“నువ్వు ముగ్గురిని పెళ్లి చేసుకుంటే.. ఒక్కొక్క మగాడు వేల మందిని చేసుకోగలడు. కానీ పద్ధతి, సంస్కారం, హిందూ మతం, తెలుగువాడిగా ఏక పత్నీ వ్రతం.. మన మతం. ఒకే స్త్రీని పెళ్లాడి ఒకే స్త్రీతో సంసారం చేయడం అన్నది మన సంప్రదాయం. ఆ సంప్రదాయానికి తూట్లు పొడిచినటువంటి నీచుడు పవన్ కళ్యాణ్’’ అంటూ ఒకప్పుడు ఓ టీవీ ఛానెల్ చర్చలో విరుచుకుపడ్డారు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్.
కట్ చేస్తే ఇప్పుడు దువ్వాడ తన భార్యాపిల్లల్ని విడిచిపెట్టి మాధురి అనే వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. తమ తండ్రిని తమకు ఇప్పించాలంటూ దువ్వాడ శ్రీనివాస్ కూతుళ్లు చేసిన ఆందోళనతో ఈ వ్యవహారం రచ్చకెక్కింది. ఆ తర్వాత వారికి తల్లి కూడా తోడయ్యారు. దువ్వాడ మరో మహిళతో ఉంటున్న ఇంటి ముందు వాళ్లంతా ఆందోళన చేపట్టడంతో వ్యవహారం మరింతగా వివాదాస్పదంగా మారింది.
ఆ సందర్భంగా భార్యాపిల్లల్ని బూతులు తిట్టడమే కాక.. వారి మీద రాడ్తో దాడికి కూడా ప్రయత్నించారు దువ్వాడ శ్రీనివాస్. ఈ గొడవ అనంతరం ఆయన ఒక మీడియా ఛానెల్కు ఇంటర్వ్యూ ఇస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ గురించి ఈ సందర్భంగా ఆయన సానుకూల వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
పవన్ గురించి తాను ఒకప్పుడు చేసిన వ్యాఖ్యల గురించి స్పందిస్తూ.. అప్పుడు పవన్ జీవితంలో ఏం జరిగిందో తెలియక అలా మాట్లాడానని.. కానీ ఆయన ఏ పరిస్థితుల్లో అలా చేశాడో ఇప్పుడు తనకు అర్థమవుతోందని దువ్వాడ అన్నారు. ఏదైనా మన వరకు వచ్చే వరకు తెలియదని.. ఇప్పుడు తన విషయంలో జరిగింది చూశాక.. పవన్ అప్పుడలా ఎందుకు చేశాడో తనకు తెలిసొచ్చిందని దువ్వాడ అన్నారు.
ఇంతకుముందు పవన్ పరిస్థితి తెలియక తాను అలా పొరపాటుగా మాట్లాడేశానని దువ్వాడ వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ వ్యవహారం చూశాక ‘కర్మ ఈజ్ ఎ బూమరాంగ్’ అనే సామెతను వల్లె వేస్తున్నారు నెటిజన్లు.
This post was last modified on August 11, 2024 3:49 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…