
ఇదిలావుంటే.. ఏపీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా.. రఘువీరారెడ్డి పేరు వినిపిస్తుండడం గమనార్హం. షర్మిల ఈ పేరును ప్రపోజ్ చేశారని, దీనికి పార్టీ కూడా ఓకే చెప్పే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on August 12, 2024 12:13 pm
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…